-
కంప్యూటర్ చదువు కలేనా?
పెదనడిపల్లి(చీపురుపల్లి రూరల్),న్యూస్లైన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంప్యూటర్ విద్య లక్ష్యం గాడి తప్పుతోంది. జిల్లాలో గల 175 జిల్లాపరిషత్ సక్సెస్ ఉన్నత పాఠశాలల్లో 6నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం 2002లో ఈ కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి ఉన్నత పాఠశాలకు 11 కంప్యూటర్లను,వాటికి సంబంధించిన పరికరాలను అందజేసింది. జిల్లా వ్యాప్తంగా ప్రతి పాఠశాలకు ఇద్దరు చొప్పున 350 మంది కంప్యూటర్ బోధకులను తాత్కాలిక వేతనం రూ 2 వేలు చెల్లిస్తూ నియమించింది. మొదట్లో ఈ పాఠశాలల కంప్యూటర్ విద్యాబోధన బాధ్యతను నిట్ సంస్థకు అప్పగించింది.తరువాత కాలంలో విద్యాబోధకులు తమకు చెల్లిస్తున్న వేతనాన్ని పెంచాలని 2008లో నిట్ సంస్థపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ మేరకు వారి వేతనం రూ 3100కు పెరిగింది. మళ్లీ 2011లో ఈ పాఠశాలల కంప్యూటర్ నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం ఐఈజీ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ బోధకుల జీతాలను రూ 1900కు కుదించింది. దీనికి తోడు కంప్యూటర్ విద్య నిర్వహణకు అవసరమైన సాఫ్ట్వేర్ను కూడా సక్రమంగా అందజేయకపోవడం,పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించకపోవడంతో కంప్యూటర్ విద్య ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఇన్ని కష్టాల నడుమ కంప్యూటర్ బోధకులు తక్కువ వేతనానికి కూడా పాఠశాలలో తరగతులు నిర్వహించే వారు. ఈ కంప్యూటర్ విద్యను అందించేటప్పుడు మొదట్లో ఒక ప్రైవేటు సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం సెప్టెంబర్ నెలతో కంప్యూటర్ టీచర్స్ గడువు పూర్తయ్యింది. దీంతో నెల రోజులుగా కంప్యూటర్ టీచర్స్ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇళ్లకు పరిమితమైన ఉపాధ్యాయులకు జీతాలు లేక విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందక ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. సామగ్రికి భద్రత కరువు ఇదిలా ఉండగా సక్సెస్ పాఠశాలలకు ప్రభుత్వం అందించిన కంప్యూటర్ సామగ్రికి భద్రత లేకుండా పోతోంది. చీపురుపల్లి మండలంలో 5 జిల్లా పరిషత్ బాలుర, బాలిక ఉన్నత పాఠశాలలకు ఈ పథకంలో భాగంగా కంప్యూటర్లను, వాటికి సంబంధించిన పరికరాలను అందజేసినప్పటికీ ఏదో ఒకరకమైన సాంకేతిక లోపంతో మరమ్మతుకు గురవుతూనే ఉన్నాయి. అంతేకాకుండా వీటిని భద్రపరచడం మరో ప్రధాన సమస్యగా మారింది. మండలంలోని పెదనడిపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో సీపీయూలు మూడేళ్ల క్రితం దొంగతనానికి గురయ్యాయి. సీపీయూలు చోరీకి గురవడంతో అప్పటినుంచి ఆ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ విద్య పూర్తిగా దూరమైంది. నేటికీ ఈ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. జిల్లాలోని పాఠశాలలకు ప్రభుత్వం అందజేసిన కంప్యూటర్లలో సుమారు 70 శాతం మరమ్మతుల్లో ఉండడంతో విద్యార్థులకు విద్యను అందించలేని పరిస్థితి. మిగిలి ఉన్న కంప్యూటర్లతో బోధన చేద్దామా అనుకుంటే ఇదే సమయంలో నిత్యం విద్యుత్ కోతలతో కంప్యూటర్ విద్య దూరమైపోతోంది. అంతేకాకుండా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించకపోవడంతో కంప్యూటర్లు ఉన్నప్పటికీ ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోతోందని చెబుతున్నారు. ‘కంప్యూటర్ల నిర్వహణ బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుని పనిచేయని కంప్యూటర్లకు మరమ్మతులు చేయించి, పాఠశాలల్లో ఈ విద్యకు అందుబాటులో ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాలి. దీంతో పాటు ప్రభుత్వమే కంప్యూటర్ బోధకులను నియమించినట్లయితే మళ్లీ విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందుతుం’దని ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. -
కంప్యూటర్ విద్య మూత‘బడి’నట్లే!
ప్రభుత్వ పాఠశాలలో ఇన్స్ట్రక్టర్ల తొలగింపు! నిధులు వెచ్చించలేక చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం కంప్యూటర్ పరిజ్ఞానం లేని టీచర్లే ఇక బోధించాలి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కంప్యూటర్ విద్య దూరమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అందిస్తున్న కంప్యూటర్ విద్య పథకానికి సంబంధించి ఐదేళ్ల కాలం పూర్తి కావడంతో దాని నిర్వహ ణ బాధ్యత ఇప్పుడు పూర్తిగా రాష్ట్రప్రభుత్వంపై పడింది. ఈ పథకానికి ఇన్నాళ్లు 25 శాతం నిధులు మాత్రమే వెచ్చించిన రాష్ట్రం ఇకపై 100 శాతం నిధులు కేటాయించాల్సి ఉంది. అయితే నిధులు వెచ్చించలేక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేస్తుంది.కంప్యూటర్లు, జనరేటర్ల నిర్వహణ, దాదాపు 12 వేల మంది ఇన్స్ట్రక్టర్లకు ప్రతి నెలా చెల్లించాల్సిన వేతనాల మొత్తం వెచ్చించేందుకు సిద్ధంగా లేమని చెబుతోంది. దీంతో రాష్ట్రంలోని ఐదువేల ఉన్నత పాఠశాలల్లో ఇన్నాళ్లు పనిచేసిన కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. పైగా నిర్వహణ సంస్థల నుంచి కంప్యూటర్లు, జనరేటర్లు అన్నింటిని సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్వాధీనం చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఇటీవల డీఈవోలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఆయా స్కూళ్లలోని టీచర్లకు కంప్యూటర్ విద్య బోధనపై అవగాహన లేదు. పెద్దగా శిక్షణ పొందిన దాఖలాలు లేవు. దీంతో ఆ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను బోధించే వారు లేకపోవడంతో విద్యార్థులకు కంప్యూటర్ విద్య దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది. కేంద్రం 75 శాతం నిధులను అందించి 2008-09 విద్యా సంవత్సరంలో కంప్యూటర్ విద్య పథకాన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్రం 25 శాతం నిధులను వెచ్చించి 7 కంప్యూటర్ నిర్వహణ సంస్థలతో ఒప్పందాలు చేసుకొని ఇన్నాళ్లు పథకాన్ని నిర్వహించింది. ప్రస్తుతం ప్రాజెక్టు ఐదేళ్ల కాలం ఈ నెలతో పూర్తయింది. కంప్యూటర్ నిర్వహణ సంస్థల ఒప్పందాలు కూడా పూర్తయ్యాయి. దీంతో ఆ సంస్థలు కంప్యూటర్ విద్యను నిలిపివేశాయి. ఫలితంగా వాటిల్లో పని చేస్తున్న 12 వేల మంది ఇన్స్ట్రక్టర్లు ఇప్పుడు ఉద్యోగాలు వదుకోవాల్సివస్తోంది. మరోవైపు ప్రభుత్వం నిధులను వెచ్చించేందుకు సిద్ధంగా లేకపోవడంతో కంప్యూటర్ విద్య బోధనను స్కూళ్లలోని టీచర్లే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. కంప్యూటర్ నిర్వహణ సంస్థలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏటా ఆయా స్కూళ్లలోని ఐదుగురు టీచర్లకు కంప్యూటర్ విద్యా బోధనపై ఆయా సంస్థలు శిక్షణ ఇవ్వాలి. కాని టీచర్లు దానిని నేర్చుకున్న దాఖలాలు పెద్దగా లేవు. దీంతో బోధన ఎలా అనే అంశంపై ఉన్నతాధికారులే తల పట్టుకుంటున్నారు. కనీసం ఈ విద్యా సంవత్సరం ముగిసే వరకైనా రాష్ట్ర నిధులను వెచ్చించి ఇన్స్ట్రక్టర్లను కొనసాగిస్తే ఉపయోగం ఉంటుందని పేర్కొంటున్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
నాట్స్ సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం!
హార్దిక్ అద్భుతమైన ప్లేయర్.. పాక్పై కచ్చితంగా చెలరేగతాడు: రైనా
భారత్ అత్యంత పేద దేశం.. 2050 నాటికి అందరూ ధనవంతులవుతారా?
మా ఇంట్లోనే ఉన్నా.. దయచేసి ఎవరూ నమ్మొద్దు: హీరో శ్రీకాంత్
2014-22 మధ్య ఆప్ రూ. 7.08 కోట్ల విదేశీ నిధులను పొందింది: ఈడీ
ఆనంద్ దేవరకొండ 'గం గం గణేశా' ట్రైలర్ చూశారా?
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది: సమంత
శివమ్ దూబేపై వేటు.. వరల్డ్కప్ జట్టులో ఫినిషర్కు చోటు!
కేజ్రీవాల్కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
తప్పక చదవండి
- భారత్ అత్యంత పేద దేశం.. 2050 నాటికి అందరూ ధనవంతులవుతారా?
- ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
- కేజ్రీవాల్కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
- రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
- AP: పలువురు డీఎస్పీలు, సీఐలను నియమించిన ఈసీ
- యాక్షన్ ఎంటర్టైనర్గా బిగ్బ్రదర్.. రిలీజ్ ఎప్పుడంటే?
- హైదరాబాద్లో మళ్లీ దంచికొడుతున్న వాన
- ‘28 శాతం జీఎస్టీ’, సుప్రీం వైపు.. గేమింగ్ కంపెనీల చూపు
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
- ‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
Advertisement