breaking news
desecration
-
రెండు వర్గాల మధ్య ఘర్షణ..జంషెడ్పూర్లో ఉద్రిక్తత..
జార్ఘండ్లోని జంషెడ్పూర్లో రెండు గ్రూపులు ఘర్షణకు దిగడంతో అల్లర్లు చెలరేగాయి. శనివారం శ్రీరామ నవమి జెండాను అపవిత్రం చేశారన్న ఆరోపణలతో ఇరు గ్రూప్లు ఘర్షణకు దిగాయి. నిందితులను పట్టుకోవాని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టడంతోనే అల్లర్లు చెలరేగినట్లు అదికారులు తెలిపారు. దీంతో ఆప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ అల్లర్లను నియంత్రించేందుకు పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఈ మేరకు శాస్త్రి నగర్లో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుని రెండు దుకాణాలు, ఆటో రిక్షాకు నిప్పు పెట్టారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు పోలీసులు. గుమిగూడి ఉన్నవారిని అక్కడ నుంచి పంపించి.. ఆ ప్రాంతం మొత్తం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది మోహరించారు. ఈ మేరకు సింగ్భూమ్ డిప్యూటీ కమిషనర్ విజయ్ యాదవ్ మాట్లాడుతూ.. అల్లర్లుకు సంబంధించిన కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. పరిస్థితిని అంచనా వేస్తున్నామని, సాధారణ స్థితికి తీసుకురావడానికి శాంతి కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కొందరూ సంఘ వ్యతిరేకులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని, పౌరులు అప్రమత్తమై సహకరించాలని విజయ్ అన్నారు. అలాగే శాంతి భ్రదతల రక్షణ కోసం తగినంత పోలీసు బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీం, ఒక మేజిస్ట్రేట్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు సిబ్బందిని నియమించామని ఆమె ఒక ప్రకటనలో చెప్పారు. పుకార్లను నమ్మవద్దదని ఎమ్మెల్యే జాదవ్ ప్రజలను కోరారు. పుకార్లు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేదా సందేశాలు వస్తే పోలీసులకు తక్షణమే ఫిర్యాదు చేయాలని సూచించారు. #WATCH | Security forces conduct flag march in Jamshedpur's Kadma police station area following an incident of stone pelting and arson, in Jharkhand Section 144 CrPc is enforced in the area and mobile internet is temporarily banned. pic.twitter.com/NhPnWtkQhR — ANI (@ANI) April 10, 2023 (చదవండి: కోవిడ్ సన్నద్ధతపై దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్.. అప్రమత్తంగా ఉండాల్సిందే!) -
జమ్మూకాశ్మీర్లో తీవ్ర ఉద్రిక్తత
జమ్మూ: జమ్మూకాశ్మీర్లో శుక్రవారం కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు తమ పవిత్ర గ్రంధం ఖురాన్ను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలువురు ముస్లింలు నిరసనలు తెలిపేందుకు భారీ సంఖ్యలో భదేర్ వాహ్ వీధుల్లోకి వచ్చారు. ఈ సందర్భంగా పలు దుకాణాలు మూతపడగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. విద్యాసంస్థలను మూసివేశారు. కొందరు ముస్లిం యువకులు వీధుల్లోకి వచ్చి టైర్లు వేసి నిప్పంటించారు. రహదారులను దిగ్భందించారు. విజయదశమి సంబురాల్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తమ ఖురాన్ లోని కొన్ని పేజీలను తగులబెట్టారని అక్కడి ముస్లింలు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.