-
పట్టపగలే ఓటర్లకు డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిన సోమిరెడ్డి
-
ఒక్కో నేతకు 10 లక్షలు...అడ్డంగా దొరికిన టీడీపీ
-
ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిన బీజేపీ మంత్రి కొడుకు.. వీడియో వైరల్
లక్నో: ఎన్నికలంటే చాలు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు గెలుపు కోసం నానాతంటాలు పడుతుంటారు. అయితే ఈ క్రమంలో కొందరు మాత్రం ఎన్నికల నియమాలను దాటి ప్రవర్తిస్తూ అడ్డంగా బుక్కవుతుంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఓ మంత్రి కొడుకు ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించిన వీడియో వైరల్గా మారింది. ఆ వీడియోలో.. త్వరలో యూపీ రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ( చదవండి: Anand Mahindra: మహీంద్రా షోరూంలో రైతుకు ఘోరఅవమానం.. ఎట్టకేలకు స్పందించిన ఆనంద్ మహీంద్రా ) ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నాయి. ఇదిలా ఉండగా యూపీ మంత్రి, శిఖర్పూర్ స్థానం అభ్యర్థి అనిల్ శర్మ కుమారుడు ప్రజలకు డబ్బు పంచుతున్నట్లు వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి 24 గంటల్లో సదరు మంత్రిని ఈ ఘటనపై వివరణ కోరారు. ఆ వీడియోలో శర్మ కుమారుడు కుష్ తన వాహనం దగ్గర డ్రమ్ బీట్ల శబ్దాల మధ్య ప్రజలకు 100 రూపాయల నోట్లను పంచుతూ కనిపించాడు. ఎన్నికల నియమావళిని స్పష్టంగా ఉల్లంఘించినట్లు స్పష్టంగా కనిపిస్తోందని, 24 గంటల్లో మంత్రిని వ్రాతపూర్వక వివరణ కోరుతూ రిటర్నింగ్ అధికారి మంత్రికి నోటీసులు జారీ చేశారు. -
డబ్బులిస్తాం.. మా వెంట రండహో!
అడిగినంత ఇస్తాం.. మా వెంట రండీ.. అంటూ టీడీపీ శ్రేణులు పచ్చ నోట్లు చూపిస్తూ జనాన్ని మభ్య పెట్టే యత్నం చేస్తున్నారు. మద్యం తాగించి మరీ కొంత మందిని ఊరేగింపునకు రప్పించుకున్నారు. అనంతపురం జిల్లా కణేకల్లు మండలంలోని తుంబిగనూరు గ్రామ పంచాయతీలో గురువారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సర్పంచి స్థానానికి టీడీపీ మద్దతుతో ఆ పార్టీ నేత కొట్రేగౌడ్ కుమార్తె అర్చన నామినేషన్ వేశారు. టీడీపీ నేతలు ఇలా బహిరంగంగా ప్రలోభాలకు గురిచేశారు. సాక్షి, అమరావతి బ్యూరో: ‘అమ్మా.. మీ కుటుంబంలో ఎనిమిది మందికి ఓటు ఉంది. మీరంతా మేము బలపరుస్తున్న సర్పంచి అభ్యర్థికి ఓటు వేయండి. అందుకుగాను మీకు రూ.10 వేలు ఇస్తాం. డబ్బు తీసుకునే ముందు మా అభ్యర్థికే ఓటు వేస్తామని ఒట్టు వేయండి..’ ఇది కొద్దిరోజులుగా విజయవాడలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నందిగామ మండలానికి చెందిన ఓ కుటుంబాన్ని టీడీపీ నేతలు మంగళవారం అర్ధరాత్రి కలిసి ఓట్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన తీరు. (చదవండి: 523 పంచాయతీల్లో సర్పంచ్లు ఏకగ్రీవం) పార్టీ రహితంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరు ఇది. పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలను సైతం భ్రష్టు పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓట్లు కొనుగోలు చేసేందుకు నోట్లు పట్టుకుని ఇంటింటికి తిరుగుతున్నారు. ఒక్కో ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు ఇస్తామని చెబుతున్నారు. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. ఉపాధి కోసం ఊరి నుంచి వచ్చి ఒకేచోట ఎక్కువమంది ఉంటున్న ప్రాంతాలకు వెళ్లి ఓట్లను గంపగుత్తగా కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిని విందులు, వినోదాలకు తీసుకెళుతున్నారు. కొన్నిచోట్ల నేరుగా అభ్యర్థులే వెళుతుండగా.. మరికొన్ని ప్రాంతాలకు అనుచరులను పంపుతున్నారు.(చదవండి: పల్లెల్లో చిచ్చు: టీడీపీ-జనసేన అడ్డదారులు..) రాకపోకల ఖర్చులకు ఆన్లైన్లో డబ్బులు.. కృష్ణా జిల్లాలో నందిగామ, జగ్గయ్యపేట, విజయవాడ రూరల్, గన్నవరం, పెనమలూరు, పామర్రు, మైలవరం మండలాల్లోని 234 గ్రామ పంచాయతీలకు మొదటి విడత ఎన్నికలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఆయా గ్రామాల్లో గతనెల 29న నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కాగా.. గురువారం ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో బరిలో ఉన్న టీడీపీకి చెందినవారి గెలుపునకోసం వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా నందిగామ, మైలవరం, పెనమలూరు, జగ్గయ్యపేట, విజయవాడ రూరల్ తదితర ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చి నివసిస్తున్న ఓటర్లపై టీడీపీ నేతలు దృష్టి సారించారు. సొంతూరు వచ్చి ఓటేసి తిరిగి వెళ్లేందుకు అయ్యే ఖర్చులకు సొమ్ము అందజేస్తున్నారు. విజయవాడ నుంచి స్వగ్రామాలకు తీసుకెళ్లేందుకు బస్సులు, కార్లు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. దూరప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లతో అభ్యర్థులు ఫోన్లలో నిత్యం మాట్లాడుతున్నారు. పోలింగ్ సమయానికి రావాలని, ఖర్చులన్నీ తాము చూసుకుంటామని హామీలిస్తున్నారు. కొందరికి ఖర్చులకోసం ముందే ఆన్లైన్లో డబ్బులు పంపుతున్నారు. -
నేటితో ప్రచారాలు సరి.. ప్రలోభాలే మరి!
సాక్షి, శ్రీకాకుళం పాతబస్టాండ్: సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ దగ్గర పడడంతో ఓటరుని ప్రసన్నం చేసుకునేందుకు టీడీపీ నాయకుల తాపత్రయం ఎక్కువైంది. ఇప్పటికే ప్రజలు టీడీపీని వ్యతిరేకిస్తున్నారన్న విషయం గుర్తించిన అధికార పార్టీ నాయకులు ఓటర్లను ప్రలోభ పెట్టే పనిలో పడ్డారు. ఓటరుని తమ వైపు తిప్పుకునేందుకు నగ దు, మద్యం, చీరలు, పంచెలు, ఇతర వస్తువులతో ప్రలోభాల పర్వానికి తెరతీశారు. ఇప్పటికే టీడీపీ కార్యకర్తలు ఈ నజరానాల పంపిణీలో తలమునకలై ఉన్నారు. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. ఓటింగ్ కేవలం రెండు రోజులే ఉన్నందున ఈ ప్రలోభాలు మరింత పెంచారు. ఇప్పటికే గ్రామాల్లో టీడీపీ కార్యకర్తల ఇళ్లకు నగదు, మద్యం నిల్వలు చేరవేశారు. ఐదేళ్లుగా అడ్డగోలుగా, టీడీపీ పాలకులు అక్రమ సంపాదనతో ఓట్లను కొనే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఓటుకి వెయ్యి నుంచి రెండు వేల వరకు పంపిణీ చేస్తున్నట్టు సమాచారం. పెచ్చుమీరుతున్న ఆగడాలు.. అధికార పార్టీ ఆగడాలు పెచ్చుమీరాయి. ఈ ఆగడాలను అరికట్టడంలో ఎన్నికల అధికారులు ఆశించినంతంగా విజయవంతం కావడం లేదు. ఫిర్యాదుల పరిశీలనే తప్ప వారు నేరుగా క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. వేర్వేరు మార్గాల్లో.. టీడీపీ కార్యకర్తలు ఎక్కువగా మహిళల ఓట్లను కొల్లకొట్టేందుకు టార్గెట్గా పెట్టుకున్నా రు. దీంతో డ్వాక్రా మహిళలను ప్రలోభాలకు గురి చేస్తూ ఈ పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. గ్రామీణ మహిళలను ఈ ప్రలోభాలకు వినియోగించుకుంటున్నారు. వారి వద్ద నుంచే ఆయా సంఘాలకు డబ్బులు అందేలా చేస్తున్నారు. ఉపాధి హామీలో పనిచేస్తున్న వారిని కూడా పావులుగా వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో ఉపా«ధి పనుల్లో ప్రచారం, అక్కడ మేట్, క్షేత్ర సహాయకుల ద్వారా ఈ పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. టెక్కలి నియోజకవర్గంలోనూ, మెళియాపుట్టిలో ఎన్ఆర్ఈజీఎస్ క్షే త్ర సహాయకులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలియడంతో ముగ్గురిని విధుల నుంచి తప్పించారు. డీలర్లను కూడా నాయకులు భయపెట్టి తమ దారిలోకి తెచ్చుకుంటున్నారు. నెల తొలి రోజులు కావడంతో సరుకుల పంపిణీతో పాటు తమ ప్రచారాలు కూడా చూసుకోవాలని బెదిరిస్తున్నారు. టెక్కలిలో.. టెక్కలి నియోజకవర్గానికి మంత్రి కింజరా పు అచ్చెన్నాయుడు ఈ సారి కూడా టీడీపీ తరఫున బరిలో ఉన్నారు. ఆయన గతంలో ప్రలో భాలతో గెలిచారని ఆ నియోజకవర్గం ప్రజలు చెబుతున్నారు. అయితే ఈ సారి కూడా అదే పంథాను సాగిస్తున్నారు. ఎన్నికల్లో ఓటర్లకు ఎర వేసేందుకు నగదు పంపిణీకి తెర తీశారు. సోమవారమే చాలా వరకు ఈ ప్రక్రియ ముగిసింది. మహిళలకు చీరలు, వృద్ధులకు పంచెలు, యువతకు డ్రస్సులు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఓటుకు ఐదు వందల నుంచి రెండు వేల వరకు పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. ♦ ఆమదాలవలస నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ అనుచరులు ప్రతి ఇంటికి వెళ్లి పింఛన్లు మంజూరు చేశామని, డ్వాక్రా డబ్బులు అందించామని, వాటితోపాటు చిరు ఉద్యోగాలు చేస్తున్న వారిని, వ్యాపారాలు చేస్తున్న వారిని బెదిరిస్తూ ఓట్లు వేయాలని ప్ర లోభాలకు గురి చేస్తున్నారు. కార్యకర్తలు కూడా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ♦ ఎచ్చెర్ల నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ దాదాపుగా గ్రామాలకు డబ్బులు, మద్యం చేరవేసింది. అడ్డతోవల్లో ఓట్లర్లను కొనుగోలు చేసేం దుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ♦ నరసన్నపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి ఓటర్లును ప్రలోభ పెట్టేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో డబ్బు, మద్యం పెద్ద ఎత్తున తరలించిన పార్టీ శ్రేణులు వీటిని కార్యకర్తలకు ఇస్తున్నారు. అలాగే మహిళలను కూడా ప్రలోభ పె ట్టేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓటరకు వెయ్యి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ♦ పాలకొండ నియోజకవర్గంలో ప్రచార పర్వం పూర్తి కావస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ నేతలు నగదు పంపిణీ చేసే పనిలో పడ్డారు. పార్టీ దిగువ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు ఒక్కొక్కరికి రూ. 5వేల చొప్పున నగదు ఇచ్చి ప్రతి ఇంటి యజమానికి రూ. 2వేల వంతున ప్రచార కరపత్రాల ద్వారా అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ♦ పలాస నియోజకవర్గం పరిధిలో టీడీపీ నాయకులు కార్యకర్తలకు రూ.500 చొప్పున రోజుకు అందిస్తున్నారు. భోజనాలు, వాహన సదుపాయం, వారికి నచ్చినటువంటి బ్రాండ్ మందు అందజేస్తున్నారు. ♦ పాతపట్నం నియోజవర్గంలో ఫిరాయింపు ఎమ్మెల్యే ఈ సారి పెద్ద ఎత్తునే ఖర్చు చేస్తున్నారు. ఆయన పార్టీ ఫిరాయించిన తర్వాత అక్రమార్జన పెరిగింది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు ఓటరుని ప్రలోభాలకు గురి చేస్తూ, మద్యం, నగదు పెద్ద ఎత్తున పంపకాలు చేస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement