Daripalli Ramaiah
-
వనజీవి కన్నుమూత
ఖమ్మం రూరల్/ ఖమ్మం మయూరి సెంటర్: వన ప్రేమికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దరిపల్లి (వనజీవి) రామయ్య (88) శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. రామయ్య ఖమ్మం రూరల్ మండలంలోని రెడ్డిపల్లిలో కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు. రోజూ తెల్లవారుజామున 4 గంటలకే నిద్ర లేచి తన దినచర్య ప్రారంభించే ఆయన ఉదయం 6 గంటలైనా మేల్కొనకపోవడంతో భార్య జానకమ్మ తట్టి లేపే ప్రయత్నం చేశారు.చలనం లేకపోవడంతో కుటుంబసభ్యుల సాయంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు భార్యతో పాటు కుమారుడు కనకయ్య, కుమార్తె సైదమ్మ ఉన్నారు. మరో ఇద్దరు కొడుకులు సైదులు, సత్యనారాయణ గతంలోనే చనిపోయారు. కాగా రామయ్య అంత్యక్రియలు ఆదివారం ఉదయం 10–30 గంటలకు పల్లెగూడెం శ్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.తుది శ్వాస వరకు మొక్కలు నాటుతూ..ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెంకు చెందిన దరిపల్లి లాలయ్య, పుల్లమ్మ దంపతులకు 1937 జూలై 1న రామయ్య జన్మించారు. ఆ తర్వాత వారు రెడ్డిపల్లికి వచ్చి స్థిరపడ్డారు. 5వ తరగతి వరకు చదువుకున్న రామయ్యకు చిన్నతనం నుంచే మొక్కల పెంపకంపై మక్కువ ఉండేది. ఉపాధ్యాయుడు జి.మల్లేశం మొక్కల పెంపకంతో కలిగే లాభాలపై బోధించిన పాఠం మనసులో నాటుకుపోయింది. అప్పటినుంచి మొక్కల ప్రేమికుడిగా మారి తుదిశ్వాస వరకు మొక్కలు నాటుతూనే ఉన్నారు.వృత్తి రీత్యా కుండలు చేస్తూ, ప్రవృత్తిగా మొక్కలు పెంచేవారు. ఇంట్లో సగ భాగంలో మొక్కల పెంపకాన్ని చేపట్టిన ఆయన.. పిల్లలతో సమానంగా వాటిని చూసుకునేవారు. రోడ్లు, గుట్టల వెంట తిరుగుతూ వివిధ రకాల మొక్కల విత్తనాలను సేకరించి వాటిని వివిధ ప్రదేశాల్లో నాటడం నిత్య కార్యక్రమంగా మార్చుకున్నారు. ఇలా ఇప్పటి వరకు కోటిన్నరకు పైగా మొక్కలను నాటారు.పాఠ్యపుస్తకాల్లో జీవిత విశేషాలుమహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి తెలుగు విద్యార్ధుల కోసం 9వ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవిత విశేషాలను పాఠ్యాంశంగా చేర్చి బోధిస్తుండటం ఆయనకు దక్కిన గౌరవంగా చెప్పవచ్చు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆరో తరగతి సాంఘిక శాస్త్రంలో వనజీవి విశేషాలతో పాఠం పొందుపరిచింది. రామయ్యకు ప్రముఖుల నివాళులురాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్తో పాటు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్రీజ.. రామయ్య భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కాగా రామయ్య మృతిపై పలువురు ప్రముఖులు, మంత్రులు, నేతలు సంతాపం ప్రకటించారు.ఇంటి పేరును వనజీవిగా మార్చుకొని, కోటికి పైగా మొక్కలు నాటి రికార్డులు సృష్టించిన దరిపల్లి రామయ్య మృతి రాష్ట్రానికే కాదు దేశానికి తీరని లోటు అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సంతాపాన్ని ప్రకటించారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కేంద్ర మంత్రులు జి.కిషన్రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, సీతక్క, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, డీకే అరుణ, ఈటల రాజేందర్, ఎమ్మెల్యే హరీశ్రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎంపీలు సంతోష్కుమార్, మధుయాష్కీ, మాజీ మంత్రి నిరంజన్రెడ్డి సంతాపం ప్రకటించారు.పద్మశ్రీ.. పలు అవార్డులుమొక్కల పెంపకంలో చేసిన కృషికి గాను వనజీవి రామయ్య 1995లో భారత ప్రభుత్వం నుంచి వనసేవా అవార్డు అందుకున్నారు. 2005లో సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ అవార్డు ప్రదానం చేసింది. యూనివర్సల్ గ్లోబల్ పీస్ అంతర్జాతీయ సంస్థ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. 2017లో కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసింది.సుస్థిరత కోసం గళం వినిపించారుదరిపల్లి రామయ్య సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా గుర్తుండిపోతారు. లక్షలాది చెట్లు నాటడమే కాకుండా వాటి రక్షణకు ఆయన తన జీవితాన్ని అంకితమిచ్చారు. ఆయన అవిశ్రాంత కృషి.. భవిష్యత్ తరాలపై బాధ్యతను ప్రతిబింబిస్తుంది. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.– ఎక్స్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీసమాజంపై తనదైన ముద్రపర్యావరణ పరిరక్షణకు, అడవుల పెంపకానికి అకుంఠిత దీక్షతో కృషి చేసిన రామయ్య సమాజంపై తనదైన ముద్ర వేశారు. పర్యావరణ పరిరక్షణకు వ్యక్తిగత స్థాయిలో తీసుకునే చర్యలు ఎంత శక్తివంతమైనవో తెలపడానికి రామయ్య జీవితం ఒక ఉదాహరణ. – రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మప్రకృతి కోసం జీవితాన్ని అంకితం చేశారుప్రకృతి, పర్యావరణం లేనిదే మానవ మనుగడ అసాధ్యమని విశ్వసించి, తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు రామయ్య. ఒక సామాన్య వ్యక్తిగా ఉండి, మొక్కలు నాటడం ద్వారా సమాజాన్ని స్ఫూర్తివంతం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.– సీఎం రేవంత్రెడ్డి పచ్చదనానికే తీరని లోటు‘వృక్షో రక్షతి రక్షితః’ అనే నినాదాన్ని తన శరీరంలో భాగం చేసుకుని, ప్రపంచానికి పచ్చదనం ప్రాముఖ్యతను ప్రచారం చేసిన వనజీవి రామయ్య లక్ష్యం మహోన్నతమైనది. ప్రపంచ పర్యావరణ కోసం సాగిన మానవ కృషిలో వనజీవిగా వారు చేసిన త్యాగం అసమాన్యమైనది. వనజీవి రామయ్య మరణం పచ్చదనానికే తీరని లోటు. – మాజీ సీఎం కేసీఆర్ రామయ్య సేవలు స్ఫూర్తిదాయకంప్రకృతి ప్రేమికుడు, సామాజిక కార్యకర్త వనజీవి రామయ్య మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషి మరువలేనిది. కోటి మొక్కలకు పైగా నాటి పుడమి తల్లికి ఆయన అందించిన సేవలు రేపటి తరానికి స్ఫూర్తిదాయకం. – ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి -
రామయ్య హరిత యజ్ఞం, ఎంత మేలు చేసిందో తెలుసా?
వృక్షో రక్షతి రక్షితః అనే సందేశమే వనజీవి రామయ్య జీవిత సారాంశం. చెట్ల ఆవశ్యకత చెప్పిన నిజమైన పర్యావరణ యోధుడాయన. వనజీవి రామయ్య చూపిన మార్గం భావితరాలకు ప్రేరణ కూడా. ఇంతకీ ఆయన ఏళ్ల తరబడి కొనసాగించిన హరిత యజ్ఞతం భవిష్యత్తు తరాలకు ఎంత మేలు అందించిందో తెలుసా?చిన్నప్పుడు బడిలో సర్ చెప్పిన పాఠాలే దరిపల్లి రామయ్య ఆకుపచ్చ కలకు స్ఫూర్తినిచ్చాయి. దశాబ్దాల పాటు శ్రమించి కోటికి పైగా మొక్కలు నాటేలా చేశాయి. ఇన్నేళ్లలో ఆయన నాటిన ఎన్నో వేల, లక్షల మొక్కలు మహావృక్షాలుగా ఎదిగాయి. స్వయంగా ఆయన నాటివే కాకుండా.. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మరెందరో మొక్కలు నాటి ఈ మహా యజ్ఞంలో భాగం అయ్యారు.చెట్లు కార్బన్ డైయాక్సైడ్ను పీల్చుకుని ఆక్సిజన్ను విడుదల చేస్తాయని తెలిసిందే. గాల్లోని హానికారక సల్ఫర్ డైయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లనూ ఫిల్టర్ చేస్తుంటాయి. కడదాకా ఆయన కొనసాగించిన హరిత యజ్ఞంతో.. కాలుష్యం తగ్గి గాలి స్వచ్ఛత పెరిగింది.ఏడాదిలో ఒక చెట్టు సగటున 48 పౌండ్ల(22 కేజీలు) కార్బన్ డైయాక్సైడ్ను పీల్చుకుంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బదులుగా ఏడాదికి ఇద్దరికి సరిపడా ఆక్సిజన్ను విడుదల చేస్తుందట. రామయ్య నాటింది కోటి మొక్కలకు పైనే. అంటే.. 218 మిలియన్ కేజీల Co2ను పీల్చుకునే అవకాశం ఉంది. ఏడాదికి 47 వేల కార్లు రోడ్డు మీద తిరిగితే వెలువడే కాలుష్యానికి ఇది సమానం. పోనీ కోటికి పైగా మొక్కల్లో లక్షల, వేల మొక్కలు వృక్షాలుగా ఎదిగి ఉన్నా.. ఆ మహానుభావుడి కృషి భావితరాల్లో ఎంత మందికి ప్రాణవాయువు అందిస్తుందో అర్థం చేసుకోవచ్చు. -
వనజీవి రామయ్య మృతికి ప్రధాని మోదీ సంతాపం
న్యూఢిల్లీ, సాక్షి: సామాజిక కార్యకర్త, పర్యావరణ ప్రేమికుడు పద్మశ్రీ వనజీవి రామయ్య(85) మృతిపై దేశవ్యాప్తంగా ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు దిగ్భ్ర్భాంతి వ్యక్తం చేస్తూ.. ఆయన సేవలను కొనియాడారు. తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ తన సంతాపం తెలియజేశారు. ఈ మేరకు తెలుగులో ఓ పోస్ట్ ఉంచారాయన.‘‘దరిపల్లి రామయ్య గారు సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా గుర్తుండిపోతారు. లక్షలాది చెట్లను నాటడానికి, వాటిని రక్షించడానికి ఆయన తన జీవితాన్ని అంకితమిచ్చారు. ఆయన అవిశ్రాంత కృషి ప్రకృతి పట్ల గాఢమైన ప్రేమనూ,భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతను ప్రతిబింబిస్తాయి. ఆయన చేసిన కృషి మన యువతలో, మరింత సుస్థిరమైన హరిత గ్రహాన్ని నిర్మించాలనే తపనను ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు,అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’ అని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. దశాబ్దాలుగా మొక్కలు నాటుతూ.. నలుగురితో మొక్కలు నాటిస్తూ.. వైవిధ్యమైన రీతిలో ప్రచారంతో హరిత ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ వచ్చారాయన. ఈ క్రమంలో కోటి మొక్కలకు పైనే నాటి అరుదైన ఘనత సాధించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం ఉదయం ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు.దరిపల్లి రామయ్య గారు సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా గుర్తుండిపోతారు. లక్షలాది చెట్లను నాటడానికి, వాటిని రక్షించడానికి ఆయన తన జీవితాన్ని అంకితమిచ్చారు. ఆయన అవిశ్రాంత కృషి ప్రకృతి పట్ల గాఢమైన ప్రేమనూ,భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతను ప్రతిబింబిస్తాయి. ఆయన చేసిన కృషి మన యువతలో,…— Narendra Modi (@narendramodi) April 12, 2025 -
