breaking news
Consumption of footwear
-
సోలార్.. రాంగ్ బిల్లింగ్!
ఇంధన శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్ చందా తన సోలార్ రూఫ్టాప్ సిస్టమ్ ద్వారా జూలైలో 124 యూనిట్ల విద్యుత్ను గ్రిడ్కు సరఫరా చేసి తిరిగి గ్రిడ్ నుంచి 309 యూనిట్ల విద్యుత్ను వాడుకున్నారు. ఈ రెండింటినీ సర్దు బాటు చేశాక ఆ నెలకు ఆయనకు 179 యూనిట్ల వినియోగానికి సంబంధించి రూ. 877 బిల్లును టీజీఎస్పీడీసీఎల్ జారీ చేసింది. కానీ అక్టోబర్ నెలలో మాత్రం 158 యూనిట్లను గ్రిడ్కు ఎక్స్పోర్ట్ చేసి గ్రిడ్ నుంచి 330 యూనిట్ల విద్యుత్ను వాడుకున్నందుకు ఆయనకు 172 యూనిట్ల వినియోగానికే బిల్లు జారీ చేయాల్సి ఉంది. కానీ టీజీఎస్పీడీసీఎల్ మాత్రం రూ. 1,444 బిల్లు పంపింది. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతించకపోయినా సోలార్ రూఫ్టాప్ వినియోగదారుల విద్యుత్ బిల్లులను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) ఏకపక్షంగా పెంచేసింది. రాష్ట్ర ఇంధన శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సురేశ్ చందా శనివారం ఈఆర్సీకి చేసిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచి్చంది. నెట్ మీటరింగ్ బదులు.. రాష్ట్రంలో సోలార్ రూఫ్టాప్ వినియోగదారులకు నెట్ మీటరింగ్ విధానంలో బిల్లులను జారీ చేస్తున్నారు. వినియోగదారులు తమ సోలార్ రూఫ్టాప్ సిస్టం ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను గ్రిడ్కు సరఫరా చేస్తారు. దీన్ని ఎక్స్పోర్ట్ చేసిన విద్యుత్ అంటారు. గ్రిడ్ నుంచి విద్యుత్ను తమ అవసరాలకు వాడుకుంటారు. దీన్ని ఇంపోర్ట్ చేసుకున్న విద్యుత్ అంటారు. ఎక్స్పోర్ట్ చేసిన విద్యుత్తో పోలిస్తే ఇంపోర్ట్ చేసుకున్న విద్యుత్ ఎక్కువ ఉన్నప్పుడు రెండింటి మధ్య ఉండే తేడాను తీసి దాని ఆధారంగా వినియోగదారులకు బిల్లులను జారీ చేయాలి. దీన్నే నెట్ మీటరింగ్ విధానం అంటారు.కానీ అక్టోబర్ నెలకు సంబంధించి సోలార్ రూఫ్టాప్ వినియోగదారులకు టీజీఎస్పీడీసీఎల్ నెట్ మీటరింగ్కు బదులుగా నెట్ బిల్లింగ్ విధానంలో బిల్లులు జారీ చేసింది. అంటే వినియోగదారుడు ఉత్పత్తి చేసి గ్రిడ్కు ఎక్స్పోర్ట్ చేసిన విద్యుత్కు, గ్రిడ్ నుంచి వినియోగదారుడు తీసుకున్న విద్యుత్కు వేర్వేరుగా చార్జీలను లెక్కించింది. ఈ రెండు చార్జీలను సర్దుబాటు చేసి తుదకు మిగిలే మొత్తాన్ని వినియోగదారులకు బిల్లులుగా జారీ చేసింది. వినియోగదారులు ఎక్స్పోర్ట్ చేసే విద్యుత్కు టీజీఎస్పీడీసీఎల్ ఇచ్చే «చార్జీలతో పోలిస్తే వినియోగదారులు ఇంపోర్ట్ చేసుకునే విద్యుత్పై విధించే చార్జీలు అధికంగా ఉన్నాయి. దీంతో వినియోగదారుల బిల్లులు భారీగా పెరిగిపోయాయి. దీనిపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈఆర్సీ తిరస్కరించినా... సోలార్ రూఫ్టాప్కు సంబంధించి కొత్త మార్గదర్శకాలను ఈఆర్సీ నవంబర్ 15న ప్రకటించింది. నెట్ మీటరింగ్ విధానానికి బదులు నెట్ బిల్లింగ్ విధానంలో బిల్లుల వసూళ్లకు అనుమతించాలని టీజీఎస్పీడీసీఎల్ విజ్ఞప్తి చేయగా ఈఆర్సీ తిరస్కరించింది. తుది రెగ్యులేషన్లో నెట్ మీటరింగ్ విధానాన్నే కొనసాగించాలని స్పష్టం చేసింది. అయినా అందుకు విరుద్ధంగా టీజీఎస్పీడీసీఎల్ వినియోగదారులపై నెట్ బిల్లింగ్ విధానంలో బిల్లులను పెంచేయడం గమనార్హం. -
ఏటా 5,000కు పైగా కొత్త డిజైన్లు
లిబర్టీ గ్రూప్ ఈడీ అనుపమ్ బన్సల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాద రక్షల తయారీలో ఉన్న లిబర్టీ గ్రూప్ ఏటా 5,000లకుపైగా డిజైన్లను ప్రవేశపెడుతోంది. ప్రాంతాలవారీగా కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా పాదరక్షలను పరిచయం చేస్తున్నట్టు కంపెనీ ఈడీ అనుపమ్ బన్సల్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. పరిశోధన కోసం ఏటా రూ.10 కోట్ల వ్యయం చేస్నున్నట్టు చెప్పారు. 100 మందికిపైగా డిజైనర్లు కొత్త మోడళ్ల రూపకల్పనలో నిమగ్నమయ్యారని తెలిపారు. ‘పాదరక్షల వినియోగంలో వినియోగదార్ల అభిరుచులు మారుతున్నాయి. రంగు రంగుల డిజైన్లు కోరుతున్నారు. ఏటా వినియోగం సగటున పురుషులు 2 జతలు వినియోగిస్తే.. మహిళలకు సమానంగా పిల్లలు సైతం 3-4 జతలు వాడుతున్నారు’ అని చెప్పారు. రూ.20,000 కోట్ల మార్కెట్..: భారత్లో పాదరక్షల మార్కెట్ 10-12% వృద్ధి రేటుతో రూ. 20,000 కోట్లుంది. ఇందులో వ్యవస్థీకృత రంగం వాటా 15-20 శాతమే. అయితే బ్రాండెడ్ వైపు మళ్లుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని అనుపమ్ తెలిపారు. చైనాలో తయా రీ వ్యయం పెరుగుతోందని, దీనికితోడు దేశంలో జీఎస్టీ అమలైతే చవక పాదరక్షల దిగుమతులు తగ్గుతాయన్నారు. కాగా, లిబర్టీ గ్రూప్ ప్రతిరోజు 50 వేల జతల పాదరక్షలను ఉత్పత్తి చేస్తోంది. టర్నోవర్ 2014-15లో రూ. 600 కోట్లు, వచ్చే రెండేళ్లలో రూ.1,000 కోట్లు అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రా ల్లో కొత్తగా 20 వరకు ఎక్స్క్లూజివ్ స్టోర్లను ఏర్పాటు చేయనుంది.


