-
‘దోస్త్’ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే దోస్త్ మూడో దశ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 23 వరకూ పొడిగించినట్లు ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. కొత్తగా బీఏ (ఆనర్స్) కోర్సును రెండు కాలేజీల్లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడిం చారు. పొడిగించిన తేదీ వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చని, కొత్త కోర్సులను కూడా ఎంపిక చేసుకోవచ్చని ఆయన వివరించారు. -
ఏపీ: నేటి నుంచి డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో వివిధ కోర్సులలో ప్రవేశానికి ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ప్రొఫెసర్ సుధీర్ ప్రేమ్ కుమార్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. (చదవండి: సీఎం జగన్ లేఖపై తక్షణం స్పందించిన విదేశాంగ శాఖ) షెడ్యూల్ ఇలా.. నోటిఫికేషన్ – సెప్టెంబర్ 16న విద్యార్థుల రిజిస్ట్రేషన్ – 17–22 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు – 23–26 వరకు వెరిఫికేషన్– 23, 24 (స్పెషల్ కేటగిరి) సీట్ల కేటాయింపు– 29న కాలేజీల్లో రిపోర్టింగ్– సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తరగతుల ప్రారంభం– అక్టోబర్ 1 నుంచి (స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ ఎస్ఆర్ఆర్ కాలేజీ విజయవాడ, డా.వీఎస్ కృష్ణా కాలేజీ విశాఖపట్నం, ఎస్వీ వర్సిటీ తిరుపతిలో జరుగుతుంది.) 17, 18 తేదీల్లో ఏపీ ఐసెట్ ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): రాష్ట్ర స్థాయిలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఐసెట్–2021 ఈ నెల 17,18 తేదీల్లో నిర్వహించనున్నట్లు కన్వీనర్ ఆచార్య జి.శశిభూషణరావు ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా, హైదరాబాద్లో పరీక్ష కేంద్రాలను ఏర్పా టు చేశామన్నారు. నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షకు అనుమతించబోమని తెలిపారు. చదవండి: జేసీ బ్రదర్స్కు టీడీపీ ఝలక్ -
25 వరకు దోస్త్ రెండో దశ రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో సీట్ల కేటాయింపునకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) రెండో దశ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించింది. ఇప్పటికే మొదటి దశ సీట్ల కేటాయింపు పూర్తవడంతో తాజాగా తదుపరి దశల షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం రెండో దశలో ఆన్లైన్ ప్రవేశాల కోసం సోమవారం నుంచే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించినట్లు దోస్త్ కన్వీనర్ ఆర్.లింబాద్రి తెలిపారు. ఇది ఈ నెల 25వరకు కొనసాగుతుందన్నారు. అలాగే ఈనెల 26 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకో వచ్చని పేర్కొన్నారు. ఇక మొదటి దశలో సీట్లు పొందిన విద్యార్థులు సోమవారం నుంచే ఆన్లైన్ ద్వారా నిర్దేశిత కాలేజీ/సీటు రిజర్వేషన్ ఫీజు చెల్లించి ఆన్లైన్లో ఈ నెల 26వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలన్నారు. ప్రస్తుతం కాలేజీకి వెళ్లాల్సిన అవసరం లేదని, వీరికి తరగతులు ఎప్పుడు ప్రారంభించేదీ తరువాత తెలియజేస్తామని వెల్లడించారు. ఇదీ రెండు, మూడు దశల ప్రవేశాల షెడ్యూలు.. 25–9–2020 వరకు: రెండో దశ రిజిస్ట్రేషన్లు 26–9–2020 వరకు: రెండో దశ వెబ్ ఆప్షన్లు 25–9–2020: స్పెషల్ కేటగిరీ వారికి వర్సిటీ హెల్ప్లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 1–10–2020: రెండో దశ సీట్లు కేటాయింపు 1–10–2020 నుంచి 6–10–2020 వరకు: ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ 1–10–2020 నుంచి 5–10–2020 వరకు: మూడో దశ రిజిస్ట్రేషన్లు 1–10–2020 నుంచి 6–10–2020 వరకు: మూడో దశ వెబ్ ఆప్షన్లు 5–10–2020: స్పెషల్ కేటగిరీ వారికి వర్సిటీ హెల్ప్లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 10–10–2020: మూడో దశ సీట్లు కేటాయింపు 10–10–2020 నుంచి 15–10–2020 వరకు: ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్, మూడు దశల్లో సీట్లు పొంది, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వారు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. -