వనజీవి రామయ్య మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: వనజీవి రామయ్య మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషి మరువలేనిది అంటూ ప్రశంసలు కురిపించారు.వనజీవి రామయ్య మృతిపై వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘ప్రకృతి ప్రేమికుడు, ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ వనజీవి రామయ్య గారి మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషి మరువలేనిది. కోటి మొక్కలకుపైగా నాటి పుడమి తల్లికి ఆయన అందించిన సేవలు రేపటి తరానికి స్ఫూర్తిదాయకం. వనజీవి రామయ్యగారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తూ నివాళులు’ అర్పించారు. ప్రకృతి ప్రేమికుడు, ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ వనజీవి రామయ్య గారి మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషి మరువలేనిది. కోటి మొక్కలకుపైగా నాటి పుడమి తల్లికి ఆయన అందించిన సేవలు రేపటి తరానికి స్ఫూర్తిదాయ… pic.twitter.com/5JjWgqnjf4— YS Jagan Mohan Reddy (@ysjagan) April 12, 2025 -
హరిత యాత్రలో అలసిన వనజీవి.. రామయ్య అరుదైన చిత్రాలు
-
Vanajeevi Ramaiah: ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇక లేరు
సాక్షి, ఖమ్మం: ప్రముఖ సామాజిక కార్యకర్త, జీవితమంతా మొక్కలు నాటేందుకే గడిపిన ప్రకృతి ప్రేమికుడు ‘వనజీవి’ రామయ్య(85) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం వేకువజామున గుండెపోటుతో కన్నుమూశారు. కోటికి పైగా మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో రామయ్య చేసిన కృషికిగానూ కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించింది.దరిపల్లి రామయ్య(Daripalli Ramaiah) స్వగ్రామం ఖమ్మం రూరల్ మండలంలోని ముత్తగూడెం. ఇక్కడే ఐదో తరగతి దాకా చదువుకున్నారు కూడా. ఆ సమయంలో మల్లేశం సర్ చెప్పిన మొక్కల పెంపకం పాఠాలు రామయ్యను బాగా ప్రభావితం చేశాయి. ఆపై పంటపొలాల కోసం చిన్నతనంలోనే రెడ్డిపల్లికి రామయ్య కుటుంబం మకాం మార్చింది. మల్లేశం సర్ పాఠాల స్ఫూర్తితో తన ఇంటిలోని 40 కుంటల స్థలంలో ఇల్లు పోను మిగతా జాగలో చెట్లు నాటి వాటిని ప్రాణప్రదంగా పెంచారు. అక్కడి నుంచి.. దశాబ్దాలపాటు రోడ్ల పక్కన ఖాళీ స్థలం, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ స్థలాలు, దేవాలయాలు.. ఇలా ఒకటేమిటి ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటడం రామయ్యకు నిత్యకృత్యమైంది. వృత్తిరీత్యా కుండలు చేస్తూ, పాలు అమ్ముతూ ప్రవృత్తి రీత్యా వనపెంపకానికి అవిశ్రాంతంగా కృషి చేశారాయన. మనవళ్లకు మొక్కల పేర్లు!వనజీవి రామయ్య((Vanajeevi Ramaiah)కు భార్య జానకమ్మ, నలుగురు సంతానం. ఓవైపు కుటుంబ భారాన్ని మోస్తూనే.. దశాబ్దాలకు పైగా మొక్కలు నాటుతూ వచ్చారు. విశేషం ఏంటంటే.. మనుమళ్లు, మనుమరాళ్లకు కూడా ఆయన చెట్ల పేర్లే పెట్టాడు. ఒకామె పేరు చందనపుష్ప. ఇంకో మనుమరాలు హరిత లావణ్య. కబంధపుష్ప అని ఇంకో పాపకు పెట్టాడు. మరో మనవరాలికి వనశ్రీ అని నామకరణం చేశారు వనజీవి రామయ్య.అలసిపోని వనజీవిఆయన యువతరం నుంచి నాటిన మొక్కలు నేడు మహావృక్షాలుగా దర్శనమిస్తున్నాయి. ఎండకాలం వచ్చిందంటే రామయ్య అడవుల్లోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. వయసు మీదపడుతున్నా కూడా అడవుల వెంట తిరుగుతూ వివిధ రకాల విత్తనాలను సేకరించేవారు. వాటన్నింటిని బస్తాల్లో నింపి ఇంటి దగ్గర నిల్వచేసేవారు. అందులో ఎవరికీ తెలియని చెట్ల విత్తనాలే ఎక్కువగా ఉండేవి. తొలకరి చినుకులు పడగానే మొక్కలు నాటే కార్యక్రమంలో మునిగిపోయేవారు. తాను మొక్కలను పెంచడం మాత్రమే కాదు.. పదిమందికి విత్తనాలు పంచి పెంచమని సూచించారు. బంధువుల ఇళ్ళలో పెళ్ళిళ్ళకు వెళ్ళినా సరే మొక్కలను, విత్తనాలను బహుమతులుగా ఇచ్చి పెంచమని ప్రోత్సహించే వారు. ఆ మధ్య ఆయనకు ఓ యాక్సిడెంట్ అయ్యింది. ఆ వాహనదారుడిని శిక్షించే బదులు అతనితో వంద మొక్కలు నాటించాలని పోలీసులను ఆయన కోరారు. అలాగే.. రైతు బంధు, దళిత బంధులాగా హరిత బంధు కూడా ఇప్పించాలంటూ బీఆర్ఎస్ హయాంలో ఆయన ఓ విజ్ఞప్తి కూడా చేశారు.సీఎం రేవంత్ సహా ప్రముఖుల సంతాపంపద్మశ్రీ వనజీవి రామయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ‘‘ప్రకృతి పర్యావరణం లేనిదే మానవ మనుగడ లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి వనజీవిగా పేరుగాంచిన దరిపల్లి రామయ్య గారు. ఒక వ్యక్తిగా మొక్కలు నాటడం ప్రారంభించి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి పద్మశ్రీ రామయ్య గారు. వారి మరణం సమాజానికి తీరని లోటు, కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి.పర్యావరణ రక్షణకు పాటుపడుతూ తన జీవితాన్ని అంకితం చేసిన రామయ్య గారి ఆత్మకు నివాళి. వారు సూచించిన మార్గం నేటి యువతకు ఆదర్శం అని ఒక ప్రకటన విడుదల చేశారు.ప్రచార సాధనాలుప్లాస్టిక్ డబ్బాలు, విరిగిపోయిన కుర్చీలు, ప్లాస్టిక్ కుండలు, రింగులు.. ఇలా ఆయన తన హరితహారం ప్రచారానికి సాధనాలుగా ఉపయోగించుకోనంటూ వస్తువు లేదు. వాటికి తన సొంత డబ్బులతో రంగులు అద్ది.. అక్షరాలు రాసి తలకు ధరించేవారు. అలా.. తను ఎక్కడికి వెళ్లనా మొక్కల పెంపకంపై అవగాహన కలిగించడం ఆయనకంటూ దేశవ్యాప్తంగా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టింది. ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా ‘‘వృక్షోరక్షతి రక్షిత’’ అని రాసివున్న ప్లకార్డులను తగిలించుకుని ప్రచారం చేసేవారాయన. అడిగిందే ఆలస్యం.. 120 రకాల మొక్కల చరిత్రను అలవోకగా వివరించేవారాయన.అవార్డులు, పాఠంగా రామయ్య జీవితంకోటికి పైగా మొక్కలను నాటి ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన రామయ్య సేవలకుగాను పలు సంస్థలు అవార్డులతో సత్కరించాయి. 2005 సంవత్సరానికి సెంటర్ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ నుంచి వనమిత్ర అవార్డు ఇచ్చింది. యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. 1995లో భారత ప్రభుత్వం నుంచి వనసేవా అవార్డు దక్కింది. సాక్షి మీడియా సంస్థ సైతం ఆయన సేవలకుగానూ ఎక్సలెన్స్(Sakshi Excellence Award) అవార్డుతో సత్కరించింది. ఇక.. మహారాష్ట్ర ప్రభుత్వం వనజీవి రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. అక్కడి తెలుగు విద్యార్థుల కోసం 9వ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితం పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. మరోవైపు.. తెలంగాణ 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో వనజీవి కృషిని పాఠ్యాంశంగా పిల్లలకు బోధిస్తున్నారు. 2017 సంవత్సరంలో నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ (సామాజిక సేవ) పురస్కారం అందుకుంటూ.. -
80వ పుట్టినరోజు.. కేజీల విత్తనాలు
ఖమ్మం రూరల్: ఖమ్మం జిల్లా రెడ్డిపల్లికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య తన 80వ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం 80 కేజీల విత్తనాలను నాటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఖమ్మం రూరల్ మండలం, కొణిజర్ల మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఆయన విత్తనాలు నాటి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడంతో పాటు మొక్కను బతికించినప్పుడే అందుకు తగిన ప్రతిఫలం వస్తుందని తెలిపారు. తద్వారా రాబోయే తరాలకు మేలు చేసిన వారమవుతాయని చెప్పారు. కార్యక్రమంలో రామయ్య అభిమాను లు పాల్గొన్నారు. (చదవండి: బియ్యంపై కయ్యం!) -
తెలుగు 'పద్మాలు' వీరే..
