breaking news
dangerous driving
-
హైవేపై డ్రాగర్ చూపుతూ యువతి హల్చల్
సాక్షి, కర్ణాటక : బెంగళూరు గ్రామీణ జిల్లా పరిధిలోని దేవనహళ్లి మార్గంలోని హైదరాబాద్ హైవే, నెలమంగల సమీపంలోని తుమకూరు హైవేలపై వీకెండ్ వచ్చిందంటే యువతీ యువకులు వీలింగ్ చేస్తూ వాహనదారులను భయాందోళనలకు గురిచేస్తున్నారు. శని, ఆదివారాల్లో తెల్లవారితే వీరి బెడద అంతా ఇంతా కాదు. వీరివల్ల అనేక ప్రమాదాలు సంభవించాయి. ఆదివారం రాత్రి నెలమంగల సమీపంలోని తుమకూరు హైవేపై ఒక జంట రెచ్చిపోయింది. (రాగిణి, సంజనలకు బెయిలు ఇస్తే ఇక అంతే) యువకుడు బైక్ను వీలింగ్ చేసి రోడ్డుమీద న్యూసెన్స్ చేస్తుండగా వెనుక కూర్చున్న యువతి చేతిలో డ్రాగర్ పట్టుకుని ప్రదర్శిస్తూ వెర్రిగా కేకలు వేసింది. దీంతో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు ఈ వీడియో తీసి వైరల్ చేశారు. ఈ జంట కోసం పోలీసులు వేట ప్రారంభించారు. -
స్పీడ్ కిల్స్!
► సిటీలో వాహనాల సరాసరి వేగం: గంటకు 18 కి.మీ ► నిశిత్ నారాయణ నడుపుతున్న కారు స్పీడు: గంటకు 205 కి.మీ... ► మెర్సిడెస్ బెంజ్ జీ 63 ఏఎంజీ మోడల్ వాహనం గరిష్ట వేగం: గంటకు 230 కి.మీ ► అతివేగం..ర్యాష్ డ్రైవింగ్లతోనే ప్రమాదాలు ► నగరంలో ఏటా వేల కేసులు నమోదు ► నగర రోడ్లకు–వాహనాలకు పొంతనే లేదు ► అడ్డుకోవడానికి అవసరమైన నిబంధనలు కరవు సిటీబ్యూరో: వాహనాన్ని అతివేగంగా నడపడం వల్లే ఏపీ మంత్రి నారాయణ తనయుడు నిశిత్ నారాయణ బుధవారం తెల్ల వారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు తేలింది. ఈనేపథ్యంలో నగరంలో వాహనాల వేగంపై మరోసారి చర్చ తలెత్తింది. కేవలం ఈ సమయాల్లో, ఈ మార్గాల్లోనే కాదు... సిటీలో ఎక్కడ చూసినా ఓవర్ స్పీడింగ్, డేంజరస్ డ్రైవింగ్, ర్యాష్డ్రైవింగ్స్ కనిపిస్తాయి. ఈ ఉల్లంఘనలకు పాల్పడే వారు సైతం 20–30 ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువగా ఉంటున్నారు. అదో ప్యాషన్గా మారిపోయి... స్పీడ్ థ్రిల్స్... బట్ కిల్స్ అనే నానుడిని పోలీసు, ఆర్టీఏ విభాగాలు నిత్యం ప్రచారం చేస్తూనే ఉంటాయి. అయినప్పటికీ హైఎండ్ వాహనాల్లో/వాహనాలపై, వీలున్నంత వేగంగా దూసుకుపోవడం కొందరు వాహనచోదకులకు నిత్యకృత్యమైంది. అధికారులు రహదారి నిబంధనల ఉల్లంఘనల్ని మూడు కేటగిరీలుగా విభజిస్తారు. వాహనచోదకుడికి ప్రమాదం కలిగించేవి, ఎదుటి వారికి ప్రమాదాన్ని చేకూర్చేవి, వాహనచోదకుడితో పాటు ఎదుటి వారికీ ప్రమాదకరమైనవి. ఓవర్ స్పీడింగ్, డేంజరస్ డ్రైవింగ్, ర్యాష్డ్రైవింగ్ ఉల్లంఘనలు మూడో కోవకు చెందుతాయి. వాహనం ఏమాత్రం అదుపు తప్పినా వాహనచోదకుడినే కాదు అనేక సందర్భాల్లో ఏ పాపం ఎరుగని ఎదుటి వారినీ మింగేస్తాయి. అయినప్పటికీ రద్దీ రోడ్లలోనూ విచ్చలవిడి స్పీడుతో, విన్యాసాలతో దూసుకుపోయే యువత ఎందరో ఉంటున్నారు. రాత్రి వేళల్లో, విశాలంగా... ఖాళీగా కనిపిస్తున్న రోడ్లపై వీరి విషయం ఇక చెప్పక్కర్లేదు. ఆ రెంటికీ పొంతనే ఉండదు... నగరంలోని రోడ్ల స్థితిగతులు, వాహనాల గరిష్ట వేగం తదితర అంశాలపైనే ఇక్కడ పరిగెత్తే వాహనాలు ఆధారపడి ఉంటాయి. అయితే సిటీలో సరాసరి వేగం గరిష్టంగా గంటకు 18 కి.మీగా ఉంటే...