breaking news
dalith woman
-
యాకమ్మ ఒక గొప్ప వెలుగు
తాళ్లపల్లి యాకమ్మ ఇంట్లో ఎవరూ చదువుకోలేదు. కథలు అంటే తెలియదు. మహబూబాబాద్ దళితవాడలో అర్ధాకలితో పెరిగిన యాకమ్మ తల్లిదండ్రుల్ని కోరింది ఒక్కటే – చదివించమని. ఇంటర్లో పెళ్లయినా ఆ తర్వాత పిల్లలు పుట్టినా యాకమ్మ చదువు మానలేదు. తెలుగులో పిహెచ్డి చేసింది. ఎం.ఏ సంస్కృతం చేసింది. ఆ సమయంలో కథలు చదివి తన బతుకు గోస కూడా కథలుగా రాయాలనుకుంది. రెండు కథాసంపుటాలు, ఒక నవల వెలువరించింది. ‘చదువుకుంటే ఏమవుతుందో నన్ను చూసైనా నా జాతి ఆడపిల్లలు తెలుసుకోవాలని నా తపన’ అంటున్న యాకమ్మ పరిచయం. ‘దళిత ఆడపిల్లలు బాగా చదువుకోవాలి. ఉద్యోగాలు తెచ్చుకోవాలి. ఆర్థికంగా గట్టిగా నిలబడాలి. ఆ తర్వాత రాజకీయ అధికారం కోసం ప్రయత్నించి పదవులు పొంది దళితుల కోసం, పేదల కోసం పని చేయాలి’ అంటారు యాకమ్మ. ఆమె ‘కెరటం’ అనే దళిత నవల రాశారు. అందులోని మల్లమ్మ అనే దళిత మహిళ పాత్ర అలాగే ప్రస్థానం సాగిస్తుంది. కష్టపడి చదువుకుని, ఉద్యోగం పొంది, ఆ తర్వాత సవాళ్లను ఎదుర్కొని సర్పంచ్ అయ్యి, ఆ తర్వాత ఎం.ఎల్.ఏ. అవుతుంది. ‘ప్రజలు’ ఎప్పుడూ ప్రజలుగానే ఉండిపోవడం ఏ కొద్దిమంది మాత్రమే ఎం.ఎల్.ఏనో ఎం.పినో అవ్వాలనుకోవడం ఎందుకు అని యాకమ్మ ప్రశ్న. యాకమ్మది వరంగల్ జిల్లా మహబూబాబాద్. అక్కడికి దగ్గరగా ఉన్న అన్నారంలోని యాకూబ్ షా వలీ దర్గాలో మొక్కుకుంటే పుట్టిందని తల్లిదండ్రులు యాకమ్మ అని పేరు పెట్టారు. ఇంటికి పెద్ద కూతురు యాకమ్మ. ఇంకో చెల్లి. తండ్రి మాదిగ కులవృత్తిని నిరాకరించి దొర దగ్గర జీతానికి పోయేవాడు. తల్లి కూలి పని చేసేది. ఇద్దరూ కూడా తమకు పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు తమలాంటి జీవితం కాకుండా మంచి జీవితం చూడాలని అనుకునేవారు. ముఖ్యంగా తల్లి అబ్బమ్మ తన కూతుళ్లను బాగా చదివించాలనుకునేది. యాకమ్మ కూడా అందుకు తగ్గట్టే చదువును ఇష్టపడేది. అక్కడ పదోతరగతి దాటితే పెళ్లి చేయడం ఆనవాయితీ. యాకమ్మ ఇంటర్కు రాగానే పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అనుకున్నారు. యాకమ్మ తల్లిదండ్రులను, భర్తను అడిగింది ఒక్కటే– పెళ్లయ్యాక కూడా చదువు కొనసాగించేందుకు అనుమతి ఇవ్వమని. మంచినీళ్లు తాగి పెళ్లయ్యాక అత్తగారింట యాకమ్మకు చదువు వీలయ్యేది కాదు. భర్త వీరాస్వామి డ్రైవర్గా పని చేసేవాడు. అతని తోబుట్టువుల రాకపోకలు ఉండేవి. సంపాదన చాలక తినడానికి కూడా ఉండేది కాదు. తల్లిదండ్రులు ఇచ్చిన రెండు జతల బట్టలతోనే కాలేజీకి వెళ్లి డిగ్రీ పూర్తి చేసింది యాకమ్మ. లంచ్బెల్లో స్నేహితురాళ్లు లంచ్ చేస్తుంటే దూరంగా చెట్టు కింద కూచుని మంచినీళ్లు తాగి మళ్లీ తరగతులకు వచ్చేది. ఆకలి ఉన్నా చదువు ఆపలేదు. ఇద్దరు పిల్లలు పుట్టినా చదువు ఆపలేదు. తెలుగులో పీహెచ్డీ యాకమ్మ కాకతీయ యూనివర్సిటీలో పి.జి. ఆ తర్వాత ద్రవిడ యూనివర్సిటీ నుంచి పి.హెచ్.డి. చేసింది. తెలుగు పండిట్గా ఉద్యోగం రావడంతో పిల్లలకు పాఠాలు చెప్పాలంటే సంస్కృతం కూడా తెలిసి ఉండాలని సంస్కృతంలో పి.జి. చేసింది. ఆ సమయంలోనే తన గైడ్ బన్న ఐలయ్య ద్వారా సాహిత్యం తెలిసింది. కథలు చదివే కొద్దీ తన జీవితంలోనే ఎన్నో కథలు ఉన్నాయి ఎందుకు రాయకూడదు అనిపించింది. కాని ఎలా రాయాలో తెలియదు. అయినా సరే ప్రయత్నించి రాసింది. ‘కథలు రాస్తున్నాను’ అని వారికీ వీరికీ చెప్తే ‘ఈమె కూడా పెద్ద రచయితనా? ఈమెకు ఏం రాయవచ్చు’ అని హేళన చేశారు. కానీ వాళ్లే ఆ తర్వాత ఆమె రచనలను అంగీకరించారు. యాకమ్మ కుమార్తె ఎం.బి.బి.ఎస్ చేస్తోంది. కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు. భర్త అనారోగ్యం వల్ల పని తగ్గించుకున్నాడు. ఇంటిని, ఉద్యోగాన్ని చూసుకుంటూనే కథను విడవకుండా సాధన చేస్తోంది యాకమ్మ. చదువుకుంటే జీవితాలు మారతాయని తనను చూసి తెలుసుకోండి అని అట్టడుగు వర్గాల ఆడపిల్లలకు ఆమె మాటల ద్వారానో కథల ద్వారానో చెప్తూనే ఉంటుంది. ‘ఆడపిల్లలు చదువుకోవాలి. సమాజాన్ని మార్చాలి. పెళ్లి పేరుతోనో డబ్బులేదనో వారిని చదువుకు దూరం చేయొద్దు’ అంటుంది యాకమ్మ. ఆమె చీకట్లను తరిమికొట్టడానికి విద్యను, సాహిత్యాన్ని ఉపయోగిస్తోంది. యాకమ్మ ఒక గొప్ప వెలుగు. రెండు సంపుటాలు యాకమ్మ 2018 నుంచి రాయడం మొదలుపెట్టింది. కథ వెంట కథ రాసింది. ‘మమతల మల్లెలు’, ‘రక్షణ’ అనే రెండు సంపుటాలు వెలువరించింది. ఆ తర్వాత దళిత నవల ‘కెరటం’ రాసింది. తన జీవితం నుంచి తాను చూసిన జీవితాల నుంచి కథలను వెతికింది. వెతలు తెలిపింది. కోవిడ్ నేపథ్యంలో వరుసపెట్టి కథలు రాసి ‘దుఃఖ నది’ అనే సంకలనం తెచ్చింది. వెక్కిరించిన వాళ్లు, వివక్ష చూపిన వారు మెల్లగా సర్దుకున్నారు. వరంగల్ జిల్లా మొత్తం ఇప్పుడు యాకమ్మ అంటే ‘కథలు రాసే యాకమ్మేనా’ అని గుర్తిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు పిలుస్తున్నారు. అవార్డులు ఇస్తున్నారు. ఇదీ యాకమ్మ ఘనత. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
హథ్రాస్ రేప్ కేసులో అనుమానాలెన్నో!
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్ దళిత యువతి దారుణ హత్యా, అత్యాచారం కేసులో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఠాకూర్ కుటుంబానికి చెందిన నలుగురు యువకులు దారుణంగా దాడి చేయడం వల్ల దళిత యువతి మరణించినట్లు తెలుస్తోంది గానీ, వారి వల్ల అత్యాచారానికి గురైనట్లు ఆధారాలు లేవని, ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అదనపు డీజీపీ ప్రశాంత కుమార్ గత గురువారం మీడియాకు వెల్లడించడం పలు అనుమానాలకు దారి తీసింది. పోలీసులే ఈ కేసును మసిపూసి మారేడు కాయను చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, బాధితురాలి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా బుధవారం తెల్లవారు జామున 3.30 గంటలకు పోలీసులే తగులబెట్టడం ఈ అనుమానాలకు బలం చేకూర్చింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం రేప్ కేసుల్లో బాధితుల మృతదేహాలను తప్పనిసరిగా కుటుంబసభ్యులకే అప్పగించాలి. అలా చేయకపోగా కూతురు మృతదేహాన్ని కోరడానికి వెళితే పోలీసులు తమను నిర్బంధించి వేధించారని బాధితురాలి తల్లి, ఇతర కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్ 14వ తేదీన దుండగుల దాడికి, అత్యాచారానికి గురైన దళిత యువతి ఆలీగఢ్ ఆస్పత్రిలో చేరిన ప్పుడు మీడియా ముఖంగా ఆమె తనపై అత్యాచారం జరిగినట్లు ఆరోపించారు. బాధితురాలిని రేప్ చేశారని చెప్పడానికి ఆ ఆస్పత్రి వైద్య నిపుణులు ‘కంప్లీట్ పెనట్రేషన్ ఆఫ్ వజీనా’ అంటూ తమ ప్రాథమిక నివేదికలో వెల్లడించారు. సెప్టెంబర్ 29వ తేదీన ఢిల్లీ ఆస్పత్రిలో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో మరణించిన తర్వాత నిర్వహించిన ‘ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్’ నివేదికలో ‘వీర్యం’ ఆనవాళ్లు కనిపించలేదని ఇచ్చారు. ఇదే విషయాన్ని యూపీ అదనపు డీజీపీ మీడియా ముఖంగా వెల్లడించారు. (చదవండి : హథ్రాస్ ఘటన: న్యాయం చేసే ఉద్దేశముందా?) బాధితురాలపై సెప్టెంబర్ 14వ తేదీన అత్యాచారం జరిగినందున వాటి ఆనవాళ్లు సెప్టెంబర్ 29వ తేదీ వరకు ఉండే అవకాశం లేదని అలీగఢ్ ఆస్పత్రి వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అత్యాచారం జరిగిన చాలా రోజుల వరకు పోలీసులు కేసు దాఖలు చేయక పోవడం, కనీసం నిందితులను అదుపులోకి తీసుకోక పోవడం కూడా పలు అనుమానాలకు దారితీసింది. ఈ కేసు విచారణను మొదట సిట్ దర్యాప్తునకు అప్పగించిన ఆదిత్యనాథ్ యోగి ప్రభుత్వం ఇప్పుడు ప్రజల ఒత్తిడి మేరకు సీబీఐకి అప్పగించింది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సీబీఐ వల్ల న్యాయం జరగక పోవచ్చని కాంగ్రెస్, దళిత పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్కౌంటర్లకు పెట్టింది పేరైన యూపీ పోలీసులు హైదరాబాద్లోని ప్రియాంక రెడ్డి హత్యా, అత్యాచారం కేసులో లాగా ఈ కేసులో నేరస్థులను ఎందుకు ఎన్కౌంటర్ చేయరని దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. (చదవండి : దళిత యువతి వీడియో క్లిప్పై హల్చల్) -
ఓటర్లపై ఎస్ఐ జులుం
పుంగనూరు: ఓటు వేసేందుకు వచ్చిన దళిత మహిళలపై ఎస్ఐ జులుం ప్రదర్శించి, ఓటర్లను చితకబాదిన సంఘటన సోమల పోలింగ్ కేంద్రంలో చోటుచేసుకుంది. అలాగే విధి నిర్వహణలో కానిస్టేబుల్పై ఉన్న దౌర్జన్యం చేసి, అతని సెల్ను లాక్కుని పగులగొట్టిన సంఘటన వనమలదిన్నెలో జరిగింది. గురువారం ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. వివరాలు.. సోమలలోని 149 పోలింగ్ కేంద్రంలో సరైన వసతులు లేకపోవడంతో ఎండవేడిమికి తట్టుకోలేక దళిత మహిళ తిమ్మిలమ్మ ఓటర్ల పక్కన కూర్చుని ఉండడంతో ఆగ్రహించిన ఎస్ఐ శ్రీనివాసులు లాఠీతో ఆమెను చితకబాదారు. దీంతో ఆమె కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరు మహిళలు, యువకులకు కూడ గాయపడ్డారు. దీనిపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు. ఇది తెలుసుకుని అక్కడికి వెళ్లిన వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై కూడ ఎస్ఐ చెయ్యి చేసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితులను పరామర్శించి, ఆసుపత్రికి తరలించారు. పోలీసుల దాష్టీకంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చే శారు. దళిత మహిళలపై దాడి చేయడం, తప్పుడు కేసులు బనాయించడంపై తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఎమ్మెల్యే హెచ్చరించారు. -
మహిళలంటే టీడీపీ నేతలకు ఇంత చిన్నచూపా?