-
శిశు శోకం
ప్రభుత్వ వైద్యశాలల్లో శిశువుల మృత్యుఘోష మోగుతోంది. పాలకుల నిర్లక్ష్యం.. శిశువుల పాలిట శాపంగా మారుతోంది. జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య నిపుణుల కొరత.. అత్యవసరమైన సమయంలో ప్రాణాధార సదుపాయాలు లేకపోవడం, గర్భిణులకు పౌష్టికాహారం సరిగా అందకపోవడం, వారు రక్తహీనతకు లోనవుతుండడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాన్పులు చేయకపోవడం తదితర పరిస్థితులు శిశు మరణాలకు కారణమవుతున్నాయి. గూడూరుకు చెందిన రమణమ్మ (పేరు మార్చాం) కాన్పు కోసం గూడూరు ఏరియా ఆస్పత్రిలో చేరింది. అక్కడి వైద్యులు ఆమెకు పరీక్షలు చేసి పరిస్థితి క్రిటికల్గా ఉందని, నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి (జీజీహెచ్) తీసుకెళ్లమన్నారు. జీజీహెచ్లో కాన్పు అనంతరం బిడ్డ చనిపోయింది. గూడూరు ఏరియా ఆస్పత్రిలో వైద్య నిపుణులు ఉండి ఉంటే, అక్కడే కాన్పు జరిగినట్టయితే బిడ్డ బతికి ఉండేదంటున్నారు బాధితురాలి బంధువులు. జిల్లాలో ఇలాంటి ఘటనలు ప్రతి రోజూ అనేకం చోటు చేసుకుంటున్నాయి. నెల్లూరు(బారకాసు) : జిల్లాలో నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రితో పాటు గూడూరు, కావలి, ఆత్మకూరు ఏరియా ఆస్పత్రులు, 14 సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్సీ), 75 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) ఉన్నాయి. వీటిలో 24 గంటలు పనిచేసే పీహెచ్సీలు 28 ఉన్నాయి. సీహెచ్సీ కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో తల్లులతో పాటు పిల్లలకూ వైద్యం అందించాల్సి ఉంది. అయితే నెల్లూరు జీజీహెచ్లో మాత్రమే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద ప్రత్యేక శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లాలో ఏడాది లోపు పిల్లలకు ఎలాంటి తీవ్ర అనారోగ్య సమస్య ఏర్పడినా జీజీహెచ్కు రావాల్సిందే. ఫలితంగా ఈ విభాగంలోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ), సిక్ న్నూబార్న్ కేర్ యూనిట్ (ఎస్ఎన్సీయూ)లకు శిశువుల తాకిడి అధికమవుతోంది. ప్రాణాధార సదుపాయాలూ లేవు పసిపిల్లలకు ప్రాణాధారమైన నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ను (ఎన్ఐసీయూ) ప్రతి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ జిల్లాలో ఒక్క సీహెచ్సీలో కూడా దీన్ని ఏర్పాటు చేయలేదు. నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల చిన్నపిల్లల విభాగంలో తగినంత మంది వైద్యులు సైతం లేరు. ఈ విభాగంలో ఓపీ కోసం నిత్యం 100 మంది వరకు వస్తుంటారు. 20 నుంచి 30 మందికి పైగా పసిపిల్లలు ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతుంటారు. పోషకాహారం కరువు నెలలు నిండక ముందే జన్మించడం, గర్భంతో ఉన్నప్పుడు తల్లికి బీపీ అధికంగా ఉండటం, పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం శిశువుల మరణాలకు ప్రధాన కారణాలవుతున్నాయి. ఇలాంటి సమస్యలను నివారించేందుకు క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులకు అందించే పోషకాహారం నాసిరకంగా ఉంటోంది. అది కూడా సక్రమంగా తల్లికి అందడం లేదు. గర్భిణులు ఇంటికి తీసుకెళ్లిన సరుకులు కుటుంబ సభ్యులందరి ఆహారంలో భాగం కావడం వల్ల తల్లికి పోషకాహార లోపం ఏర్పడుతోంది. ఆ ప్రభావం పుట్టబోయే బిడ్డపై పడుతోంది. పిల్లల వైద్యులకు తీవ్ర కొరత జిల్లాలోని ప్రతి సామాజిక ఆరోగ్య కేంద్రానికి గైనకాలజిస్ట్తో పాటు పిడియాట్రిషియన్, అనెస్థిటిస్ట్ పోస్టులు మంజూరు చేయాల్సి ఉంది. కానీ 14 సామాజిక ఆరోగ్య కేంద్రాలకు గాను 10 కేంద్రాల్లోనే పిడియాట్రిషయన్లు ఉన్నారు. 