breaking news
Cincinati
-
స్వియాటెక్ సాధించె... విజేతగా అల్కరాజ్.. యూఎస్కు పయనం
సిన్సినాటి (ఒహాయో): ఎట్టకేలకు ఏడో ప్రయత్నంలో పోలాండ్ టెన్నిస్ స్టార్, ప్రపంచ మూడో ర్యాంకర్ ఇగా స్వియాటెక్ సిన్సినాటి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో తన లక్ష్యాన్ని చేరుకుంది. గతంలో ఆరుసార్లు ఈ టోర్నీలో ఆడిన స్వియాటెక్ సెమీఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. అయితే ఏడో ప్రయత్నంలో మాత్రం స్వియాటెక్ చాంపియన్గా అవతరించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో స్వియాటెక్ 7–5, 6–4తో ప్రపంచ ఏడో ర్యాంకర్ జాస్మిన్ పావోలిని (ఇటలీ)పై గెలిచింది.1 గంట 49 నిమిషాలపాటు జరిగిన ఈ తుదిపోరులో స్వియాటెక్ తొమ్మిది ఏస్లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్లు చేసింది. తన సర్వీస్ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. స్వియాటెక్ కెరీర్లో ఇది 24వ సింగిల్స్ టైటిల్కాగా... ఈ ఏడాది వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీ టైటిల్ తర్వాత రెండోది.విజేతగా నిలిచిన స్వియాటెక్కు 7,52,275 డాలర్ల (రూ. 6 కోట్ల 54 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు, రన్నరప్ పావోలినికి 3,91,600 డాలర్ల (రూ. 3 కోట్ల 40 లక్షలు ) ప్రైజ్మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.విజేత అల్కరాజ్ సిన్సినాటి ఓపెన్ ఏటీపీ–1000 టోర్నీలో స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ విజేతగా నిలిచాడు. ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ)తో జరిగిన ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ అల్కరాజ్ 5–0తో గెలిచాడు. తొలి సెట్లో 0–5తో వెనుకబడిన దశలో అనారోగ్యం కారణంగా సినెర్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు.ఇక టైటిల్ నెగ్గిన అల్కరాజ్కు 11,24,380 డాలర్ల (రూ. 9 కోట్ల 78 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సినెర్కు 5,97,890 డాలర్ల (రూ. 5 కోట్ల 20 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఓవరాల్గా ఈ ఏడాది అల్కరాజ్కిది ఆరో టైటిల్కాగా, కెరీర్లో 22వది కావడం విశేషం.ఒకే విమానంలో..ఇదిలా ఉంటే.. సిన్సినాటి ఓపెనర్ టైటిల్స్ గెలిచిన తర్వాత స్వియాటెక్, అల్కరాజ్ కలిసి ఒకే విమానంలో న్యూయార్క్కు బయలుదేరారు. యూఎస్ ఓపెన్లో విజేతలుగా నిలవడమే లక్ష్యంగా అమెరికాలో అడుగుపెట్టారు. వీరిద్దరు ఒకే విమానంలో ప్రయాణిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.Iga Swiatek and Carlos Alcaraz sharing a plane to New York. 🗽Cincinnati champions ready for the US Open.Love this. ❤pic.twitter.com/nLD6KMnHJd— The Tennis Letter (@TheTennisLetter) August 19, 2025 -
వీనస్ విలియమ్స్ అవుట్
సిన్సినాటి (ఒహాయో): గత నెల టెన్నిస్ సర్క్యూట్లోకి పునరాగమనం చేసిన అమెరికన్ దిగ్గజం వీనస్ విలియమ్స్కు సిన్సినాటి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో చుక్కెదురైంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఆమె 4–6, 4–6తో స్పెయిన్కు చెందిన బౌజస్ మనీరో చేతిలో వరుస సెట్లలో పరాజయం చవిచూసింది.ఈ ఏడాది ఆఖరి గ్రాండ్స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్లో బరిలోకి దిగేందుకు సిద్ధమైన వీనస్ సన్నాహకంగా ఈ హార్డ్కోర్ట్ టెన్నిస్ టోర్నీలో ఆడింది. 7 గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిళ్లు, 14 డబుల్స్ టైటిళ్లు నెగ్గిన అమెరికన్ వెటరన్ స్టార్కు స్వదేశంలోని యూఎస్ ఓపెన్ నిర్వాహకులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. 45 ఏళ్ల అమెరికన్ నాలుగు (వింబుల్డన్–2000, 2001; యూఎస్ ఓపెన్ 2000, 2001) గ్రాండ్స్లామ్ టైటిల్స్ గెలిచేనాటికి బౌజస్ మనీరో పుట్టనేలేదు.తాజాగా 51 ర్యాంకర్ మనీరో వరుస సెట్లలోనే ఓ దిగ్గజ ప్లేయర్కు ఇంటిదారి చూపింది. మ్యాచ్ ముగిసిన తర్వాత 22 ఏళ్ల స్పెయిన్ అమ్మాయి నిజంగానే అద్భుతంగా ఆడిందని వీనస్ కితాబు ఇచ్చింది. సిన్సినాటిలో ఆమె బరిలోకి దిగడం ఇది 11వ సారి! టైటిల్ గెలవనప్పటికీ 2012లో సెమీస్, 2019లో క్వార్టర్స్ చేరింది. ఈ నెల 19 నుంచి జరిగే యూఎస్ ఓపెన్లో వీనస్ సింగిల్స్తో పాటు మిక్స్డ్ డబుల్స్ బరిలోనూ దిగుతోంది. మిక్స్డ్లో సహచర క్రీడాకారుడు రీలి ఒపెల్కాతో జతకట్టింది.సూపర్ షెల్టన్టొరంటో: అమెరికా రైజింగ్ టెన్నిస్ స్టార్ బెన్ షెల్టన్ తన కెరీర్లోనే గొప్ప టైటిల్ సాధించాడు. నేషనల్ బ్యాంక్ ఓపెన్ టొరంటో ఏటీపీ మాస్టర్స్–1000 టోరీ్నలో ప్రపంచ ఆరో ర్యాంకర్ షెల్టన్ విజేతగా నిలిచాడు.ఫైనల్లో షెల్టన్ 6–7 (5/7), 6–4, 7–6 (7/3)తో ప్రపంచ 12వ ర్యాంకర్ కరెన్ ఖచనోవ్ (రష్యా)పై విజయం సాధించాడు. 2 గంటల 47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో షెల్టన్ 16 ఏస్లు సంధించి, 6 డబుల్ ఫాల్ట్లు చేశాడు. తన సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. విజేత షెల్టన్కు 11,24,380 డాలర్ల (రూ. 9 కోట్ల 84 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
నదులు ఎండిపోతున్నాయ్!
నదులు మానవాళి పాలిట జీవనాడులు. నది లేకపోతే జీవమే లేదు. అలాంటి నదులు ప్రస్తుతం తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 లక్షల నదులు విపరీతమైన మార్పులకు లోనవుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ మార్పులు ఇలాగే కొనసాగితే తాగడానికి నీరు దొరకదని, మరోవైపు విపరీతమైన వరదలను ఎదుర్కోవాల్సి వస్తుందని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు. ఇవీ ప్రమాదాలు...మరికొద్ది కాలంలో ప్రపంచంలోని అనేక నదుల్లో అతి స్వల్ప పరిమాణంలో నీరు అందుబాటులో ఉందని నివేదిక పేర్కొంది. → అవి నెమ్మదిగా దుమ్ము, చిన్న రాళ్ళతో కూడిన అవక్షేపంగా మారిపోతాయని హెచ్చరించింది. → ఫలితంగా దీంతో తాగడానికి, పంటలకు, పశువులను పోషించడానికి మంచి నీటి కొరత ఏర్పడుతుందని అధ్యయన సారథి, హైడ్రాలజీ ప్రొఫెసర్ డోంగ్మే ఫెంగ్ తెలిపారు. → నదులు భూమికి రక్తనాళాల వంటివని, అవి ప్రవహించే తీరులో మార్పులు మనపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఫెంగ్ హెచ్చరించారు.క్షీణిస్తున్న నదులు భూమిపై నదులు లోనవుతున్న మార్పులపై సిన్సినాటీ విశ్వవిద్యాలయం అధ్యయనం చేసింది. శాటిలైట్ డేటా, కంప్యూటర్ మోడలింగ్ పరిజ్ఞానంతో పలువురు శాస్త్రవేత్తలు 35 ఏళ్లుగా భూమిపై ప్రతి రోజూ ప్రతి నది నీటి ప్రవాహాన్ని మ్యాపింగ్ చేశారు. ఇందులో వెల్లడైన విషయాలు వారిని దిగ్భ్రాంతికి గురి చేశాయి. ప్రపంచంలోని అతి పెద్ద నదుల్లోని సగం నదుల్లో నీటి ప్రవాహం అతి వేగంగా తగ్గుముఖం పడుతోంది! ఈ తగ్గుదల వేగం కొన్నింట్లో ఏటా 5 శాతముంటే మరికొన్నింట్లో ఏకంగా 10 శాతం దాకా ఉన్నట్టు అధ్యయనం తేల్చింది. ఇది చాలా వేగవంతమైన మార్పని హెచ్చరించింది. ఆఫ్రికాలోని రెండో అతి పెద్ద నది కాంగో, చైనాలో ప్రముఖ నది యాంగ్జీ, దక్షిణ అమెరికాలోని ప్లాటా వంటి నదులైతే ఇప్పటికే గణనీయంగా క్షీణించిపోయాయి. ముంచుకొస్తున్న వరద ముప్పు ఇక పర్వత ప్రాంతాల్లోని పలు చిన్న నదుల పరిస్థితి భిన్నంగా ఉంది. వాటిలో ప్రవాహం 17 శాతం పెరిగింది. హిమాలయాల వంటి ప్రాంతాల్లో జలవిద్యుత్ ప్రణాళికలు ఊహించని ప్రమాదాలు తెచ్చి పెడుతున్నాయి. అవక్షేపం దిగువకు రవాణా అవుతోంది. ఇది వరదలను తీవ్రతరం చేస్తోంది. గత 35 ఏళ్ల కాలంలో ఎగువ ప్రాంతాల్లోని ఇలాంటి చిన్నాచితకా నదుల వల్ల భారీ వరదలు ఏకంగా 42 శాతం పెరిగాయని అధ్యయనంలో తేలింది. వాతావరణంలో అధిక మార్పులు, నదీ ప్రవాహాలకు మానవులు అంతరాయం కలిగించడం వంటివే ఇందుకు కారణమని సివిల్ అండ్ ఎని్వరాన్మెంటల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ కోలిన్ గ్లీసన్ చెప్పారు. ‘‘ఈ వాతావరణ మార్పులు ప్రధానంగా మానవ కార్యకలాపాలు, శిలాజ ఇంధనాల వల్ల ఏర్పడ్డ వాతావరణ సంక్షోభమే. వాటివల్ల వర్షపాత పరిస్థితులు మారుతున్నాయి. మంచు కరిగి రేటు వేగవంతం అవుతోంది. స్తోందని, ఫలితంగా వరదలు ముంచెత్తుతున్నాయి’’ అని ఆయన వివరించారు. ‘‘పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో దుర్భర కరువు, మరికొన్ని ప్రాంతాల్లో కనీవినీ ఎరగని వరదలు పరిపాటిగా మారే రోజు దూరంలో లేదు’’ అన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికాలో కాల్పుల కలకలం..
-
అమెరికాలో కాల్పుల కలకలం..
సిన్సినాటీ నైట్ క్లబ్లో కాల్పులు ⇒ ఒకరు మృతి.. మరో 15 మందికి గాయాలు ⇒ లాస్వేగాస్లో బస్సులో కాల్పులు.. ఒకరి మృతి సిన్సినాటీ(అమెరికా): అమెరికాలో తుపాకీ సంస్కృతి మరోసారి విజృంభించింది. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడటంతో ఇద్దరు మరణించగా.. మరో 16 మంది గాయాలపాలయ్యారు. సిన్సినాటీ లోని కేమియో నైట్ క్లబ్లో ఆదివారం తెల్లవారుజామున 1.30 గంటల సమయం లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. వీకెండ్ కావడంతో కిక్కిరిసిన నైట్క్లబ్లో ఒక్కసారిగా కాల్పులు జరపడంతో ఒకరు మరణించగా.. 15 మంది గాయపడ్డారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాద సంబంధాలు లేవని అసిస్టెంట్ పోలీస్ చీఫ్ పాల్ న్యూడిగేట్ చెప్పారు. కాల్పులకు గల కారణాలు తెలియలేదని, దీనిపై దర్యాప్తు జరుపుతున్నా మన్నారు. ఈ ఘటనకు సంబంధించి నింది తులెవరినీ పోలీసులు అరెస్ట్ చేయలేదన్నారు. కాల్పులకు పాల్పడింది ఒకే దుండగుడని సమాచారం అందిందని, ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా అనే దానిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. కాల్పుల్లో మరణించిన వ్యక్తి ఎవరనేది గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. నైట్ క్లబ్లో సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తామని పోలీసులు చెపుతున్నారు. బస్సులో ఘాతుకం.. అమెరికాలో టూరిస్ట్ స్పాట్ లాస్వేగాస్లో మరో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఓ దుండగుడు తుపాకీతో బస్సులోకి ప్రవేశించి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరొకరు గాయపడ్డారు. అనంతరం దుండగుడు పోలీసులకు లొంగిపోయాడు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో కాస్మోపాలిటన్ హోటల్ క్యాసినో సమీపంలో డబుల్ డెక్కర్ బస్సులోకి ప్రవేశించిన దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. హైడ్రామా నడిచిన తర్వాత సుమారు 3.30 గంటల సమయంలో దుండగుడు తన వద్ద ఉన్న హ్యాండ్ గన్తో పాటు లొంగిపోయాడని లాస్వెగాస్ పోలీస్ అధికారి ల్యారీ హాడ్ఫిల్డ్ చెప్పారు. ఒకే వ్యక్తి ఉండటంతో దీనికి ఉగ్రవాద సంబంధాలు ఉండే అవకాశాలు లేవని చెప్పారు. -
అమెరికా నైట్క్లబ్లో కాల్పులు
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపుతున్నాయి. అమెరికా సిన్సినాటీలోని ఓ నైట్క్లబ్లో శనివారం అర్ధరాత్రి కాల్పులు చోటుచేసుకున్నాయి. నైట్క్లబ్లో ఆనందంతో కేరింతలు కొడుతున్న వారిపై ఓ సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్టు సమాచారం. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో 13 మంది గాయపడ్డారని స్థానిక అమెరికా మీడియా తెలిపింది. సిన్సినాటీ నగరంలోని కెల్లోగ్ అవెన్యూలో ఉన్న కేమియో క్లబ్లో ఈ కాల్పులు చోటుచేసున్నాయి. ఈ కబ్ల్ నుంచి క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.