breaking news
cruel murder
-
శ్రద్ధా హత్య కేసు: కటకటాల్లో అఫ్తాబ్ సుఖనిద్ర!
న్యూఢిల్లీ: పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసిన ప్రియురాలిని అతికిరాతకంగా హత్య చేసిన ఓ ప్రియుడి ఉదంతం.. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రియురాలిని చంపి 35 ముక్కలుగా చేసి.. నగరంలో అక్కడక్కడ పడేశాడు దుండగుడు. దేశరాజధాని నుంచి వెలుగు చూసిన ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్రచర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈ కేసులో దుండగుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా(28)ను పటిష్టమైన భద్రత నడుమ ఉంచారు పోలీసులు. సౌత్ ఢిల్లీలోకి మెహ్రౌలీ పోలీస్ స్టేషన్లో మరో ఖైదీతో పాటు ఉంచారు. నేలపై దుప్పటి కప్పుకుని అతని ప్రశాంతంగా నిద్రించడం చూడొచ్చు. ఇక సెల్ను కవర్ చేసేలా సీసీటీవీ ఫుటేజీని ఉంచిన పోలీసులు.. ఆ సెల్ బయట ఇద్దరు కానిస్టేబుళ్లను కాపలా ఉంచారు. అంతేకాదు.. అధికారులు సైతం అతని కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక లోపల ఉన్న మరో ఖైదీ బిక్కుబిక్కుమంటూ కనిపించడం వీడియోలో ఉంది. తనను సెల్ మార్చాలని ఆ ఖైదీ వేడుకుంటున్నట్లు తెలుస్తోంది. కీలకమైన కేసు కావడం, పైగా అప్తాబ్ మానసిక స్థితిపై అనుమానాల నేపథ్యంలోనే ఇలా జాగ్రత్తలు వహిస్తున్నారు. కోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు అతన్ని అలాగే చూసుకోవాల్సి ఉంటుంది. #Delhi : Shraddha Walker murder केस में आरोपी Aftab Amin Poonawalla का जेल वाला Video आया सामने.#shraddhawalker #ShraddhaWalkermurder #AftabAminPoonawalla #DelhiMurder pic.twitter.com/nhqAvRCZ6N — Eyenews (@eyenewsup) November 15, 2022 శ్రద్ధా వాల్కర్ అనే యువతితో సహజీవనం చేసిన అఫ్తాబ్ అమీన్ పూనావాలా.. తీరా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి నో చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలో ఈ ఏడాది మే 18వ తేదీన ఆమెను గొంతు కోసి హత్య చేశాడు. ఆపై ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఓ పెద్ద ఫ్రీజర్లో భద్రపరిచాడు. పద్దెనిమిది రోజులపాటు రోజూ అర్ధరాత్రి పూట బయటకు వెళ్లి.. ఆమె విడిభాగాల్ని నగరంలో అక్కడక్కడ పడేసి వచ్చాడు. రెండు నెలలుగా ఆమె సోషల్ మీడియా అకౌంట్లు యాక్టివ్గా లేకపోవడం, ఫోన్ సైతం లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె సోదరుడు.. తండ్రికి విషయం చెప్పాడు. ఆయన నవంబర్లో కూతురు ఉంటున్న అపార్ట్మెంట్కు వెళ్లి చూడగా.. తాళం వేసి ఉంది. దీంతో పోలీసులకు కిడ్నాప్ ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగు చూసింది. ముంబైలో ఓ ఎంఎన్సీ కాల్సెంటర్లో పని చేసే శ్రద్ధకు.. డేటింగ్ యాప్ ద్వారా అఫ్తాబ్తో పరిచయం అయ్యింది. ఇంట్లో వాళ్లు వాళ్ల రిలేషన్షిప్కు ఒప్పుకోకపోవడంతో.. ముంబైని విడిచి ఢిల్లీకి వచ్చారు. పెళ్లి చేసుకోమని కోరడంతో అతను ఒప్పుకోలేదు. మరికొందరు అమ్మాయిలతో అతను సంబంధం కొనసాగించినట్లు శ్రద్ధకు తెలిసింది. దీంతో ఆమె పెళ్లి కోసం ఒత్తిడి చేయడంతోనే దారుణంగా హతమార్చాడు. విచారణలో తొలుత పొంతన లేకుండా సమాధానాలు చెప్పిన అఫ్తాబ్.. చివరకు నేరం అంగీకరించాడు. అతని ఫోన్ హిస్టరీలో నేరానికి సంబంధించిన ఆధారాలు కూడా దొరికాయి. ఆంగ్ల క్రైమ్ సిరీస్ డెక్స్టర్ ప్రేరణతోనే తాను ఈ హత్య చేశానని నేరం ఒప్పుకున్నాడు అప్తాబ్. సంబంధిత కథనం: 300 లీటర్ల ఫ్రిడ్జి కొని.. అగరబత్తులతో.. -
భయానకం: మహిళను చంపి, ముక్కలు చేసి.. ఆ తర్వాత..
మండ్య(బెంగళూరు): మండ్య జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల భయానక స్థితిలో మహిళల మృతదేహాలు కనిపించాయి. మొదట పాండవపుర తాలూకా బేబీ గ్రామానికి సమీపంలో చెరువులో కాళ్లు కట్టివేసి అర్ధనగ్న స్థితిలో ఉన్న మహిళ మృతదేహం కనిపించింది. రైతులు పొలాలకు వెళుతుండగా చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్, పోలీసులు చేరుకుని బయటకు తీసి పరిశీలించగా శిరస్సు, మొండెం లేని సగం మృతదేహం కనిపించింది. ఎరుపురంగు చుడీదార్, బిస్కెట్ రంగు లెగ్గింగ్ ఉంది. రెండు రోజుల క్రితమే హత్య చేసి చెరువులోకి విసిరేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరో అర్ధభాగం కోసం గాలిస్తున్నారు. పాండవపుర పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. శ్రీరంగ పట్టణ వద్ద కాలువలో శ్రీరంగ పట్టణ తాలూకా అరకెరె గ్రామ శివార్లలోని చిక్కదేవరాయ సాగర కాలువ లో మహిళ సగం మృతదేహం తేలుతూ కనిపించింది. సుమారు 40–45 ఏళ్ల వయసు కలిగిన మహిళ మృతదేహంగా అంచనా వేశారు. ఎక్కడో హత్య చేసి శరీరాన్ని, మొండెంను వేరు చేసి ఒక్క భాగాన్ని కాలువలో వేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అరకెరె పోలీసులు పరిశీలించి విచారణ చేపట్టారు. ఇద్దరి మృతదేహాల వెనుక ఒకే నేరం ఉందా, వేర్వేరా? అని దర్యాప్తు చేపట్టారు. రెండు చోట్లకు జిల్లా ఎస్పీ ఎన్.యతీశ్, డీఎస్పీ సందేశ్ కుమార్, పీఐ ప్రభాకర్ చేరుకుని పరిశీలించారు. చదవండి: మల్లేశంతో ప్రేమ వివాహం.. ఐదేళ్లయినా. -
చంపుడు పందెం!
గత కొన్నేళ్లుగా అత్యంత అమానుషమైన, హృదయవిదారకమైన ఉదంతాలు చోటు చేసుకుంటున్న పశ్చిమాసియాలో ఉన్మాదానికి పరాకాష్ట అనదగ్గ మరో ఘటన జరిగింది. డిసెంబర్ నెలలో తమకు బందీగా చిక్కిన జోర్డాన్ పైలట్ను ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు పంజరంలో బంధించి పెట్రోల్ పోసి నిప్పంటించి ప్రాణాలు తీశారు. ఆ ఉదంతం మొత్తాన్ని వీడియో తీసి సైబర్ ప్రపంచంలో ఉంచారు. 22 నిమిషాల ఆ వీడియో సభ్య సమాజాన్ని దిగ్భ్రమ పరిచింది. 2003లో అమెరికా ఇరాక్ను దురాక్రమించాక ఆ ప్రాంతంలో సాగుతున్న దురంతాల పరంపరకు తాజా ఘటన కొనసాగింపు. లండన్లో గత నెల 22న అమెరికా ఆధ్వర్యంలో జరిగిన 21 దేశాల సమావేశం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అణచడంలో తాము గణనీయంగా విజయం సాధించామని చెప్పుకుంది. అమెరికా విదేశాంగమంత్రి జాన్ కెర్రీ అందుకు సంబంధించిన