breaking news
coal storages
-
విద్యుత్ కొరత రాకూడదు
సాక్షి, అమరావతి: వేసవిలో విద్యుత్ కొరత రాకూడదని, డిమాండ్కు సరిపడా విద్యుత్ను సమకూర్చుకోవడానికి అన్ని విధాలుగా సిద్ధం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. వేసవిలో విద్యుత్ డిమాండ్, రైతులకు విద్యుత్ కనెక్షన్లు, నాణ్యమైన విద్యుత్ సరఫరా తదితర అంశాలపై శుక్రవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఇంధన శాఖతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి, వేసవి డిమాండ్ అంచనాలను ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందున ఫిబ్రవరి 2వ వారం నుంచే విద్యుత్ డిమాండ్ పెరిగిందని చెప్పారు. మార్చిలో సగటున రోజుకు 240 మిలియన్ యూనిట్లు, ఏప్రిల్లో 250 మిలియన్ యూనిట్లు ఉంటుందని అంచనా వేశామని తెలిపారు. విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పవర్ ఎక్స్చ్ంజ్ (బహిరంగ మార్కెట్)లో విద్యుత్ను షార్ట్ టర్మ్ టెండర్ల ద్వారా ముందస్తుగా బుక్ చేసుకున్నామని చెప్పారు. బొగ్గు నిల్వల విషయంలో కూడా అధికారులు తగిన జాగ్రత్త వహించాలని, థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వేసవిలో విద్యుత్ కొరత కారణంగా కరెంటు కోతలనే సమస్య ఉత్పన్నం కాకూడదని స్పష్టం చేశారు. అదే నెలలో విద్యుత్ కనెక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అందించే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై ఈ సమావేశంలో సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న వారికి 1.06 లక్షల కనెక్షన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మంజూరు చేశామని సీఎంకు అధికారులు వెల్లడించారు. మార్చి నాటికి మరో 20 వేల కనెక్షన్లపైగా మంజూరు చేస్తున్నామని చెప్పారు. రైతులకు కనెక్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదన్న సీఎం.. ఇకపై ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో సర్వీసు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేస్తామని అధికారులు చెప్పారు. సరఫరాలో నాణ్యత విద్యుత్ సరఫరా నాణ్యతను పెంచాలన్న సీఎం ఆదేశాల మేరకు అనేక చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తవుతోందని తెలిపారు. మార్చి ఆఖరు నాటికి వీటిని పూర్తి చేస్తామని తెలిపారు. పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్న ఇళ్లకు వెంటనే కనెక్షన్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 2.18 లక్షలకుపైగా ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చామని, ఇళ్లు పూర్తవుతున్న కొద్దీ వాటికి శరవేగంగా కనెక్షన్లు ఇస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ కె.విజయానంద్, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ట్రాన్స్కో జేఎండీలు ఐ.పృధ్వీతేజ్, బి.మల్లారెడ్డి, డిస్కంల సీఎండీలు కె.సంతోషరావు, జె.పద్మాజనార్ధనరెడ్డి, నెడ్క్యాప్ వీసీఎండీ ఎస్.రమణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
బొగ్గు బ్లాక్లపై టీజెన్కో ఆరా
* సాధ్యాసాధ్యాల పరిశీలన * జనవరి 15 వరకు తుది గడువు * దక్కించుకునేందుకు సింగరేణి ప్రయత్నాలు సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు రద్దుచేసిన బొగ్గు బ్లాక్లపై తెలంగాణ జెన్కో ఆరా తీస్తోంది. రద్దయిన బొగ్గు బ్లాక్లకు త్వరలోనే ఈ-వేలం విధానంలో టెండర్లు పిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో ఏడింటిని విద్యుత్తురంగ సంస్థలకు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఛత్తీస్గఢ్లోని రాయగడ్, జార్ఖండ్లోని సౌత్ క్రాన్పుర, మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి, ఒడిశాలోని ఎల్బీ వాలీ, పశ్చిమ బెంగాల్లోని రాణిగంజ్, బర్జోరా బ్లాక్లను విద్యుత్తు అవసరాలకు వినియోగించాలని టెండర్ షెడ్యూల్లో నిర్దేశించింది. కొత్త విద్యుదుత్పత్తి కేంద్రాలకు భారీ మొత్తంలో బొగ్గు నిల్వలు అవసరమున్నందున ఈ బ్లాక్లను దక్కించుకునేందుకు తెలంగాణ జెన్కో ప్రయత్నాలు ప్రారంభించింది. వీటిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సంబంధిత ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే ఆయా రాష్ట్రాలకు వెళ్లి.. అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయనున్నట్లు తెలిసింది. ఈ వేలంలో పాల్గొనేందుకు జనవరి 15 వరకు కేంద్రం గడువు విధించింది. దీంతో ఈలోగా క్షేత్రస్థాయి పరిస్థితులపై అందిన నివేదికల ఆధారంగా వేలంలో పాల్గొనాలా.. వద్దా.. అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు జెన్కో వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఏపీ జెన్కో సైతం అదే ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. సుప్రీంకోర్టు బొగ్గు బ్లాకుల రద్దు నిర్ణయంతో తెలంగాణ జెన్కో ఒక బ్లాక్ను కోల్పోయింది. కరీంనగర్ జిల్లాలోని తాడిచెర్ల బ్లాక్ రద్దయిన జాబితాలో ఉంది. గతంలో దీన్ని కేంద్ర ప్రభుత్వం ఏపీ జెన్కోకు కేటాయించింది. రాష్ట్ర పునర్విభజనలో ఇది తెలంగాణ జెన్కో ఖాతాలోకి వచ్చింది. ఈ బ్లాక్ నిర్వహణ, తవ్వకాల బాధ్యతను టీజెన్కో సింగరేణి కంపెనీకే అప్పగించింది. ఈసారి కూడా అదే పద్ధతిలో బ్లాక్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సిద్ధమవుతున్న సింగరేణి మరోవైపు సింగరేణి సైతం ఈ బొగ్గు బ్లాక్లపై కన్నేసింది. తెలంగాణలో ఉన్న కోల్ బ్లాక్లన్నీ తమ సంస్థకే కేటాయించాలని నెల రోజుల కిందటే కేంద్ర ఇంధన శాఖకు లేఖ రాసింది. దీనికి తోడు మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని కోల్ బ్లాక్లు అప్పగించాలనే ప్రతిపాదనలు పంపింది. బొగ్గు ఉత్పత్తికి సంబంధించి ప్రభుత్వరంగ సంస్థల్లో సింగరేణికి అపారమైన అనుభవం ఉంది. తాజా నిబంధనల ప్రకారం విద్యుత్తు ప్లాంట్లు ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు మాత్రమే బొగ్గు బ్లాక్ల వేలంలో పాల్గొనాల్సి ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో సింగరేణి విద్యుత్తు ప్లాంట్ నిర్మిస్తుండటంతో.. ఈ వేలంలో పాల్గొనేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.