breaking news
deflationary
-
‘తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఇలా పతనం కావడం ఇదే తొలిసారి’
హైదరాబాద్: రేవంత్రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనతోనే తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని ధ్వజమెత్తారు. వరుసగా నెలలు తెలంగాణ మైనస్ ద్రవ్యోల్పణమే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పతనం అయ్యిందనడానికి నిదర్శమన్నారు. ఈ మేరకు కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. వరుస రెండు నెలల పాటు తెలంగాణ మైనస్ ద్రవ్యోల్పణంలోకి వెళ్లిపోవడం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇదే తొలిసారి అని మండిపడ్డారు. దేశంలో ఇలాంటి పరిస్థితి వచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కారు ఆర్థిక కార్యకలాపాలను పూర్తిగా అణచివేసిందని, అదే సమయంలో ఉద్యోగాలను సృష్టించడంలో విఫలమైందన్నారు. ఒక శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థను అవగాహన లేని పాలనతో నాశనం చేయడం చూస్తే బాధగా ఉందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలన నిరాశజనకంగా కనిపిస్తోందన్నారు కేటీఆర్. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, రాష్ట్రాభివృద్ధి తిరోగమనంలో పయనిస్తోందన్నారు.For the first time since its formation, Telangana has slipped into deflation for 2 straight months - June & JulyWhat’s worth highlighting is that Telangana is the ONLY state in India in this situationDeflation is not a sign of prosperity. It means people are limiting… pic.twitter.com/AAk5ZGCNTl— KTR (@KTRBRS) August 14, 2025 -
మైనస్లోనే టోకు ధరలు..
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2023 సెప్టెంబర్లో అసలు పెరక్కపోగా (2022 ఇదే నెలతో పోల్చి) మైనస్ (–) 0.26 శాతంగా నమోదయ్యింది. టోకు ధరల సూచీ మైనస్లోనే కొనసాగడం ఇది వరుసగా ఆరవ నెల. ఏప్రిల్ నుంచీ నెలకొన్న ఈ తరహా ధోరణిని ప్రతి ద్రవ్యోల్బణంగా వ్యవహరిస్తారు. ఎందుకంటే..: ప్రతి ద్రవ్యోల్బణానికి రసాయనాలు, రసాయన ఉత్పత్తులు, మినరల్ ఆయిల్స్, టెక్స్టైల్స్, బేసిక్ మెటల్స్, ఫుడ్ ప్రొడక్ట్స్ ధరలు తాజా సమీక్షా నెల్లో (2022 సెప్టెంబర్ ధరలతో పోలి్చతే) తగ్గడమే కారణమని వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. విభాగాల వారీగా చూస్తే... ఫుడ్ ఆరి్టకల్స్: ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 3.35 శాతానికి తగ్గింది. అంతక్రితం రెండు నెలలూ ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రెండంకెల్లో కొనసాగింది. ఆగస్టులో 10.60 శాతంగా ఉంది. తాజా సమీక్షా నెల్లో కూరగాయల ధరలు 15 శాతం తగ్గాయి. ఆగస్టులో వీటి పెరుగుదల రేటు 48.39 శాతంగా ఉంది. ఆలూ ధరలు 25.24 శాతం తగ్గాయి. అయితే పప్పులు (17.69%), ఉల్లి (55.05%) ధరలు సెప్టెంబర్లో పెరిగాయి. రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో 3 నెలల కనిష్ట స్థాయిలో 5.02 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. ఫ్యూయెల్ అండ్ పవర్: ఈ రంగంలో ప్రతి ద్రవ్యోల్బణం 3.35 శాతంగా ఉంది. తయారీ: మొత్తం సూచీలో మెజారిటీ వాటా గత ఈ రంగంలో ధరల తగ్గుదల 1.35%గా నమోదైంది. ఇక పెరిగే అవకాశం.. సెప్టెంబర్ వరకూ టోకు ధరల సూచీలో తగ్గుదల నమోదయినప్పటికీ, ఇకపై పెరిగే అవకాశమే ఉందన్నది నిపుణుల వాదన. అంతర్జాతీయంగా పెరుగుతున్న క్రూడ్ ధరలు, వర్షాభావం ఖరీఫ్ పంటపై అనిశ్చితి ధోరణి ఇందుకు కారణం కావచ్చని కేర్ఎడ్జ్ చీఫ్ ఎకనమిస్ట్ రజనీ సిన్హా పేర్కొన్నారు. -
భారీగా దిగివచ్చిన ద్రవ్యోల్బణం
సాక్షి, న్యూఢిల్లీ : పండుగ వేళ ప్రజలకు ఉపశమనంలా ద్రవ్యోల్బణం దిగివచ్చిందనే గణాంకాలు వెల్లడయ్యాయి. గత నెల డిసెంబర్లో వినియోగదారుల సూచీ ద్రవ్యోల్బణం కనిష్టస్ధాయిలో 2.19 శాతానికి తగ్గిందని ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. 2017 జూన్లో ద్రవ్యోల్బణం అత్యంత కనిష్టస్ధాయిలో 1.49 శాతంగా నమోదైన క్రమంలో ఆ స్ధాయిలో ద్రవ్యోల్బణం మళ్లీ తగ్గుముఖం పట్టింది. ఆర్థిక నిపుణుల అంచనాలకు అనుగుణంగానే డిసెంబర్లో వినిమయ ద్రవ్యోల్బణం దిగివచ్చిందని చెబుతున్నారు. ఇక డిసెంబర్లో టోకుధరల సూచీ ద్రవ్యోల్బణం ఎనిమిది నెలల కనిష్టస్ధాయిలో 3.80 శాతంగా నమోదైంది. ఇంధన ధరలు, కొన్ని ఆహారోత్పత్తుల ధరలు దిగిరావడంతో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. గత ఏడాది నవంబర్లో టోకుధరల సూచీ ద్రవ్యోల్బణం 4.64 శాతంగా నమోదైంది. కాగా డిసెంబర్లో ఆహారోత్పత్తుల సూచీ ప్రతి ద్రవ్యోల్బణం (డిఫ్లేషన్)లో 0.07 శాతంగా నమోదవడం గమనార్హం. కూరగాయల ధరలు సైతం 17.55 శాతం డిఫ్లేషన్ నమోదు చేశాయని ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేశాయి. -
మరో ఐదేళ్లు.. క్రూడ్ నేలచూపులే!
