breaking news
DR K. Laxman
-
'లిక్కర్ స్కామ్లో కవిత.. ఓపెనింగ్ వికెట్ పడబోతోంది'
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బండి సంజయ్ పాదయాత్రపై దాడులు చేస్తున్నారని బీజేపీ ఎంపీ డా.లక్ష్మణ్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే బండి సంజయ్ పాదయాత్రపై దాడికి తెగబడ్డారని విమర్శించారు. సంజయ్ యాత్రను అడ్డుకోవడం, అరెస్టు చేయడం దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు. 'టీఆర్ఎస్ చౌకబారు, చిల్లర రాజకీయాలు చేస్తోంది. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. అసహనంతో, నిరాశ నిస్పృహలో దాడులకు పాల్పడుతున్నారు. పాదయాత్ర యధావిధిగా అనుమతివ్వాలని, జరిగిన ఘటనపపై విచారణ జరపాలని' ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మునుగోడు బీజేపీదే లిక్కర్ స్కామ్లో కవిత.. ఓపెనింగ్ వికెట్ పడబోతోందని మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. లిక్కర్ స్కామ్ను కప్పిపుచ్చుకునేందుకే టీఆర్ఎస్ నేతలు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలు కేసులకు భయపడరని.. రాబోయే మునుగోడు ఎన్నికలో బీజేపీ గెలవబోతోందని విజయశాంతి పేర్కొన్నారు. చదవండి: (బండి సంజయ్కు షాక్.. పాదయాత్రకు పోలీసుల బ్రేక్!) -
బీజేపీకి అనుకూల పరిస్థితులున్నాయి
ఉగాది పంచాంగ శ్రవణంలో శశిభూషణ శర్మ సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయిలో గత మూడేళ్లుగా బీజేపీకి శనిబలం బాగా ఉందని, అందుకే విజయాలు ప్రాప్తించాయని శశిభూషణ శర్మ తన పంచాంగ శ్రవణంలో పేర్కొన్నారు. బీజేపీది ధనస్సు రాశి అని దాని ప్రకారం రాష్ట్ర బీజేపీకి కూడా అనుకూల పరిస్థితులున్నాయని, వచ్చే మూడేళ్ల పాటు ఇవి కొనసాగుతాయని, విజయాలు సిద్ధిస్తాయని చెప్పారు. అయితే అందుకు కలిసొచ్చే అవకాశాలను ఉపయోగించుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో ఉగాది పండుగ సందర్భంగా శర్మ పంచాంగ పఠనం చేశారు. బీజేపీ ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు ఈ ఏడాది బాగుందన్నారు. పార్టీ అనేక విజయాలు సాధిస్తూ తెలుగు కొత్త సంవత్సరంలోకి అడుగిడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ అన్నారు. వచ్చే ఎన్నికలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, పార్టీ కార్యక్రమాలకు సమయమిచ్చి పనిచేయాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చేలా కృషి చేయాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కోరారు. మోదీ నాయకత్వాన్ని బలపరిచేలా కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే బీజేపీకి విజయాలు సిద్ధిస్తాయన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీకి మంచిరోజులు రాబోతున్నాయని బీజేఎల్పీ నేత జి.కిషన్రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం దేశం వైఫు, ప్రధాని మోదీ వైపు చూస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్ రావు, డా.జి. మనోహర్రెడ్డి, టి.ఆచారి, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, డా.ఎస్.మల్లారెడ్డి, ఆకుల విజయ, సుధాకర శర్మ తదితరులు పాల్గొన్నారు.