24 గంటలు పనిచేసే పీహెచ్సీలు జిల్లాలో 28 ఉన్నప్పటికీ, వాటిలో కొన్నింటిలో కాన్సులు సైతం సరిగా జరగడం లేదు. అధిక శాతం ప్రసవాలు నెల్లూరు, గూడూరు, కావలి, ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. నెల్లూరు జీజీహెచ్ చిన్నపిల్లల విభాగంలో మూడు యూనిట్లు ఉన్నాయి. అందులో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు మరో ఇద్దరు కాంట్రాక్ట్ వైద్యులు మాత్రమే ఉన్నారు. పిల్లల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అందుకు అనుగుణంగా పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరముందని వైద్యులు చెబుతున్నారు. వైద్యుల కొరత వాస్తవమే జీజీహెచ్ చిన్నపిల్లల విభాగంలో వైద్యుల కొరత ఉన్న మాట వాస్తవమే. ఇక్కడ నియమించిన వైద్యుల్లో చాలా మంది డిప్యూటేషన్పై ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ఖాళీ పోస్టుల్లో వైద్యులను నియమించాల్సిన బాధ్యత రాష్ట్ర ఉన్నతాధికారులదే. త్వరలో వైద్యుల రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది. అది జరిగితే ఇక్కడికి వైద్యులు వచ్చే అవకాశముంది. స్థానికంగా నలుగురు ప్రైవేట్ వైద్యులతో మాట్లాడాం. త్వరలో వారి ద్వారా సేవలు అందిస్తాం. – డాక్టర్ రాధాకృష్ణరాజు, సూపరింటెండెంట్, జీజీహెచ్ శిశు మరణాల నివారణకు చర్యలు శిశు మరణాలను తగ్గించేందుకు మా వంతు చర్యలు చేపడుతున్నాం. గర్భిణులను గుర్తించి వారికి పౌష్టికాహారం అందేలా చూడాలని ఐసీడీఎస్ సిబ్బందికి చెబుతున్నాం. రక్తహీనత ఉన్నవారికి ఐర¯న్ మాత్రలు ఇవ్వడంతో పాటు ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నాం. అయినా జిల్లాలో అక్కడక్కడా శిశు మరణాలు సంభవిస్తున్నాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోల్చుకుంటే నెల్లూరు జిల్లాలో నమోదవుతున్న శిశు మరణాలు తక్కువే. – డాక్టర్ వరసుందరం, డీఎంహెచ్ఓ, నెల్లూరు -
నాడి చూసే నాథుడే లేడు..
జి.సిగడాం(శ్రీకాకుళం): శ్రీకాకుళం జిల్లా జి. సిగడాం మండల కేంద్రంలోని ఆస్పత్రి రోగులకు అక్కరకు రాకుండా పోతోంది. వర్షాల కారణంగా వ్యాపించే డయేరియా, విషజ్వరాలతో పాటు పాముకాటు, కుక్క కాటు వంటి పేషెంట్లకు నాడిపట్టి చూసి మందులు ఇచ్చే నాథుడు కరువుయ్యాడు. మండలం పరిధిలో ఉన్న 31 గ్రామ పంచాయితీలకు ఒకే ఒక్క ఆసుపత్రి. దీనికి తోడు వైద్యులను ప్రభుత్వం నియమించక పోవడంతో రోగులు నానా ఇబ్బందులు పడుతన్నారు. ఈ ఆరోగ్యకేంద్రం పరిధిలో 10 సబ్ సెంటర్లు, 106 గ్రామాలు.. సుమారుగా 65 వేల జనాబా కలిగిన మండలం అయినా ఆరోగ్య కేంద్రంలో వైద్యులు లేకపోవడంతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు, గ్రామానికి శివారులో ఉన్న శ్మశానవాటిక వద్ద ఉన్న ఈ ఆస్పత్రిలో రాత్రి సమయాల్లో సంబందిత స్టాఫ్ నర్స్లు ఉంటున్నారు. కానీ వీరికి సరైన రక్షణ లేకపొవడంతో నానా ఇబ్బందులు పడుతన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇద్దరు వైద్యులను నియమించగా వారు ఉన్నత చదువులకు సెలవులపై వెళ్లారు. దీంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ 24గంటల ఆసుపత్రికి ప్రతిరోజు సుమారుగా వంద నుంచి 150 మంది వరకు ఓపీ వస్తుంది. వీటిని చూసే నాథుడులేక సిబ్బంది.. స్టాఫ్ నర్స్ పనులు చేసి మందులు అందిస్తున్నారు. వైద్యాధికారులు లేకపొవడంతో సిబ్బంది వారి ఇష్టానుసారంగా విధులకు హజరవుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement