breaking news
Cheru Sudhakar
-
నయీం కేసును నీరుగార్చిన సర్కార్
నేరెళ్ల ఘటనపై స్పందించని ప్రభుత్వం: చెరుకు పెద్దపల్లిరూరల్: అధికార పార్టీ సహా ఇతర పార్టీల నేతల తో సంబంధాలుండటం వల్లే సీఎం కేసీఆర్ నయీం కేసు ను నీరుగార్చారని తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఆరోపించారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేటలో శుక్రవారం ఆయన విలేకరు లతో మాట్లాడారు. నయీం ఎన్కౌంటర్ జరిగిన తర్వాత లభ్యమైన డైరీలో లభించిన ఆధారాలు, ఆయన స్థావరాల్లో లభ్యమైన సొమ్ము ను ఏం చేశారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. నేరెళ్ల ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడాన్ని బట్టి చూస్తే ఇసుక మాఫియాకు సర్కార్ అండగా ఉంటోదనే సంకేతాలను ఇస్తోందని ఆరోపించారు. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోకుండా సామాన్యులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం టీఆర్ఎస్ సర్కార్కే చెల్లిందన్నారు. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబీకులు రాష్ట్రాన్ని సొంత జాగీరులా భావిస్తున్నారన్నారు. హోంమంత్రి నాయిని ప్రారం భోత్సవ కార్యక్రమాలకు తప్ప దేనికి పనికిరాడన్నారు. -
2019 కల్లా భావ విప్లవం: గద్దర్
నకిరేకల్: ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడేళ్లు గడిచినా ప్రజల జీవనశైలిలో ఎలాంటి మార్పులు రాలేదు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు ఎలా ఉందో నేడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది.. 2019 వరకు తెలంగాణలో ఒక మహత్తరమైన భావ విప్లవాన్ని తీసుకువస్తాం’ అని ప్రజాయుద్ధ నౌక గద్దర్ అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్లో తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్తో కలసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం పాలకపక్షానికి, ప్రతిపక్షానికి ఏమీ తేడా లేకుండా ఉందన్నారు. ప్రజావ్యతిరేకంగా పాలన సాగుతున్నందున తెలంగాణలో ప్రత్నామ్నాయ శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. ‘పల్లెపల్లెకు పాట – పార్లమెంట్కు బాట’ అనే నినాదంతో ప్రజలను చైతన్యం చేసేందుకు తెలంగాణలోని అన్ని శక్తులు ఏకమై ముందుకు సాగుతామన్నారు. చెరుకు సుధాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఇంటి పార్టీ పురుడు పోసుకుందని ఆ పార్టీ తెలంగాణలోని ఇంటింటికీ వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఆ పార్టీ ముందుకు సాగేందుకు తమ మద్దతు ఉంటుందని గద్దర్ పేర్కొన్నారు. -
సామాజిక శక్తులకు అధికారమే లక్ష్యం
- దాని సాధనకే తెలంగాణ ఇంటి పార్టీ - ‘సాక్షి’తో పార్టీ నేత చెరుకు సుధాకర్ - జూన్ 2న పార్టీ ఆవిర్భావం - ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సభ సాక్షి, హైదరాబాద్: ఉద్యమకారులకు గౌరవం, నిరుపేదలకు సంక్షేమం, సామాజిక శక్తులకు అధికారమే లక్ష్యంగా, ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా ‘తెలంగాణ ఇంటి పార్టీ’ ని ఏర్పాటు చేస్తున్నట్టు పార్టీ నేత డాక్టర్ చెరుకు సుధాకర్ చెప్పారు. ‘‘రాష్ట్రంలో అధికా రంలో ఉన్నది తెలంగాణ ఉద్యమకారుల ప్రభుత్వం కాదు. తెలంగాణ వ్యతిరేకులతో నిండిన ఫక్తు రాజకీయ పార్టీ ప్రభుత్వం’’ అని విమర్శించారు. తెలంగాణ ఆవిర్భవించిన జూన్ 2న తెలంగాణ ఇంటి పార్టీని ప్రారంభి స్తున్నామని మంగళవారం ‘సాక్షి’కి తెలిపారు. ‘‘పార్టీ ఆవిర్భావ సభ జూన్ 2న మధ్యాహ్నం హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతుంది. ప్రజా గాయకుడు గద్దర్, జేఏసీ చైర్మన్ కోదండరాం, నేతలు విమలక్క, మందకృష్ణ మాదిగలను సభకు ఆహ్వానిం చాం. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమ కారులు కూడా పాల్గొంటారు’’ అని వివరిం చారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సమైక్య పాలన అభివృద్ధి నమూనానే సీఎం కేసీఆర్ కొనసాగిసు ్తన్నారని చెరుకు ఆరోపిం చారు. అవకాశవాద నేతలను టీఆర్ఎస్లో చేర్చుకుని డొల్లతనా న్ని చాటుకున్నారని, ఆ డొల్లతనమే ఇప్పుడు తెలంగాణకు పెను భారంగా మారిందన్నా రు. ‘ఉద్యమకారుడే అధికారానికి కేంద్ర బిందువు కావాలి. తెలంగాణ ఆత్మగౌరవం, ఉద్యమకారుల ఆత్మరక్షణ కోసం స్వచ్ఛంద దళాలను ఏర్పా టు చేస్తాం. రాష్ట్రంలోని కుటుంబ పాలనను వ్యతిరేకిస్తున్నాం. జనాభాలో 52 శాతమున్న ఉన్న బీసీల పట్ల వివక్షను నిలదీస్తాం. బీసీ మంత్రులు సన్నబి య్యం ప్రచారానికి, మొక్క లు నాటడానికి, మద్యం వ్యవస్థను నడప డానికి, పాలాభి షేకాలకు, సబ్సిడీ గొర్రెలు, చేపల పెంపకం చుట్టూ తిప్పడానికే పనికొ స్తారా?’ అని ప్రశ్నించారు. బీసీని తక్షణం ఉప ముఖ్య మంత్రిని చేయాలని డిమాండ్ చేశారు. 2019లో బీసీ అభ్యర్థిని సీఎం చేయడమే లక్ష్యంగా తమ పార్టీ పని చేస్తుందన్నారు. ‘తెలంగాణ ఉద్యమ వేదికగా మేం ఉద్యమ శక్తులను రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడానికి తెలంగాణ కోసం పోరాడిన గ్రామ జేఏసీలను కలుపుకొని వెళ్తున్నాం. ఇప్పటికే 20 వేల మంది ఉద్యమకారుల చరిత్రను రికార్డు చేశాం. వారికోసం 10 వేల ఎకరాల భూమిని కేటాయించడం కూడా మా ఎజెండాలో ఉంది’ అని వివరించారు.