breaking news
Dramatic developments
-
గోవాలో మరో అర్ధరాత్రి డ్రామా
పణజీ: గోవాలో వారం తిరిగేలోపే మరోసారి అర్ధరాత్రి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉన్న మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ)కి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు తమ పార్టీ శాసనసభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేశారు. ఇందుకు సంబంధించిన లేఖను ఎంజీపీ ఎమ్మెల్యేలు మనోహర్ అజ్గావోంకర్, దీపక్ పావస్కర్లు గోవా అసెంబ్లీ తాత్కాలిక స్పీకర్ మైఖేల్ లోబోకు మంగళవారం అర్ధరాత్రి 1.45 గంటలకు అందజేశారు. అనంతరం ఉపముఖ్యమంత్రిగా ఉన్న మరో ఎంజీపీ ఎమ్మెల్యే సుదీన్ ధవలికర్ను ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మంత్రివర్గం నుంచి తొలగించారు. తమ పార్టీ శాసనసభాపక్ష వ్యవహారాల్లో బీజేపీ తలదూరుస్తోందనీ, ఆ పార్టీ కుట్రకు పాల్పడుతున్నందున సంకీర్ణ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటామంటూ ఎంజీపీ అధ్యక్షుడు దీపక్ ధవలికర్ హెచ్చరికలు చేసిన కొన్ని గంటల్లోనే తాజా పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. బీజేపీతో కలిసే పార్టీలకు ఇదే గతి: కాంగ్రెస్ గోవాలో తాజా పరిణామాలపై కాంగ్రెస్ స్పందిస్తూ బీజేపీతో పొత్తు పెట్టుకునే పార్టీలకన్నింటికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించింది. ‘తన మిత్రపక్షాలకు తానే ప్రమాదకారినని బీజేపీ నిరూపించింది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తమ పార్టీ మనుగడే ప్రమాదకరమవుతుందన్న విషయాన్ని ఎన్డీయేలోని పార్టీలు గుర్తించాలి. లోక్సభ ఎన్నికలకు ముందు ఇదో గట్టి హెచ్చరిక’ అని గోవా కాంగ్రెస్ అధికార ప్రతినిధి సునీల్ కవఠాంకర్ అన్నారు. -
అబాట్కు ఉద్వాసన
- ఆస్ట్రేలియా కొత్త ప్రధానిగా టర్న్బుల్ కాన్బెర్రా: నాటకీయ పరిణామాల మధ్య ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ తన పదవిని కోల్పోయారు. అధికార పీఠం ఎక్కిన రెండేళ్ల తర్వాత అబాట్ను సోమవారం పార్టీ అంతర్గత ఓటింగ్లో తొలగించారు. అర్ధరాత్రి దాటాక లిబరల్ పార్టీ నిర్వహించిన ఓటింగ్లో అబాట్కు 44 ఓట్లే దక్కాయి. అబాట్ వ్యతిరేక వర్గం నేత మాల్కం టర్న్బుల్కు 54 ఓట్లు దక్కాయి. కమ్యూనికేషన్ల మంత్రి పదవికి టర్న్బుల్ రాజీనామా చేశారు. దేశానికి ఆర్థిక పరిపుష్టిని ఇచ్చే నాయకత్వ లక్షణాలు అబాట్కు లేవంటూ ఆయన నాయకత్వాన్ని టర్న్బుల్ సవాల్ చేయడంతో ఓటింగ్ జరిపారు. 2010లో కెవిన్ రడ్ను పదవీచ్యుతుడిని చేసి గిలార్డ్ ప్రధాని అయిన ఉదంతం మాదిరిగానే తాజా ఘటన జరిగింది. అబాట్ రాజీనామా చేశాక టర్న్బుల్ ప్రధాని పదవి చేపడతారు.