-
‘జలయుక్త' లో అంతా బోగస్సే
షోలాపూర్ జల నిపుణుడు ప్రఫుల్లా పటేల్ షోలాపూర్: షోలాపూర్ జిల్లాలోని చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం (జలయుక్త శివారు) పర్యవేక్షించడానికి వచ్చిన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను కలెక్టర్ సహా ఉన్నతాధికారులంతా మోసగించారని సాంగోళాకు చెందిన జల నిపుణుడు ప్రఫుల్లా పటేల్ ఆరోపించారు. శనివారం విలేకరు సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిని ఈ విషయంలో పక్కదారి పట్టించారని, దీనికి సంబంధించిన నివేదికను సీఎంవోకు పంపానని చెప్పారు. ‘జిల్లాలో జలశివారు ప్రోగ్రాం ద్వారా చేపట్టిన పనులను సందర్శించేందుకు సీఎం వచ్చారు. సాంగోళా తాలూకా మంగేవాడిలో సిమెంట్తో నిర్మించిన చెరువును ఆయనకు చూపించారు. అందులో 22.06 టీఎంసీల నీటి నిల్వ ఉంటుందని చూపించారు. కానీ ప్రత్యక్షంగా ఇక్కడ ఆ స్థాయిలో నీటి నిల్వ సాధ్యం కాదు. ఈ విషయాన్ని గ్రామస్తులు, జల నిపుణుల సమక్షంలో కొలతలు నిర్వహించడంతో వెలుగులోకి వచ్చింది. అత్యధికంగా నాలుగు నుంచి ఆరు టీఎంసీల నీటి నిల్వకు మాత్రమే వీలుంటుంది’ అని ప్రఫుల్లా వివరించారు. కేవలం ప్రచారం కోసం అధికారులు పాకులాడుతున్నారని ఆయన విమర్శించారు. దీని వల్ల నీటి సమస్య తీరకపోగా, వ్యయం తడిసి మోపెడవుతుందన్నారు. జిల్లాకు చెందిన శాసనసభ్యులతో సహా ముఖ్యమంత్రిని కలుసుకొని జలయుక్త శివారులోని బోగస్ ఉదంతాలపై పూర్తి స్థాయిలో నివేదిక అందజేస్తానని ప్రఫుల్ల తెలిపారు. -
అరుణకు ఘన నివాళి
- ఓ కళాశాలకు పేరు పెడుతున్నట్లు సీఎం ప్రకటన - అవార్డు నెలకొల్పుతున్నట్లు ప్రకటించిన ఎంపీ సీఎం ముంబై: 42 ఏళ్లపాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయిన అరుణా శానబాగ్ జ్ఞాపకార్థం థాణేలోని ప్రముఖ నర్సింగ్ కళాశాలకు ఆమె పెరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం తెలిపారు. ఆమె స్ఫూర్తికి సెల్యూట్ చేస్తున్నానని ట్వీట్ చేశారు. కేఈఎమ్ ఆస్పత్రిలోని నాలుగో వార్డుకు అరుణ పేరు పెట్టాలని ఆస్పత్రి అధికారులు బీఎంసీని కోరారు. చికిత్స చేసిన గదిలో ఆమె ప్రతిమను ఉంచారు. ఆ గదికి ఆమె పేరు పెట్టి ఆ గదిని ఆస్పత్రి పనులకు, చికిత్సలకు వాడుకోవాలని నిర్ణయించారు. అరుణ పేరుతో అవా ర్డు నెలకొల్పుతున్న ట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మహిళలపై జరుగుతు న్న అన్యాయాలకు వ్య తిరేకంగా పోరాడుతు న్న స్వచ్ఛంద సంస్థకు ఇవ్వాలని నిర్ణయిం చారు. ఈ అవార్డు కింది రూ. ఒక లక్ష బహుమతిగా ఇవ్వనుంది. అరుణకు జరిగిన అన్యాయానికి మధ్యప్రదేశ్ సీఎం చింతిస్తూ...ఆమె గౌరవానికి చిహ్నంగా పేర్కొన్నారు. దేశానికి దక్కిన బహుమతి అరుణ దేశానికి దక్కిన గొప్ప బహుమతి అని రచయిత పింకి విరానీ అన్నారు. 1973 నవంబర్ 27 ఘటన అరుణ జీవితాన్ని మార్చి వేసిందని విచారం వ్యక్తం చేశారు. ఆమె చనిపోయినా ఎప్పటికీ తన గుండెలో బతికే ఉందని అన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Advertisement