breaking news
Deposit Rs 600 Crore
-
‘రూ.600కోట్లు జమ చేయ్.. లేదంటే ఇక జైలుకే..’
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్కు సుప్రీంకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఫిబ్రవరి 6లోగా సెబీ-సహారాలో రూ.600 కోట్లు జమచేయాలని లేదంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ రంజన్ గొగోయ్, ఏకే సిక్రీలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. చదవండి..(పెరోల్ పొడిగిస్తాం కానీ..రూ.600 కోట్లు చెల్లించు!) ఇప్పటికే ఆయనకు చాలా అవకాశం ఇచ్చినట్లు కోర్టు స్పష్టం చేసింది. మరింత గడువు కావాలంటూ మరోసారి సహారా గ్రూపు వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. ఇప్పటి వరకు సహారా గ్రూపు పెట్టుబడిదారులకు దాదాపు రూ.18,000 కోట్లు తిరిగి చెల్లించింది. అనంతరం మరో వెయ్యి కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించి అనంతరం ఆ మొత్తాన్ని రూ.600 కోట్లకు తగ్గించి ఫిబ్రవరి 6నాటికి చెల్లించాలని ఆదేశించింది. -
పెరోల్ పొడిగిస్తాం కానీ..రూ.600 కోట్లు చెల్లించు!
సహారా చీఫ్ సుబ్రతా రాయ్ పెరోల్ గడువును సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. 2017 ఫిబ్రవరి 6వరకు పెరోల్ గడువు పొడిగిస్తున్నట్టు సుప్రీం సోమవారం పేర్కొంది. అయితే జైలు బయట ఉండటానికి ఫిబ్రవరి ఆరవ తేదీ వరకు రూ.600 కోట్లను డిపాజిట్ చేయాలని అత్యున్నత న్యాయస్థానం సహారా చీఫ్ను ఆదేశించింది. ఒకవేళ డబ్బును డిపాజిట్ చేయని పక్షంలో సరెండర్ అవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. అక్టోబర్ 25న కూడా సుప్రీంకోర్టు సుబ్రతా రాయ్ పెరోల్ను నవంబర్ 28వరకు పొడిగించింది. ఈ పొడిగింపుకు సహారా గ్రూప్ రూ.200 కోట్లు డిపాజిట్ చేసింది. మరో రూ.200 కోట్లను నవంబర్ ఆఖరికల్లా చెల్లించనున్నట్టు సహారా పేర్కొంది. కాగ, సుబ్రతారాయ్ తల్లి గత మే నెలలో మరణించడంతో కోర్టు మానవతా దృక్పథంతో ఆయనకు పెరోల్ మంజూరు చేసింది. ఆ తర్వాత డిపాజిట్ దారులకు డబ్బు వెనక్కి ఇచ్చేందు కోసం నాటి నుంచి ఆయన పెరోల్ను కోర్టు పొడిగిస్తూ వస్తోంది. నేటితో ముగుస్తున్న ఆయన పెరోల్ గడువును అపెక్స్ కోర్టు మరోసారి పొడిగించింది. మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి రెండు సహారా గ్రూప్ సంస్థలు రూ.25,000 కోట్లు వసూలు చేయడం.. వడ్డీతో సహా మొత్తం రూ.35,000 కోట్లు దాటి వాటిని తిరిగి చెల్లించడంలో ఆ సంస్థలు వైఫల్య చెందాయి. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కేసు నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ సంస్థల చీఫ్ సుబ్రతారాయ్ 2014 మార్చి 4 నుంచీ తీహార్ జైలులో ఉన్నారు. అనంతరం ఆయన పెరోల్పై బయటికి వచ్చారు. ఆయన బెయిల్కు రూ.10,000 కోట్లు(సగం నగదు రూపంలో, సగం బ్యాంకు గ్యారెంటీ రూపంలో) చెల్లించాలని మార్చి 26న సుప్రీంకోర్టు ఆదేశించింది. వాటిలో సగం మొత్తం సహారా నగదు రూపంలో సహారా చెల్లించింది. కానీ బ్యాంకు గ్యారెంటీ తరుఫును ఇవ్వాల్సిన రూ.5000 కోట్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి.