తులసీ వైట్ టైగర్స్ గెలుపు
జింఖానా, న్యూస్లైన్: సీకే నాయుడు డే అండ్ నైట్ జూనియర్ క్రికెట్ టోర్నీలో తులసీ వైట్ టైగర్స్ జట్టు 9 వికెట్ల తేడాతో జూనియర్ మదీనా సీసీ జట్టుపై విజయం సాధించింది. అండర్-11 విభాగంలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన జూనియర్ మదీనా సీసీ 5 వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. అన ంతరం బరిలోకి దిగిన తులసీ వైట్ టైగర్స్ వికెట్ కోల్పోయి 41 పరుగులు చేసింది.
బ్యాట్స్మన్ నదీమ్ (26 నాటౌట్) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకున్నాడు. మరో మ్యాచ్లో దోబీఘాట్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో మౌలానా టైగర్స్పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన మౌలానా టైగర్స్ 3 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది. తర్వాత బరిలోకి దిగిన దోబీఘాట్ టైగర్స్ రెండు వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. 30 పరుగులు చేసి అజేయంగా నిలిచిన రాహుల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ జూనియర్ క్రికెట్ టోర్నీని బుధవారం నేషనల్ బ్యాంకింగ్ జోనల్ మేనేజర్ ఆర్ఎస్ చౌహాన్ లాంఛనంగా ప్రారంభించారు.
ఇతర మ్యాచ్ల స్కోర్లు
ఠ డీఏవీ క్రికెట్ క్లబ్: 38/3; డాన్ బాస్కో క్రికెట్ అకాడమీ: 39/2 (మిషద్ద్రి 20 నాటౌట్).
ఠ స్పోర్ట్స్ సెంటర్: 53/3; శివాజి మరాఠా: 54/2 (కరణ్ 31). ఠ రాయల్ టైగర్స్: 41/2; గ్రేట్ మరాఠా: 44/3