breaking news
china Intelligence organization
-
‘భారత్ రహస్యాలు లీక్; ఢిల్లీ జర్నలిస్ట్ అరెస్టు’
న్యూఢిల్లీ : భారత్కు చెందిన సున్నతమైన సమాచారాన్ని చైనా ఇంటెలిజెన్స్కు చేరవేసిన కేసులో మరో ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందుతుల్లో ఢిల్లీ జర్నలిస్టు రాజీవ్ శర్మ అనే వ్యక్తి తోపాటు చైనా మహిళ ఉన్నారు. చైనాకు చెందిన గూఢచారి ఏజెన్సీలతో భారత రహస్య రక్షణ పత్రాలను పంచుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రాజీవ్ శర్మను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ విచారించిన అనతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి పెద్ద మొత్తంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (జాతీయ భద్రతకు సంబంధించిన డేటా హ్యాక్..!) Freelance journalist Rajeev Sharma (pic 1) arrested under Official Secrets Act for passing sensitive information to Chinese intelligence. A Chinese woman & her Nepalese associate also arrested for paying him large amounts of money routed through shell companies: Delhi Police pic.twitter.com/8cDHbwcFtB — ANI (@ANI) September 19, 2020 పోలీసుల వివరాల ప్రకారం.. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా పనిచేస్తున్న న్యూఢిల్లీలోని పితమ్పురాకు చెందిన రాజీవ్ శర్మ విలేఖరి ముసుగులో చైనా గూఢచారిగా పనిచేస్తూ దేశ రహస్యాలను చైనాకు లీక్ చేస్తున్నాడు. అందుకోసం అతడికి, చైనాకు చెందిన మహిళకు పెద్ద ఎత్తున డబ్బులు అందుతున్నాయి. ఈ కేసుపై విచారణ జరుగుతుందని.. విచారణ క్రమంలో పూర్తి వివరాలు వెలుగుచూస్తాయని పోలీసులు తెలిపారు. కాగా రాజీవ్ శర్మను ముందుగా సెప్టెంబర్ 14న స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేసి.. సెప్టెంబర్ 15 కోర్టులో హాజరుపరిచారు. అతడిని ఆరు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అప్పగించింది. (టిక్టాక్, వీచాట్ల బ్యాన్.. చైనా స్పందన) -
అమెరికా గూఢచర్య విమానాలకు నెహ్రూ అనుమతిచ్చారు!
వాషింగ్టన్: భారత వైమానిక స్థావరాన్ని ఉపయోగించుకుని చైనాపై గూఢచర్యం జరిపేందుకు అమెరికా గూఢచర్య సంస్థ (సీఐఏ)కు 1962లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అనుమతినిచ్చారట. చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్ ఓటమిపాలైన తర్వాత అమెరికాతో ఈ మేరకు ఒప్పందం కుదిరిందట. సీఐఏ రహస్య జాబితా నుంచి తొలగించిన అధికారిక పత్రాలను ఈ మేరకు నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్స్ సంస్థ శుక్రవారం బయటపెట్టింది. 400 పత్రాల సీఐఏ నివేదికను సమాచార స్వాతంత్య్ర చట్టం కింద పొందినట్లు తెలిపింది.దీని ప్రకారం... చైనా భూభాగంపై సీఐఏకు చెందిన యూ-2 గూఢచర్య విమానాలతో గూఢచర్యం జరిపేందుకు 1962, నవంబర్ 11న నెహ్రూఆమోదం తెలిపారు. ఒడిశాలోని చార్బాటియా వైమానిక స్థావరంలో యూ-2 విమానాలు ఇంధనం నింపుకునేందుకు, చైనా సరిహద్దుల్లో భారత గగనతలంపై ఎగిరేందుకు నెహ్రూ అనుమతించారు. 1963లో అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ, భారత రాష్ట్రపతి ఎస్.రాధాకృష్ణన్ల మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. కానీ భారత్ జాప్యం చేయడంతో చివరికి థాయిలాండ్ నుంచి చైనాపై అమెరికా గూఢచర్యాన్ని ప్రారంభించింది. అయితే 1964లో నెహ్రూ మరణించడంతో భారత్ నుంచి ఈ గూఢచర్య కార్యకలాపాలు మరింత వాయిదాపడ్డాయి.