Chanderi
-
అక్కాచెల్లెళ్లు తెలుపు రంగు దుస్తులే ధరించడానికి రీజన్ ఇదే..!
దిగ్గజ నేపథ్య గాయని ఏప్రిల్ 12, ఆదివారం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఏ తరానికి చెందినవారైన ఆశా మధురమైన గాత్రానికి ఫిదా అవ్వాల్సిందే. ట్రెండ్కి తగ్గట్టుగా ఆలపిస్తూ..అభిమానుల మనసును దోచుకునే దిగ్గజ గాయని. ఆ సంగీత నైపుణ్యం ఆమెకు ఎన్నో అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టాయి కూడా. అక్క లతా మంగేష్కర్ అడుగుజాడల్లోనే నడుస్తూ..సంగీతంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఎటువంటి పాటలైన ఆశా స్వరంతో జత కలిస్తే ఓ అద్భుతం అనేలా పేరుతెచ్చుకున్నారామె. అలాంటి పాటలరాణి మనముందు లేరు అన్నమాటే బాధగా అనిపిస్తున్నా..ఆమె జ్ఞాపకాలు, స్మృతులు మనకళ్లముందు కదలాడుతూనే ఉంటాయి. వాటిలో ఒకటి అక్కాచెల్లెళ్లు ఇద్దరు ఒకే విధమైన రంగు చీరలతో కనిపించిన అద్భుతమైన దృశ్యాలు. ఇద్దరు ఎక్కువగా తెలుపు రంగునే ఎంచుకునేవారు. దీంతో అభిమానులు ఇద్దరూ ఇలా ఎందుకు ధరిస్తారనే దానిపై చాలా కుతుహలంగా ఉండారు. ఒక షాడ్కాస్ట్లో దివంగత గాయని ఆశా భోంస్లేనే ఆ విషయాన్ని పంచుకున్నారు. ఎందుకు ఆ రంగే ఇష్టం అంటే..గతేడాది ఆర్జే అన్మోల్, అతని భార్య నటి అమృతరావు హోస్ట్ చేసిన 'కపుల్ ఆఫ్ థింగ్స్' అనే పాడ్కాస్ట్తో భోస్లే అరంగేట్రం చేశారు. ఆ సంభాషణలో తన సోదరి వృత్తిపరమైన ప్రత్యర్థి అయినప్పటికీ ఆమెతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారామె. అంతేగాదు ఆ ఇంటర్వ్యూలో ఆశా తన సోదరి ఇద్దరూ తెలుపు రంగుకే తొలి ప్రాధాన్యత ఎందుకు ఇచ్చేవారో చెప్పారు. View this post on Instagram A post shared by Lata Mangeshkar (@lata_mangeshkar) "నేను దీదీ(లతా మంగేష్కర్) ఎల్లప్పుడూ తెల్ల చీరలే ధరించేవాళ్లం. తెలుపు రంగు మా చర్మ ఛాయకు బాగా నప్పుతుందని మేము భావించేవాళ్ళం. ఇతర రంగులు ధరిస్తే, మేము మరింత నల్లగా కనిపించేవాళ్ళం. ఆ తర్వాత, నేను గులాబీ రంగు చీరలు ధరించడం మొదలుపెట్టాను, దీదీ నన్ను వింతగా చూసేవారు, కానీ నేను నెమ్మదిగా గులాబీ రంగుతో పాటు ఇతర రంగులను కూడా జోడించడం ప్రారంభించాను." అని నవ్వతూ చెప్పారామె. కాగా, ఆశా భోంస్లే తన దుస్తుల విషయంలో రంగులను ఇష్టపడటం మొదలుపెట్టారు. కానీ లతా మంగేష్కర్ అడపాదడపా కనిపించే ప్రకాశవంతమైన ఎరుపు రంగు బ్రోకేడ్ పల్లు లేదా షెవ్రాన్ ప్రింటెడ్ బహుళ-రంగుల అంచు మినహా, తెలుపు, లేత తెలుపు వంటి ఐవరీ దుస్తులకే పరిమితమయ్యారు. భోంస్లే కాలక్రమేణా తన జీవిత ఉత్సాహాన్ని వ్యక్తపరిచేలా రంగుల దుస్తులతో తన ఇమేజ్ను పెంచుకున్నారు. ఆమె ఎక్కువగా చందేరి, బనారసి, చేనేత వస్త్రాలు, కాంజీవరం చీరలు, షిఫాన్ ప్రింట్లు వంటి రకరకాల రంగురంగుల చీరలతో తళుక్కుమనేవారు. గాత్రంలోనే కాదు..వేషధారణలోనూ ఆశా ఎవర్గ్రీన్ అన్నట్లుగా తన మార్కును చూపించేవారామె. View this post on Instagram A post shared by RJ Anmol 🇮🇳 (@rjanmol27) (చదవండి: Asha Bhosle: నిశబ్దంగా ఆ మధుర స్వరం.. కానీ ఆమె జ్ఞాపకాలు చిరస్మణీయం!) -
