Dileep raj
-
విషాదం.. గుండెపోటుతో 47 ఏళ్ల నటుడు మృతి!
కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్(47) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం ఉదయం తన ఇంట్లో దిలీప్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వెంటనే ఆయనను సమీప ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మరణించారని ధ్రువీకరించారు. దిలీప్ మరణవార్త కన్నడ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది.2007లో పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన మిలానా చిత్రంలో దిలీప్కి మంచి గుర్తింపు లభించింది. తర్వాత ‘యు-టర్న్’ సినిమాలో కీలక పాత్ర పోషించి అందరినీ మెప్పించాడు. వెండితెరపైనే కాదు.. హిట్లర్ కళ్యాణ వంటి సీరియల్తో బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించాడు.నటుడిగా కాకుండా నిర్మాతగా రాణించారు. డీఆర్ క్రియేషన్స్ బ్యానర్పై టీవీ సీరియళ్లను నిర్మించారు. ఆయన అకాల మృతితో కన్నడ సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. -
నచ్చకపోతే తిట్టండి
‘‘పండుగాడి ఫొటో స్టూడియో’ సినిమా నచ్చితే ఇతరులకు చెప్పండి.. నచ్చకపోతే నన్ను తిట్టండి. ఎక్కడైనా తప్పు ఉంటే ఎత్తి చూపండి.. సరిదిద్దుకుంటాను’’ అని దర్శకుడు దిలీప్ రాజా అన్నారు. అలీ, రిషిత జంటగా పెదరావూరు ఫిలిం సిటీ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్ పతాకంపై గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా దిలీప్ రాజా మాట్లాడుతూ– ‘‘రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా ఏపీలో చిత్రీకరించిన తొలి సినిమా మాదే. ఈ సినిమాలో మా హీరో ఎవరికి ఫొటో తీస్తే వారికి పెళ్లయిపోతుంది. ఎందుకు అలా జరుగుతుంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. పూర్తి గ్రామీణ నేపథ్యంలో మా చిత్రం కొనసాగుతుంది. మా కథను దర్శకుడు సుకుమార్గారు ఓకే చేసిన తర్వాతే చిత్రీకరణ మొదలుపెట్టాం. దర్శకులు జంధ్యాల, కె. బాలచందర్ గార్ల ఆశీర్వాదం మా సినిమాకి ఉంటుందని భావిస్తున్నా. యాజమాన్య చక్కని సంగీతం అందించారు. ఈ చిత్రంలో అలీని కమర్షియల్ హీరోగా చూపించాను. నేను బ్లాక్బస్టర్ తీశానా? సక్సెస్ఫుల్ సినిమా తీశానా? ఫెయిల్యూర్ సినిమా తీశానా? అని నిర్ణయించేది ప్రేక్షకులే. వారి తీర్పు కోసం ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. -
'డార్లింగె ఓసినా డార్లింగే' ఆడియో ఆవిష్కరణ


