breaking news
Civilian injured
-
మానవ బాంబు విధ్వంసం.. 50 మంది దుర్మరణం
బాంబు దాడులతో అప్ఘనిస్తాన్ అట్టుకుడుతోంది. తాజాగా అప్ఘన్ రాజధాని కాబూల్లో మరోసారి బాంబు దాడి జరిగింది. కాబూల్లోని ఖలీఫా సాహిబ్ మసీదులో మానవ బాంబు తనను తాను పేల్చుకోవడంతో 50 మందికి పైగా మృతించెందారు. మరో వందమంది గాయపడ్డారు. వివరాల ప్రకారం.. పవిత్ర రంజాన్ మాసంలో ప్రజలనే లక్ష్యంగా చేసుకుని అప్ఘనిస్తాన్లో వరుస బాంబు దాడులు జరుగుతున్నాయి. కాగా, రంజాన్ మాసంలో చివరి శుక్రవారం కావడంతో ఖలీపా సాహిబ్ మసీదులో ప్రజలు ప్రార్థనలు చేసుకుంటున్నారు. నమాజ్ ముగుస్తుందన్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా మసీదులో భయానక వాతావరణం చోటుచేసుకుంది. ఎక్కడ చూసినా శవాలు, క్షతగాత్రులే కనిపించారని స్థానికులు తెలిపారు. అప్పటికే ప్రార్ధన చేస్తున్నవారిలో కలిసిపోయిన మానవబాంబు తనను తాను పేల్చుకోవడంతో ఈ ఘోరం జరిగిందని వెల్లడించారు. కాగా, ఈ మానవ బాంబుకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటన చేయలేదు. గతవారం మజర్ ఈ షెరీఫ్ పట్టణంలోని ఓ మసీదుపై జరిగిన బాంబు దాడిలో 33 మంది మరణించిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: ఉక్రెయిన్కు స్పీడుగా సహాయం -
పాక్ కాల్పులు : జమ్ము పౌరుడికి తీవ్ర గాయాలు
జమ్మూ : పాకిస్థాన్ తరచుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తన తెంపరితనాన్ని చాటుకోంటుంది. తాజాగా శుక్రవారం ఉదయం సాధారణ నియంత్రణ రేఖపై పాక్ సైన్యం విచక్షణరహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో జమ్మూ కాశ్మీర్కు చెందిన ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రుడు మహమ్మద్ అష్రాఫ్గా గుర్తించినట్లు తెలిపారు. అతడిని ఆసుపత్రికి తరలించామని చెప్పారు. క్షతగాత్రుడిది పూంచ్ జిల్లాలోని బసోని గ్రామానికి చెందిన వాడని పేర్కొన్నారు. అయితే పాక్ ఈ రోజు ఉదయం నుంచే కాల్పులు ప్రారంభించిందని.. వెంటనే అప్రమత్తమైన భారత్ సైన్యం కూడా ఎదురు కాల్పులకు దిగిందన్నారు. ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయని ఉన్నతాధికారులు వెల్లడించారు.