breaking news
data intelligence
-
స్పేస్టెక్ స్టార్టప్స్లోకి నిధుల వెల్లువ
ముంబై: స్పేస్టెక్ అంకుర సంస్థల్లోకి భారీ స్థాయిలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. డేటా ఇంటెలిజెన్స్ ప్లాట్ఫాం ట్రాక్షన్ టెక్నాలజీస్ ప్రకారం ఇప్పటివరకు 871 మిలియన్ డాలర్లు వచ్చాయి. 285 కంపెనీలు 241 విడతల్లో ఈ మొత్తాన్ని సమీకరించాయి. ఇటీవలే విక్రమ్–1 లాంచ్ వెహికల్తో రికార్డు సృష్టించిన హైదరాబాద్ సంస్థ స్కైరూట్లోకి అత్యధికంగా 150 మిలియన్ డాలర్లు వచ్చాయి. ఇది దేశీయంగా తొలి స్పేస్టెక్ యూనికార్న్గా (1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్) నిలి్చంది. ఈ ఏడాది మే నెలలో కంపెనీ 1.1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్తో నిధులను సమకూర్చుకున్నట్లు డేటాలో వెల్లడైంది. స్పేస్టెక్ కంపెనీలు బైటి నుంచి నిధులను సేకరించిన మొత్తం 871 మిలియన్ డాలర్లలో టాప్ 10 కంపెనీల వాటా ఏకంగా 60 శాతంగా ఉంది. డేటాలో మరిన్ని విశేషాలు.. ⇒ 106 విడతల్లో 495 మిలియన్ డాలర్ల సమీకరణతో బెంగళూరు స్పేస్టెక్ స్టార్టప్లు అగ్రస్థానంలో ఉన్నాయి. నిధులు దక్కించుకున్న టాప్ 10 సంస్థల్లో ఆరు స్టార్టప్లు బెంగళూరులోనే ఉన్నాయి. ⇒ బెంగళూరుకు చెందిన పిక్సెల్ (96 మిలియన్ డాలర్లు), అగి్నకుల్ కాస్మోస్ (76 మిలియన్ డాలర్లు), దిగంతర (67 మిలియన్ డాలర్లు) సంస్థలు స్కైరూట్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ⇒ ప్రభుత్వ రంగ ఇస్రో ఆధిపత్యం ఉన్న రంగంలో ప్రైవేట్ కంపెనీలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం సంస్కరణలు చేపట్టినప్పటి నుంచి స్పేస్టెక్ స్టార్టప్స్లోకి పెట్టుబడులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. 2021లో 43 మిలియన్ డాలర్లు రాగా 2025లో 200 మిలియన్ డాలర్లు పైగా వచ్చాయి. ⇒ 2026లో స్టార్టప్లు ఇప్పటివరకు 24 విడతల్లో 113 మిలియన్ డాలర్లు సమకూర్చుకున్నాయి. -
హైదరాబాద్లో స్టారెజ్ ఇన్నోవేషన్ హబ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టూడెంట్ హౌసింగ్ సాఫ్ట్వేర్ సేవల సంస్థ స్టారెజ్ తమ కార్యకలాపాలను హైదరాబాద్లో విస్తరించింది. తాజాగా గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ని ప్రారంభించింది. ఏఐ, డేటా ఇంటెలిజెన్స్ ధారిత ఆవిష్కరణలపై ఇది ప్రధానంగా దృష్టి పెడుతుందని సంస్థ చైర్మన్ ట్రావిస్ నైప్ తెలిపారు. భారత్లో ప్రస్తుతం 40కి పైగా ఉన్న తమ సిబ్బంది సంఖ్యను 200 పైచిలుకు పెంచుకోనున్నట్లు వివరించారు. ఆ్రస్టేలియా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టారెజ్.. అమెరికా, కెనడా తదితర దేశాల్లో 1,100 పైగా సంస్థలకు సేవలు అందిస్తోంది. -
స్క్వేర్ యార్డ్స్ చేతికి రియల్టీ స్టార్టప్
న్యూఢిల్లీ: రియల్టీ రంగంలో డేటా ఇంటెలిజెన్స్ సేవలందిస్తున్న ప్రాప్స్ఏఎంసీని కొనుగోలు చేసినట్లు ప్రాపర్టీ, గృహ రుణ బ్రోకింగ్ కంపెనీ స్క్వేర్ యార్డ్స్ తాజాగా పేర్కొంది. ఈ కొనుగోలులో భాగంగా ప్రాప్స్ఏఎంసీకి చెందిన సహవ్యవస్థాపకులతోసహా మొత్తం టీమ్ తమ సంస్థలో భాగంకానున్నట్లు తెలియజేసింది. అయితే ప్రాప్స్ఏఎంసీ సొంత బ్రాండుతోనే ఇకపైనా కొనసాగనున్నట్లు తెలియజేసింది. డీల్ విలువను వెల్లడించలేదు. డేటా ఇంటెలిజెన్స్, అసెట్ మేనేజ్మెంట్ తదితర రియల్ ఎస్టేట్ సర్వీసులందిస్తున్న ప్రాప్స్ఏఎంసీని 2016లో ఆనంద్ మూర్తి, వెంకట్ రాఘవన్ ఏర్పాటు చేశారు. ఎస్ఏఏఎస్(సాస్) ఆధారిత ప్లాట్ఫామ్ ద్వారా 1.5 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 11,000 కోట్లు) విలువైన రియల్టీ ఆస్తులను నిర్వహణను చేపడుతోంది. కాగా.. ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్క్వేర్ యార్డ్స్ 2014 నుంచి ఇప్పటివరకూ 5 కోట్ల డాలర్ల(సుమారు రూ. 360 కోట్లు) నిధులను సమీకరించింది. అక్టోబర్–డిసెంబర్ కాలంలో 12 శాతం అధికంగా రూ. 89 కోట్ల ఆదాయం సాధించింది. స్థూల లాభం 13 శాతం పెరిగి రూ. 33 కోట్లకు చేరువైంది. చదవండి: 2020లో అతిపెద్ద డీల్ హైదరాబాద్లోనే.. 2 నిమిషాల్లో కోటి రూపాయల పాలసీ