లెక్కలను కూడా వెల్లడించారు. ఇప్పటికి 6,000మంది జిహాదీలను హతమార్చగా... ఉగ్రవాదుల అధీనంలో ఉన్న ఇరాక్ భూభాగంలోని 700 చదరపు కిలోమీటర్ల ప్రాంతం వెనక్కి తీసుకోగలిమన్నారు. అయితే, ఉగ్రవాదుల చెరలో ఉన్న భూభాగంతో పోలిస్తే ఇది అత్యల్పం. అటు ఇరాక్లోనూ, ఇటు సిరియాలోనూ ఆ ఉగ్రవాదులు మూడో వంతు భూభాగాన్ని గుప్పిట బంధించి ఉంచుకున్నారు. ఇజ్రాయెల్, లెబనాన్ ప్రభుత్వాల ఆధ్వర్యంలోని భూభాగంకంటే ఉగ్రవాదుల చెరలో ఉన్న ప్రాంతమే పెద్దది! సిరియాలో బషర్ అల్ అసద్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చడానికి తామిచ్చిన ఆయుధాలతో, డబ్బుతో బలం పెంచుకుంటూ పోతున్న ఐఎస్ను ఉగ్రవాద సంస్థగా అమెరికా గుర్తించేసరికే కాలాతీతమైంది. ఆ తర్వాత సంకీర్ణ కూటమి సైన్యాలు ఆ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఇంతవరకూ 1,800కు పైగా వైమానిక దాడులు చేశాయి. ఇందుకు దాదాపు 120 కోట్ల డాలర్లు వెచ్చించాయి. కానీ, ఇవి ఏమాత్రం ఫలితమివ్వలేదని అమెరికా విదేశాంగ మంత్రి వెల్లడించిన ‘విజయాలు’ చూస్తే అర్థమవుతుంది. నిజానికి ఆ విజయాలైనా అటు ఇరాన్, ఇటు సౌదీ అరేబియా సహకారం లేకపోతే సాధ్యమయ్యేవి కాదు. ఆ ప్రకటన చేసిన కొన్ని రోజులకే జోర్డాన్ పైలట్ అనూహ్యంగా ఉగ్రవాదులకు పట్టుబడ్డాడు. కెర్రీ ప్రకటనకు బదులన్నట్టు ఉగ్రవాదులు కనీ వినీ ఎరుగని క్రూరత్వాన్ని ప్రదర్శించి అతన్ని పొట్టన బెట్టుకున్నారు. పటిష్టమైన వ్యూహం లేకుండా, లక్ష్యంపై అవగాహన లేకుండా, ఐఎస్ ఉగ్ర వాదుల నుంచి ఎదురుకాగల సవాళ్లపై అంచనా లేకుండా సంకీర్ణ కూటమి సేనలు సాగిస్తున్న దాడులవల్ల వీసమెత్తు ఫలితం ఉండటం లేదని ఇప్పటికే స్పష్టమైనా దాన్ని బహిరంగంగా ఒప్పుకుని సరిదిద్దుకోవడానికి అమెరికా ముందుకు రావడం లేదు. ఇరాక్, సిరియా, అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్, సోమాలియా, యెమెన్, మాలి, లిబియా తదితర దేశాల్లో ముస్లింలపై దాడులు సాగిస్తున్న పాశ్చాత్యులనుంచి కాపాడటం తనవల్లనే సాధ్యమని ఐఎస్ చెప్పుకుంటున్నది. ద్రోన్ల ద్వారా, యుద్ధ విమానాల ద్వారా సాగిస్తున్న బాంబు దాడులు కొంతమంది ఉగ్రవాద నేతలను హతమార్చిన మాట వాస్తవమే అయినా...ఆ దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నవారిలో అత్యధికులు సాధారణ పౌరులేనని మర్చిపోకూడదు. ఇదే ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తున్నది. ఈ సంకీర్ణ కూటమిలో చేరినందుకు జోర్డాన్పై ఐఎస్ ఉగ్రవాదులు చాన్నాళ్లుగా నిప్పులు కక్కుతున్నారు. అదును కోసం ఎదురుచూస్తున్నారు. తమ అధీనంలో ఉన్న జపాన్ బందీలను విడిపించడానికి డబ్బు డిమాండు చేసిన ఉగ్రవాదులు జోర్డాన్ విషయంలో మాత్రం 2005 అమ్మాన్ పేలుళ్ల ఘటనలో చిక్కి జోర్డాన్ జైల్లో ఉన్న మహిళా ఉగ్రవాదిని విడుదల చేయాలని డిమాండు చేయడం అందులో భాగమే. భిన్న జాతుల కూటమిగా సాగుతున్న జోర్డాన్ ప్రభుత్వంలో విభేదాలు పెంచడానికి ఈ ఘటన తోడ్పడుతుందన్నది వారి భావన. ఇప్పుడు ప్రాణాలు కోల్పోయిన పైలట్ తండ్రి కూడా జోర్డాన్లోని బలమైన ఒక తెగకు నాయకుడు. తన కుమారుడు ప్రాణాలతో తిరిగి రాకపోతే దేశం సంక్షోభంలో పడటం ఖాయమని ఆయన హెచ్చరించాకే జోర్డాన్ రాజు కదిలారు. అయితే అప్పటికే జాప్యం జరగడంతో ఉగ్రవాదులు పైలట్ ప్రాణాలు తీశారు. పశ్చిమాసియాలో ఇప్పుడు సాగుతున్నది చంపుడు పందెం. ఒకర్ని చూసి మరొకరు క్రౌర్యాన్ని, ఉన్మాదాన్ని పెంచుకుంటూ పోతున్నారు. 2003లో రసాయన ఆయుధాలున్నాయన్న నెపంతో సంకీర్ణ సేనలు ఇరాక్ను వల్లకాడు చేశాక అక్కడ ఉగ్ర వాదం వేళ్లూనుకుంది. తమ దేశంపై దాడిచేసిన అల్ కాయిదాను అంతం చేద్దామని... సిరియాలో తమకు అనుకూలంగా ఉండే నేతను ప్రతిష్టిద్దామని అమెరికా వేసిన ఎత్తుగడలే ఈ మొత్తం సంక్షోభానికి మూలకారణం. ఇందుకోసమని ఆ ముఠాకు ప్రత్యర్థులుగా ఉన్నవారిని పెంచి పోషించిన పర్యసానంగానే ఐఎస్ ఆవిర్భవించింది. పైలట్ హత్యపై వీడియో విడుదల కాగానే ‘భూమి బద్దలయ్యేంత స్థాయిలో ప్రతీకారం ఉంటుంద’ని జోర్డాన్ రాజు ప్రకటించారు. తీరా ఆయన ప్రభుత్వం చేసిందేమంటే పదేళ్లుగా తమ చెరలో ఉన్న ఇద్దరు మహిళా ఉగ్రవాదులకు మరణశిక్ష అమలు జరపడం! ఈ వరస ఇకపైనా కొనసాగుతుందని సర్కారు చెబుతున్నది. ప్రైవేటు గ్రూపులైనా, ప్రభుత్వాలైనా సాగించే హింస అంతిమంగా సమాజాన్ని బండ బారుస్తుంది. సమస్య ఎక్కడ మొదలైందో, ఎలా మొదలైందో గుర్తించడం సాధ్యం కానంతగా పరిస్థితిని దిగజారుస్తుంది. నాలుగేళ్లక్రితం పశ్చిమాసియాను ఊగించి శాసించిన ప్రజాస్వామిక ఉద్యమాలు మళీ ్ల అక్కడ పురుడు పోసుకుంటే తప్ప ఈ ఉన్మాదం విరగడ కాదు. ఉగ్రవాదులు ఎటూ వినే స్థితిలో లేరు. ప్రజాస్వామిక వాదులమని చెప్పుకునే పాశ్చాత్యదేశాలైనా కాస్తంత ఇంగితజ్ఞానాన్ని ప్రదర్శించాలి. సంక్షోభ ప్రాంతాల్లోని సాధారణ పౌరుల విశ్వాసాన్ని చూరగొనే చర్యలు ప్రారంభించాలి. లేనట్టయితే ఇవాళ ఇరాక్, సిరియాలను చుట్టుముట్టిన రాక్షసత్వమే రేపు ప్రపంచానికి సైతం ముప్పుగా పరిణమిస్తుంది.