హైదరాబాద్/ న్యూఢిల్లీ: 2017 సంవత్సరానికి పద్మ పురస్కారాలను కేంద్రం బుధవారం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని పద్మ పురస్కారాలు వరించాయి. తెలంగాణకు ఆరు పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. చింతకింది మల్లేశం (చేనేత రంగం), మహ్మద్ అబ్దుల్ వాహిద్ (వైద్య రంగం), చంద్రకాంత్ పితావా (సైన్స్ అండ్ టెక్నాలజీ), వనజీవి రామయ్య (సామాజిక సేవ), మోహన్ రెడ్డి వెంకట్రామ బోదనపు (పారిశ్రామిక రంగం) లకు పద్మశ్రీ వచ్చింది. ఏపీ నుంచి త్రిపురనేని హనుమాన్ చౌదరి, వి. కోటేశ్వరమ్మ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 1. ప్రొఫెసర్ డా. ఎక్కా యాదగిరి రావు (శిల్పకళ), తెలంగాణ అసెంబ్లీ ఎదురుగా గన్పార్కులో ఉన్న 1969నాటి తెలంగాణ అమర వీరుల తాగ్యాలకు గుర్తుగా ఉన్న స్థూపాన్ని ఈయన రూపొందించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ‘బంగారు తెలంగాణ సాధిద్దాం’ నినాదంతో వీణను వాయుస్తున్న సంగీత కళాకారిణి శిల్పాన్ని రూపొందించారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ హైదరాబాద్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో శిల్పకళల డిపార్ట్మెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తించి రిటైరయ్యారు. 2. దరిపల్లి రామయ్య(సామాజిక సేవ), తెలంగాణ కోటి మొక్కలు నాటిన వనజీవి దరిపల్లి రామయ్యను పద్మశ్రీ పురస్కారం వరించింది. ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దరిపల్లి రామయ్య(వనజీవి రామయ్య) ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా ప్రసిద్ధి. 1995లో కేంద్రం నుంచి వనసేవా అవార్డు అందుకున్నారు. 3. చింతకింది మల్లేశం(సైన్స్ అండ్ ఇంజినీరింగ్), తెలంగాణ చేనేతకు సంబంధించిన యంత్రాన్ని కనుగొన్నందుకు ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం శారాజీపేట గ్రామానికి చెందిన చింతకింది మల్లేశం ఓ చేనేత కార్మికుడు. 2000ల సంవత్సరంలో కేవలం గంటల్లోనే చీర నేసే యంత్రం కనిపెట్టారు. 2011లో ఈ యంత్రానికి పేటెంట్ హక్కులు వచ్చాయి. 2011లో ఈ యంత్రానికి సాఫ్ట్ వేర్ జత చేస్తామని అమెరికా ముందుకు రావడం విశేషం. 4. త్రిపురనేని హనుమాన్ చౌదరి (సివిల్ సర్వీస్), ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఐటీ సలహాదారుగా ఈయన వ్యవహరించారు. 5. వి. కోటేశ్వరమ్మ (సాహిత్యం మరియు విద్య), ఆంధ్రప్రదేశ్ విజయవాడలో మాంటిసోరి మహిళా కళాశాలకు ప్రిన్సిపాల్గా వ్యవహరించారు. మహిళల విద్యకు ఎన్నో ఎళ్ల నుంచి ఎంతో విశేష సేవ చేశారు. 6. డాక్టర్ మహ్మద్ అబ్దుల్ వహీద్(మెడిసిన్), తెలంగాణ 7. చంద్రకాంత్ పితావ(సైన్స్ అండ్ ఇంజినీరింగ్), తెలంగాణ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో సైంటిస్ట్గా, డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించి రిటైరయ్యారు. బార్క్ ట్రాంబే, ముంబై, ఈసీఐఎల్ హైదరాబాద్లో సేవలు అందించారు. 8. మోహన్రెడ్డి వెంకటరామ బోదనపు(వాణిజ్యం, పరిశ్రమలు), తెలంగాణ -
