breaking news
Co -2
-
అందం మాత్రమే అర్హత కాదు
నటికి అందం మాత్రమే అర్హత కాదంటున్నారు నటి నిక్కీగల్రాణి. డార్లింగ్ చిత్రంలో కోలీవుడ్లో ఎంటరై ఆ చిత్రంలో దెయ్యంగా సహజ నటనను ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్న నిక్కీగల్రాణి ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమకు డార్లింగ్గా మారిపోయారని చెప్పవచ్చు. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ నటించిన కో-2 చిత్రం ఈ నెల 13న విడుదలకు ముస్తాబవుతోంది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఎన్నికల వాతావరణంతో వేడెక్కిన సమయంలో విడుదల కానుండడం విశేషంగానే భావించాలి. ఈ చిత్రం గురించి కథానాయకి నిక్కీగల్రాణి తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఒకే తరహా పాత్రల్లో నటించ రాదని నిర్ణయించుకున్న తనకు కో-2 చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. అందం ఒక్కటే నటికి అర్హత కాదని మంచి ప్రతిభ, శ్రమ కూడా అవసరం అని పేర్కొన్నారు. కో-2లో అలాంటి వైవిధ్యభరిత పాత్రను పోషించాననీ చెప్పారు. ఇందులో తాను పత్రికా విలేకరిగా నటించడం సరికొత్త అనుభవంగా పేర్కొన్నారు. ఈ పాత్ర కోసం నిజ జీవితంలో పత్రికా విలేకరులను చాలా సునిశితంగా పరిశీలించానని చెప్పారు. ముఖ్యంగా వారి వేష భాషలు, ప్రశ్నించే విధానం వంటి అంశాలను దగ్గర నుంచి గమనించాననీ తెలిపారు. ఇప్పటికే మార్కెట్లోకి విడుదలైన చిత్ర పాటలు ఎఫ్ఎం రేడియో, ఐ ట్యూన్స్లలో వరుసగా ప్రసారం అవుతూ మొదటి స్థానంలో కొనసాగడం సంతోషంగా ఉందన్నారు. అంతే కాదు చిత్ర విజయంపై నమ్మకం పెరిగిందనీ పేర్కొన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో విడుదలవుతున్న ఈ చిత్రం ప్రజల్లో కచ్చితంగా మార్పునకు కారణం అవుతుందన్నారు. ఎన్నికలపై అవగాహన కలిగంచే చిత్రంగా కో-2 ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాబీసింహా, ప్రకాష్రాజ్, శరవణన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఇంతకు ముందు కో వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన నిర్మాత ఎల్రెడ్ కుమార్ తన ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెర ట్ పతాకంపై నిర్మించారు. శరత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలకు ముస్తాబవుతోంది. -
వాస్తవ రాజకీయాలను ఆవిష్కరించే కో-2
కో-2 చిత్రం వాస్తవ రాజకీయాలను ఆవిష్కరిస్తుందంటున్నారు ఆ చిత్ర దర్శకుడు. కో వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన ఆర్ ఎస్ ఇన్ఫోటెయిన్మెంట్ సంస్థ అధినేత ఎల్ రెడ్ కుమార్ తాజాగా దానికి సీక్వెల్ను నిర్మిస్తున్నారు. కో-2 పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలసింహ, ప్రకాష్రాజ్, నిక్కీ గల్రాణీ, బాలా శరవణన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నవ దర్శకుడు శరత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన దర్శకుడు విష్ణువర్ధన్ చక్రి తోలేటిల వద్ద సహాయ దర్శకుడిగా పని చేశారన్నది గమనార్హం. ఈయన చిత్ర వివరాలను తెలుపుతూ చిత్రాన్ని తెరకెక్కించాలన్న నిర్ణయానికి వచ్చినప్పుడు ప్రస్తుత ట్రెండ్కు భిన్నంగా చిత్రం చేయాలని భావించానన్నారు. కో చిత్రం ఘన విజయం సాధించడంతో కో-2 చిత్రం తన బాధ్యతలను పెంచిందన్నారు. అదే విధంగా జాతీయ అవార్డు గ్రహీత నటులు బాబిసింహా, ప్రకాష్రాజ్లతో చిత్రం చేయడం అంత సులభం కాదన్నారు. నటుడు ప్రకాష్రాజ్ చిత్ర స్కిప్టును చదివి బాగుందంటూ ప్రశంసించారని తెలిపారు. ఈ చిత్రం ద్వారా ఎంనోజేమ్స్ అనే కొత్త సంగీత దర్శకుడిని పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. కో -2 నేటి రాజకీయాలను ప్రతిబింబించే విధంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు.