breaking news
cotton season
-
నేడు మార్కెట్ పునఃప్రారంభం
వరంగల్ సిటీ : వారం రోజుల సెలవుల అనంతరం సోమవారం నుంచి వరంగల్ ఏనుమా ముల మార్కెట్ ప్రారంభం కానుంది. పత్తి సీజ న్ ప్రారంభమవుతున్నందున పెద్ద ఎత్తున పత్తి తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. వేల సంఖ్య లో బస్తాల పత్తి రానున్నందున రైతులకు ఎ లాంటి ఇబ్బంది కలగకుండా కొనుగోళ్లు పూర్తిచేయించడం అధికారులకు కత్తి మీద సామేనని చెప్పాలి. కొత్త కార్యదర్శి విధుల్లో చేరేనా? వరంగల్లోని ఏనుమాముల వ్యవసాయ మా ర్కెట్ కార్యదర్శిగా నియమితులైన అజ్మీరా రాజునాయక్ ఇక్కడ విధుల్లో చేరేందుకు అనాసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న కార్యదర్శి ఉప్పుల శ్రీనివాస్ను హైదరాబాద్లోని మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేసిన ప్రభుత్వం.. ఆయన స్థానంలో ఆదిలాబాద్ జిల్లా భైంసా మార్కెట్ కార్యదర్శి అజ్మీరా రాజునాయక్ను వరంగల్కు బదిలీ చేసింది. అయితే, ఆసియాలోనే రెండో అతి పెద్దదైన వరంగల్ మార్కెట్ను పరిపాలనాపరంగా నడిపించడంలో ఇబ్బందులు ఎదురవుతాయనే భావనతో రాజునాయక్ ఇక్కడకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని సమాచారం. అంతేకాకుండా వరంగల్లో ఖరీ దుదారుల కంటే అడ్తివ్యవస్థ బలంగా ఉన్న కా రణంగా కార్యదర్శిగా విధులు నిర్వర్తించడం కష్టంతో కూడుకున్న పని అని ఆయన ఇతరుల తో మాట్లాడిన సందర్భంలో తెలుసుకున్న ట్లు చెబుతున్నారు. దీంతో తన బదిలీ స్థానాన్ని మార్పించుకునేందుకు రాజునాయక్ ప్రయత్నిస్తున్నట్లు మార్కెటింగ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా, రాజునాయక్ ఇక్కడకు రాని పక్షంలో గతంలో వరంగల్ మార్కెట్ కార్యదర్శిగా పనిచేసిన ఓ అధికారి వరంగల్కు బదిలీ చేయించుకోవాలని భావిస్తున్నట్లు సమాచా రం. అయితే, ఒకవేళ రాజునాయక్ విధుల్లో చేరినా వెంటనే భారీగా రానున్న పత్తి కొను గో ళ్లపై దృష్టి సారించాల్సి వస్తుంది. ఇక్కడ పత్తి కొనుగోళ్లు సాఫీగా సాగేలా చూడడం కత్తి మీద సామేనని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఒకటి, రెం డు రోజుల్లో ఉప్పుల శ్రీనివాస్ విధుల నుంచి రిలీవ్ అయితే.. రాజునాయక్ చేరతారా, లేదా అనేది తేలనుంది. -
రూ. 5 వేలు పలికిన పత్తి ధర
- బేళ్లు, గింజలకు పెరిగిన డిమాండ్ - మరింత పెరిగే అవకాశం! వరంగల్ : వరంగల్ వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి క్వింటాల్కు రూ.5వేలు పలికింది. తొమ్మిదినెలల క్రితం పత్తి క్వింటాల్కు రూ.4850 వరకు వచ్చింది. తాజాగా మంగళవారం వరంగల్ మార్కెట్కు 5992 బస్తాల పత్తి రాగా క్వింటాల్కు రూ.5వేలు పలికింది. అయితే పత్తి సీజన్ పూర్తిగా అయిపోరుుంది. పెట్టుబడుల కోసం రైతులు కొన్ని బస్తాలను మాత్రమే ఇంటివద్ద నిల్వ చేసుకున్నారు. ప్రస్తుతం పత్తి ధర రూ.5వేలు పలికినా పెద్దగా లాభపడేది లేదని పత్తి రైతులు వాపోతున్నారు. ఇప్పటికే 95 శాతం రైతులు పత్తిని అమ్ముకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బేల్కు రూ.43,500 ధర పలుకుతున్నదని, గింజలు క్వింటాల్కు రూ.1770 ధర పలుకుతున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపారుు. బేళ్లు, గింజల ధర మరికొద్దిగా పెరిగే అవకాశం ఉందని, పత్తి ధర సైతం మరో 500 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు తెలుపుతున్నాయి. మొత్తంగా పత్తి సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లో క్వింటాల్ పత్తి ధర గరిష్టంగా రూ.5వేలు పలకడం ఇదే మొదటిసారి.