breaking news
district wise
-
AP: ఓటర్ల తుది జాబితా విడుదల.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2024 ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం జిల్లాల వారీగా విడుదల చేసింది. సీఈఓ ఆంధ్రా వెబ్సైట్(CEO Andhra)లో జిల్లాల వారీగా తుది ఓటర్ల జాబితా విడుదల చేసినట్లుగా సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాల వారీగా ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం ప్రచురించింది. నియోజకవర్గాల వారీగా పీడీఎఫ్ ఓటర్ల జాబితాలను సీఈఓ ఆంధ్రా వెబ్సైట్లో ఈసీ అప్ లోడ్ చేసింది. ఓటర్ల జాబితాను ఎక్కడికక్కడే విడుదల చేయాలని ఈసీ.. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఓటర్లు: 4,08,07,256 మహిళా ఓటర్లు: 2,07,37,065 పురుష ఓటర్లు: 2,00,09,275 రాష్ట్రంలో సర్వీస్ ఓటర్లు: 67,434 థర్డ్ జెండర్ ఓటర్లు: 3482. కాగా, గత 6 నెలలుగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు, అధికారులను నియమించి ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కొత్త ఓటర్ల నమోదును వేగవంతం చేశారు. ఓటు ప్రాధాన్యతపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించారు. అన్ని ప్రక్రియలు పూర్తి అయ్యాక సోమవారం అధికారికంగా తుది ఓటరు జాబితాను విడుదల చేశారు.ఏపీలో పురుషుల కంటే మహిళల ఓటర్లే అధికం ఉండటం గమనార్హం. జిల్లాల వారీగా ఓటర్ల వివరాలు జిల్లా పురుషులు స్త్రీలు ఇతరులు సర్వీస్ ఓటర్లు మొత్తం ఓటర్లు తిరుపతి 8,68,273 9,10,597 188 867 17,79,058 చిత్తూరు 7,65,90 7,88,725 84 3,379 15,58,257 ఎన్టీఆర్ 8,17,484 8,57,361 150 16,74,995 కాకినాడ 7,88,105 8,10,781 15,99,065 కృష్ణా 7,37,394 7,80,796 65 15,18,255 యువ ఓటర్ల నమోదు కోసం మళ్లీ ప్రచారం చేస్తాం ఏపీ ఓటర్ల తుది జాబితాను ప్రకటించామని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 4.08 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ముసాయిదా జాబితా తర్వాత 5.08 లక్షల ఓటర్లు పెరిగారని పేర్కొన్నారు. యువ ఓటర్లు 8.13 లక్షల ఓటర్లు నమోదయ్యారని వెల్లడించారు. యువ ఓటర్లు ఇంకా నమోదు కావాల్సి ఉందని చెప్పారు. యువ ఓటర్ల నమోదు కోసం మళ్లీ ప్రచారం చేస్తామని అన్నారు. ఒకే డోర్ నెంబర్పై అధిక ఓట్లు ఉన్న ఫిర్యాదులను 98 శాతం పరిష్కరించామని తెలిపారు. లక్ష 50 వేల ఇళ్లలో 10 కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయని అన్నారు. ఇప్పుడు 4వేల ఇళ్లకు తగ్గాయని, ప్రతి ఎన్నికల్లోనూ ఇలాంటి ఓట్లు ఉండేవని అన్నారు. ఫామ్ 7 ద్వారా తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. 70 చోట్ల పోలీసు కేసులు నమోదు చేశామని అన్నారు. మళ్లీ కొత్త దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. వికలాంగులు, 80 ఎళ్ల పైబడిన వారికి ఇంటి వద్ద ఓటింగ్కి అవకాశం ఇస్తామని అన్నారు. నామినేషన్ చివరి రోజు వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. చదవండి: లోలోన రగిలిపోతున్న అచ్చెన్నాయుడు -
జిల్లాల వారిగా అభ్యర్థుల వారిగా ఎన్నికల ఫలితాలు
-
హోరాహోరీగా కబడ్డీ ఎంపిక పోటీలు
గోపన్నపాలెం (దెందులూరు) : స్థానిక ప్రభుత్వ వ్యాయామ కళాశాలలో ఆదివారం జిల్లా స్థాయి పురుషుల, మహిళల కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక పోటీలు హోరాహోరీగా సాగాయి. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 150 మంది పురుషులు, 70 మంది మహిళలు పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి పురుషుల, మహిళల కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.రాము, కార్యదర్శి రంగారావు, జాయింట్ సెక్రటరీ పీవీకేడీ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లా జట్లకు ఎంపికైన క్రీడాకారులు తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో వచ్చేనెల 6 నుంచి 9 వరకు జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ ఎన్వీఆర్ దాసు, చీఫ్ ప్యాటరన్ కొండలరావు పాల్గొన్నారు. -
రక్తహీనత నివారణకు డీ వార్మింగ్ మాత్రలు
ఏలూరు అర్బన్: డీ వార్మింగ్ డేను పురస్కరించుకుని పిల్లల్లో రక్తహీనతకు కారణమవుతున్న నులిపురుగల నివారణకు సోమవారం జిల్లావ్యాప్తంగా డీ వార్మింగ్ మాత్రలు పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్వో) డాక్టర్ కె.కోటేశ్వరి తెలిపారు. స్థానిక డీఎంహెచ్వో కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో నులిపురుగుల నివారణ మాత్రలు అందించేందుకు 6,03,669 మంది చిన్నారులను గుర్తించామన్నారు. వారిలో ఒకటి నుంచి రెండేళ్లలోపు వయసున్న చిన్నారులకు ఒక మాత్రలో సగభాగం డోసుగా ఇవ్వాలని, రెండేళ్ల నుంచి 18 ఏళ్ల వయసుగల వారికి పూర్తి మాత్ర అందించాలని చెప్పారు. ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో మాత్రల పంపిణీ కార్యక్రమాలు చేపడతామన్నారు. అన్ని పీహెచ్సీల్లో కూడా మాత్రలు పంపిణీ చేస్తామని చెప్పారు. వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తల పర్యవేక్షణలో చిన్నారులు మాత్రలు వేసుకోవాలని, ఖాళీ కడుపుతో మాత్రలు మింగడం చేయకూడదని స్పష్టం చేశారు. ఆర్బీఎస్కే జిల్లా కో–ఆర్డినేటర్, డాక్టర్ కె.సురేష్ బాబు, డెమో, సీహెచ్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
29 నుంచి వైఎస్ఆర్ సీపీ సమీక్షలు