-
ఈసారి సిటీలో బతుకమ్మ ప్రత్యేకతలివే..!
ఓనం తరహాలో ఘనంగా వేడుకలు కవాడిగూడ (హైదరాబాద్ సిటీ): తెలంగాణ సాంస్కృతిక వైభవం, రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబురాలను ఈసారి కూడా నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కేరళ సంప్రదాయ పండుగ ఓనం తరహాలో ట్యాంక్బండ్ వద్ద బతుకమ్మ వేడుకను గొప్పగా నిర్వహిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 9న ట్యాంక్బండ్ వద్ద నిర్వహించే ఈ వేడుకల ఏర్పాట్లను ఆయన గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ బతుకమ్మ పండుగకు దేశవ్యాప్తంగా గొప్ప పేరుందని, అందుకు తగినవిధంగానే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ఈ సంబురాలను నిర్వహిస్తామని తెలిపారు. పెద్ద సంఖ్యలో హాజరయ్యే ప్రజలకు, మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. నగరంలో గణేష్, బక్రీద్ పండుగలు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయని, అదేవిధంగా బతుకమ్మ పండుగను సైతం ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈసారి వర్షాలు పుష్కలంగా పడినందున ప్రజలు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకొంటున్నారని అన్నారు. బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు చేపట్టేందుకు నీళ్ళు కూడా పుష్కలంగా ఉన్నాయన్నారు. వేడుకలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారిశుద్ధ్య సమస్య రాకుండా సానిటేషన్ సిబ్బంది టీమ్లు పనిచేస్తాయన్నారు. రహదారికి ఇరుపైపులా ప్రత్కేక లైటింగ్ను, మంచినీటి సౌకర్యం అందిస్తామన్నారు. 'స్వచ్ఛ భారత్- స్వచ్ఛ హైదరాబాద్'లో భాగంగా మొబైల్ మరుగుదొడ్లను ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. మహిళల రక్షణ కోసం నిఘా సిబ్బందితో పోలీసులు ప్రత్కేక భద్రతా ఏర్పాట్లు చేశారని తెలిపారు. టూరిజం శాఖ, జీహెచ్ఎంసీ సంయుక్తంగా నిర్వహించే బతుకమ్మ సంబురాలలో ప్రజలు సంతోషంగా పాల్గొనాలని ఆయన కోరారు. -
ఎన్నికల నిర్వహణకు చురుగ్గా సన్నాహాలు
► వడివడిగా ఎన్నికల నిర్వహణకు చురుగ్గా సన్నాహాలు ► కౌంటింగ్కు ఏర్పాట్లు ► జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడుతోంది. దీని కోసం అధికారులు వడివడిగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాల కల్పన.. అవసరమైన సిబ్బందిని నియమించడం వంటివి చేస్తున్నారు. మరోవైపు పోలింగ్ పూర్తయ్యాక కౌంటింగ్కు అవసరమైన కేంద్రా లు.. టేబుళ్ల ఏర్పాటు.. సిబ్బంది నియామకంలోనూ మునిగారు. ఈవీఎంలలో పొందు పరిచేందుకు బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేశారు. వీటి ప్రింటింగ్ పూర్తయిందని... గురువారం ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారి డా.బి.జనార్దన్రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం అడిషనల్ కమిషనర్ సురేంద్ర మోహన్ (ఎన్నికలు)తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో అదనపు కమిషనర్ (రె వెన్యూ) శంకరయ్య, సీసీపీ ఎస్.దేవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలివీ... 24 కేంద్రాలు.. 893 టేబుళ్లు ఫిబ్రవరి 2న పోలింగ్ జరుగనుంది. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే 4న నిర్వహిస్తారు. 5వ తేదీ ఉదయం లెక్కింపుమొదలవుతుంది. దీనికి 24 కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్కు అన్ని కేంద్రాల్లో కలిపి మొత్తం 893 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపునకు 3,200 మంది సిబ్బందిని నియమించారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖల ఉద్యోగుల కోసం పోస్టల్ బ్యాలె ట్లు పంపిణీ చేస్తున్నారు. జీహెచ్ఎంసీలోనే దాదాపు 6,500 మంది రెగ్యులర్ ఉ ద్యోగులు ఉండగా... పోస్టల్ బ్యాలెట్లకు ఇప్పటి వరకు కేవలం 2,281 మంది మాత్రమేదరఖాస్తుచేసుకున్నారు. 2,677 మంది సర్వీస్ ఓటర్లకు పోస్టు ద్వారా బ్యాలెట్ పత్రాలు పంపిణీ చేశారు.పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఇబ్బందులు ఎదురవకుండా తాగునీరు, మరుగుదొడ్లు, ఎండ తగలకుండా టెం ట్లు, వికలాంగుల కోసం ర్యాంపులు, విద్యుత్ సౌకర్యాలు సమకూరుస్తున్నా రు. ఈ పనులు ఇప్పటి వరకు 70 శాతం పూర్తయ్యాయని... మిగతావి మరో రెండు మూడు రోజుల్లో పూర్తికానున్నట్లు కమిషనర్ చెప్పారు. మొత్తం 7,802 పోలింగ్ కేంద్రాలు ఏర్పా టు చేస్తుండగా... 20 శాతం అదనంగా మొత్తం 9,352 పోలింగ్ పార్టీలను నియమించారు. (ఒక్కో పోలింగ్ పార్టీలో ఒక ప్రిసైడింగ్ అధికారి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు సిబ్బంది ఉంటారు.)పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా డేగకళ్లతో నిఘా పెడుతున్నారు. సున్నిత, అతి సున్నిత, సమస్యాత్మక పోలింగ్ కేంద్రా ల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు రెప్పవాల్చని నిఘా కోసం 1,600 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. వీరికి శిక్షణ ఇచ్చారు. వీరు లేని ప్రాంతాల్లో వెబ్ కెమెరాలను విని యోగిస్తారు. దీని కోసం 2,500 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు శిక్షణనిచ్చా రు. మెక్రో అబ్జర్వర్లలో కేంద్ర ప్రభుత్వోద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకుల ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. పోలింగ్ శాతం పెంచేందుకు ఇప్పటికే 40,60,133 మందికి ఓటరు స్లిప్పులు పంపిణీ చేశారు.ఇందులో 33.30 లక్షల మందికి తమ సిబ్బంది ఇళ్లకు వెళ్లి వ్యక్తిగతంగా అందజే యగా... వెబ్సైట్ నుంచి 3,38,377 మంది, ప్రత్యేక యాప్ ద్వారా 92,047 మంది పోలింగ్ కేంద్రాల వివరాలను డౌన్లోడ్ చేసుకున్నారని కమిషనర్ తెలిపారు. మొత్తం ఓటర్లలో 55 శాతం మంది తమ పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకున్నారని చెప్పారు. ‘సంకల్పం’ పేరిట తప్పకుండా ఓటేయాల్సిందిగా ఐదు లక్షల మందికి పైగా విద్యార్థుల ద్వారా వారి తల్లిదండ్రులకు కరపత్రాలు పంపిణీ చేశామన్నారు. ఉల్లంఘనులపై చర్యలు ఎన్నికల నిబంధనల ఉల్లంఘనులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ చెప్పారు. ఇప్పటి వరకు 1,81,794 అనధికార కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు తొలగించామన్నారు. వాహనాల్లో తరలిస్తుండగా ఇంతవరకు రూ.2,08,28,200 నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రూ.1.80 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 1,059 మంది బైండోవర్ ఇప్పటి వరకు 1,059 మందిని పోలీసులు బైండోవర్ చేశారు. 2,318 లెసైన్సు కలిగిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 511 మందిపై నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement