-
వేసవి సెలవుల్లోనూ పిల్లలు నాలుగు గోడల మధ్యే ఉన్నారా?
ఎండకాలం సెలవుల్లో కూడా పిల్లలు నాలుగు గోడల మధ్య ఉన్నారా? వారికి మీరు పాదలేపనం పూయడం లేదనే అర్థం. వారి చేతికి కథల పుస్తకం ఇవ్వండి. అందులో రాకుమారుడు వద్దన్నా ఉత్తరం వైపుకు వెళతాడు. పిల్లలూ వెళతారు. రాక్షసుడు ఉన్న చోటుకు గండభేరుండ పక్షి మీద చేరుకుంటాడు. పిల్లలూ చేరుకుంటారు. తెలివైన కొడుక్కే రాజ్యం ఇస్తానని రాజు అంటే ఆ తెలివి పుస్తకం చదివే పిల్లలకూ వచ్చి జ్ఞానరాజ్యం దక్కుతుంది. వేసవి అంటే పిల్లలకు ఆటలు పాటలతోపాటు పుస్తకం కూడా. వారి చేతి నుంచి ఫోన్ లాక్కోండి. పుస్తకం ఇవ్వండి. ఇప్పటిలా పాడుకాలం కాదు. పూర్వం ఎండాకాలం సెలవులు ఎప్పుడొస్తాయా అని పిల్లలు కాచుక్కూచునేవారు. దేనికి? ఆడుకోవచ్చు. పాడుకోవచ్చు. కాని అసలు సంగతి కథలు ఎంత సేపైనా చదువుకోవచ్చు. అందుకే ఎదురుచూపు. పక్కింటి నుంచి, ఎదురింటి నుంచి, అద్దె పుస్తకాల షాపుల నుంచి చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి, బాలజ్యోతి... ఇన్ని మేగజీన్లు... చాలక పాకెట్ సైజు పిల్లల నవలలు ‘మంత్రాల అవ్వ.. తంత్రాల తాత’, ‘భైరవ ద్వీపం’,‘కపాల మాంత్రికుడు’, ‘పేదరాశి పెద్దమ్మ’... ఇవన్నీ చదవడం... చాలనట్టు మేజిక్ ట్రిక్కుల పుస్తకాలు, లెక్కలతో చిక్కులు, సైన్లు ప్రయోగాలు, సూపర్మేన్.. స్పైడర్మేన్ కామిక్స్... వీటన్నింటిలో కూరుకుపోయేవారు... ఊహల లోకాల్లో తేలిపోయేవారు. వేసవి కాలం మండే ఎండల కాలం అందరికీ. పిల్లలకు మాత్రం కథలు చదివే కాలం. పుస్తకాల్లో మునిగే కాలం. సింద్బాద్... గలీవర్.. బాల్యంలో పుస్తకాలు చదివితే ఏమవుతుంది? సింద్బాద్.. గలీవర్ తెలుస్తారు. జీవితం అంటే ఉన్న చోటునే ఉండిపోవడం కాదని.. కదలాలని.. కొత్త ప్రపంచాలను చూడాలని... మనుషులను తెలుసుకోవాలని తెలుస్తుంది. అపాయాలు వచ్చినా విజయం వరిస్తుందనే ధైర్యం వస్తుంది. సింద్బాద్ సాహసాలు పిల్లల్ని ఉత్కంఠ రేపేలా చేస్తాయి. అతడు చేసిన సముద్ర యానాలలో ఎన్ని వింతలు. విడ్డూరాలు. సినిమా చూస్తే, గేమ్స్ చూస్తే వీలుకాని ఊహ, కల్పన చదవడం వల్ల పిల్లలకు వస్తుంది. వారి ఊహల్లో తామే సింద్బాద్లు అవుతారు. మత్స్యకన్యను చూస్తారు. రాకాసి సముద్రజీవితో తలపడతారు. ఇక గలీవర్ చేరుకునే లిల్లీపుట్ ల దేశం ఎంత వింత. చీమంత ఉన్నా వాళ్లు అందరూ కలిసి అపాయాన్ని ఎదుర్కొనాలని చూస్తారు. ఆ తర్వాత గలీవర్ మంచివాడని గ్రహిస్తారు. స్నేహితులను శత్రువులుగా పొరపడటం, శత్రువులను స్నేహితులుగా నమ్మడం ఈ పాఠాలు పిల్లలకు కథలే చెబుతాయి. అప్రమత్తం చేస్తాయి. సమయస్ఫూర్తి కథలు చదివితే సమయస్ఫూర్తి వస్తుంది. కఠినమైన సన్నివేశాలను కూడా సమయస్ఫూర్తితో దాటడం తెలుస్తుంది. మర్యాద రామన్న, బీర్బల్, తెనాలి రామలింగడు, షేక్ షిల్లీ, ముల్లా నసీరుద్దీన్, మర్యాద రామన్న వీరందరూ తమ కామన్సెన్స్ను ఉపయోగించే జటిల సమస్యలను ఛేదిస్తారు. పదహారు భాషలు తెలిసిన పండితుడు తన మాతృభాష కనిపెట్టమన్నప్పుడు తెనాలి రామలింగడు ఏం చేశాడు... ఒకే బిడ్డను ఇద్దరు తల్లులు నా బిడ్డంటే నా బిడ్డని కొట్లాడినప్పుడు మర్యాద రామన్న ఏం చేశాడు ఇవన్నీ పిల్లలకు తెలియాలి. అందుకు కథలు చదవాలి. ఇక చందమామలో చాలా కథలు పరీక్షలు పెడతాయి. ముగ్గురు వ్యక్తుల్లో ఎవరు తెలివైన వారైతే వారికి ఉద్యోగం, రాచకొలువు, సింహాసనం దక్కుతుందనుకుంటే సాధారణంగా మూడోవ్యక్తే గెలుస్తాడు. అతని తెలివి పిల్లలకు తెలుస్తుంది. నీతి– బతుకునీతి దేశదేశాల నీతి కథల భాండాగారం పిల్లల కోసం సిద్ధంగా ఉంది. మన పంచతంత్రం, అరేబియన్ నైట్స్, ఈసప్ కతలు... ఇవన్నీ నీతిగా బతకడం గురించి బతుకులో పాటించాల్సిన నీతి గురించి తెలియచేస్తాయి. బంగారు కడియం ఆశ చూపి గుటుక్కుమనిపించే పులులు, నమ్మించి మోసం చేసే గుంటనక్కలు జీవితంలో ఎదురుపడతాయని చెబుతూనే కలిసికట్టుగా ఉంటే వలను ఎగరేసుకుపోయి తప్పించుకోవచ్చని చెప్పే పావురాలను, వలను కొరికి ఉపయోగపడే స్నేహితులను చూపుతాయి. గుండె చెట్టు మీద ఉంది అని చావుతెలివి చూపి మొసలి నుంచి కాపాడుకునే కోతి పాఠం తక్కువది కాదు. నోర్మూసుకోవాల్సిన చోట నోరు మూసుకోకుండా తెరిచి ఆకాశం నుంచి కిందపడే తాబేలును చూసి ఎంతో నేర్చుకుంటారు. అత్యాశకు పోతే బంగారు గుడ్లు దక్కవని తెలుసుకుంటారు. రాకుమారుని వెంట ఎన్నో కతల్లో రాకుమారుడు సాహసాలు చేస్తాడు. పేదరాశి పెద్దవ్వ దగ్గర బస చేస్తే‘ఏ దిక్కయినా వెళ్లు కాని ఉత్తర దిక్కు మాత్రం వద్దు’ అంటుంది. రాకుమారుడు అటే వెళ్లి కష్టనష్టాలకు ఓర్చి విజయం సాధిస్తాడు. రిస్క్ అవతల కూడా అద్భుత విజయం ఉంటుంది అని ఈ కథలు చెబుతాయి. భట్టి విక్రమార్క కథలు తెగువను నేర్పిస్తాయి. ఎంతటి భయంకర మాంత్రికుణ్ణయినా ప్రాణం కనిపెట్టి తుద ముట్టించవచ్చని ఇతర కథలు చెబుతాయి. కథలు చదివిన వారి తెలివి, భాష, వకాబులరీ, ఉచ్ఛరణ... ఇవన్నీ కథలు చదవని వారి కంటే ఎక్కువ ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. స్కూళ్లు తెరిస్తే ఎలాగూ ఆ పాఠాల్లో పడక తప్పదు. నెల రోజులు దాదాపు చేతిలో ఉన్నాయి.పిల్లల్ని పుస్తకాల లోకంలోకి తోయండి. -
ఒక పుస్తకంలోని పేజీ ఏకంగా రూ.24 కోట్లకు అమ్ముడు పోయింది!!
ఇంతవరకు ప్రముఖులు, సెలబ్రిటీలు వాడిన వస్తువులు వేలంలో అధిక ధర పలుకుతాయని మనకు తెలుసు. ఇంకొంతమంది తమకు ఇష్టమైన వ్యక్తుల వస్తువులను పిచ్చి వ్యామోహంతో ఎక్కువ డబ్బులు వెచ్చించి కొనడం చూశాం. అంతేందుకు ప్రముఖుల నవలలు, పుస్తకాలు కూడా అత్యధిక ధరకు అమ్ముడవడం కూడా చూశాం. పుస్తకంలోని ఒక పేజీ కోట్లలో అమ్ముడవడం గురించి తెలుసా మీకు!. అసలు విషయంలోకెళ్తే...1984 నాటి సింగిల్ స్పైడర్ మ్యాన్ కామిక్ పేజీ వేలంలో రూ. 24 కోట్లకు అమ్ముడుపోయింది. స్పైడర్ మ్యాన్ 1962 నాటి ప్రచురణతో కామిక్ పుస్తక చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్ హీరోల పాత్రలో ఒకటి. కామిక్ పుస్తకాల సుప్రసిద్ధ రచయితలైన స్టాన్ లీ, స్టీవ్ డిట్కోచే సృష్టించబడిన ఈ పాత్ర దశాబ్దాలుగా ఇది అందరీ ఇంటి పేరుగా మారిపోయింది. అంతేకాదు చలన చిత్రాలు, వెబ్సీరీస్, యానిమేటెడ్ చిత్రాల వరకు ఈ స్పైడరమేన్ పాత్ర విస్తరిస్తూనే ఉంది. ఇటీవల డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ‘స్పైడర్మ్యాన్: నో వే హోమ్’ హిట్ అయిన విధానాన్ని బట్టి చూస్తేనే తెలుస్తుంది ఆ పాత్రకు ఉన్న ఆదరణ. అంతేగాదు కోవిడ్-19 ఆంక్షల మధ్య అభిమానులు టిక్కెట్లు కొనుక్కొని థియేటర్లలో సినిమా చూసేందుకు ఎగబడ్డారు. పైగా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అయితే ఇప్పుడూ 1984 నాటి సింగిల్ స్పైడర్ మ్యాన్ కామిక్ పుస్తకంలోని 25వ పేజీ వేలంలో ఇంత ధర పలకడంతో ఆ పాత్రకు ఉన్న ప్రజాదారణ మరోసారి తేటతెల్లం అయ్యింది. (చదవండి: ఆ చిన్నారి బరువుని చూసి డాక్టర్లే ఆశ్యర్యపోతున్నారు!..రక్త పరీక్షలు కూడా నిర్వహించలేరట !) -
‘చిన్నారుల భద్రత’ కోసం గూగుల్ కార్యక్రమం
న్యూఢిల్లీ: భారత్లో చిన్నారులకు ఇంటర్నెట్ భద్రతపై అవగాహన కల్పించేందుకు గూగుల్ తన గ్లోబల్ ‘బీ ఇంటర్నెట్ అవెసమ్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. హాస్య పుస్తక ప్రచురణలకు ప్రసిద్ధి చెందిన ‘అమర్ చిత్ర కథ’ భాగస్వామ్యంతో ఎనిమిది భారతీయ భాషల్లో ఇంటర్నెట్ భద్రతకు సంబంధించి పాఠాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ప్రకటించింది. ఇంటర్నెట్ యూజర్ల భద్రతను పెంచేందుకు మెరుగుపరిచిన ‘గూగుల్ సేఫ్టీ సెంటర్’ను ఎనిమిది భారతీయ భాషల్లో ప్రారంభించింది. భారత్లోని భద్రతా బృందంలో మానవ వనరులను కూడా గణనీయంగా పెంచినట్టు తెలిపింది. దీంతో తప్పుడు సమాచారం, మోసాలు, చిన్నారుల భద్రతకు ముప్పు, నిబంధనల ఉల్లంఘన, ఫిషింగ్ దాడులు, మాల్వేర్కు వ్యతిరేకంగా మరింత గట్టిగా పనిచేసేందుకు వీలు కలుగుతుందని పేర్కొంది. ‘‘నిత్యం ఇంటర్నెట్ పట్ల చాలా మంది తమ నమ్మకాన్ని చాటుతున్నారు. నూతన సేవలను స్వీకరిస్తున్నారు. వారి విశ్వాసాన్ని గౌరవించాల్సిన బాధ్యత మాపై ఉంది’’ అని గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్ సంజయ్గుప్తా పేర్కొన్నారు. -
ఆర్చీని చంపేస్తారా?
వీక్షణం కామిక్ పుస్తకాలు, కార్టూన్ షోల పేర్లు చెబితే పిల్లలే కాదు... పెద్దలు కూడా ఎగిరి గంతేస్తారు. ఒత్తిడి పెరిగిపోతున్న జీవితాల్లో రిలాక్సేషన్ కోసం ఉపయోగపడే మందులవి. అందుకే అందరూ వాటిని ఇష్టపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే... వాటికి వీరాభిమానులు అవుతున్నారు. ఎంతగా అంటే... ఓ కామిక్ క్యారెక్టర్ని చంపేస్తున్నామని పబ్లిషర్ చెప్పగానే, వద్దు అని గొడవ చేసేంత! ఆర్చీ ఆండ్రూస్... కామిక్ ప్రపంచంలో మార్మోగే పేరిది. దాదాపు డెబ్భై ఏళ్లుగా ఈ క్యారెక్టర్ అందరినీ ఉర్రూతలూగిస్తోంది. తన సాహసాలతో, అద్భుత విన్యాసాలతో, మంచితనంతో, హాస్యంతో పలు రకాలుగా ఆకట్టుకుంటూ వచ్చిన ఆర్చీ త్వరలో చచ్చిపోబోతున్నాడు. ఈ విషయం గురించి ఇటీవలే ఆర్చీ కామిక్స్ పబ్లిషర్, సీఈవో జాన్ గోల్డ్వాటర్ ప్రకటించారు. అంతే... తక్షణం ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అది తమకు ఎంతో ఇష్టమైన పాత్ర అని, ఆర్చీని చంపడానికి వీల్లేదని ఫోన్లు, ఉత్తరాలు, మెయిళ్లు వస్తుండటంతో షాక్ తిన్నాడు గోల్డ్వాటర్. ఏడు దశాబ్దాలుగా పుస్తకాలు, యానిమేషన్లు, టీవీ షోలు, సినిమాల రూపంలో ఆర్చీ అందరినీ అలరిస్తున్నాడు. ఇక ఇప్పటికైనా అతడి కథకి ముగింపు చెబితే మంచిదనుకున్నాడు గోల్డ్వాటర్. అందుకే ప్రస్తుతం కొనసాగుతున్న ‘లైఫ్ విత్ ఆర్చీ’ సిరీస్లో చివరి ఎపిసోడ్ని సిద్ధం చేశాడు. కానీ అభిమానుల ఒత్తిడి ఇంతగా ఉన్నప్పుడు ఆయన ఆ పని చేయగలడా అన్నదే సందేహం. చూద్దాం... ఆర్చీ ఆండ్రూస్ ఆయువు పెరుగుతుందో లేదో!
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement