breaking news
Chamling
-
అక్కడ మామూలు వ్యక్తులు ఓటు వేయలేరు!
గ్యాంగ్టక్: ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలంటే ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తింపు కార్డు ఉండాలి. కానీ, సిక్కింలోని ఓ నియోజకవర్గంలో ఓటువేయాలంటే మాత్రం ప్రత్యేక వర్గానికి చెందిన సంఘాల ద్వారా గుర్తింపు పొందాలి. రాష్ట్రంలోని 32 నియోజకవర్గాలను ‘సంఘా’ అనే సన్యాసిల వర్గానికి కేటాయించారు. 2800 ఓటర్లున్న సంఘా నియోజకవర్గంలో.. ఎన్నికల్లో పోటీచేయాలన్నా, ఓటు హక్కు వినియోగించాలనుకున్నా దాదాపు 111 మఠాల్లో ఏదైనా ఒక మఠం ద్వారా గుర్తింపు పొంది ఉండాలి. అందుకేనేమో భౌగోళిక చిత్రపటంలో సంఘా అసెంబ్లీ నియోజకవర్గం లేకుండాపోయింది. కనీసం దీని సరిహద్దులను కూడా ఇప్పటివరకు నిర్ణయించలేదు. ఎన్నికల సమయంలోనూ వీరికి ప్రత్యేకమైన ఈవీఎంలను కేటాయిస్తారు. సిక్కింలో జరిగే త్రిముఖపోటీలో పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీపీ), పీ.ఎస్ గోలే ఆధ్వర్యంలోని సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్కేఎమ్), మాజీ ఫుట్బాల్ క్రిడాకారుడు బైచుంగ్ భూటీయ నెలకొల్పిన హమ్రో సిక్కిం పార్టీ(హెచ్ఎస్పీ), భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు పోటీలో ఉన్నాయి. ప్రస్తుత సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్.. ఈ ఎన్నికలలో విజయం సాధించి వరుసగా ఆరోసారి అధికారాన్ని చేపట్టి రికార్డు సృష్టించేందుకు సిద్దమయ్యారు. ఇదిలా ఉండగా చామ్లింగ్ పోక్లోక్-కమరంగ్, నామ్చీ-సింగీథాంగ్ రెండు స్థానాల నుంచి పోటీ చేయగా, భూటీయ గ్యాంగ్టక్, ట్యూమెన్ లింగి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈ రాష్ట్రంలో 4,23,325 మంది ఓటర్లు ఉండగా..32 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్సభ స్థానాలు ఉన్నాయి. -
రేప్పై తీవ్రంగా స్పందించిన సీఎం
గ్యాంగ్టక్: తమ రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్ కు చెందిన బాలికపై లైంగిక దాడి జరగడం పట్ల సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పర్యాటకులతో స్నేహభావంగా ఉండే రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం అన్నారు. ఈ నెల (మే) 15న సిక్కింలో ఓ ట్యాక్సీ డ్రైవర్ బెంగాల్ కు చెందిన 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పదో తరగతి పరీక్షలు పూర్తి చేసుకున్న 16 ఏళ్ల బాలిక మరో ఇద్దరు స్నేహితులతో కలిసి సిక్కిం పర్యటనకు వచ్చారు. ఓ ట్యాక్సీ తీసుకొని ముగ్గురు స్నేహితులు ప్రయాణిస్తుండగా ఆ ప్రేమ్ రాయ్ అనే ట్యాక్సీ డ్రైవర్ స్నాక్స్ తోపాటు ఏదో డ్రింక్ ఇచ్చాడు. అందులో మత్తుమందు కలిపాడు. అది తాగిన ఆ ముగ్గురు మత్తులోకి జారకుంటుండగా ఒకరిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. దీంతో మరో ఇద్దరు అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిని బలంగా కొట్టి కిందకు తోసి ఆ బాలికతో పారిపోయాడు. దీంతో ఆ ఇద్దరు ఏడ్చుకుంటూ ఇంట్లోవారికి బంధువులకు చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ట్యాక్సీ డ్రైవర్ ను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. ఈ వార్త సిక్కింలో కలకలం రేపడంతో స్వయంగా ముఖ్యమంత్రి మంగళవారం ప్రకటన చేశారు. ఆ నేరస్థుడిని ప్రపంచానికి తెలిసేలా చేయాలని, బహిర్గతం చేయాలని, నలుగురిలో నిలబెట్టాలని సీఎం పోలీసులకు ఆదేశించారు.