దీనివల్ల భారత్కు లాభమే... * రిలయన్స్ సీఎండీ ముకేశ్ అంబానీ న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు(క్రూడ్) ధరలు మరో 3-5 ఏళ్ల పాటు ఇప్పుడున్న దిగువ స్థాయిల్లోనే కొనసాగే అవకాశం ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. దీనివల్ల చమురు దిగుమతులపై అత్యధికంగా ఆధారపడుతున్న భారత్ వంటి దేశాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. సీఎన్ఎన్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుత క్రూడ్ ధరల పరిస్థితి చాలా కాలంపాటు కొనసాగవచ్చని భావిస్తున్నాం. కనీసం మూడు నుంచి ఐదేళ్లు ఉండొచ్చు. అంతేకాదు తొలిసారిగా డిమాండ్ను మించి సరఫరా పెరిగిపోవడం కారణంగా ముడిచమురు ధరలు పడిపోవడాన్ని ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. మార్కెట్ స్వరూపంలో భారీ మార్పులు వస్తేనే ప్రస్తుత ట్రెండ్ మారే అవకాశం ఉంది. మరోపక్క, అమెరికాలో క్రూడ్ ఉత్పత్తి గతంలో రోజుకు మిలియన్ బ్యారెళ్ల స్థాయి నుంచి ఇప్పుడు 9 మిలియన్ బ్యారెళ్ల స్థాయికి చేరింది. ఇది కూడా ధరల పతనానికి కారణమే. ఈ అధిక సరఫరా కారణంగా చమురు ఉత్పత్తి దేశాల కూటమి(ఒపెక్) ప్రపంచ క్రూడ్ మార్కెట్పై పట్టు కోల్పోయింది. ఫలితంగా అధిక సరఫరాకు దారితీసి ధరలు ఘోరంగా పతనమవుతున్నాయి’ అని ముకేశ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తాజాగా క్రూడ్ రేటు 11 ఏళ్ల కనిష్టానికి(నెమైక్స్ లైట్ స్వీట్ క్రూడ్ 26 డాలర్లు) పడిపోయిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ప్రతి ద్రవ్యోల్బణం(డిఫ్లేషనరీ) పరిస్థితులు చాలా ప్రమాదకరమైనవని ముకేశ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను కనిష్టస్థాయిల్లోనే కొనసాగిస్తాయని... అనుకున్నదానికంటే ఎక్కువ కాలమే ఈ ధోరణి ఉండొచ్చని కూడా ఆయన పేర్కొన్నారు. ద్వితీయార్ధంలో రిలయన్స్ జియో సేవలు... వాణిజ్యపరంగా 4జీ టెలికం సేవలు అందించేందుకు తమ రిలయన్స్ జియో సంస్థ తుది సన్నాహాలు చేస్తోందని... ఈ ఏడాది ద్వితీయార్ధంలో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు ముకేశ్ అంబానీ తెలిపారు. గతేడాది డిసెంబర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ సిబ్బంది(దాదాపు 1.2 లక్షలు), వ్యాపార భాగస్వాములకు జియో సేవలు అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. తమ సేవల ప్రారంభంతో దేశంలోని 80 శాతం ప్రజలకు తాము హైస్పీడ్ మొబైల్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ను అందుబాటులోకి తీసుకురానున్నామని ముకేశ్ చెప్పారు. 2017 నాటికి దీన్ని 90 శాతానికి.. 2018 కల్లా దేశమంతా జియో సేవలను విస్తరింపజేయనున్నట్లు ఆయన వెల్లడించారు.