-
పత్తి పంట కోసం గోద్రెజ్ ఆగ్రోవెట్ ప్రత్యేక బ్రాండ్
ముంబై: పంట సంరక్షణ ఉత్పత్తుల సంస్థ గోద్రెజ్ ఆగ్రోవెట్ (జీఏవీఎల్) తాజాగా పత్తికి సంబంధించి ’పయ్నా’ పేరిట ప్రత్యేక బ్రాండ్ను ప్రవేశపెట్టింది. హిట్వీడ్, హిట్వీడ్ మాక్స్, మాక్స్కాట్ అనే మూడు కలుపు నిర్వహణ ఉత్పత్తులను ఈ బ్రాండ్ కింద విక్రయించనున్నట్లు సంస్థ క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ విభాగం సీఈవో రాజవేలు ఎన్కే తెలిపారు. ఇవి కలుపు మొక్కల సమస్యను తగ్గించి, ప్రారంభ దశల్లో పత్తి పంట ఏపుగా ఎదిగేందుకు సహాయపడతాయని పేర్కొన్నారు. తద్వారా అధిక దిగుబడులను పొందేందుకు తోడ్పడగలవని వివరించారు. -
దిగుబడిపై పత్తి రైతుల గంపెడాశలు
సాక్షి, ఆదిలాబాద్: తెల్ల బంగారమేనా.. పత్తి రైతులు పంటపై గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం పంట పూత, కాత దశలో ఉంది. పంట చేతికొచ్చే దశ ఆసన్నమవుతోంది. సాధారణంగా జిల్లాలో దసరా నుంచి పత్తి పంట కొనుగోలు ప్రారంభమవుతుంది. అయితే ఈసారి ఆలస్యంగా అక్టోబర్ చివరి వారంలో పంట కొనుగోలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ యేడాది పత్తి క్వింటాలుకు స్వల్పంగా వంద రూపాయల మద్దతు ధర పెంచింది. సాధారణం కన్నా మించి విస్తీర్ణం జిల్లాలో ఈయేడాది పత్తి పంట సాధారణ సాగు విస్తీర్ణం కంటే మించింది. పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో 4500 ఎకరాల్లో పంట నష్టం సంభవించగా అందులో 90శాతానికి పైగా పత్తి పంటకే నష్టం చేకూరింది. ఈ దశలో ప్రకృతి సహకరిస్తేనే రైతుకు లాభం చేకూరే పరిస్థితి. ఎకరానికి 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడిపై రైతు ఆశలు పెట్టుకున్నాడు. రైతు నుంచి పంట చేజారిన తర్వాత.. కేంద్ర ప్రభుత్వం పత్తికి మద్దతు ధరను స్వల్పంగా పెంచింది. గతేడాది క్వింటాలుకు రూ.5450 ఉండగా, ఈయేడాది దానికి అదనంగా మరో వంద రూపాయలు పెంచింది. అయితే గతేడాది పత్తి రైతులు పంటను అమ్ముకున్న తర్వాత మార్కెట్లో క్వింటాలు పత్తి ధర గణనీయంగా పెరుగుతూ వస్తూ ఓ దశలో రూ.6050కు చేరుకుంది. అయితే అప్పటికే రైతుల నుంచి పంట చేజారింది. దీంతో అప్పటికే పంటను కొనుగోలు చేసిన ప్రైవేట్ ట్రేడర్సే లాభపడ్డారు. గతేడాది జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ ప్రభుత్వరంగ సంస్థ సీసీఐ మీనమేషాల నేపథ్యంలో మార్కెట్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకేపీ సంఘాలతో గ్రామాల్లో కొనుగోళ్లు చేయించారు. చిన్న, సన్నకార రైతులు తమ పంటను ఈ సంఘాలకు అమ్ముకున్నారు. తద్వారా వారికి రవాణ చార్జీలు మిగిలాయి. ఈయేడాది కూడా సీసీఐతో పాటు పీఏసీఎస్, ఐకేపీ సంఘాలు పత్తి పంటను కొనుగోలు చేయనున్నాయి. అయితే ఈ సంఘాలు నామమాత్రంగా కొనుగోలు చేయగలిగాయి. ప్రధానంగా మార్కెట్లో ప్రైవేట్ ట్రేడర్స్ రైతులకు మద్దతు ధర కల్పించడంలో విఫలమైన పక్షంలో సీసీఐ రంగంలో ఉంటుంది. ఒకవేళ మద్దతు ధరను మించి మార్కెట్లో హెచ్చు ధర ఉన్నప్పుడు సీసీఐ పాత్ర నామమాత్రంగా ఉంటుంది. గతేడాది ఎంఎస్పీ కంటే ధర అధికంగా ఉండడంతో సీసీఐ కొనుగోలు అంతంత మాత్రంగా చేపట్టింది. నార్నూర్కు ప్రతిపాదనలు.. జిల్లాలో గతేడాది ఆదిలాబాద్, సొనాల, నేరడి గొండ, బోథ్, పొచ్చర, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, బేలలో ఎనిమిది సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పత్తి పంటను కొనుగోలు చేశారు. ఈయేడాది వీటితో పాటు నార్నూర్లో కొను గోలు కేంద్రం ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ శాఖ సీసీఐకి ప్రతిపాదన చేసింది. అయితే ఇది కార్యరూపం దాల్చుతుందా?.. లేదా అనేది వేచి చూడాల్సిందే. నార్నూర్లో జిన్నింగ్ ఫ్యాక్టరీ లేకపోవడం సమస్యకు కారణమైంది. ప్రైవేట్ ట్రేడర్సే అత్యధికంగా కొనుగోలు గతేడాది సీసీఐ, పీఏసీఎస్, ఐకేపీ సంఘాలు పత్తి కొనుగోలు కోసం రంగంలో ఉన్నప్పటికీ ప్రైవేట్ ట్రేడర్సే పంటను అత్యధికంగా కొనుగోలు చేశారు. జిల్లాలో దిగుబడి వచ్చిన పంటలో సీసీఐ నామమాత్రంగా 18.69 శాతం మాత్రమే కొనుగోలు చేసింది. ఇక వ్యాపారులు 80 శాతం వరకు కొనుగోలు చేశారంటే దాదాపు పంట మొత్తం వారే కొనుగోలు చేశారనేది స్పష్టమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో విపణి ధరలను బట్టి పత్తి ధరలో హెచ్చు, తగ్గులు ఉంటాయి. గతేడాది కొనుగోలు సీజన్ చివరిలో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు అమాంతంగా పెరిగాయి. దీంతో పత్తి మద్దతు ధర కంటే అధిక ధర పలికింది. ఈ నేపథ్యంలోనే రైతులు తెల్లబంగారంపై ఆశలు పెంచుకున్నారు. పత్తి పంట వివరాలు పంట సాగైన విస్తీర్ణం: 1,32,047 హెక్టార్లు దిగుబడి అంచనా: 18,48,658 క్వింటాళ్లు మద్దతు ధర: రూ.5,550 (క్వింటాలుకు) సీసీఐ ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలు: 9 గతేడాది కొనుగోలు వివరాలు ప్రైవేట్ ట్రేడర్స్: 14,62,011 క్వింటాళ్లు సీసీఐ: 3,36,092 క్వింటాళ్లు పీఏసీఎస్ (11 కేంద్రాలు): 998 క్వింటాళ్లు ఐకేపీ (12 కేంద్రాలు): 2,939 క్వింటాళ్లు అక్టోబర్ చివరిలో కొనుగోలు అక్టోబర్ మూడోవారంలో పత్తి పంట కొనుగోలు ప్రారంభించే అవకాశం ఉంది. సీసీఐ తొమ్మిది కేంద్రాలతో కొనుగోలు కోసం ప్రతిపాదనలు చేసింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకేపీ సంఘాలు కూడా గ్రామాల్లో పంటను కొనుగోలు చేస్తాయి. మార్కెట్ యార్డుల్లో ఏర్పాట్లు చేస్తున్నాం. – గజానంద్, జిల్లా మార్కెటింగ్ శాఖాధికారి, ఆదిలాబాద్ -
‘టెక్స్టైల్’ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ: కేటీఆర్
మేడ్చల్రూరల్: టెక్స్టైల్ రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధతో పలు విధానాలను అమలు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు(కేటీఆర్) అన్నారు. బుధవారం మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లిలోని అపరెల్ పార్క్లో జర్మనీ, ఇండియా భాగస్వామ్యంతో హెల్సియా, ఐకాన్ ఇండియా కంపెనీ నెలకొల్పిన షోల్డర్ ప్యాడ్ల పరిశ్రమను కేటీఆర్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో పత్తి ఉత్పత్తిలో దేశం మొదటి స్థానంలో ఉండగా గార్మెంట్ రంగంలో మాత్రం దీనస్థితిలో ఉందనిదేశ వస్త్రపరిశ్రమ వాటా కేవలం 3.87 శాతం ఉందని, బంగ్లాదేశ్ 10, చైనా 30 శాతం వాటా కలిగి ఉన్నాయని తెలిపారు. వ్యవసాయం తర్వాత వస్త్ర పరిశ్రమలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందని, వస్త్ర పరిశ్రమ పాధాన్యతను గుర్తించి రూ.12 వేల కోట్ల బడ్జెట్ను ఈ రంగానికి కేటాయించామన్నారు. త్వరలో మిషన్ మెగా టెక్స్టైల్ పేరుతో వరంగల్ జిల్లాలో అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి తెలిపారు. వస్త్ర ఉత్పత్తిలో దూసుకుపోయేలా కృషి పత్తి ఉత్పత్తిని ప్రారంభించనప్పటి నుండి దుస్తులు తయారు చేసే వరకు అన్ని కంపెనీలు ఒకే పార్కులో ఏర్పాటు చేసి, అన్ని వసతులు, పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి వస్త్ర ఉత్పత్తిలో రాష్ట్రం దూసుకుపోయేలా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. మారుతున్న ప్యాషన్కు అనుగుణం గా ముందుకు సాగాలని, అప్పుడే మార్కెట్ లో నిలువగలుగుతామని అన్నారు. గుండ్లపో చంపల్లిలోని అపరెల్ పార్క్లో 174 ఎకరాల స్థలం అందుబాటులో ఉండగా, ఇక్కడ ఏర్పాటు చేసిన వివిధ కంపెనీలలో 3 వేల మంది ఉపాధి పొందుతున్నారన్నారు. అనం తరం కార్మికులతో కేటీఆర్ మాట్లాడారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement