breaking news
dawath
-
Hyderabad: ప్రేమ వ్యవహారాలు, దావత్ల మోజులో చిన్నారులు
సాక్షి, హైదరాబాద్: ఆట పాటలతో హాయిగా సాగాల్సిన బాల్యం పక్కదారి పడుతోంది. చదువుపై శ్రద్ధ పెట్టాల్సిన చిన్నారులు దావత్ల మోజులో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా మద్యానికి బానిసలవుతున్నారు. ఫోన్లు, సినిమాల మాయలో పడి పసితనంలోనే ప్రేమ వ్యవహారాలు సాగిస్తున్నారు. చిన్న వయస్సులో స్నేహితులతో కలిసి విలాసవంతమైన విందులు చేసుకోవడం జీవితంలో భాగంగా నేటి చిన్నారులు, యువత భావిస్తున్నారు. తమ పనుల్లో బిజీగా మారిన తల్లిదండ్రులు పిల్లల గురించి పట్టించుకోకపోవడంతో వారు పెడదారులు పడుతున్నారు. తెలిసి తెలియని స్కూల్ వయస్సులోనే విద్యార్థులు ప్రేమ వలలో చిక్కుకుంటున్నారు. ఆన్లైన్ తరగతుల పుణ్యమా అని విద్యార్థులకు ఫోన్లు కొనివ్వడంతో వారు చాటింగ్లు చేస్తూ బడి వయస్సులోనే ప్రేమ వలలో చిక్కి ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి దాకా వెళ్తున్నారు. 15 ఏళ్లలోపు వారు సైతం మద్యం, సిగరెట్లు తాగుతున్నారు. బర్త్డే పార్టీల పేరిట రోడ్ల మీద హంగామా చేస్తున్నారు. కొందరు మద్యం తాగి సోషల్మీడియాలో ఫొటోలు సైతం పెడుతున్నారు. భయం లేకపోవడమేనా? గతంలో తల్లిదండ్రులు, గురువులు అంటే పిల్లలు భయపడేవారు. ప్రస్తుతం తల్లిదండ్రుల అతిగారాబంతో చిన్నారులకు వారంటే భయం ఉండడంలేదు. ఉపాధ్యాయులు విద్యార్థులను ఏమన్నా అంటే తల్లిదండ్రులు గొడవలు పెట్టుకునే పరిస్థితి ఉంది. దీంతో వారు సైతం మిన్నకుండిపోతున్నారు. ఇటీవల ఓ ప్రైవేటు పాఠశాలలో చిన్నారి చేసిన తప్పిదానికి ఉపాధ్యాయుడు మందలిస్తే తల్లిదండ్రులు, బంధువులు సదరు ఉపాధ్యాయుడిపై గొడవకు దిగారు. తల్లిదండ్రుల్లో మార్పు వస్తేనే.. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఫోన్లు, బైకులు, డబ్బులిచ్చి పాఠశాలకు కళాశాలకు పంపితే సరిపోతుందని భావించడంతోనే విద్యార్థులు పక్కదారి పడుతున్నారు. తాము పడుతున్న కష్టాలను తల్లిదండ్రులు తమ పిల్లలకు చూపించాల్సి ఉంది. పిల్లలు ఎటు పోతున్నారో ఓ కంట కనిపెట్టాలి. పిల్లల బాగోగులను ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకోవాలి. విద్యార్థి ప్రవర్తనలో మార్పు కనిపిస్తే ఉపాధ్యాయుల సలహాలు తీసుకోవాలి. ఆలోచన విధానం మారాలి పిల్లలకు తల్లిదండ్రుల నుంచే క్రమశిక్షణ అలవాటు అవుతుంది. పిల్లలకు ఏమిస్తున్నాం. దాని అవసరం ఎంత ఉందని తల్లిందడ్రులు తెలుసుకోవాలి. చిన్న వయస్సులో అవసరానికి మించి బైకులు, ఖరీదైన ఫోన్లు ఇచ్చి కళాశాలకు, పాఠశాలకు పంపరాదు. సంస్కారం తల్లిదండ్రులు నుంచి వస్తుంది. వినయం విద్య ద్వారా వస్తుంది. తాము కూడా పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నాం. – రమేశ్కుమార్, ఎస్ఐ, దౌల్తాబాద్ -
మునుగోడు ఓటర్లకు పెద్ద ఎత్తున దావత్ లు
-
దావత్ తర్వాత ధనాధన్!
► పిస్టల్తో అర్ధరాత్రి గాల్లోకి కాల్చిన రియల్టర్ ► హైదరాబాద్ నార్సింగి ఠాణా పరిధిలో జరిగిన ఉదంతం హైదరాబాద్: రాజధానిలో మరోసారి తుపాకీ పేలింది. రిసార్ట్స్లో జరిగిన దావత్లో పాల్గొన్న రియల్టర్ అది ముగిసిన తర్వాత తన లైసెన్డ్ పిస్టల్కు పని చెప్పాడు. మద్యం మత్తులో అకారణంగా కాల్చడంతో రెండు రౌండ్లు గాల్లోకి దూసుకుపోయాయి. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఉదంతంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. నిందితుడిని అరెస్టు చేసిన నార్సింగి పోలీసులు పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. గండిపేట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ విజేత భర్త ప్రశాంత్యాదవ్ సోమవారం రాత్రి గోల్కొండ రిసార్ట్స్లో స్నేహితులకు విందు ఏర్పాటు చేశారు. రియల్ఎస్టేట్ వ్యాపారులైన నార్సింగి మాజీ సర్పంచ్ వెంకటేష్యాదవ్, పుప్పాలగూడకు చెందిన ప్రభాకర్, మణికొండకు చెందిన బి.అజయ్, బి.శ్రీనివాస్, ప్రసాద్తో పాటు మరో ఇద్దరిని ఆహ్వానించారు. నల్గొండ జిల్లా కోదాడకు చెందిన ప్రభాకర్ కొన్ని రోజుల క్రితం పుప్పాలగూడ ప్రాంతానికి వచ్చి నివసిస్తున్నారు. ఈయన వద్ద కోదాడ పోలీస్ స్టేషన్ నుంచి 2014లో తీసుకున్న లైసెన్స్తో ఖరీదు చేసిన 32 క్యాలిబర్ పిస్టల్ ఉంది. వీరంతా కలిసి రాత్రి 11.30 వరకు రిసార్ట్స్లోనే గడిపారు. ఆపై రెండు కార్లలో ఇళ్లకు బయలుదేరారు. ప్రశాంత్యాదవ్ ఇంటి వద్దకు రాగానే అందరూ దిగి కొద్దిసేపు ఓ విషయమై చర్చించుకున్నారు. మిగిలిన వారు వెళ్లిపోగా... ప్రభాకర్తో పాటు మరో స్నేహితుడు అక్కడ మిగిలారు. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ తన పిస్టల్ తీసి గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో అంతా అక్కడ నుంచి జారుకోగా... కాల్పుల మోతతో స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు విందులో పాల్గొన్న వారందరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. మంగళవారం ప్రభాకర్ వద్ద నుంచి పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఆయుధ చట్టం ఉల్లంఘన ఆరోపణలపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కళ్ల ముందే ఓ సహచరుడు కాల్పులు జరిపినా... ఆ విషయం పోలీసులకు ఫిర్యాదు చేయని మరొకరిపైనా కేసు నమోదు చేశారు.