‘వన’ రామయ్య
♦ చెట్లే ఆయన ప్రాణం..కోటి మొక్కల పెంపకం ♦ పచ్చని పుడమి కోసం నిత్య ప్రయత్నం ♦ ‘హరితహారమే’ అతని జీవనయానం వృక్షో రక్షితి రక్షితః అని రాసివున్న గుండ్రని రేకును తలకు కిరీటంలా ధరించి నిత్యం ఏదో ఒక ప్రాంతంలో సంచరించే రామయ్య జిల్లా ప్రజలకు సుపరిచితులే. ‘వనజీవి’ రామయ్య అంటే తెలియని వారుండరేమో..!. ప్రభుత్వం నేడు చేపట్టిన హరితహారం స్ఫూర్తిని ఆయన ఏనాడో పుణికిపుచ్చుకున్నారు. 75 ఏళ్ల వయసులోనూ భార్య జానకమ్మతో కలిసి నిత్యం మొక్కలు నాటుతూ.. ఈ దంపతులు పచ్చని పుడమికోసం పాటుపడుతున్నారు. ఇప్పటికే కోటికి పైగా మొక్కలు నాటిన ఈ రామయ్యకు కోటి మొక్కులు మొక్కినా తక్కువే... కాబట్టి ‘పచ్చని మొక్కను నాటి..పెంపు చేయడమే..’ ఈ వనజీవికి మనం చేయగలిగిన గొప్ప సన్మానం. ‘హరితవారం’ నేపథ్యంలో సండేస్పెషల్గా రామయ్య సేవలను మరోమారు గుర్తుచేసుకుందాం..ఆయన బాటలో సాగుదాం... - సాక్షి ప్రతినిధి, ఖమ్మం సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ‘మొక్కల పెంపకం.. వాటి ప్రాధాన్యం గురించి’ పాఠశాల రోజుల్లో తెలుసుకున్న ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లికి చెందిన దరిపల్లి రామయ్య హరితోద్యమానికి ఆనాడే శ్రీకారం చుట్టారు. 75 ఏళ్ల వయసులోనూ వక్ష రక్షణ కోసం పాటుపడుతున్న ఈ రామయ్య ఇప్పటికే కోటికి పైగా మొక్కలను నాటి పెంచాడు. భార్య జానకమ్మతో కలిసి ‘హరితోద్యమం’ నిర్వహిస్తున్న రామయ్య ఇంటిపేరు దరిపల్లి కాస్త వనజీవిగా మారిపోరుుంది. ఎవరీ రామయ్య..? ఖమ్మం రూరల్ మండలంలోని రెడ్డిపల్లికి చెందిన దరిపల్లి రామయ్య చెట్లను ప్రాణప్రదంగా చూసుకుంటాడు. ఇతని స్వగ్రామం ఇదే మండలంలోని ముత్తగూడెం. పంటపొలాలు రెడ్డిపల్లిలో ఉండటంతో ఇక్కడికి చిన్నప్పుడే వచ్చి స్థిరపడ్డారు. రామయ్యకు భార్య జానకమ్మ, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్నతనం నుంచి కుటుంబ భారాన్ని మోస్తూనే 43 ఏళ్లుగా మొక్కలను పెంచుతున్నారు. ముత్తగూడెం పాఠశాలలో 5వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ సమయంలోనే ఉపాధ్యాయుడు మల్లేశం ప్రబోధించిన ‘మొక్కల పెంపకం- లాభా లు’ అనే పాఠం అతనిలో స్ఫూర్తినింపింది. తన ఇంటిలోని 40 కుంటల స్థలంలో ఇల్లు పోను మిగతా భాగంలో చెట్లు నాటి వాటిని ప్రాణపదంగా పెం చాడు. అది మొదలు రోడ్ల పక్కన ఖాళీ స్థలం, ప్రభు త్వ కార్యాలయాలు, ప్రైవేట్ స్థలాలు, దేవాలయాలు..ఇలా ఒకటేమిటి ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటడం రామయ్యకు నిత్యకృత్యమైంది. వృత్తిరీత్యా కుండలు చేస్తూ, పాలు అమ్ము తూ ప్రవృత్తి రీత్యా వనపెంపకానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న రామయ్య మొక్కలనే బహుమతిగా ఇస్తూ పెంచాలంటాడు. వెయ్యికిపైగా సూక్తులు.. వన రక్షణపై వెయ్యికి పైగా సూక్తులు, 315 శిల్పాలపై మొక్కల చరిత్ర చెక్కాడు. ఏమొక్కను చూపించినా ఆ మొక్క ఉపయోగాన్ని రామయ్య అలవోకగా చెబుతాడు. కెన్యా దేశానికి చెందిన వంగారి మాతాయిని స్ఫూర్తిగా తీసుకుని రామయ్య మూడు కోట్ల మొక్క లు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. మాతాయి 1970లో గ్రీన్బెల్ట్ మూవ్మెంట్ను స్థాపించి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ను నడిపిస్తూ మొక్కలు నాటడంపై దృష్టి పెట్టారు. 1986 నుంచి మహిళల హక్కులు, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్కై కృషి చేస్తున్నారు. 2004లో రైట్ లైవ్హుడ్ అవార్డ్ తీసుకున్నారు. సుస్థిర అభివృద్ధి - ప్రజాస్వామ్యంలో శాం తిని ప్రోత్సహిస్తున్నందుకుగాను నోబెల్ బహుమతి అందుకున్నారు. ఆమె గురించి వనజీవి రామయ్య విద్యావేత్తల ద్వారా తెలుసుకుని ప్రభావితమయ్యూ రు. రామయ్య 120 రకాల మొక్కల చరిత్రను తేలికగా వివరిస్తారు. కుటుంబ సభ్యులకు చెట్ల పేర్లు వనజీవి రామయ్య చెట్లను ఎంతగానో ప్రేమిస్తాడనడానికి నిదర్శనం తన మనుమరాళ్లకు హరిత లావ ణ్య, చందన పుష్ప అని పేర్లు పెట్టడమే. అలాగే తన కుమారుడు సైదయ్య, సత్యనారాయణ, కనకయ్య, కూతురు సైదమ్మ వివాహాల శుభలేఖలపై వృక్షాల గురించిన సమాచారం కూడా ముద్రించి మొక్కలపై తన మక్కువను చాటుకున్నారు. తన సహధర్మచారిణి జానకమ్మ సహా ఎవరికి ఏ రోగమొచ్చినా మొ క్కల ఆకులతోనే వైద్యం చేయటం గమనార్హం. ఎన్నో అవార్డులు.. వనజీవి విశేష కృషికి ఎన్నో సంస్థలు గౌరవ పురస్కారాలు అందించాయి. జిల్లా అటవీశాఖ పర్యావరణ అవార్డును అందజేసింది. 1995లో కేంద్ర ప్రభుత్వం నుంచి సేవా అవార్డును అందుకున్నారు. అలాగే 2005లో సెంటర్ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ అందజేసిన వనమిత్ర అవార్డును ఢిల్లీలో మాజీ ప్రధాని పి.వి.నరసింహరావు చేతుల మీదుగా తీసుకున్నారు. జిల్లాలో గణతం త్ర, స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా వనజీవికి ప్రతి ఏటా అవార్డులే. అతని కృషి, పట్టుదలకు ఆకర్షితులైన జిల్లా యంత్రాంగం గతంలో ఒక ద్విచక్రవాహనానంతో పాటు పెట్రోల్ ఖర్చుల కింద రూ.4 వేలు ఇచ్చింది. కాలక్రమంలో ద్విచక్రవాహనం మరమ్మతులకు గురవడంతో తన పాత సైకిల్పైనే తిరుగుతున్నారు. కోటి మొక్కల ఘనకీర్తి.. త ను నాటిన కోటి చెట్ల నీడలో రేపటి తరం సుఖంగా ఉండాలన్నదే వనజీవి తపన. ఆయన కంటికి ఎండిన మొక్క కన్పిస్తే నీరు పోయకుండా ముందుకు కదలడు. శుభకార్యాలకు వెళ్ళినప్పుడు బహుమతులు బదులు మొక్కలను బహూకరిస్తారు. నేటి ప్రభుత్వం చేపట్టిన ‘హరితహారం’ స్ఫూర్తిని ఏనాడో పుణికిపుచ్చుకున్న రామయ్య స్ఫూర్తితో అందరం ముందుకు సాగుదాం..మొక్కలు, చెట్లను సాకుదాం..