1,41,340 మందికి సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన మొదటి దశ ఆన్లైన్ ప్రక్రియలో 1,41,340 మంది విద్యార్థులకు సీట్లు లభించాయి. ఈ మేరకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) సోమవారం సీట్ల కేటాయింపును ప్రకటించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, దోస్త్ కన్వీనర్, మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, సీజీజీ డీజీ రాజేంద్ర నిమ్జే, కళాశాల విద్య ఏజీవో బాలభాస్కర్ తదితరులు వివరాలు వెల్లడించారు. మొదటి దశలో 1,71,275 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 1,53,323 మంది ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వీరిలో 1,41,340 మందికి సీట్లు లభించాయి. ఈసారి సీట్లు పొందిన వారిలో బాలికలే అత్యధికం. మొదటి ఆప్షన్ కాలేజీల్లోనే అధిక శాతం మందికి.. ఈసారి తక్కువ వెబ్ ఆప్షన్లు ఇచ్చినందున 11,983 మందికి సీట్లు లభించలేదు. విద్యార్థులు ఎంచుకున్న జిల్లా, కోర్సు, ప్రభుత్వ కాలేజీలో సీట్లు పొందిన వారు 282 మంది ఉన్నారు. ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన బీఎస్సీ డేటా సైన్స్ కోర్సులో మొత్తం 6,780 సీట్లు అందుబాటులో ఉండగా, 2,598 మందికి సీట్లు లభించాయి. సీట్లు పొందిన మొత్తం విద్యార్థుల్లో 65,167 మంది (46.10శాతం) బాలురు, 76,173 మంది (53.90 శాతం) బాలికలు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 982 కాలేజీల్లో 4,07,390 సీట్లు ఉండగా, మొదటి దశ సీట్ల కేటాయింపు 1,41,340 (34.69 శాతం) తరువాత ఇంకా 2,66,050 సీట్లు ఖాళీగా ఉన్నాయి. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం వల్ల ఈసారి విద్యార్థులు కొత్త కాంబినేషన్లు ఎంచుకున్నారు. గతేడాది 174 రకాల కాంబినేషన్లతో కోర్సులు ఉంటే ఈసారి 501 రకాల కాంబినేషన్లతో కోర్సులు అందుబాటులోకి తెచ్చారు. ఇక ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల్లో ఎక్కువగా బాలికలే ఉన్నారు. వారిలో అధికశాతం మందికి యూనివర్సిటీ కాలేజీలు, నిజాం కాలేజీల్లో సీట్లు లభించాయి. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. మొదటి దశ కౌన్సెలింగ్లో సీట్లు పొందిన విద్యార్థులు కచ్చితంగా మొదట ఫీజు చెల్లించి సీటు కన్ఫర్మ్ చేసుకోవాలని, అలా చేయకపోతే ఈ సీటు ఉండదని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి పేర్కొన్నారు. ‘విద్యార్థులు సీటు కన్ఫర్మ్ చేసుకున్న తరువాత రెండో దశ, మూడో దశ కౌన్సెలింగ్లో పాల్గొనవచ్చు. ఇపుడు నచ్చిన కాలేజీలోనే సీటు వచ్చిందనుకుంటే రెండు, మూడు దశల కౌన్సెలింగ్లో పాల్గొనవద్దు. ప్రస్తుత కాలేజీ నచ్చకపోతేనే రెండో దశ కౌన్సెలింగ్లో ఇంతకంటే నచ్చిన కాలేజీల్లో మాత్రమే ఆప్షన్లు ఇచ్చుకోవాలి. అపుడు ఆ కాలేజీలో సీటు వస్తే సరే. లేదంటే ఇపుడున్న సీటు అలాగే ఉంటుంది. ఒకవేళ రెండు మూడు దశల్లో ఇపుడు సీటు వచ్చిన కాలేజీ కంటే సాధారణ కాలేజీలకు ఆప్షన్ ఇస్తే, వాటిల్లో ఏదేని కాలేజీల్లో సీటు లభిస్తే ఇపుడు వచ్చిన సీటు ఆటోమెటిక్గా రద్దు అవుతుంది. కాబట్టి తమకు బెటర్ అనుకున్న దానికే ఆప్షన్ ఇవ్వాలి. ఇపుడు చెల్లించిన ఫీజు విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదు. రెండు, మూడు దశలో సీటు వచ్చినా ఆ కాలేజీ ఫీజు ప్రకారమే ఇపుడు చెల్లించిన మొత్తాన్ని సర్దుబాటు చేస్తారు. సీట్లు పొందిన విద్యార్థులకు ఎస్ఎంఎస్ ద్వారా మొబైల్కు వస్తాయి. దోస్త్ వెబ్సైట్లో విద్యార్థులు లాగిన్ అయి సీటు కేటా యింపు ఫీజు రూ. 500/రూ.1000 చెల్లించి ఈనెల 26లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా సీటు కన్ఫర్మ్ చేసుకోవాలి’అని సూచించారు. -
మొదట విడత డిగ్రీ సీట్ల కేటాయింపు: కన్వీనర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్(దోస్త్) మొదటి విడత సీట్లను కేటాయించినట్లు ‘దోస్త్’ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి సోమవారం వెల్లడించారు. కాగా మొత్తం1,71,275 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 1,53,323 మంది విద్యార్థులు ఆప్షన్స్ను ఎంచుకున్నారు. వీరిలో 1,41,340 మందికి డిగ్రీ సీట్లు కేటాయించినట్లు లింబాద్రి పేర్కొన్నారు. కేటాయింపులు పూర్తయిన అనంతరం 2,66,050 సీట్లు మిగిలిపోయాయని చెప్పారు. తొలి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 26 వ తేదీ వరకు దోస్త్ వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ఆయన సూచించారు. ఆ తర్వాత రెండో విడతలో వెబ్ ఆప్షన్లు ఇవ్వొచ్చని తెలిపారు. మరోవైపు రెండో విడత రిజిస్ర్టేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ సోమవారం(నేటి) నుంచి మొదలైందని లింబాద్రి పేర్కొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement