breaking news
chintalkunta check post
-
చింతల్కుంట చెక్పోస్టు వద్ద లారీ బీభత్సం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చింతల్గుంట చెక్పోస్ట్ వద్ద మంగళవారం ఓ లారీ బీభత్సం సృష్టించింది. లోడ్తో వెళ్తున్న లారీ చెక్పోస్టు వద్ద మరో వాహనాన్ని తప్పించబోయి ఆటోను ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పిన లారీ పక్కనే ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. గుడిసెలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఆటో, కారు ధ్వంసమయ్యాయి. -
చింతల్కుంటలో భారీ ట్రాఫిక్ జాం
హైదరాబాద్: ఎల్బీనగర్ చింతల్ కుంట చెక్ పోస్ట్ వద్ద ప్లై ఓవర్ కోసం తీసిన గుంతలో పడి మృతి చెందిన రాఘవేందర్, గాయపడిన అశోక్, సాయి కిరణ్ కుటుంబాలకు న్యాయం చేయాలంటూ బాధితుల బంధువులు ఆందోళన చేపట్టారు. మధ్యాహ్నం నుంచి జాతీయరహదారిపై వారు చేపట్టిన రాస్తారోకోతో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సోమవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో మృతుడు, క్షతగాత్రులు బడంగ్ పేట్ కు చెందిన వారిగా గుర్తించారు. బాధితులు ఒవైసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిరసన తెలుపుతున్న బాధితుల కుటుంబీకులకు విద్యార్థి సంఘాల వారు మద్దతు తెలిపారు.