breaking news
doctor samaram
-
ప్రజలలో అవగాహన బాగా పెరిగింది : డాక్టర్ సమరం
సాక్షి, విజయవాడ : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ర్యాలీ ప్రారంభించారు. సమాజ భాగస్వామ్యం ఎయిడ్స్ వ్యాధి నివారణ పేరుతో వందలాది మంది విద్యార్థులతో తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు ఈ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో 23 వేల మంది ఎయిడ్స్ రోగులున్నట్టు కలెక్టర్ తెలిపారు. వీరంతా 4ఏ ఆర్టీ సెంటర్స్ ద్వారా చికిత్స పొందుతున్నట్టు వెల్లడించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రముఖ సెక్సాలజిస్టు డాక్టర్ సమరం మాట్లాడుతూ.. 2030 నాటికి ఎయిడ్స్ పూర్తిస్థాయిలో తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎయిడ్స్ తగ్గుముఖం పట్టడంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు బావున్నాయనీ, వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన బాగా పెరిగిందని వ్యాఖ్యానించారు. -
పుష్కర స్నానాలు అశాస్త్రీయం
డాక్టర్ సమరం పటమట(ఆటోనగర్): పుష్కర స్నానాలు మూఢత్వానికి పరాకాష్ట, మూఢత్వానికి ఖరీదు అనేక ప్రాణాలని నాస్తిక కేంద్రం నిర్వాహకులు డాక్టర్ జి.సమరం అన్నారు. ఆదివారమిక్కడ ఆయన మాట్లాడుతూ పుష్కరాల సమయంలో దేవతల గురువు బృహస్పతితో పాటు పుష్కరుడు మూడున్నర కోట్ల మంది దేవతలు నదిలో కొలువై ఉంటారనేది అభూత కల్పన అని అన్నారు. పుక్కిటి పురాణాలతో జనాలను మూఢులుగానూ అజ్ఞానులుగానూ తయారుచే శారని అన్నారు. పుష్కర స్నానంతో వేయి జన్మల పాపమైనా నశించిపోతుందనటం మానవ వివేకాన్ని తాకట్టుపెట్టడమని అన్నారు. భారత రాజ్యాంగంలోని 51ఎ(హెచ్) ప్రకారం శాస్త్రీయ దృష్టిని,పరిశోధించే గుణాన్ని, సంఘ సంస్కరణను పెంపొందించి ప్రతి పౌరుని ప్రా«థమిక విధి అని అన్నారు. తండోపతండాలుగా పుష్కర స్నానాలు చేయటం అశాస్త్రీయమన్నారు. ’పుష్కర స్నానాలు మూఢత్వానికి పరాకాష్ఠ– కృష్ణా పుష్కరాలు–తెలుసుకోవలసిన నిజాలు’ అన్న కరపత్రాన్ని విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో హరిసుబ్రమణ్యం, రశ్మి, కీర్తి, డాక్టర్ మారు, డాక్టర్ విజయం, డాక్టర్ దీక్ష, డాక్టర్ జగతి పాల్గొన్నారు.