breaking news
Doctors demand money
-
దారుణం : గ్లూకోజ్ పెట్టి.. రూ.3లక్షలు వసూలు
సాక్షి, రాజన్నసిరిసిల్ల: జిల్లా కేంద్రానికి చెందిన అనంతుల రవీందర్ సుమారు 30ఏళ్లుగా స్థానిక పాత బస్టాండ్లో మెస్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య, ఇద్దరు కొడుకులు. ఇంజినీరింగ్ పూర్తయిన కొడుకులు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు. వాళ్లిద్దరూ సెటిల్ అయితే ప్రశాంతంగా ఉందామనుకున్నాడు. ఉన్నట్టుండి సెకండ్ వేవ్లో రవీందర్ కరోనా బారినపడ్డాడు. ఎందుకైనా మంచిదని గత ఏప్రిల్ 4న అతడు కరోనా టీకా వేయించుకున్నాడు. ఒకట్రెండు రోజులు జ్వరం వస్తుందని నర్స్లు తెలిపారు. తీవ్రజ్వరం.. కరోనా పాజిటివ్ టీకా వేసుకున్న మరుసటిరోజు రవీందర్ అస్వస్థతకు గురయ్యాడు. ఏప్రిల్ 8వ తేదీన జ్వరం వస్తే డోలో 650 టాబ్లెట్లు వేసుకున్నాడు. తగ్గకపోగా 9,10,11వ తేదీల్లో విపరీతంగా పెరిగింది. 12న ఉదయం జిల్లా ఆస్పత్రిలో పరీక్ష చేయించుకున్నాడు. మరుసటి రోజు పాజిటివ్గా ఫలితం వచ్చింది. ఆక్సిజన్ లెవెల్ 70కి పడిపోయింది. దీంతో మానసికంగా ఆందోళనకు గురయ్యాడు. రూ.2వేలు ఇస్తానన్న దొరకని కారు అప్పటికే మధ్యాహ్నం 12 గంటలు దాటింది. స్థానిక ఏరియా ఆస్పత్రిలో పడకలు ఖాళీ లేవని చెప్పడంతో స్నేహితుడి సలహాతో వేములవాడలోని ఆస్పత్రికి వెళ్లాలనుకున్నాడు రవీందర్. 12కి.మీ. దూరానికి రూ. 2వేలు కిరాయి చెల్లిస్తామన్నా కారు దొరకలేదు. ఎలాగోలా వేములవాడకు చేరుకున్నాడు. డాక్టర్లు స్పందించక పోవడంతో తిరిగి సిరిసిల్లకు వచ్చాడు. తెలిసిన డాక్టర్ను సంప్రదిస్తే.. కరీంనగర్లో తనకు తెలిసిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లండని, తాను నేను ఫోన్ చేసి చెప్పా అని సలహా ఇచ్చాడు. రూ.25వేలు చేతిలో పట్టుకుని కారు డ్రైవింగ్ చేసుకుంటూ కరీంనగర్ వెళ్తుండగా బావుపేటలో చెమటలు బాగా వచ్చాయి. ఓ ఐదు నిమిషాలు ఆగి.. మంచినీళ్లు తాగి సేద తీరాడు. నాలుగురోజులు రూ.3లక్షలు కరీంనగర్లోని బంధువు సాయంతో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు రవీందర్. భయానికి పల్స్ రేటు కూడా పడిపోయింది. రూ.25వేలు చెల్లించి ఆస్పత్రిలో చేరాడు. సిబ్బంది మాస్క్ వేసి గ్లూకోజ్ పెట్టారు. మరుసటిరోజు రెండు గ్లూకోజులు పెట్టారు. అయినా డాక్టర్ రాలేదు. పరీక్షించలేదు. ఈలోపు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. వెంటిలేటర్ ఉన్న మరో ఆస్పత్రికి వెళ్లాలని సిబ్బంది సూచించారు. అప్పటికే నాలుగు రోజులైంది. నామమాత్రపు చికిత్స చేసి మందులకని రూ.90వేలు, డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు రూ.1.30లక్షలు, ఇతర ఖర్చుల కింద ఇంకో రూ. 60 వేలు.. మొత్తం సుమారు రూ. 3 లక్షలు వసూలు చేశారు ఆస్పత్రి నిర్వాహకులు. మొత్తం రూ.13 లక్షలు వెంటిలేటర్ సౌకర్యం ఉన్న మరో ఆస్పత్రికి వెళ్లగా ఒక్కరోజులోనే రూ.70వేలు వసూలు చేశారు. అయినా, అక్కడ ఆ సౌకర్యం లేదంటూ ఇంకో ఆస్పత్రికి పంపించారు. రోజూ రూ.50వేలు అడ్వాన్స్గా చెల్లిస్తేనే వైద్యం అందుతుందని ఆస్పత్రి నిర్వాహకులు తేల్చి చెప్పారు. చేసేదిలేక దొరికిన చోటల్లా అప్పు చేసి బిల్లులు చెల్లించారు. ఐదు రోజులు చికిత్స చేసిన నిర్వాహకులు.. రూ.5లక్షలు బిల్లు వసూలు చేసి రవీందర్ను డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చాక కూడా ఆక్సిజన్ సౌకర్యం ఉండాలని సూచించారు. దీంతో ఇంట్లోనే ఆక్సిజన్తో చికిత్స కొనసాగింది. ప్రస్తుతం కోలుకున్నాడు. దాదాపు 12 రోజులు ఆస్పత్రిలో ఉండి తీరా ఇంటికి చేరే సరికి అన్ని ఖర్చులు కలుపుకుని రూ.13 లక్షల వరకు ఖర్చు అయ్యాయి. ఇందులో తండ్రి ప్రాణాలు కాపాడాలని కొడుకు తెలిసిన వాళ్లదగ్గర రూ.11లక్షలు అప్పుగా తెచ్చాడు. మంచి ఆహారం తీసుకుంటూ అతడు కోలుకున్నాడు. ప్రాణాపాయం తప్పింది కానీ చికిత్స కోసం చేసిన అప్పు ఎలా తీర్చేదని తల్చుకుంటూ ఆందోళనకు గురవుతున్నాడు. బిల్లులు ఇప్పించాలె కరోనా టీకా తీసుకున్నాక కూడా వైరస్ బారినపడడం దారుణంగా ఉంది. ఉన్నంతలో పనిచేసుకుని బతకడం అలవాటైన సమయంలో కరోనా కాటేస్తూ అప్పుల్లో ముంచింది. చికిత్సల పేరుతో ఆస్పత్రుల నిర్వాహకులు రూ.లక్షల్లో గుంజుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఆస్పత్రులను కట్టడి చేయాలె. నా బిల్లులు వాపసు ఇప్పించాలె. సామాన్యులను ఆదుకోవాలె. – అనంతుల రవీందర్, సిరిసిల్ల చదవండి: వన్.. టూ.. 'త్రీ'.. రెడీ! -
సొమ్ముంటేనే... సేవలు
చీపురుపల్లి, న్యూస్లైన్: మెరకముడిదాం మండలం బిల్లల వలస గ్రామానికి చెందిన గర్భిణి వెంకటలక్ష్మికి జనవరి 12వ తేదీని డెలివరీ టైమ్గా వైద్యులు చెప్పారు. అయితే ఆమెను చెకప్ కోసం శుక్రవారం చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకువచ్చారు. పరీక్షలు నిర్వహించిన వైద్యుడు తక్షణమే ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలన్నారు. అందుకు ఆమె కుటుంబసభ్యులు సరేనన్నారు. సరే అంటే సరిపోదు. శస్త్రచికిత్స చేయాలంటే రూ.4 వేలు అవుతుందని వైద్యుడు చెప్పాడు. బిడ్డకు ఏమౌతుందోనని కుటుంబ సభ్యులు మళ్లీ సరే అన్నారు. అలాగే చీపురుపల్లి మండలంలోని పర్ల గ్రామానికి చెందిన పొదిలాపు సూరమ్మకు కడుపులో కాయకాసింది. మామూలుగా వైద్యునికి చూపిద్దామని ఆమె భర్త చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకు వచ్చారు. తక్షణమే ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారు. దానికి రూ.4 వేలు అవుతుందన్నారు. పండగ తరువాత చేయించుకుంటామని భర్త చెప్పడంతో ఆ తరువాత అయితే ఏం జరుగుతుందో మాకు తెలియదని వైద్యుడు భయపెట్టడం తో అప్పుచేసి రూ.4 వేలు ఇచ్చి ఆపరేషన్ చేయించుకున్నారు. దానికి తోడు మరో రూ.400 పెట్టి మందులు కొనుక్కున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలోని బాతువ గ్రామానికి చెందిన గర్భిణి పద్మను కుటుంబసభ్యులు ఆస్పత్రి కి తీసుకొస్తే గర్భసంచి తీసెయ్యాలని డాక్టర్ చెప్పారు. అందుకు రూ.4 వేలు అవుతుందని చెప్పగానే ఇచ్చి ఆపరేషన్ చేయించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో అయితే రూ.10 వేలు అవుతుందన్నారు. ఇక్కడైతే రూ.4వేలని చేయించామని రోగి బం ధువులు చెబుతున్నారు. ఇదంతా చీపురుపల్లి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న తీరు.పేరుకే సర్కారు దవాఖానా..కానీ ఇక్కడి తీరు మాత్రం కార్పొరేట్ ఆస్పత్రులను తలపిస్తుంది. ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వైద్య సేవలు అందించాల్సిన వైద్యులే డబ్బులు ఖర్చు పెట్టాలని చెబుతుంటే పేద, మధ్యతరగతి రోగులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. తమరిష్టం బాబూ..తమరెలా చెప్తే అలాగే..అంటూ చీపురుపల్లి సర్కార్ ఆస్పత్రికి వెళ్లే రోగులు, బంధువులు అక్కడి వైద్యుడు చెప్పిందానికి తలాడిస్తూ అతి కష్టం మీద అప్పులు చేసి డబ్బులు వదిలించుకుంటున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం ఆస్పత్రులకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. కానీ చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి వచ్చిన వారికి తక్షణమే ఆపరేషన్ చేయాలని అందుకు రూ.4 వేలు అవుతుందని, ముందే చెల్లించాలని అక్కడికి నూతనంగా వచ్చిన వైద్యుడు డిమాండ్ చేస్తుండడంతో సర్కారీ దవాఖానా కాస్తా వసూళ్ల కేంద్రంగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడాం, లావేరు తదితర మండలాలకు చెందిన ప్రజలు వైద్య సేవలకు చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రిపై ఆధారపడతారు. అత్యధికంగా గర్భిణులు ప్రసవం నిమిత్తం ఇక్కడకు వస్తుంటా రు. ఇదే అదునుగా తీసుకున్న వైద్యాధికారి క్యాష్ చేసుకోవాలని భావించారు. ప్రతి శస్త్ర చికిత్సకు ఓ రేటు ఖరారు చేశారు. శస్త్రచికిత్స చేయించాలంటే బయిట నుంచి వైద్యుడిని తీసుకురావాలని, అంతేకాకుండా ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుంటే రూ.పది వేలు నుంచి రూ.20 వేల వరకు ఖర్చు అవుతుందని రూ.4 వేలు ఇవ్వలేరా? అంటూ ప్రసవాల నిమిత్తం వస్తున్న గర్భిణుల కుటుంబ సభ్యులను మోటివేట్ చేసి మరీ ఒప్పిస్తున్నారు. స్థానిక ఆస్పత్రిలో నెలకు కనీసం 100 నుంచి 150 ప్రసవాలు జరుగుతున్నాయి. ఇందులో చాలా మంది గర్భిణులకు సాధారణ ప్రసవం జరగాల్సి ఉన్నప్పటికీ డబ్బుల కోసం శస్త్రచికిత్స తప్పదని భయపెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన నెలకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూళ్ల పర్వం నడుస్తోంది. శస్త్రచికిత్సల దందా ఇలా ఉండగా ఇక్కడ ప్రసవించేందుకు వస్తున్న గర్భిణులకు కనీసం మం దులు కూడా ఇవ్వకపోవడం దారుణం. ప్రసవ సమయంలో మందులు కొనుక్కోమని చెబుతూ, కనీసం బ్లేడు, సబ్బు కూడా ఆస్పత్రి వర్గాలు ఇవ్వడం లేదని రోగుల బంధువులు వాపోతున్నారు. అంతేకాకుండా ధనిక వర్గాల కు చెందిన వారు ఎవరైనా తగిలితే అలాంటి వారి నుంచి డబ్బులు తీసుకుని వివిధ రకాల ఆపరేషన్లు స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లో నిర్వహించి, మందులు కూడా అందజేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటున్నాం... ఈ విషయమై ప్రభుత్వాస్పత్రి ఇన్చార్జి మెడికల్ ఆఫీసర్ సునీల్ ‘న్యూస్లైన్’తో మాట్లాడు తూ ప్రభుత్వాస్పత్రికి వచ్చిన రోగుల నుంచి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే తీసుకుంటున్నామని చెప్పారు. ఇక్కడ వైద్యులు లేరని, శస్త్రచికిత్స చేయించాలంటే బయట నుంచి వైద్యుడిని తీసుకురావాలని, ఆయన ఊరకనే రారుకదా అన్నారు. ఇవే శస్త్ర చికిత్సలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేయించాలంటే చాలా ఖర్చు అవుతుందన్నారు. తన సొంత నిధులతో ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్ను అభివృద్ధి చేశానని చెప్పారు. పత్రికల్లో రాస్తే ఇక్కడ ఎవ్వరూ పని చేసేందుకు ముందుకు రారని, అయినా వార్త రాసి చెడ్డ చేస్తే ఒక్కరోజు మాత్రమే ఉంటుంద ని, పత్రిక హైలెట్ అవ్వడం తప్ప అంతకన్నా ఉపయోగం ఉండదన్నారు. మందులు కూడా బయట కొనుక్కోమని రోగులకు చెబుతున్నారట అని ప్రశ్నించగా..ఆపరేషన్కు అవసరమ య్యే చాలా మందుల సరఫరా లేదని, అవి వారే కొనుక్కోవాలన్నారు.