breaking news
Cleaners
-
తొక్కలో బిజెనెస్తో క్లీన్ స్వీప్..!
ఆవిష్కరణలు యూనివర్శిటీ డిగ్రీల నుంచి కాకుండా... అవసరాల నుంచే ఎక్కువగావస్తాయి అని చెప్పడానికి తాజా ఉదాహరణ ముంబైకి చెందిన సోనియా వర్మ, ఫర్హీన్. సాధారణ గృహిణులు అయిన వీరు, వాడి పారేసిన నిమ్మకాయ తొక్కలతో ఎకో ఫ్రెండ్లీ క్లీనర్స్ తయారు చేస్తూ ‘ఊర్థి’ బ్రాండ్గా సక్సెస్ అయ్యారు...ఇంటిని శుభ్రపరిచే ద్రావణాలలో ఉండే కఠినమైన రసాయనాలు ఇబ్బంది పెడుతుంటాయి. ఎలర్జీకి కారణం అవుతాయి. వీటికి ప్రత్యామ్నాయంగా సోనియా వర్మ, ఫర్హీన్ అలీల ఆవిష్కరణ సూపర్హిట్ అయింది. ‘ఊర్థి’ బ్రాండ్గా ఫేమ్ అయింది.ఇల్లే ప్రయోగశాలగా...సోనియ, ఫర్హీన్లు కొన్ని సంవత్సరాల క్రితం ముంబైలోని ఒక హోమ్స్కూల్ కమ్యూనిటీ ద్వారా స్నేహితులు అయ్యారు. ఇద్దరికీ ఒకే రకమైన ఆసక్తులు ఉన్నాయి.వివిధ విషయాలకు సంబంధించి ‘ఇలా కాకుండా అలా ఉంటే ఎలా ఉంటుంది!’ అని మాట్లాడుకునేవారు. ఇంటిని శుభ్రపరిచేటప్పుడు గృహిణులు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి ఒకసారి మాట్లాడుకున్నారు.‘కఠినమైన రసాయనాలు లేని క్లీనర్స్ తయారు చేస్తే ఎలా ఉంటుంది?’ అనే ఆలోచనల్లో నుంచి పుట్టిందే... ఊర్థి. వారి ఆలోచనలకు ఇల్లే ప్రయోగశాలగా మారింది.స్వచ్ఛమైన ప్రత్యామ్నాయంఎలక్ట్రానిక్స్లో ఇంజినీరింగ్ చేసిన ఫర్హీన్ కుటుంబ బాధ్యతల వల్ల ఇంటికే పరిమితం అయింది. అయినప్పటికీ బయోఎంజైమ్లతో రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉండేది. తన కుటుంబ సభ్యులు నిర్వహించే కేబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారం నుంచి తప్పుకొని ఇంటి బాధ్యతలకే పరిమితం అయింది సోనియా వర్మ. ఫర్హీన్ తో పరిచయం ఆమెను ప్రయోగాల దిశలోకి తీసుకెళ్లి ‘ఊర్థి’ రూపంలో స్వచ్ఛమైన ప్రత్యామ్నాయాన్ని అందించేలా చేసింది. ‘మేము ప్రయోగాలు చేయడానికి డ్రమ్ములు, విశాలమైన స్థలం అవసరం. ఎలా? అని ఆలోచిస్తున్నప్పుడు తన ఇంటి టెర్రస్ను వాడుకోవచ్చు అని ఫర్హీన్ చెప్పింది. అలా టెర్రస్పై మా ప్రయోగాలు మొదలయ్యాయి’ అంటుంది సోనియ.రెండు డ్రమ్ములతో మొదలై...రెండు డ్రమ్ములతో మొదలైన ప్రయోగాలు సఫలం అయ్యాయి. ఆ తరువాత వేరే చోట స్థలం తీసుకొని డజన్ల కొద్దీ్ద డ్రమ్ములతో ఫెర్మెంటేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. స్థానికంగా జ్యూస్ అమ్మే వారి నుండి నిమ్మపండ్ల తొక్కలు సేకరిస్తారు. నిమ్మజాతి పండ్ల తొక్కలు, బెల్లం, నీటి మిశ్రమాన్ని సుమారు మూడు నెలలపాటు గాలి చొరబడని డబ్బాలలో ఉంచుతారు. అది పులిసిపోయి సహజమైన క్లీనర్గా మారేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.‘పులియబెట్టిన తరువాత బయటకు వచ్చే ద్రవంలో మంచి బ్యాక్టీరియా, ఎంజైములు ఉంటాయి. ఆ ఎంజైములు ఉత్ప్రేరకాలుగా పనిచేసి మురికిని తొలగిస్తాయి’ అంటుంది ఫర్హీన్.‘ఊర్థి’ అనేది ఇప్పుడు నలభైకి పైగా ఫెర్మెంటేషన్ యూనిట్లుగా విస్తరించింది. ఈ యూనిట్లలో రకరకాల నేచురల్ క్లీనింగ్ ప్రాడక్ట్స్ను తయారు చేస్తున్నారు.‘మేము తొలి అడుగులు వేసినప్పుడు మా దగ్గర ఎలాంటి ప్రాజెక్ట్ రిపోర్ట్గానీ, బిజినెస్ ΄్లాన్గానీ లేదు. ఏది సరిౖయెనది అనిపించిందో అదే చేయడం ప్రారంభించాం. ఆ తర్వాత వాటంతట అవే చక్కబడ్డాయి’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది సోనియా. ఎకోఫ్రెండ్లీ బయో ఎంజైమ్లుచాలా రసాయన క్లీనర్లు వాడిన తరువాత మురికి కాలువల్లోకి, నదుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. దీనికి భిన్నంగా ‘ఊర్థి’ క్లీనర్స్ కాలువల్లోకి వెళ్లినప్పుడు అక్కడ కూడా సేంద్రియ వ్యర్థాలను (ఆర్గానిక్ వేస్ట్) విచ్ఛిన్నం చేస్తూనే ఉంటాయి. నీటి వ్యవస్థను కూడా శుభ్రం చేస్తాయి. అనేక రకాల మేలు చేసే సూక్ష్మజీవులను చంపే కఠినమైనక్రిమిసంహారకాల వలే కాకుండా ఊర్థిలోని బయో ఎంజైమ్లు పర్యావరణంలోని ఉపయోగకరమైన సూక్ష్మజీవులు జీవించడానికి వీలు కల్పిస్తాయి.– సోనియ, ఫర్హీన్ -
క్లీనర్ సహాయంతో ఫిక్సింగ్
న్యూఢిల్లీ: ఐపీఎల్లో కొత్త తరహా ఫిక్సింగ్కు ప్రయత్నం జరిగినట్లు తేలింది. ఇందు కోసం బుకీలు మైదానంలోనే పని చేసే క్లీనర్ను ఉపయోగించుకున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) చీఫ్ షబ్బీర్ హుస్సేన్ వెల్లడించారు. మంగళవారం నిరవధికంగా వాయిదా పడిన లీగ్లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్షా కోట్లా మైదానంలోనూ మ్యాచ్లు జరిగాయి. మ్యాచ్లు జరిగే సమయంలో మైదానాన్ని శుభ్రపరిచే సిబ్బందికి అక్రిడేషన్ కార్డులు జారీ చేశారు. ఇలా అధికారికంగా కార్డు పొందిన ఒక వ్యక్తి మ్యాచ్ జరుగుతున్న సమయంలో బుకీలతో మాట్లాడుతున్నట్లుగా పోలీసులు అనుమానించారు. స్టేడియంలో ఒక మూలన అతడిని చూసి పోలీసులు ప్రశ్నించగా తన గర్ల్ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్లు చెప్పాడు. అదే నంబర్కు మళ్లీ డయల్ చేయమని అడగ్గా, ఆ వ్యక్తి సరిగ్గా సమాధానమివ్వలేదు. అతడిని పట్టుకునే లోపే రెండు ఫోన్లను వదిలేసి పారిపోయాడు. మ్యాచ్ జరుగుతున్న అసలు సమయానికి, టీవీలో ప్రసారానికి మధ్య క్షణకాలపు విరామం ఉంటుంది. దీనిని వాడుకొని ప్రతీ బంతికి ఫిక్సింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే మరో కేసు విచారణ సందర్భంగా ఐపీఎల్ దొంగ అక్రిడేషన్లు పొందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు కేసులను ఒక చోటికి చేర్చి దీనిపై çపూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని షబ్బీర్ హుస్సేన్ చెప్పారు. -
9 నెలలుగా జీతాల్లేవ్!
సౌదీలో భారత మహిళల కష్టాలు దుబాయ్: దేశం కాని దేశానికి వలస వెళ్లిన భారత మహిళలు.. చేసిన పనికి నెలల తరబడి జీతాలు అందక అష్టకష్టాలు పడుతున్నారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని ఒక ఆస్పత్రిలో క్లీనర్లుగా పని చేస్తున్న 11 మందికి తొమ్మిది నెలలుగా జీతాలు అందట్లేదు. ఈ విషయంపై తాము భారత ఎంబసీకి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదని కేరళకు చెందిన ఆ మహిళలు వాపోయారు. భారత్కు చెందిన వారిపై ఆస్పత్రి వర్గాలు వివక్ష చూపిస్తున్నాయని, ఇతర దేశాల పనివార్లకు జీతాలు చెల్లిస్తూ తమకు మాత్రమే నిలిపివేశారని వారు ఆరోపించారు. సెలవులపై స్వదేశాలకు వెళ్దామన్నా తమను ఇక్కడకు తీసుకొచ్చిన కంపెనీ అనుమతి ఇవ్వడంలేదన్నారు. ఆదివారం నుం చి తాము విధులకు హాజరు కావడంలేదని, జీతాలు చెల్లించిన తర్వాతే మళ్లీ పని చేస్తామని చెప్పారు. దీనిపై భారత ఎంబసీ అధికారులు స్పందిస్తూ.. ఈ విషయానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చి ఆస్పత్రి యజమానులతో, సౌదీ అధికారులతో చర్చలు జరుపుతున్నామన్నారు


