-
కాటన్ బ్యారేజ్ 15.9 అడుగులకు చేరుకున్న నీటిమట్టం
-
ఉరకలేస్తున్న గోదావరి
దవళేశ్వరం: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉరకలేస్తోంది. పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలతో బ్యారేజీ వద్దకు వచ్చి చేరుతున్న వరద నీటిని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు. కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం ఆదివారం సాయంత్రానికి 9.70 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 1,25,693 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. నీటిమట్టం ఆదివారం సాయంత్రం భద్రాచలం వద్ద 14 అడుగులకు, పోలవరంలో 27.67 మీటర్లకు చేరింది. -
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి పోటెత్తిన వరద
-
డెల్టా ఆధునికీకరణతో.. మళ్లీ అరకొరేనా!
సాక్షి, రాజమహేంద్రవరం: రబీ పంటకు నీటి విడుదల గడువు ఆదివారంతో ముగుస్తోంది. ముందుగా నిర్ణయించిన మేరకు మార్చి 31తో నీటిని నిలిపివేయాల్సి ఉన్నా పలు ప్రాంతాల్లో పంట పొట్టదశలో ఉండడంతో రైతుల విజ్ఞప్తి మేరకు ముందు పది రోజులు, ఆ తర్వాత మరో ఐదు రోజులు వెరసి ఏప్రిల్ 15 వరకు గడువు పొడిగించారు. ప్రస్తుతం తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 5,500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. 15న సాయంత్రం 6 గంటలకు మూడు డెల్టా కాలువలను మూసివేయనున్నారు. ఇందుకు సంబంధించి ఆదివారం నిర్ణయం తీసుకోనున్నారు. 16 నుంచి మే 30 వరకు 45 రోజుల పాటు డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టనున్నారు. గత ఏడాదిలాగే ఈ సారి జూన్ 1న కాలువలకు నీరు విడుదల చేయనున్నారు. 2,020 పనులు.. రూ.308 కోట్లు.. రబీ ఆరంభానికి ముందు గత ఏడాది నవంబర్లో కాకినాడలో నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో డిసెంబర్ 31 నాటికి నాట్లు పూర్తి చే యాలని నిర్ణయించారు. మార్చి 31న కాలువలు మూసి వేసి మే 30 వరకు 60 రోజులపాటు డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. రైతుల విజ్ఞప్తి మేరకు అదనంగా 15 రోజులు నీరు విడుదల చేయడంతో డెల్టా ఆధునికీకరణ పనులకు 45 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ ఏడాది రూ. 308 కోట్లతో 2,020 పనులు చేసేందుకు జలవనరులశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. డెల్టా ఆధునికీకరణ కింద రూ. 173 కోట్లతో 370 పనులు చేయనున్నారు. నీరు– చెట్టు పథకంలో రూ.135 కోట్లతో 1650 పనులు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. పునరావృతం కాకూడదంటున్న రైతులు గత ఏడాది డెల్టా ఆధునికీకరణ పనులు ఆలస్యంగా ప్రారంభించారు. ఆధునికీకరణలో భాగంగానే రూ. 60 కోట్ల విలువైన పనులు చేపట్టారు. ప్రధాన కాలువలు, చానల్స్, పంట బోదెలు, డ్రైన్లలో పూడిక తీత, రిటైనింగ్ వాల్స్, హెడ్ స్లూయిజ్, స్లూయిజ్ పనులు చేపట్టారు. నెల రోజులు ఆలస్యంగా మే నుంచి పనులు చేయడం ప్రారంభించారు. మరికొన్ని పనులు హడావుడిగా మే నెలాఖరున ప్రారంభించారు. జూన్ 1నే నీరు విడుదల చేయాలన్న రైతుల పోరాటం ఫలించినా పనులు పూర్తి కాకపోవడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్టైంది. జూన్ ఒకటిన అధికారులు కాలువలకు నీరు విడుదల చేసినా ఆధునికీకరణ పనులు మధ్యలో ఉండడంతో ఫలితం లేకపోయింది. కాంట్రాక్టర్లు ఎక్కడికక్కడ కాలువలకు అడ్డుకట్టలు వేసి పనులు చేయడంతో కాలువలకు పూర్తి స్థాయిలో నీరు 15 రోజులు ఆలస్యంగా అందింది. గత ఏడాది అదృష్టవశాత్తూ అక్టోబర్లో తుపాన్లు రాకపోవడం వల్ల పంట కోత ఆలస్యమైనా ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఈ ఏడాదైనా డెల్టా ఆధునికీకరణ పనులు సకాలంలో మొదలు పెట్టి నిర్ణీత గడువు మే 30 నాటికి పూర్తి చేసి జూన్ ఒకటిన నిరు విడుదల చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
రక్షణ గోదారమ్మకెరుక
ధవళేశ్వరం బ్యారేజి దుస్థితి 169 గేట్లలో రూ.16.90 లక్షల విలుౖÐð న బ్రేక్ కాయిల్స్ చోరీ నామమాత్రంగా చర్యలు.. తేలని దోషులు అరకొరగా రక్షణ ఏర్పాట్లు 8 చాలీచాలని సిబ్బందితోనే కాలక్షేపం ‘సాక్షి’ పరిశీలన ఉభయ గోదావరి జిల్లాల వరప్రదాయినిగా నిలుస్తున్న ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజి రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. దేశంలోనే అత్యధికంగా 175 గేట్లతో నిర్మించిన ఈ బ్యారేజి పరిరక్షణలో జలవనరుల శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతోంది. వరదల సమయంలో బ్యారేజి గేట్లను ఎత్తేందుకు ఉపయోగించే ఎంతో విలువైన బ్రేక్ కాయిల్స్ మాయమయ్యాయి. మరోపక్క చాలీచాలని సిబ్బందితోనే బ్యారేజి నిర్వహణ, రక్షణ చర్యలు చేపడుతున్నారు. ఈ అంశాలపై ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో నివ్వెరపరిచే నిజాలు వెలుగు చూశాయి. సాక్షి, రాజమహేంద్రవరం : ఉభయ గోదావరి జిల్లాల్లో ఏటా సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీరందించే ధవళేశ్వరం బ్యారేజి రక్షణను ప్రభుత్వం గాలికి వదిలేసింది. సుమారు రెండు నెలల కిందట జరిగిన బ్రేక్ కాయిల్స్ చోరీ ఘటనతో బ్యారేజి రక్షణలోని డొల్లతనం స్పష్టంగా బయటపడింది. గోదావరి నదికి సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ ఎక్కువగా వరదలు వస్తూంటాయి. ఎగువ నుంచి వచ్చే వరద ఉధృతినిబట్టి వెనువెంటనే బ్యారేజి క్రస్ట్ గేట్లను అవసరమైన మేరకు ఎత్తి.. అదనపు జలాలను సముద్రంలోకి విడిచిపెడతారు. నాలుగు ఆర్్మలుగా నిర్మించిన కాటన్ బ్యారేజికి 175 గేట్లు ఉన్నాయి. టన్నులకొద్దీ బరువుండే ఈ ఇనుప గేట్లను సకాలంలో ఎత్తేందుకు బ్రేక్ కాయిల్స్ ఉపయోగిస్తారు. వరద నీటి నియంత్రణలో ఎంతో కీలకంగా ఉపయోగించే ఈ కాయిల్స్ చోరీకి గురయ్యాయి. అది కూడా ఒకటో రెండో కాదు.. ఏకంగా 169 గేట్లకు ఉండే బ్రేక్ కాయిల్స్ మాయమయ్యాయి. వీటి విలువ సుమారు రూ.16.90 లక్షలని చెబుతున్నారు. ప్రస్తుతం వరదల సీజనే అయినప్పటికీ వీటిని ఇంతవరకూ తిరిగి ఏర్పాటు చేయలేదు. మరోపక్క ఇంత ముఖ్యమైన, విలువైన పరికరాలు చోరీకి గురవుతూంటే అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారన్న ప్రశ్న. పుణేలో మాత్రమే దొరికే ఈ కాయిల్స్ రప్పించాలని భావించినా ఇప్పటికిప్పుడు లభ్యమయ్యే పరిస్థితి లేదు. ప్రత్యేకంగా ఆర్డర్ పెట్టి వీటిని తయారు చేయించుకోవాలని చెబుతున్నారు. మరోపక్క కాయిల్స్ ఉన్నప్పుడు కేవలం స్విచ్ ఆన్ చేయగానే గేట్లు వాటంతటవే తెరచుకునేవి. ఇప్పుడవి దొంగలపాలు కావడంతో ఒక్కో గేటుకు ఇద్దరు అదనపు సిబ్బందిని నియమించడం తప్పనిసరైంది. మొక్కుబడి చర్యలతో సరి బ్యారేజి నిర్వహణలో ఎంతో ప్రాధాన్యం ఉన్న పరికరాలు చోరీకి గురయితే అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకున్నారు. ముగ్గురు సెక్షన్ అధికారులను సస్పెండ్ చేసి, చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ జరిగిన సమయంలోని ఉన్నతాధికారులందరూ బదిలీపై వెళ్లిపోయారు. ప్రస్తుతం కొత్తవారు రావడంతో శాఖాపరమైన విచారణ జరుగుతుందో లేదో తెలియని పరిస్థితి. 240 మందికి.. 40 మందే సిబ్బంది బ్యారేజి నిర్వహణ, రక్షణ కోసం 240 మంది సిబ్బంది అవసరమవుతారు. కానీ ప్రస్తుతం 40 మంది మాత్రమే ఉన్నారంటే బ్యారేజి రక్షణ, నిర్వహణలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్థమవుతుంది. ప్రస్తుతం బ్యారేజి వద్ద కాపలాగా ప్రైవేటు వ్యక్తులను నియమించారు. మూడు షిఫ్టుల్లో ఒక్కో ఆర్మ్ వద్ద ఆరుగురు చొప్పున నాలుగు ఆర్మ్ల వద్ద 24 మందిని నియమించారు. అయితే రాత్రిపూట విధులు నిర్వర్తించేవారికి కనీసం టార్చిలైట్ను కూడా అధికారులు సమకూర్చలేదు. ధవళేశ్వరంవైపు బ్యారేజి పైకి, జలాల కొలత చూసే ప్రాంతంలోకి ఇతరులు రాకుండా ఉండేలా ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదు. ఉభయ గోదావరి జిల్లాలకు ఎంతో కీలకమైన ప్రభుత్వం, జలవనరుల శాఖ పటిష్ట చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. పోలీసులు పట్టించుకోవడంలేదు బ్రేక్ కాయిల్స్ చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. విచారణ ఎంతవరకూ వచ్చిందో తెలియదు. ప్రస్తుతం గేట్లు తెరవడానికి ఇద్దరు వ్యక్తులు అవసరమవుతున్నారు. బ్రేక్ కాయిల్స్కు ఆర్డర్ పెట్టాం. వీటిని పుణేలో తయారు చేస్తారు. రెండు నెలలు పడుతుందన్నారు. అన్నీ ఒక్కసారిగా కాకపోయినా విడతలవారీగానైనా రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం బ్యారేజి రక్షణగా బయటి వ్యక్తులను నియమించాం. మరో 20 రోజుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. రాత్రి వేళ బ్యారేజిపై కాపలా ఉంచాలని పోలీసు శాఖను కోరాం. – కృష్ణారావు, ఈఈ, హెడ్వర్క్స్, ధవళేశ్వరం బ్యారేజి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
Advertisement