breaking news
cloth marchant
-
‘ఈద్ను ఇలా ఎందుకు జరుపుకోకూడదు’
తిరువనంపురం: సోమవారం దేశ వ్యాప్తంగా ప్రజలు సంతోషంగా ఈద్ పండుగ జరుపుకుంటుంటే.. కేరళ వాసులు మాత్రం సొంత ఇంటికి దూరంగా.. సహాయక శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరదల మూలానా సొంత ఇంటికి, ఊరికి దూరమయ్యారు. మరి పండుగ అంటే అందరం సంతోషంగా ఉండాలి కదా. వరద బాధితులు కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలని భావించాడు కొచ్చికి చెందిన నౌషద్. అందుకోసం అతడు చేసిన పని ప్రస్తుతం ప్రశంసలు అందుకుంటుంది. వరద బాధితులకు, అనాథ శరణాలయాలకు సాయం చేయాలన్నప్పుడు వాడేసిన బట్టలు, వస్తువులు ఇస్తూ ఉంటాం. కానీ నౌషద్ మాత్రం తన వ్యాపార నిమిత్తం తీసుకొచ్చిన కొత్త బట్టలను వరద బాధితులకు అందించి వారి ముఖాల్లో సంతోషం తీసుకొచ్చాడు. ఆ వివరాలు.. నౌషద్ కొచ్చిలో చిన్న బట్టల దుకాణం నడుపుతున్నాడు. ఈద్ పండుగ సందర్భంగా అమ్మకం నిమిత్తం కొత్త స్టాక్ తెచ్చాడు. ప్రస్తుతం కేరళ పరిస్థితి ఎలా ఉందో అందరికి తెలుసు. భారీ వర్షాలతో జనం ఉన్న చోటును వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. వరద బాధితులను ఆదుకోమంటూ సామాజిక, స్వచ్ఛంద సేవా సంస్థలు బట్టలు, ఆహార పదార్ధాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నౌషద్ వ్యాపార నిమిత్తం తెచ్చిన కొత్త బట్టలను వరద బాధితులకు అంద జేశాడు. నౌషద్ చేసిన పని ప్రస్తుతం సోషల్మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ విషయం గురించి నౌషద్ మాట్లాడుతూ.. ‘చనిపోయాక ఈ లోకం నుంచి ఏం తీసుకెళ్లం. నా లాభం కొందరి పేదల కళ్లలో సంతోషం కోసం వినియోగించాను. ఈద్ను ఇలా ఎందుకు జరుపుకోకూడదు అనిపించింది. అందుకే లాభనష్టాల గురించి ఆలోచించకుండా వ్యాపారం కోసం తెచ్చిన కొత్త బట్టలను వరద బాధితుల కోసం పంపించాను. ఈ ఈద్ నాకు సంతోషాన్ని మిగిల్చింది’ అంటున్నారు నౌషద్. ఫేస్బుక్లో పోస్ చేసిన ఈ స్టోరి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. -
బతుకుదెరువు కోసం వచ్చి మృత్యువాత
– పాముకాటుతో ప్రకాశం జిల్లావాసి మృతి పత్తికొండ టౌన్: బతుకుదెరువు కోసం ఊరూరు తిరుగుతూ దుస్తులు అమ్ముకునే ప్రకాశం జిల్లాకు చెందిన చిరువ్యాపారి గోదిన వెంకటేశ్వర్లు(44).. బుధవారం తెల్లవారుజామున పాముకాటుతో పత్తికొండలో మృతి చెందాడు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన ఇతనితోపాటు మరో నలుగురు కొన్నిరోజుల క్రితం పత్తికొండకు వచ్చారు. ఆదోనిరోడ్డులో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని వస్త్ర వ్యాపారం చేసేవారు. టీవీఎస్ మోపెడ్పై గ్రామాలకు వెళ్లి దుస్తులు అమ్మి.. రాత్రి పత్తికొండలోని అద్దె ఇంట్లో ఉండేవారు. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న వెంకటేశ్వర్లును పాము కరిచింది. వెంటనే లేచిన వెంకటేశ్వర్లు తనను ఏదో కుట్టిందని తనతో పాటు ఉన్నవారికి చెప్పడంతో వారు చూడగా పరుపులో పాము కనిపించింది. పామును వారి చంపివేశారు. వెంకటేశ్వర్లును పక్కనే ఉన్న ఒక ప్రైవేటు నర్సింగ్హోంకు తీసుకెళ్లగా వైద్యసిబ్బంది సకాలంలో స్పందించలేదు. ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే వెంకటేశ్వర్లు మృతిచెందాడు. మృతుడు వెంకటేశ్వర్లుకు భార్య రమణమ్మ, ఇద్దరు కుమార్తెలు లక్ష్మీత్రివేణి, లక్ష్మీత్రిష, ఒక కుమారుడు వెంకట గోపీచంద్ ఉన్నారు. ఆయన మృతితో వారి కుటుంబం జీవనాధారం కోల్పోయింది. పోస్టుమార్టం అనంతరం వెంకటేశ్వర్లు మృతదేహాన్ని బంధువులకు అప్పగించి.. పత్తికొండ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.