breaking news
courtesy meet
-
నిజాయితీగా పన్ను చెల్లించేవారితో మర్యాదగా మెలగండి: సీతారామన్
ఘజియాబాద్: నిజాయితీపరులైన పన్ను చెల్లింపుదారులతో మర్యాదగా మెలగలాని, వారికి పన్ను నిబంధనల అమలును సులభతరం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ అధికారులకు సూచించారు. అదే సమయంలో పన్ను ఎగవేతదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. ఘజియాబాద్లో సెంట్రల్ జీఎస్టీ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. అధికారులపై క్రమశిక్షణ చర్యలను సకాలంలో ముగించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. తద్వారా విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అనైతిక, దు్రష్పవర్తనను సహించేది లేదన్న స్పష్టమైన సందేశాన్ని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) పంపించాలని కోరారు. వేగవంతమైన రిజి్రస్టేషన్కు, ఫిర్యాదుల పరిష్కారానికి వీలుగా టెక్నాలజీని వినియోగించుకోవాలని క్షేత్ర స్థాయి అధికారులకు సూచించారు. టెక్నాలజీ సాయంతో స్మార్ట్ విచారణలు చేయొచ్చు. అవసరమైతే పన్ను చెల్లింపుదారులను సంప్రదించొచ్చు. అంతేకానీ, ఆ పత్రం ఇవ్వండి, ఈ పత్రం ఇవ్వండి అంటూ పన్ను చెల్లింపుదారులపై భారం వేయొద్దు. వర్తకులకు మీకు మధ్య ఎలాంటి ఉక్కు గోడ లేదు. సమస్యను పెంచడానికి బదులు అది ఎక్కడ ఉందన్నది మీరు అర్థం చేసుకోవాలి. నిజాయితీపరులైన పన్ను చెల్లింపుదారులతో మర్యాదగా మెలగాలి. కొత్త తరం జీఎస్టీ కింద వారిని గౌరవిస్తున్నట్టు భావించేలా మసులుకోవాలి. పన్ను చెల్లింపుదారుల్లో ఎవరిలో అయినా నిజాయితీ లోపిస్తే నిబంధనల మేరకు వారిని నిలువరించండి. అంతేకానీ, ప్రతి ఒక్కరినీ అనుమానించొద్దు’’అంటూ మంత్రి జీఎస్టీ అధికారులకు హితవు పలికారు. కొత్త జీఎస్టీ అన్నది కేవలం రేట్లు, శ్లాబులు, సులభతరానికే పరిమితం కాదంటూ, తమను భిన్నంగా చూస్తున్నారన్న భావన పన్ను చెల్లింపుదారుల్లో కలిగేలా ఉండాలన్నారు. -
హామీలు అమలు చేయకపోవడం అన్యాయం
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం అన్యాయమని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పల్లంరాజు అన్నారు. తెలంగాణ సచివాలయంలో సీఎస్ ఎస్కే జోషిని ఆయన మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జోషి పాత మిత్రుడు కావడంతోనే కలిసానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేటప్పుడు గత యూపీఏ ప్రభుత్వం, అప్పటి ప్రధాన మంత్రి అన్ని పార్టీలను ఒప్పించి ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని, అప్పటి కేబినెట్ కూడా ఆమోదం తెలిపిందన్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్ల నుంచి పోరాటం చేస్తుందని, రాహుల్ గాంధీ కూడా ఇదే అంశంపై పార్టీ ప్లీనరీలో తీర్మానం చేశారని పేర్కొన్నారు. తొలి నుంచే అందరూ కలిసి హోదా కోసం పోరాడాల్సిందన్నారు, ఇప్పటికైనా నిజాయితీగా కలిసికట్టుగా పోరాడి హోదా సాధించుకోవాలని ఆయన సూచించారు. -
మర్యాద కోసం పిలిస్తే.. రాద్ధాంతమా?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను కలవడం కేవలం మర్యాదపూర్వకమేనని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించిన ఒకరోజు తర్వాత పీఎంఓ నుంచి ఈ ప్రకటన వచ్చింది. మాజీ ప్రధానమంత్రులు చాలామందిని ఈ భేటీకి పిలిచామని పీఎంఓ అధికారులు తెలిపారు. మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడకు కూడా ఆహ్వానం వెల్లిందని, అయితే ఆయన బెంగళూరులో ఓ సమావేశానికి హాజరు కావాల్సి ఉండటంతో రాలేకపోతున్నట్లు చెప్పారని అన్నారు. దాంతో ప్రధాని ముఖ్యకార్యదర్శి నృపేంద్ర మిశ్రా స్వయంగా దేవెగౌడకు ఫోన్ చేసి.. ఆయనకు ఖాళీ ఉన్నప్పుడు మోదీని కలవాల్సిందిగా ఆహ్వానించారు. ఏడాది పాలన పూర్తయిన ఒకరోజు తర్వాత.. మే 27న ప్రధాని నరేంద్రమోదీ తన అధికారిక నివాసం నెం.7 రేస్కోర్సు రోడ్డు నివాసంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను కలిసిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్ గాంధీ విమర్శించడం.. దాన్ని బీజేపీ శ్రేణులు కూడా తిప్పికొట్టడం వెంటవెంటనే జరిగిపోయాయి.