చందేరి పురాణ కట్టు
ఇంపైన రంగుల కలబోత.. చిక్కని పోగుల కలనేత పురాణ కాలాన పుట్టినా.. నేటి కాలాన తిరుగులేని చేనేత చందేరి. చీర కట్టుతో సింగారించినా.. అనార్కలీ కట్తో అలరించినా లెహంగా ఓణీలతో ఆకట్టుకున్న సంప్రదాయపు కళనేత చందేరి. వేద కాలం నుంచి చందేరీ ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. సంప్రదాయం, సౌందర్యం కలబోసుకున్న చందేరీ చేనేతకు పుట్టినిల్లు మనదేశంలోని మధ్యప్రదేశ్. ఈ రాష్ట్రంలోని చందేరీ పట్టణానికి ఇక్కడి హ్యాండ్లూమ్స్ వల్లే పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తమయ్యాయి. హ్యాండ్లూమ్ సిటీగా పిలిచే ఈ పట్టణంలో ఏ ఇంటి ముందు చూసినా రంగు రంగుల నూలు దారాల అల్లిక కనిపిస్తుంది. దేవతా వస్త్రాలుగా పేరొందిన ఈ ఫ్యాబ్రిక్ మొఘలుల కాలంలో రాచఠీవీతో వెలిగిపోయింది. పట్టు, కాటన్ ఫ్యాబ్రిక్లోనే కాదు రెండింటి మేలవింపుతోనూ చందేరీ ఆకట్టుకుంటుంది. అందుకే డిజైనర్లు చందేరీ ఫ్యాబ్రిక్తో ఎన్నో ప్రయోగాలు చేశారు.. ఇంకా చేస్తూనే ఉన్నారు. చందేరీ ఫ్యాబ్రిక్తో చీరలు, షల్వార్ కమీజ్, అనార్కలీలు, కుర్తీలు.. ఇలా ఎన్నో రకాల డిజైనర్ వేర్ సృష్టిస్తున్నారు సృజనశీలులు. ఆరు గజాల కళాత్మకం ప్రతి స్త్రీ అపురూపంగానూ.. ఎంతో ఇష్టంగా అందుకునే చీర చందేరీ. ఆరు గజాల చీర మీద ఆకట్టుకునే మోటిఫ్స్, చీర అంచులు, పల్లూ మీద కనిపించే మొఘలుల కళానైపుణ్యం మాటల్లో వర్ణించలేం. చందేరీ క్లాత్తో ప్రయోగాలు చేసి మీదైన స్టైల్తో ఒక ఎత్నిక్ స్టేట్మెంట్ను తెలియజేయవచ్చు. మొదట్లో ఎరుపు-నలుపు రంగులలోనే చందేరీ చీరలను రూపొందించేవారు. తరువాత ఫ్యాషన్ డిజైనర్ల జోక్యంతో ఈ క్లాత్పైన అద్భుతమైన డిజైన్లు వెలుగు చూశాయి. గ్లామర్ లుక్ దేశానికే కాదు ప్రపంచమంతటికీ చందేరీ చీరలు ఈ పట్టణం నుంచే ఎగుమతి అవుతాయి. అత్యంత తేలికగా ఉండటంతో పాటు సున్నితమైన లుక్తో ఆకట్టుకుంటుంది చందేరీ ఫ్యాబిక్. అంతేకాదు, దీనిపై ఆకట్టుకునే టెంపుల్ ఆర్ట్. మోటిఫ్స్లలో నెమళ్ళు, తామరపువ్వులు, నాణేలు, జియోమెట్రికల్ ప్యాటర్న్, ఇతర జంతు బొమ్మలు, ఊహాత్మక ఖగోళ గణాంకాలు.. ఇలా ఎన్నో చందేరీ మీద మనకు కనిపిస్తాయి. చందేరీ చీరలో ఒక గ్లామర్ లుక్ కనిపిస్తుంది. అందుకే బాలీవుడ్ నటీమణులు, సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనే మహిళలు చందేరీని ఎక్కువగా ధరిస్తుంటారు. ఈ చీరల మీదకు బంగారు లేదా ముత్యాల ఆభరణాల సెట్ మరింత అందాన్ని ఇస్తుంది. కాటన్ శారీస్ అయితే వెండి ఆభరణాలు, మీనాకారి, టైట జువెల్లరీ ధరించవచ్చు. తేలికగా ఉండే జరీ జిలుగులు, మృదువైన ఎంబ్రాయిడరీ సౌకర్యంగానూ, అందంగానూ ఉంచుతుంది. చందేరీ చీరకట్టు ఒక రాయల్ లుక్తో వెలిగిపోతుంది. సంప్రదాయ కట్టు లెహంగా, చందేరీ దుపట్టా కాంబినేషన్తో ఫ్యాషన్ వేదిక మీద మోడల్స్చే ప్రదర్శించారు హైదరాబాద్ డిజైనర్ గౌరంగ్షా! ముంబయ్ డిజైనర్ వైశాలీ షడంగులే చందేరీ ఫ్యాబ్రిక్తో ఇండోవెస్ట్రన్ డిజైన్స్ని సృష్టించారు. విల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్లో వాటిని మోడల్స్చే ప్రదర్శించారు.