ఇక్కడ అందుబాటులో ఉంటున్న, దిగుమతి చేసుకుంటున్న వాహనాల గరిష్టం వేగం గంటలకు 200 కిమీ కంటే ఎక్కువే ఉంటోంది. ఇదే అనేక సందర్భాల్లో ప్రమాదాలకు హేతువుగా మారింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలో మితిమీరిన వేగంతో వెళ్ళే వాహనాల రిజిస్ట్రేషన్ను నిరోధించే చట్టాలు, నిబంధనలు అంటూ మచ్చుకైనా కనిపించవు. సిటీలో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ స్థాయిలో మౌలిక వసతులు, రోడ్ల విస్తరణ చేడుతున్న దాఖలాలు లేవు. ఇవన్నీ సైతం పరోక్షంగా రోడ్డు ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి. ‘బెల్ట్’ అంటే నిర్లక్ష్యం... ద్విచక్ర వాహనచోదకుడికి హెల్మెట్ ఎలానో.. తేలికపాటి వాహనం నడిపే వారికి సీటుబెల్ట్ అలానే తప్పనిసరి. అయితే వీటిని ధరించి కార్లు నడుపుతున్న వారి సంఖ్య ఉండాల్సిన స్థాయిలో ఉండట్లేదు. నిబంధనల ప్రకారం తేలికపాటి వాహనాలను డ్రైవ్ చేసే వారు మాత్రమే కాదు.. వాటిలో ప్రయాణించే వారు సైతం సీటుబెల్టులు ధరించాల్సిందే. కానీ పాటిస్తున్న దాఖలాలు తక్కువే. బుధవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్లో జరిగిన నిశిత్ నారాయణ ప్రమాదంలో ప్రాణనష్టానికి సీటుబెల్ట్ వాడకపోవడమే కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎట్టకేలకు మేల్కొన్న పోలీసులు... సిటీ ట్రాఫిక్ పోలీసులు ఇటీవలే రేసింగ్స్, ర్యాష్డ్రైవింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టారు. వీరిని కట్టడి చేయడానికి ‘ఆర్ఆర్ డ్రైవ్’ పేరుతో ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. వీటిలో చిక్కిన వారికి జరిమానాతో సరిపెట్టకుండా వాహనాలు స్వాధీనం చేసుకోవడం, కౌన్సిలింగ్ వంటి చర్యలు తీసుకుంటున్నారు. -
నిబంధనలు గాలికి.. ప్రాణాలు గాల్లోకి!
-
నిబంధనలు గాలికి.. ప్రాణాలు గాల్లోకి!
నిబంధనలు పాటించకుండా, లాభార్జనే ధ్యేయంగా కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు వ్యవహరించడం వల్ల ప్రమాదాలు సంభవించి విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు వద్ద మంగళవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైన దివాకర్ ట్రావెల్స్ బస్సు కూడా వాస్తవానికి కాంట్రాక్ట్ క్యారియర్గానే వెళ్లాలి. అంటే బస్సు బయల్దేరిన చోట మాత్రమే మొత్తం ఎంతమంది ప్రయాణికులుంటే అందరినీ ఎక్కించుకుని, వారందరినీ గమ్యస్థానాల వద్ద దించాలి. అంతే తప్ప మధ్యదారిలో మాత్రం ఎవరినీ ఎక్కించుకోకూడదు. అలా ఎక్కించుకునేవాటిని స్టేజి క్యారియర్లు అంటారు. ప్రమాదానికి గురైన దివాకర్ ట్రావెల్స్ బస్సు కాంట్రాక్టు క్యారియర్. ఈ విషయాన్ని బస్సు రిజిస్ట్రేషన్ సమయంలోనే పేర్కొన్నారు. కానీ ఇష్టం వచ్చినట్లు ఎక్కడపడితే అక్కడ ప్రయాణికులను ఎక్కించుకున్నారు. ప్రయాణించిన వారు ఇలా.. శ్రీకాకుళం-హైదరాబాద్ 15 మంది, విశాఖపట్నం -హైదరాబాద్ 14 మంది, విశాఖపట్నం - విజయవాడ ఒకరు, భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ 9 మంది, భువనేశ్వర్ నుంచి విజయవాడ నలుగురు, భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం ఒకరు, టెక్కలి నుంచి హైదరాబాద్ ముగ్గురు, టెక్కలి నుంచి విజయవాడ ఒకరు, బెర్హంపూర్ నుంచి హైదరాబాద్ ఇద్దరు చొప్పున టికెట్లు తీసుకున్నారు. మొత్తం 50 సీట్లు ఉండగా ఒక్కటి కూడా ఖాళీ లేకుండా అన్నీ భర్తీ అయ్యాయి. గతంలోనూ అతివేగం ఇదే బస్సు ఇంతకుముందు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేటప్పుడు కూడా అతి వేగంగా, ప్రమాదకరంగా వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో జనవరి 12వ తేదీన ఇదే ఏపీ02టీసీ7146 నంబరు బస్సును.. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి చెక్పోస్టు వద్ద అధికారులు పట్టుకున్నారు. అప్పుడు డ్రైవర్ అత్యంత ప్రమాదకరంగా నడుపుతున్నట్లు గుర్తించి, అతడికి 2వేల రూపాయల జరిమానా విధించారు. డ్రైవర్ కూడా తాను తప్పు చేసినట్లు అంగీకరించి, జరిమానా చెల్లించాడు. ఈ విషయాన్ని కత్తిపూడి చెక్పోస్టులో పనిచేసిన అధికారి శ్రీకాంత్ బాబు ధ్రువీకరించారు. కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం