breaking news
Committee Janmabhoomi
-
నగరి సమస్యలు పరిష్కరించరా?
► నియోజకవర్గ సమస్యలపై కలెక్టర్కి వినతి ► అధికారుల అవినీతి పెచ్చుమీరింది ► జన్మభూమి కమిటీలతో అర్హులకు ► అన్యాయం : ఎమ్మెల్యే రోజా తిరుపతి తుడా: నగరి నియోజకవర్గంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నారని, సమస్యలు పరిష్కరించకపోవడం అన్యాయమని ఎమ్మెల్యే రోజా, కలెక్టర్ సిద్ధార్థ జైన్ దృష్టికి తీసుకెళ్లారు. తిరుపతి సబ్కలెక్టర్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ సిద్ధార్థజైన్ను నగరి నియోజక వర్గ రైతులతో పాటు ఆమె కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరి నియోజక వర్గంలో సమస్యలు తాండవిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే ఆ నియోజక వర్గ సమస్యలు పరిష్కరించరా? అని ప్రశ్నించారు. విజయపురం తహశీల్దార్ అవినీతి పెచ్చుమీరిందని ఫిర్యాదు చేశారు. భూ ఆక్రమణలకు అక్రమంగా క్వారీల అనుమతులు ఇస్తున్నారని ఆమె చెప్పారు. జన్మభూమి కమిటీలతో గతంలో మాదిరే అర్హులకు అన్యాయం జరుగుతోందన్నారు. సర్పంచ్ల సంతకం లేకుండా జన్మభూమి కమిటీలు పాలనలో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. నగరి, పుత్తూరులో ఉన్న వంద పడకల ఆస్పత్రులు అంకారప్రాయంగా మిగిలాయన్నారు. రోగులకు మౌలిక వసతులు, నగరి ఆస్పత్రికి రోడ్డులేదన్నారు. కరెంట్బిల్లులు కట్టలేదని, అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ కట్ చేయడంతో చిన్నపిల్లలు ఉక్కపోతతో అల్లాడుతున్నారని చెప్పారు. గాలేరు-నగరి సీతారామపురం ప్రాజెక్ట్ కారణంగా భూములు కోల్పోయిన 14 మంది రైతులకు పరిహారం చెల్లించలేదని చెప్పారు. వీరితో పాటు నగరి - పుత్తూరు ప్రాంతంలో రోడ్లు విస్తరణ కారణంగా ఇండ్లు కోల్పోయిన వారికి ఇంత వరకు పరిహారం ఇవ్వలేదని ఆమె చెప్పారు. ఇలా నియోజక వర్గంలో అనేక సమస్యలు తాండవిస్తున్నాయని, అధికారులు స్పందించడం లేదని తెలిపారు. తక్షణం సమస్యలను పరిష్కరించాలని ఆమె విజ్ఞప్తి చేయడంతో కలెక్టర్ సిద్ధార్థ జైన్ సానుకూలంగా స్పందించారు. -
పింఛన్లు పెంచారోచ్..!
నియోజకవర్గానికి వెయ్యి వంతున జిల్లాకు 9 వేలు మంజూరు జన్మభూమి కమిటీ సూచించిన వారికే అక్టోబర్ నుంచి కొత్త పింఛన్ల అమలు విజయనగరం అర్బన్: అర్హతలున్నా సాంకేతిక కారణాలతో పింఛను అందక కొంత కాలంగా నిరీక్షిస్తున్న కొందరు లబ్ధిదారులకు ఊరట లభించనుంది. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా జిల్లాకు మరో 9 వేల పింఛన్లు మంజూరయ్యాయి. నియోజకవర్గానికి వెయ్యి పింఛన్లు చొపున వీటిని కేటాయించారు. దీంతో అయితే పింఛను దరఖాస్తులను జన్మభూమి కమిటీలు పరిశీలించి తుది జాబితాను రూపొందించి అందించాల్సి ఉంది. అన్నీ సక్రమంగా జరిగితే అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి కొత్త పింఛన్లను అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 2.40 లక్షల మందికి ఇస్తున్నారు. ఇందులో వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, చేనేత, కల్లు గీత కార్మికులు ఉన్నారు. కొత్తగా మంజూరైన 9 వేల పింఛన్లతో కలిపి 2.49 లక్షలకు చేరనుంది. అయితే గత ప్రభుత్వం హయంలో 2.79 లక్షల మందికి పింఛన్ ఇచ్చేవారు. ఈ లెక్కన పింఛన్ రద్దు చేసిన వారి సంఖ్య ఇంకా 30 వేలు దాటే ఉంది. ఇప్పటికే పింఛన్ కోరుతూ మరో 35 వేల దరఖాస్తులు అందగా వాటిలో సుమారు 25 వేల మందిని అర్హులుగా తేల్చారు. వాటిని మరోసారి పరిశీలించి అందులో ప్రాధాన్యం ప్రకారం అర్హత ఉన్న వారికి మంజూరు చేయడంతోపాటు, మిగిలిన వాటికి నూతన దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఎంపిక ప్రక్రియను సెప్టెంబర్ మొదటి వారం ముగిసేలోపు పూర్తి చేసేందుకు కసరత్తు జరుగు తోంది. జన్మభూమి కమిటీ సూచించిన వారికే ప్రస్తుతం విడుదల చేసిన నియోజకవర్గానికి వెయ్యి పింఛన్లలో మండలానికి సరాసరిన కనీసం 200 మించి దక్కే అవకాశం లేదు. గ్రామాలకు 5 నుంచి 10 మాత్రమే కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శులు రూపొందించే జాబితా ప్రాధాన్యం సంతరించుకోనుంది. అయితే ఇటీవల పంచాయతీ కార్యదర్శుల బదిలీలు భారీగా జరగడంతో, అన్ని గ్రామ పంచాయతీల్లోనూ నూతన కార్యదర్శులే ఉన్నారు. దీంతో వారి కంటే జన్మభూమి కమిటీ సభ్యులు సూచించిన వారికే పింఛను దక్కనుంది. లబ్ధిదారుడి వయస్సుతోపాటు, నిరుపేదలు, వితంతువులు, వికలాంగులు, కుటుంబ ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోనున్నారు. పెరగనున్న ఒత్తిళ్లు పింఛను సాయం కోసం నిరీక్షిస్తున్న వారు ప్రతి పంచాయతీలోను వందల సంఖ్యలో ఉండడంతో ఆధిక సంఖ్యలో పోటీ పడి రాజకీయఒత్తిళ్లు తీసుకువచ్చే అవకాశం ఉంది. దీంతో విడతల వారీగా ప్రభుత్వం మంజూరు చేస్తున్న పింఛన్లను ప్రాధాన్య క్రమంలో అందేలా చూడాల్సిన బాధ్యత క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులపై ఉంది. వారు రూపొందించిన జాబితాను అనంతరం గ్రామ, మండల స్థాయి జన్మభూమి కమిటీలు అనుమతిస్తే ఎంపీడీఓ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం డీఆర్డీఏలోని పింఛన్ల విభాగం అధికారులు మరోమారు పరిశీలించి సెర్ప్ కార్యాలయానికి నివేదిస్తారు. అక్టోబర్ నుంచి కొత్త పింఛన్ల అమలు: డీఆర్డీఏ పీడీ జిల్లాకు 9 వేల నూతన పింఛన్లు మంజూరయ్యాయి. నియోజకవర్గానికి వెయ్యి చొప్పున కేటాయించనున్నాం. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను సెప్టెంబర్ మొదటి వారం ముగిసేలోపు పూర్తిచేయనున్నాం. అక్టోబరు 1వ తేదీ నుంచి నూతన పింఛన్లు మంజూరుకానున్నాయని డీఆర్డీఏ పీడీ డిల్లీరావు తెలిపారు.