-
అదనంగా ఏడు లక్షల మందికి వైఎస్సార్ పెన్షన్లు
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలతో పాటు, ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలో అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గృహనిర్మాణశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం ఆయన విజయవాడలోని సెర్ఫ్ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి డీఆర్డీఏ పీడీల సమీక్షా సమావేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డీఆర్డీఏ పీడీలు ప్రతినెలా 15 రోజులపాటు ఫీల్డ్లో పని చేయాలన్నారు. గ్రామీణాభివృద్ది కోసం కేటాయించిన పథకాల అమలును స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు. వచ్చే జనవరి నుంచి అదనంగా 7 లక్షల మందికి వైఎస్సార్ పెన్షన్లు ఇస్తామని వెల్లడించారు. పెన్షన్ల ఎంపికలో గ్రామ సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పొదుపు సంఘాలు చెల్లించాల్సిన రుణాలను నాలుగు విడతలుగా వారి చేతికే అందిస్తామని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీనిని ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీని కార్యరూపంలోకి తెస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 9.33 లక్షల పొదుపు సంఘాలు బ్యాంక్లకు చెల్లించాల్సిన రుణం రూ. 27,168 కోట్లు ఉందని.. రుణభారం నుంచి పొదుపు మహిళలను విముక్తి చేస్తామని హామి ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీలోగా బ్యాంకులకు మహిళలు చెల్లించాల్సిన వడ్డీ రూ.1,823 కోట్లు, రుణభారాన్ని ప్రభుత్వమే భరించేందుకు సిద్దంగా ఉందని వెల్లడించారు. మొదటి అయిదు నెలల వడ్డీ కింద రూ. 760 కోట్లు నేరుగా రుణ ఖాతాలకు జమ చేస్తామని తెలిపారు. సున్నావడ్డీ కింద రూ.5 లక్షల రూపాయలకు లోబడి రుణాలు ఇస్తామన్నారు. ఈ వడ్డీని పొదుపు సంఘాల తరుఫున ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుందని చెప్పారు. స్త్రీనిధి కింద ఈ ఏడాది స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే కేటాయింపులను రూ.900 కోట్లు నుంచి రూ.1800 కోట్లకు పెంచుతామని పేర్కొన్నారు. స్త్రీనిధి కింద ఇచ్చే ఆర్థిక తోడ్పాటును రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచుతామన్నారు. సుమారు 168 రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు మొదటిసారిగా కార్యాలయ సదుపాయం కల్పిస్తామన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేందుకు, పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు 76 గోడౌన్లతో కూడిన ఇన్పుట్ షాప్ల ఏర్పాటుకు చేస్తామన్నారు. రైతు సంస్థలే స్వయంగా నిర్వహించుకునేలా 92 ఉత్పత్తి ఆధారిత ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఎఫ్పీఓల ద్వారా తక్కువ ధరకు ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులను రైతులకు అందించేందుకు రూ.33 కోట్లు విడుదల చేస్తామన్నారు. ప్రతినెలా 5న వైఎస్సార్ పెన్షన్లను అందించాలని అధికారును ఆదేశించారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామన్నారు. అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. గ్రామస్థాయిలో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు, ముఖ్యంగా నవరత్నాలు సక్రమంగా ప్రజలందరికీ అందేలా పీడీలు, సెర్ఫ్ సిబ్బంది చిత్తశుద్దితో పనిచేయాలని రామచంద్రారెడ్డి ఆదేశించారు. -
టీడీపీ అధికార దుర్వినియోగం
నంద్యాల: ఉప ఎన్నికలో గెలుపుకోసం తెలుగుదేశం ప్రభుత్వం వక్రమార్గాలను అన్వేషిస్తోంది. ప్రతి రోజు కొత్త మార్గాలను వెతుకుతోంది. ప్రభుత్వ ఉద్యోగులను సైతం ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవాలని చూస్తోంది. తెలుగుదేశానికి ఓటు వేయకపోతే పింఛన్లతో పాటు ఏప్రభుత్వ పథకాలను అందివ్వబోమని బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నారు. ఇటీవల 31 వార్డులో ఓటర్లను ప్రలోభ పెడుతూ తెలుగుదేశం నేతలు మీడియాకు చిక్కారు. మరోవైపు పారిశుధ్యకార్మికులను సైతం ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. ఓటర్ల ఇంటి ముందు చెత్త ఊడ్చేసి తెలుగుదేశానికి ఓటు వేయాలని చెప్పడం వంటి పనులు కూడా చేశారు. తాజాగా తెలుగుదేశం నేతలు మరో అడుగు ముందుకేశారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ప్రచారం కోసం డీఆర్డీఏ అధికారులను రంగంలోకి దించారు. జిల్లా నలుమూలల నుంచి డీఆర్డీఏ, సీఆర్పీ అధికారలను నంద్యాలకు పిలిపించారు. వచ్చి రాగానే అధికారులు స్వామి భక్తి నిరూపించుకొనే పనిలో పడ్డారు. తెలుగుదేశానికి ఓటు వేయాలని మహిళా సంఘాలపై ఒత్తిడి తేవడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేతలు డీఆర్డీఏ అధికారలు నిర్వాకంపై ఆధారాలతో సహా ఎన్నికల కమీషన్కు ఫిర్యాదు చేశారు. మేరకు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ అధికారులపై వేటు పడే అవకాశం ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement