-
రైతు బాగే దేశ స్వావలంబన
పంటల ఉత్పత్తి ఖర్చు నిర్ధారణలో అనేక లోపాలు ఉన్నాయి. ఉత్పత్తి ఖర్చును రాష్ట్రాల వారీగా సేకరించి, దానిని దేశ ‘సగటు’గా మార్చడం వల్ల రైతులకు నష్టం జరుగుతున్నది. ఒకే పంటకు దేశ వ్యాప్తంగా సాగు ఖర్చులో తేడా ఉంటుంది. ప్రతి పంటలో అనేక వెరైటీలు ఉన్నా ఒకే మద్దతు ధరఉంటుంది. వరిలో కొన్ని వందల రకాలున్నా, కనీస మద్దతు ధర అన్నింటికీ ఒకటే. ఈ తేడాలను కనీస మద్దతు ధర నిర్ణాయక వ్యవస్థ పరిగణనలోనికి తీసుకునే పరిస్థితి లేదు. ధరలు రాని పంటలను రైతులు వేయడం మానేస్తారు. ఆ పంటలు వేయడం మానేస్తే, పంట పండించే జ్ఞానం, నైపుణ్యం కోల్పోతాము. క్రమంగా, స్వావలంబన కోల్పోతే ఇతర దేశాల పెత్తనానికి దాసోహం కావాల్సి వస్తుంది. వ్యవసాయ ఖర్చులు ధరల కమిషన్ (సీఏసీపీ) కేవలం మద్దతు ధరను సిఫారసు చేస్తుంది. సిఫారసు చేసిందే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలని లేదు. ఉదా: 2023–24 రబీ సీజన్లో గోధుమలకు వారు క్వింటాలుకు రూ. 2,300 సిఫారసు చేస్తే, క్యాబినెట్ ఆమోదించింది రూ. 2,125 మాత్రమే. కనీస మద్దతు ధర నిర్ణయంలో కనీసం 12 అంశాలను పరిశీ లిస్తారు. అయితే 12 అంశాలలో ఉత్పత్తి ఖర్చు తప్పితే, మిగతాఅంశాలు కనీస మద్దతు ధర నిర్ణయంలో ఎటువంటి పాత్ర పోషి స్తాయో స్పష్టత లేదు. పంటల ఉత్పత్తి ఖర్చు నిర్ధారణలో కూడా అనేక లోపాలు ఉన్నాయి. ఉత్పత్తి ఖర్చు రాష్ట్రాల వారీగా సేకరించి, దానిని దేశ ‘సగటు’గా మార్చడం వల్ల కూడా రైతులకు నష్టం జరుగుతున్నది. ఒకే పంటకు దేశ వ్యాప్తంగా సాగు ఖర్చులలో తేడా ఉంటుంది. దీనిని సగటు చేస్తే, ఖర్చు ఎక్కువ అవుతున్న రైతులకు నష్టం అవుతున్నది. సాగు ఖర్చు ఎందుకు పెరుగుతున్నదనే విషయం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సమీక్ష ఎన్నడూ చేయలేదు. రైతు ఆత్మ హత్యల తదనంతరం జరిపిన అధ్యయనాలు రైతుల మీద పెరుగు తున్న ఖర్చు, మార్కెట్లో గిట్టుబాటు ధర పరిస్థితి గురించి ప్రధానంగా ప్రస్తావించాయి. రైతు కొనే విత్తనాలు, ఎరువులు, కీటకనాశకాలు అన్ని కంపెనీల లాభాలు అవుతున్నాయి. కృత్రిమ ఎరువులు, రసా యన కీటక నాశకాలు సారవంతమైన మట్టిని విషతుల్యం చేస్తూ, రైతును ‘బానిసను’ చేస్తున్నాయి. రాష్ట్రాల వారీగా జరిపే ఉత్పత్తి ఖర్చు నిర్ధారణ కూడా సరిగా, పారదర్శకంగా లేదు. చిన్న రైతు ఎదుర్కొనే అన్ని రకాల ఖర్చులను సేకరించే వ్యవస్థ లేదు. రాష్ట్రాలు అందించే రాష్ట్ర స్థాయి ‘సగటు’ లెక్కలను సీఏసీపీ తన స్వీయ ఆలోచన మేరకు తగ్గిస్తూ ఉంటుంది. స్థూలంగా, పంటల మీద ఖర్చును దశల వారీగా, వివిధ స్థాయిలలో ‘తరుగు’ చేస్తున్నది. వ్యవసాయ ఉత్పత్తి ఖర్చుని శాస్త్రీయంగా, పార దర్శకంగా నిర్ధారించే వ్యవస్థ అవసరం. రైతులు కోరుతున్నట్లుగా ధర లకు చట్టబద్ధత కల్పిస్తే, ఈ వ్యవస్థ లోపాలు బయటకు వస్తాయని కూడా విధాన నిర్ణేతల ఆందోళన కావచ్చు. ప్రపంచ వాణిజ్య సంస్థ పరిధిలో విధించిన షరతులు కూడా ఒక కారణం. కనీస మద్దతు ధర అన్ని పంటలకు ఇవ్వరు. 1964–65లో వరి, గోధుమలకు మాత్రమే కనీస మద్దతు ధరను నిర్ణయించేవారు. కాలక్రమేనా 23 పంటలకు చేరింది. పసుపు, జొన్నలు, తృణధాన్యాలు వంటి పంటలకు లేవు. భారత దేశంలో దాదాపు 600 పంటలు పండించేవారు. అనేక పంటలు కనుమరుగు అయినాయి, అవుతున్నాయి. ఖర్చులు ఎక్కువ, రాబడి తక్కువ, సారవంతమైన మట్టి కనుమరుగు అవ్వడం, కలుషిత నీళ్ళు, నీటి కొరత, పురుగుల బెడద, వన్యప్రాణుల దాడులు, నాణ్యమైన విత్తనాల కొరత, కూలీల కొరత, ఇంకా ఇతర ఆర్థిక, సామాజిక, పర్యావరణ అంశాల నేపథ్యంలో రైతులు క్రమేణా కొన్ని పంటలకే పరిమితం అవుతున్నారు. ఈ నిర్ణయంలో కనీస మద్దతు ధర పాత్ర కూడా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కనీస మద్దతు ధరల వ్యవస్థ మీద నాలుగు కమిటీలు అనేక సూచ నలు ఇచ్చాయి – ఝా కమిటీ (1965), సేన్ కమిటీ (1979), హను మంతరావు కమిటీ (1990), వై.కే.అలఘ్ కమిటీ (2005). 2007లో ప్రణాళిక సంఘం, 2017లో నీతి ఆయోగ్ నివేదికలు కూడా ఉన్నాయి. ఈ సూచనలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. 2005 కమిటీ వ్యవసాయ ధరల కమిషన్కు చట్టబద్ధత కల్పించాలని సిఫారసుచేసింది. అంటే, కనీస మద్దతు ధర చట్టబద్ధతను అది ఆమోదించింది. ధర నిర్ణయంలో నాణ్యత కూడా కీలకం అని ఈ కమిటీ భావించింది. వివిధ పంటలకు మార్కెట్ కాలం రెండు లేక మూడు నెలలు మాత్రమే ఉంటుంది. రబీ పంటల మార్కెటింగ్ కాలం ఏప్రిల్ నుంచి జూన్ వరకు మాత్రమే. ఆయా పంటల సరఫరా డిమాండ్లతోసంబంధం లేకుండా మద్దతు ధరలు మాత్రం సంవత్సరం పాటు స్థిరంగా ఉంటాయి. ప్రతి పంటలో అనేక రకాల వెరైటీలు ఉన్నా ఒకే మద్దతు ధర ఉంటుంది. వరిలో కొన్ని వందల రకాల విత్తనాలు ఉన్నా, కనీస మద్దతు ధర అన్నింటికీ ఒకటే. వరి రకం బట్టి పంట కాలం ఉంటుంది. ఆ మేరకు ఖర్చులలో కూడా తేడా ఉంటుంది. కొన్ని 80 రోజుల పంట అయితే, ఇంకొన్ని 160 రోజులు ఉంటాయి. ఈ తేడాను కనీస మద్దతు ధర నిర్ణాయక వ్యవస్థ పరిగణనలోనికి తీసుకునే పరిస్థితి లేదు. అంతా స్థిరమైన సగటు. ధర రాక రైతులు రాబోయే సంవత్సరంలో ఈ పంట వేయడం ఆపేస్తే ఆ పంట సరఫరాపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దాని మీద ఆధారపడ్డ వినియోగదారులకు, పరిశ్రమలకు (పంట ముడిసరుకుగా వాడే వాటికి) ధర పెరుగుతుంది. ఏదైనా పంట దిగుబడి తగ్గి, సరఫరా తగ్గి, ధర పెరిగితే వెంటనే దిగుమతులకు అనుమతులు ఇస్తుంది ప్రభుత్వం. అయితే ఆ యేడు వరకే దిగు మతులను ‘నల్లా తిప్పి బంజేసినట్లు’ చేసే పరిస్థితి ఉండదు. సాధారణంగా అంతర్జాతీయ వాణిజ్యంలో సరఫరా ఒప్పందాలు గిట్టుబాటుగా కొన్ని సంవత్సరాల కొరకు చేసుకుంటారు. దిగుమ తులు కొనసాగితే దేశీయంగా ధర మళ్లీ పెరిగే అవకాశం లేక రైతులు ఆ పంట వేయడం పూర్తిగా మానేస్తారు. పప్పుల విషయంలో అదే అయ్యింది. 2015లో కొరత ఉందని అనుమతిస్తే సరఫరా ఒప్పందాలు 7 సంవత్సరాలకు చేసుకుని దిగుమతులు పెంచారు. రైతులకు ధర వచ్చే ఆశ లేక పూర్తిగా వేయడం మానేశారు. దరిమిలా పప్పుల ఉత్పత్తిలో అగ్రగామి అయిన భారత్ ఇప్పుడు దిగుమతుల మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. అటు వినియోగదారులకు పప్పుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పప్పులకు కనీస మద్దతు ధర (ఖర్చుకు అనుగుణంగా) ఇస్తేనే రైతులు మళ్లీ వేస్తారు. అధిక ధరలకు దిగుమతి చేసుకుంటున్న ప్రభుత్వం కనీస మద్దతు పెంచడానికి ఇష్టపడటం లేదు. వంట నూనె విషయంలో ఇంకో విధంగా మన స్వావలంబన కోల్పోయాం. ముడి పామాయిల్ దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు చేసిన వ్యవస్థ వల్ల ఏర్పడింది. తక్కువ ధరకు పామాయిల్ రావడంతో, తక్కువ ధరకు వినియో గదారులకు అందిస్తే రాజకీయ ప్రయోజనం అని చూసుకుని ప్రభుత్వం ఆయా సంవత్సరాలలో పెరుగుతున్న పామాయిల్ దిగుమతులను పట్టించుకోలేదు. పైగా దిగుమతి సుంకాలను సున్నా చేసింది. ఫలితంగా, మనం పండించే వేరుశనగ, నువ్వులు, ఆము దాలు, ఆవాలు వంటి 9 రకాల వంట నూనె గింజల పంటల విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయింది. వంట నూనె నిత్య అవసరం కాబట్టి ఇప్పుడు ఆ దిగుమతి మానలేము. అది మానకుంటే రైతులకు ధర రాక ఇక్కడ నూనె గింజల ఉత్పత్తి పెరిగే పరిస్థితి లేదు. డిమాండ్ ఉన్న రకాల పంటలు వేసే ప్రోత్సాహక పరిస్థితి రైతులకు లేకుండా పోయింది. ప్రభుత్వం జోక్యం వల్ల మార్కెట్లకు నష్టం అని భావించేవారు, ఈ పరిస్థితిని ప్రభుత్వ జోక్యం లేకుండా ఎట్లా మారుస్తారో చెప్పాలి. రైతులు ఆ యా పంటలు వేయడం మానేస్తే, పంట పండించే జ్ఞానం, నైపుణ్యం, సామర్థ్యం కోల్పోతాము. ఇప్పుడు చెరుకు కోసే నైపుణ్యం ఉన్న కూలీలు దొరకడం లేదు. తిరిగి ఆ పంట కావాలంటే ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాల్సిందే. అప్పుడు పెట్టుబడులు పెట్టే బదులు, ప్రభుత్వం ఇప్పుడే మార్కెట్లో జోక్యం చేసుకుని, రైతులకు గిట్టుబాటు ధర ఇస్తే అందరూ సంతోషంగా ఉంటారు కదా! లేకుంటే మనం కొన్ని ఆఫ్రికన్ దేశాల మాదిరి అయి పోతాం. నిరంతరం సముద్ర తీరాల వైపు చూడాల్సి వస్తుంది. క్రమంగా, స్వావలంబన కోల్పోతే ఇతర దేశాల పెత్తనానికి దాసోహం కావాల్సి వస్తుంది. - వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు - డా‘‘ దొంతి నరసింహా రెడ్డి -
ప్రకృతి సాగులో 'అమృతంఫలం'
ఖర్చు తక్కువతో కచ్చితమైన నికరాదాయం పొందుతూ భూసారాన్ని కూడా పెంపొందించుకుంటూ రైతులోకానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు గుంటూరు జిల్లా నాదెండ్ల రైతులు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఈ అరటి రైతులు పండిస్తున్న నాణ్యమైన అరటి గెలలను వ్యాపారులు అధిక ధర చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఆరేళ్ల నాడు నల్లమోతు సాంబశివరావు అనే రైతు ప్రారంభించిన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ఇప్పుడు పలువురు రైతులు అనుసరిస్తున్నారు. సాంబశివరావు 2000 సంవత్సరం నుంచి రసాయనిక వ్యవసాయ పద్ధతిలో కర్పూర అరటి సాగు చేస్తున్నారు. సాగు వ్యయం అంతకంతకూ పెరిగిపోతుండడంతో నికరాదాయం బాగా తగ్గిపోతూ వచ్చిన నేపథ్యంలో.. మహారాష్ట్రకు చెందిన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ వద్ద సాగు పద్ధతిలో శిక్షణ పొంది.. ఈ పద్ధతిలో అరటి సాగును కొనసాగిస్తున్నారు. పొలం పనులన్నీ వీలైనంతవరకు సాంబశివరావు దంపతులే స్వయంగా చేసుకుంటారు. ఆవు పేడ, మూత్రం తదితరాలతో జీవామృతం తయారు చేసి పంటలకు వేస్తారు. దగ్గర్లోని గోశాల నుంచి ఆవు పేడ, మూత్రం తెచ్చుకుంటూ ప్రకృతి వ్యవసాయం చేస్తూ.. మనసుంటే మార్గం ఉంటుందన్న సూక్తిని నిజం చేస్తున్నారు. ఈ గెలలకు మార్కెట్లో మంచి గిరాకీ ఎకరాకు 900 పిలకలు నాటుతారు. మంగళగిరి, మందడం, పెనుమాక వంటి కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి మొక్క రూ. 5 చొప్పున కొనుగోలు చేసి నాటుతున్నారు. అయితే, వీటిలో 150 మొక్కల వరకు వివిధ కారణాలతో పాడయిపోతాయి. పొలంలో పిలకలు నాటిన ఏడాదిలోపు కాపు ప్రారంభమౌతుంది. ఈ తోటలకు రసాయనిక పురుగుమందులు, రసాయనిక ఎరువులు వాడకపోవటంతో మార్కెట్లో ఈ అరటి గెలలకు మంచి గిరాకీ ఉంది. మంచి రంగు, సైజుతో అరటి కాయలు చాలా ఆకర్షణీయంగా ఉండటంతో వ్యాపారులు అధిక ధర ఇచ్చి కొంటున్నారు. ఎక్కువ రోజులు నిల్వ ఉండడం.. పురుగుమందుల అవశేషాలు లేకపోవటం వలన వినియోగదారులు ఈ అరటి పండ్లను ఇష్టపడుతున్నారు. ఇదీ సాగు పద్ధతి.. రైతులకు అధిక నికరాదాయం అందిస్తున్న పాలేకర్ ప్రకృతి వ్యవసాయంలో జీవామృతం ముఖ్య భూమిక పోషిస్తోంది. ఎకరా అరటి తోటకు పది కేజీల ఆవుపేడ, పది లీటర్ల ఆవుపంచకం, రెండు కేజీల బెల్లం, రెండు కేజీల అలసంద పిండి (మినపపిండి లేదా శనగపిండి లేదా మరేదైనా పప్పుల పిండి)ని 200 లీటర్ల నీటిలో కలిపి రెండు రోజులు మురగబెడతారు. వాడకానికి సిద్ధమైన జీవామృతాన్ని వడకట్టి విద్యుత్ సౌకర్యం ఉన్న రైతులు డ్రమ్ముకు మోటారు బిగించి డ్రిప్ పద్ధతిలో మొక్కలకు అందిస్తారు. విద్యుత్ సౌకర్యం లేని రైతులు నేరుగా మొక్కకు పావు లీటరు చొప్పున ప్రతి 15 రోజులకోసారి పోస్తారు. ఈ రైతులు రసాయనిక పురుగుమందులు, ఎరువులు వాడకపోవడం వల్ల సాగు ఖర్చు సగం తగ్గింది. పశువుల ఎరువుకు జీవామృతం కలిపి.. గత ఏడాది అధిక వర్షాల వల్ల నాదెండ్ల ప్రాంత రేగడి భూముల్లో పంటలు ఉరకెత్తి దెబ్బతినే పరిస్థితి వచ్చింది. అప్పుడు కొందరు రైతులు రసాయనిక ఎరువులు చల్లినా.. సాంబశివరావు, ఆయన దాయాది నారాయణస్వామి, పరమేశ్వరరావు తదితర రైతులు మాత్రం కొత్త పద్ధతిని అవలంభించి మంచి ఫలితాలు పొందుతున్నారు. పశువుల ఎరువుకు జీవామృతం కలిపి 15 రోజులు చివికిన తర్వాత.. ఒక్కో అరటి మొక్క డ్రిప్పర్ దగ్గర 200 గ్రాముల చొప్పున వేస్తున్నారు. ఈ పద్ధతిలో ఎకరం అరటి తోటకు ఒక పంటకాలానికి ట్రాక్టర్ ట్రక్కు సరిపోతుంది. దీంతో తోట బ్రహ్మాండంగా తిప్పుకుంది. మొక్కలు బలంగా ఏపుగా పెరిగి, కాయ సైజు బాగా పెరగడంతో మార్కెట్లో అత్యధిక ధర పలుకుతున్నదని సాంబశివరావు ఆనందంగా చెబుతున్నారు. గత ఏడాది అధిక వర్షాలు వచ్చినప్పుడు అరటి చెట్ల పక్కన ముందుజాగ్రత్తగా మరో పిలకను కూడా పెరగనిచ్చారు. కొద్ది నెలల్లో రెండో పంట కూడా బోనస్గా అందివస్తుందని ఆశిస్తున్నారు. రసాయనిక వ్యవసాయం చేసే పొలాల్లో పెరిగిన అరటి గెలకు ఎనిమిది నుంచి 10 హస్తాల పండ్లు ఉంటాయి. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన గెలకు 15 హస్తాల వరకు ఉంటున్నాయని రైతులు చెప్పారు. వేసవిలో తీవ్ర వడగాలులకు రసాయనిక ఎరువులతో సాగు చేసిన అరటి తోటలు బాగా వడబడి పోతున్నా ప్రకృతి వ్యవసాయంలో ఉన్న తోటలు కళగానే ఉండడాన్ని ఇతర రైతులు సైతం గుర్తించడం విశేషం. ఒకరిని చూసి మరొకరు.. సాంబశివరావు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించినప్పుడు ఎగతాళి చేశారు. అయితే, ఈ పద్ధతిలో పండించిన కాయలకు అధిక ధర వస్తుండటంతో గ్రామంలో మరో 10 మంది రైతులు ఈ సాగు పద్ధతిని అనుసరిస్తున్నారు. అరటి సాగు 30 ఎకరాలకు విస్తరించింది. వివిధ జిల్లాలకు చెందిన రైతులు సైతం ఈ అరటి తోటలను చూసి స్ఫూర్తి పొందుతుండడం విశేషం. - కాట్రు శ్రీనివాసరావు, నాదెండ్ల, గుంటూరు జిల్లా ఎకరాకు రూ. లక్ష లాభం.. మొదట్లో నేను ఈ పద్ధతిని అవలంభిస్తున్నపుడు తోటి రైతులు హేళన చేశారు. కానీ మూడేళ్లు ఫలితాలు చూశాక కొంతమంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. ఎకరానికి రసాయనిక ఎరువులు 30-40 బస్తాల వరకు వేస్తున్న రైతులున్నారు. నాకు ఎకరానికి రూ. 15 వేల లోపు ఖర్చవుతోంది. వాళ్ల ఖర్చులో మా ఖర్చు సగమే. అరటి తోట గాలులకు పడిపోకుండా ఉంటే.. ఎకరానికి రూ. లక్ష నికరంగా మిగులుతుంది. మొదట్లో దిగుబడి తక్కువగా ఉంది. ఇప్పుడు రసాయనిక ఎరువులు వేసిన పొలాల్లోకన్నా మిన్నగానే ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా భూమి సారవం తమవుతోంది. మా గెలలకు ధర కూడా ఎక్కువే వస్తున్నది. పాలేకర్ ప్రకృతి వ్యవసాయం పూర్తిగా సక్సెస్ అయ్యిందని నేను అనుకుంటున్నా. పేడతో చేసే పని కాబట్టి.. మార్పు నెమ్మదిగా ఉంది.. వచ్చే పదేళ్లలో రైతులందరూ వాళ్ల పిల్లల కోసమైనా ఈ దారికి రాక తప్పదు. పనులు చేసే అలవాటున్న రైతు దంపతులు పదెకరాల్లో అరటి సాగు చేయొచ్చు. - నల్లమోతు సాంబశివరావు (93473 84545), అరటి రైతు, నాదెండ్ల, గుంటూరు జిల్లా తోట దగ్గరికొచ్చి కొనుక్కెళ్తున్నారు..! నాకున్న ఎకరం పొలంలో పాలేకర్ పద్ధతిలో కర్పూర అరటి సాగు చేశాను. మొదటి కాపులోనే రూ. లక్ష ఆదాయం వచ్చింది. నీటి సౌకర్యం ఉండటంతో కాయ సైజు బాగా వచ్చింది. మార్కెట్లో మంచి ధర లభించింది. వ్యాపారులు తోట దగ్గరకే వచ్చి కొనుక్కెళ్లడంతో రవాణా ఖర్చులూ మిగిలాయి. ప్రకృతి వ్యవసాయంలో శ్రమ ఎక్కువ. ఖర్చు తక్కువ. - దేవబత్తుని పరమేశ్వరరావు (98666 56665), రైతు, నాదెండ్ల, గుంటూరు జిల్లా ఆన్లైన్లో అమ్ముతా.. ఎకరం 30 సెంట్ల భూమిలో గతేడాది ఈ పద్ధతిలో కూర అరటి, బొప్పాయి పంటలు సాగు చేశా. మొదటి ఏడాది రూ. లక్షన్నర ఆదాయం వచ్చింది. చక్కెరకేళీ కూడా సాగు చేస్తున్నా. త్వరలో సేంద్రియ ఆహార పదార్థాల ధృవీకరణను పొంది ఆన్లైన్ బుకింగ్ ద్వారా టోకు వ్యాపారస్తులకు నేరుగా అమ్ముతా. వినియోగదారులకు డోర్ డెలివరీ చేస్తా. - ఎన్. నారాయణస్వామి (99511 66287), రైతు, నాదెండ్ల, గుంటూరు జిల్లా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్హాసన్ 'థగ్ లైఫ్'.. ఆ హీరోను రిప్లేస్ చేశారు!
RCB vs PBKS: ధర్మశాలలో గర్జించేదెవరు?
హర్యానాలో మరో ట్విస్ట్.. గవర్నర్కు లేఖ రాసిన జేజేపీ
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
SRH vs LSG: ఏమా పరుగుల విధ్వంసం.. లక్నో చిత్తు
తొలిసారి ఆ జానర్ టచ్ చేయనున్న విజయ్!
Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
రేపే పసిడి కొనుగోలు జాతర.. దిగొచ్చిన బంగారం!
ఆ ప్రేమ జంట టీ దుకాణానికి వినియోగదారుల క్యూ!
Watch Live: కళ్యాణదుర్గంలో సీఎం జగన్ ప్రచార సభ
తప్పక చదవండి
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- Mona Patel: ‘ఎవరీ మోనా?’ అని సెర్చ్ చేసేలా...
- Playoffs: పాండ్యాకు పరాభవం.. ముంబై కథ ముగిసిందిలా!
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement