breaking news
chaithanya patham
-
సమరమే..
ప్రత్యేక హోదా మా హక్కు – మాట ఇచ్చి తప్పితే ఊరుకునేదిలేదని స్పష్టీకరణ – వెంకయ్య, చంద్రబాబులు రాజీనామా చేయాలని డిమాండ్ – ప్యాకేజీతో నిండేది నాయకుల జేబులేనని విమర్శ – ‘సాక్షి చైతన్య పథం’లో ముక్తకంఠంతో నినదించిన జిల్లా సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకూ కలిసి పోరాడతామని కర్నూలు జిల్లా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు నినదించారు. ఎన్నికల ముందు మాట ఇచ్చి తర్వాత తప్పితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. సాక్షి మీడియా ఆధ్వర్యంలో ప్రత్యేక హోదాపై కర్నూలులో నిర్వహించిన చైతన్యపథం కార్యక్రమంలో వివిధ రాజకీయపార్టీలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఎన్నికల ముందు మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పిన కేంద్ర మంత్రి వెంకయ్య, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా ఆశను రగిల్చి, ఇప్పుడు లేదని చెప్పిన బీజేపీ వైఖరిని నిశితంగా విమర్శిస్తూ ఎంపీ బుట్టా రేణుక చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ప్రత్యేక ప్యాకేజీ అంటూ టీడీపీ, బీజేపీలు చెబుతున్న లెక్కలన్నీ కూడా చనిపోతూ ఒక తండ్రి తన కుటుంబ సభ్యులకు పాల వ్యాపారం పంచినట్టుగా ఉందంటూ పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పిన పిట్టకథ అందరినీ ఆకర్షించింది. ప్రత్యేక హోదా వస్తే ఏయే రాయితీలు వస్తాయో బుగ్గన సవివరంగా తెలియజేశారు. గుంతకల్లుకు రైల్వే జోన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక ప్యాకేజీని ఆహ్వానిస్తానంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే ఐజయ్య తూర్పారబట్టారు. గతంలో ప్రత్యేక హోదా ఇస్తామని.. తర్వాత చూస్తామని.. ఇప్పుడు ఇవ్వలేమంటూ టీడీపీ–బీజేపీలు మాట మార్చాయని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మండిపడ్డారు. ఇక ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఇతర రాజకీయ పార్టీలతో పాటు విద్యార్థులు కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పంచెకట్టు.. పదనిసలు వెంకయ్య నాయుడు పంచెకట్టుపై సీపీఐ నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు హరీష్బాబు మండిపడ్డారు. అయితే, ఈ సందర్భంగా పంచెకట్టును ఎవ్వరూ ఎగతాళి చేయలేదని అది ఆంధ్రులకు ఎంతో ఇష్టమైనదంటూ పంచెకట్టుపై సీపీఐ నాయకుడు రసూల్ పాడిన గీతం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా బీజేపీ నేతలకు ఇతర పార్టీల నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సాక్షి టీవీ కొమ్మినేని శ్రీనివాసరావు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఎన్నికల ముందు హోదా ఇస్తామని వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని పక్కనపెట్టిన వెంకయ్య, చంద్రబాబు నాయుడులు రాజీనామాలు చేయాలంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య డిమాండ్ చేసిన సందర్భంలో వేడి రాజుకుంది. కర్ణాటక నుంచి నేను గెలిచానని, ఆంధ్రప్రదేశ్ నుంచి కాదంటూ వెంకయ్య నాయుడు తాము ఢిల్లీలో కలిసిన సందర్భంలో వ్యాఖ్యానించారని ఎస్డీపీఐ నాయకులు చెప్పగా సభలోని నేతలతో పాటు విద్యార్థులు వెంకయ్య తీరుపై మండిపడ్డారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పీబీవీ సుబ్బయ్య విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తే ప్రత్యేక ఉద్యమాలు వస్తాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు హెచ్చరించారు. ప్రత్యేక హోదా కావాల్సిందే.. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే కేవలం కొద్ది మంది నేతల జేబుల్లోకి పోతుందని చర్చ సందర్భంగా పలువురు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. తమకు ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా రావాల్సిందేనని నినదించారు. ప్రస్తుతం ప్లేస్మెంట్స్ లేక అవస్థలు పడుతున్నామని వాపోయారు. హోదా కోసం జైళ్లకు వెళ్లేందుకైనా సిద్ధమేనని ప్రకటించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు కపిలేశ్వరయ్య, హరీష్బాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యేలు బుగ్గన, ఐజయ్య, గౌరుచరిత, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జి హఫీజ్ఖాన్, నేతలు తోట కష్ణారెడ్డి, గుండం సూర్యప్రకాష్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రాజా విష్ణువర్దన్ రెడ్డి, సీపీఎం నుంచి ప్రభాకర్ రెడ్డి, గౌసుదేశాయ్, సీపీఐ నుంచి ఓబులేసు, రసూల్, మునెప్ప, మనోహర్ మాణిక్యం, ఎస్డీపీఐ– ఖలీల్ అహమ్మద్, ఆమ్ఆద్మీ– సుబ్బయ్య, కేవీ సుబ్బారెడ్డి సంస్థల నుంచి సుబ్బారెడ్డి, అశోక్వర్దన్ రెడ్డి, ఐద్వా– అలివేలమ్మ, బీసీ జనసభ–మాతం నాగరాజు, ఏఐఎస్ఎఫ్ మహేంద్ర.. ఎస్టీ, ఎస్టీ స్టూడెంట్ పరిషత్– ఓబులేష్, అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్– రాజీవ్కుమార్, యూటీఎఫ్–డి.రామశేషయ్య, న్యాయవాది పద్మజానాయుడు, సీనియర్ సిటిజన్స్ నుంచి వేణుగోపాల్రావు తదితరులు పాల్గొన్నారు. -
అనంత గర్జన
ఉద్యమాల పురిటి గడ్డ ‘అనంత’ గర్జించింది. మన బతుకులు, భవిష్యత్తు ముడిపడి ఉన్న ప్రత్యేక హోదా కోసం ఒక్కటై నినదించింది. అన్యాయాన్ని ఎదిరించాలి... పిడికిలెత్తి పోరాడాలి... మన హక్కులు సాధించుకోవాలి... అంటూ ప్రజలు ఎలుగెత్తి చాటారు. అనంతపురం నగరంలోని కేటీఆర్ కన్వెన్షన్ హాలులో ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో బుధవారం సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు నేతత్వంలో ‘చైతన్య పథం’ చర్చావేదిక జరిగింది. టీడీపీ మినహా అన్ని పార్టీలు, ప్రజా, విద్యార్థి, మహిళా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొని.. ప్రత్యేక హోదా ఆకాంక్షను బలంగా చాటారు. మరో స్వాతంత్య్ర పోరాటంలా హోదా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పలువురి అభిప్రాయాలు వారి మాటల్లోనే... ఒక్కరు గెలిచినా ఉద్యమం విరమిస్తాం ఎన్నికలకు ముందు ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మోదీ, వెంకయ్యనాయుడు ఎంతో చెప్పారు. ఇప్పుడు మాట మారుస్తున్నారు. సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారు. వీరందరికీ ఒక్కటే చెబుతున్నాం.. ఎన్నికలకు వెళ్దాం..‘హోదా’ నినాదంతో మేము... ‘ప్యాకేజీ’తో మీరు రండి.. మీలో ఒక్కరు గెలిచినా ప్రత్యేక హోదా ఉద్యమం విరమించుకుంటాం. విభజన తర్వాత ఎంతో నష్టపోయాం. ఇప్పుడు మళ్లీ నష్టపోవడానికి సిద్ధంగా లే ం. ఉద్యమం కొనసాగిస్తాం. – రామకష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ====== హోదాతో బతుకులు మారుతాయి 14వ ఫైనాన్స్ కమిషన్ యూపీఏ హయాంలోనే ఉంది. పార్లమెంట్లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్.. ఏపీకి హోదా ఇస్తామన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు. మోదీకి ఈ విషయం తెలియదా? అంత అమాయకుడా? ప్రత్యేక హోదా వస్తేనే ఇక్కడి బతుకులు మారుతాయి. హోదా ఉన్న రాష్ట్రాల్లో ఇక్కడి నాయకులు పరిశ్రమలు పెట్టింది వాస్తవం కాదా? ఆర్థిక శాఖ.. చట్టబద్ధత అంటూ మోసపు మాటలు చెప్పొద్దు. – రాంభూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి ========================== ‘ఓటుకు నోటే’ ముంచింది ఏపీకి హోదా కోసం అసెంబ్లీలో తీర్మానం చేశారు. మరి అర్ధరాత్రి ‘ప్రత్యేక ప్యాకేజీ’ని ఎందుకు స్వాగతిస్తున్నామని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఉద్యోగాలు వస్తాయని చెప్పే ధైర్యం ఉందా? ‘ఓటుకు నోటు’ కేసుకు భయపడి చంద్రబాబు వ్యక్తిగత స్వార్థంతో హోదాపై కేంద్రానికి సరెండరయ్యారు. హైదరాబాద్ వెళ్లిపోయాక ఏపీలో ఎక్కడా పరిశ్రమలు లేవు. పెద్ద చదువులు చదివి ఉద్యోగం కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. సింగపూర్, జపాన్ వంటి దేశాలకు వెళ్లొచ్చిన చంద్రబాబు ఒక్క ప్రధాన పరిశ్రమనైనా తీసుకొచ్చారా? ప్రజల మనోభావాలు అర్థం చేసుకుని హోదా ఇవ్వాల్సిందే. పోరాటం ఆగదు. – విశ్వేశ్వరరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే ============ ప్రత్యేక హోదాయే సంజీవిని ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాయే సంజీవిని. అనంతపురం వంటి కరువు జిల్లాలో అనేక పరిశ్రమలు, రాయితీలు రావాలి. ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. విభజన చట్టంలో పేర్కొన్నవన్నీ మాకు కావాల్సిందే. హోదా అడిగితే ప్యాకేజీ అంటున్నారు. మోదీ అనుకుంటే హోదా పెద్ద విషయమేమీ కాదు. అందరూ కలిసి కట్టుగా ఉద్యమిద్దాం.. హోదా సాధించుకుందాం – శంకరనారాయణ, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు =============== రాజకీయాలకు అతీతంగా ఒక్కటవుదాం రాష్ట్ర విభజనకు ముందు సమైక్య ఉద్యమం అనంతపురం జిల్లా నుంచే ప్రారంభమైంది. ఇప్పుడు ప్రత్యేక హోదా సాధన విషయంలోనూ ఈ జిల్లా నుంచే ‘ప్రత్యేక హోదా సాధన సమితి’ పేరుతో ఉద్యమం మొదలైంది. జిల్లాలో వెనుకబాటుతనం, పేదరికం ఎక్కువ. ఈ 30 ఏళ్లలో ఆరేళ్లు మాత్రమే పంట చేతికందింది. పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే హోదానే గత్యంతరం. రాజకీయాలకు అతీతంగా ఒక్కటవుదాం. బీజేపీ, టీడీపీ మెడలు వంచుదాం. – జగదీశ్, సీపీఐ జిల్లా కార్యదర్శి === ప్యాకేజీలతో ప్రయోజనం లేదు ప్యాకేజీ వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అందరూ ఐకమత్యంగా వెళ్దాం. హోదా సాధించుకుందాం. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మానుకుని చిత్తశుద్ధితో పోరాటం చేద్దాం. ప్రత్యేక హోదా మన హక్కు. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. – కోటా సత్యం, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ============= హోదా తప్ప మరేమీ వద్దు ప్యాకేజీ వల్ల మనకు అన్యాయమే జరుగుతుంది. పార్లమెంట్ సాక్షిగా చెప్పిన మాటలకే విలువలేకపోతే ఎలా? విభజన బిల్లులో జాతీయ విద్యా సంస్థలు ప్రకటించారు. ఇక్కడకు ఏదీ రాలేదు. మాకు హోదానే కావాలి.. ఇంకేమీ వద్దు. – రాగే పరశురాం, కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడు ============ విద్యార్థులు, యువత కదలిరండి రాష్ట్ర విభజన తర్వాత మనం ఎంతగానో నష్టపోయాం. పరిశ్రమలు లేవు. ఉపాధి లేక యువత కొట్టుమిట్టాడుతోంది. ఏపీకి హోదాకు మించింది ఏదీ లేదు. జేఏసీలో అందరూ భాగస్వాములవుదాం. హోదా సాధనకు విద్యార్థులు, యువత కదలిరావాలి. – గురునాథరెడ్డి, అనంతపురం మాజీ ఎమ్మెల్యే =============== ప్రజల ఆకాంక్షను తప్పుబట్టను రాష్ట్ర విభజనకు ముందు ప్రత్యేక హోదా కోసం బీజేపీ మాత్రమే మాట్లాడింది. అది కూడా వెంకయ్య నాయుడు మాత్రమే పదేళ్లు హోదా కావాలని అడిగారు. ప్రత్యేక హోదా అందరి ఆకాంక్ష అనడంలో సందేహం లేదు. దాన్ని తప్పుపట్టడం లేదు. – ఎంఎస్ పార్థసారథి, కదిరి మాజీ ఎమ్మెల్యే ============ ఆ రాష్ట్రాలకు చట్టబద్ధత ఉందా? ప్రత్యేక హోదా విషయంలో ఎవరికి వారు మాట్లాడుతున్నారు. లోక్సభ, రాజ్యసభలో బిల్లు అయ్యాక ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోవాలని.. చట్టబద్ధత ఉండాలని అంటున్నారు. ఇప్పుడు హోదా ఉన్న అన్ని రాష్ట్రాల్లో చట్టబద్ధత ఉందా? ఇన్నాళ్లూ చేసింది చాలు. మాకు కావాల్సింది ప్రత్యేక హోదా.. దీనికోసం ఎందాకైనా వెళ్తాం. ఇది మా హక్కు. – కేవీ రమణ, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు ========================== యజ్ఞంలా కొనసాగాలి ప్రత్యేక హోదా ఉద్యమం యజ్ఞంలా కొనసాగాలి. ప్రత్యేక హోదా కల్పించాలని ఎన్నికలకు ముందు పార్లమెంట్ సాక్షిగా డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హోదా వల్ల ఎలాంటి ప్రయోజనం లేదంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రత్యేక సాయం పేరుతో ఇచ్చే భిక్ష అక్కర్లేదు. హోదా వస్తే పీజీ, ఎంబీఏ, పీహెచ్డీ పూర్తి చేసిన లక్షలాది యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సాధ్యమవుతాయి. – యుమునా రాణి, నిరుద్యోగి ==================================== ఎస్కేయూ వేదికగా ఉద్యమం సమైక్యాంధ్ర ఉద్యమ తరహాలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఎస్కేయూ వేదికగా ఉధతం చేయనున్నాం. ఉద్యమంలో పాల్గొనే విద్యార్థులపై అక్రమ కేసులు, సస్పెన్షన్లు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడం. హోదా సాధించి తీరుతాం. – సి.నరసింహరెడ్డి, వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ============================== సమాజ శ్రేయస్సు కోరడం తప్పా ? సమాజం కడుతున్న పన్నుల నుంచి జీతాలు తీసుకొంటున్నాం. అలాంటి వారి శ్రేయస్సు కోరడం తప్పని బెదిరిస్తున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో నపాల్గొన్నందుకు మెమో ఇచ్చారు. సస్పెన్షన్ చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి బెదిరింపులకు భయపడనని స్పష్టం చేస్తున్నా. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరో స్వాతంత్య్ర పోరాటం తరహాలో ఉధతం చేస్తాం. – డాక్టర్ ఎన్.ఆర్.సదాశివారెడ్డి, ఎస్కేయూ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు ================================== ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టారు స్వార్థపూరిత రాజకీయాల కోసం ఏపీ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ప్యాకేజీ వల్ల రాజకీయ నాయకులకే లాభం. ప్రజలను వంచిస్తున్న వారికి గుణపాఠం చెబుతాం. –వడిత్య శంకర్నాయక్, గిరిజన విద్యార్థి సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు . ప్యాకేజీలతో ఒరిగేదేమీ లేదు ప్యాకేజీలతో ఒరిగేదేమీ ఉండదు. ప్రత్యేక హోదా కల్పిస్తే అందరికీ ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది. విద్యార్థులు పోరాడుతుంటే కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. ప్రత్యేక హోదా కల్పించకపోతే మేము బీటెక్ పూర్తి చేసినా లాభం ఉండదు. –స్రవంతి, బీటెక్ విద్యార్థిని ================================= పార్లమెంట్లో నిర్ణయాలకు లేదా? పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా అంశంపై చర్చించి తగిన హామీలు గుప్పించారు. ఆ నిర్ణయాలకే గౌరవం లేకుండా పోయింది. ప్రత్యేక హోదా అంశంలో బీజేపీ, టీడీపీ మాట మారుస్తున్నాయి –వెంకట్రాముడు, బలిజ సంఘం రాయలసీమ అధ్యక్షుడు ============================== ఉమ్మడిగా పోరాడాలి ప్రత్యేక హోదా సాధనకు అన్ని పార్టీలు ఉమ్మడిగా పోరాడాలి. జాతీయ స్థాయి సంస్థలు ఏర్పాటు చేసినంత మాత్రాన నిరుద్యోగ నిర్మూలన సాధ్యం కాదు. ప్రత్యేక హోదాతోనే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించిన వారు, అందుకు సహకరించిన పార్టీ నాయకులు ఇప్పటికైనా సంఘటితంగా ఉద్యమించాలి. – చిరంజీవి రెడ్డి, విద్యాసంస్థల అధినేత అందరి అజెండా ఒక్కటే ఉండాలి ప్రత్యేక హోదా సాధనకు పార్టీల అజెండా ఒక్కటే ఉండాలి. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరిని మార్చుకొని ప్రత్యేక హోదా కల్పనకు సిద్ధపడాలి. హోదా కల్పిస్తే పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు, ప్రోత్సహాకాలు ఉంటాయి. – కోగటం విజయభాస్కరరెడ్డి , అనంత నగరాభివద్ధి అధ్యక్షుడు ద్వంద్వ వైఖరి వీడాలి బీజేపీ, టీడీపీ ద్వంద వైఖరితో ఏపీ ప్రజలకు తీరని నష్టం జరుగుతోంది. ప్రత్యేక హోదా కల్పించాలని ప్రజల్లో ప్రగాఢమైన ఆకాంక్షగా మారింది. ప్రజల మనోభావాలను కించపరిచిన రాజకీయ పార్టీలకు ఏం గతి పట్టిందో గుర్తించుకోవాలి. – రాజగోపాల్, ఎస్సీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు . ప్యాకేజీలతో వారికే లబ్ధి రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది విద్యార్థులు డిగ్రీ, బీటెక్ పూర్తి చేస్తున్నారు. వీరందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే మార్గాలు అన్వేషించాలి. హోదానే ఇందుకు తరుణోపాయం . – పులిరాజు, ప్రత్యేక హోదా ఎస్కేయూ జేఏసీ నాయకుడు కమీషన్ల కోసం కక్కూర్తి కమీషన్ల కోసం కక్కూర్తి పడి ప్యాకేజీని ఆహ్వానిస్తున్నారు. కరువు జిల్లాలో పరిశ్రమల స్థాపనతోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సాధ్యమవుతాయి. రాయితీ ప్రకటిస్తేనే పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడిదారులు ముందుకు వస్తారు. ఇది ప్రత్యేక హోదా ద్వారానే సాధ్యమవుతుంది. – కాపు రామచంద్రా రెడ్డి, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పట్టించుకోలేదు పునర్వ్యస్థీకరణ బిల్లులో ఏపీకి ఏమి కావాలనే అంశాలపై కాంగ్రెస్ పార్టీ పట్టించుకున్న పాపాన పోలేదు. జాతీయ సంస్థల ఏర్పాటును కేవలం రెండేళ్లలోనే బీజేపీ అమలు చేసింది. ఏపీ శ్రేయస్సు కోసం పరితపిస్తున్న వెంకయ్యనాయుడుపై విమర్శలు చేయడం భావ్యం కాదు. – డి.వెంకటేశ్వర రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పరిశ్రమల ఏర్పాటుతోనే అభివద్ధి ప్రత్యేక హోదా.. ప్యాకేజీకి తేడా లేదని బుకాయిస్తున్నారు. 11 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా అమలవుతోంది. ఆ రాష్ట్రాల్లో పారిశ్రామిక పురోగతిని పరిశీలించండి. ఫిజికల్ ఇన్సెంటెవీస్ వస్తేనే పరిశ్రమల స్థాపన సాధ్యమవుతుంది. పారిశ్రామికీకరణతోనే నిరుద్యోగాన్ని రూపుమాపవచ్చు. – ఆచార్య కేవీ రమణారెడ్డి, ఎమిరటర్స్ ప్రొఫెసర్, ఎస్కేయూ. ఎంతకైనా తెగిస్తాం ప్రత్యేక హోదా సాధనకు ఎంతకైనా తెగిస్తాం. పోరాటం చేస్తాం. ఎస్కేయూ వేదికగా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉధతం చేస్తాం. 5 కోట్ల ప్రజల ఆకాంక్ష సాకారానికి సమష్టిగా కార్యోన్ముఖులవుతాం. – మచ్చా రామలింగా రెడ్డి, ప్రత్యేక హోదా కార్యనిర్వాహక కార్యదర్శి టీడీపీ, బీజేపీలు తుడిచిపెట్టుకు పోతాయి ప్రత్యేక హోదా కల్పనలో విఫలమైన బీజేపీ, టీడీపీ తుడిచిపెట్టుకు పోవడం ఖాయం. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడాలంటే ప్రత్యేక హోదా అనివార్యం. –నదీం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బీజేపీ హామీ ఏమైంది ఎన్నికలకు ముందు రాజ్యసభలో 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని బీజేపీ డిమాండ్ చేసింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యాక హోదా అంశాన్ని కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాలు విస్మరించాయి. తాజాగా ప్రత్యేక హోదా వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఈ ప్రభుత్వ పెద్దలు బుకాయిస్తున్నారు. – రామాంజినేయులు, ఏఐఎస్ఎఫ్, ఏపీ వర్సిటీల కో ఆర్డినేటర్ -
‘ప్రత్యేక’ దగా
– ప్రత్యేకSహోదా 15 ఏళ్లుకావాలని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన చంద్రబాబు – ఇప్పుడు అవసరం లేదంటూ కొత్త పల్లవి – హోదాతో అభివద్ధి బాటన 11 రాష్ట్రాలు – ‘అనంత’ లాంటి వెనుకబడిన ప్రాంతాలకు హోదానే సంజీవని – ‘ప్రత్యేక హోదా.. ఏపీ హక్కు’ అనే అంశంపై నేడు ‘సాక్షి’ చైతన్య పథం సాక్షిప్రతినిధి, అనంతపురం : → ‘ప్రధాని ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు. పరిశ్రమలు ఏర్పడి, ఉత్పత్తి సాధించేలోపు ఐదేళ్లు పూర్తవుతాయి. ఏపీకి మేలు జరగాలంటే పదేళ్లు హోదా ప్రకటించండి.’ - ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు–2014 ఆమోద సమయంలో వెంకయ్య నాయుడు → ‘కనీసం 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రం అభివద్ధి చెందుతుంది. లేదంటే తీరని అన్యాయం జరుగుతుంది. 15 ఏళ్లు హోదా ఇవ్వాలని మోదీని అడుగుతున్నా.’ – 2014 తిరుపతి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు → ‘ప్రత్యేక హోదా సంజీవని కాదు. హోదాతో ఏం మేలు జరుగుతుంది? అంతకంటే ప్యాకేజీతోనే మేలు కలుగుతుంది. అవగాహన లేనివాళ్లే హోదా గురించి మాట్లాడుతున్నారు.’ – తాజాగా వెంకయ్య, చంద్రబాబు వ్యాఖ్యలు నవ్యాంధ్ర ప్రదేశ్లో రాజధాని లేదు. హైదరాబాద్ను కోల్పోవడంతో పరిశ్రమలు దూరమయ్యాయి. తద్వారా ఆదాయం భారీగా తగ్గింది. ఈ క్రమంలో కనీసం ప్రత్యేక హోదా ఇస్తే పారిశ్రామికాభివద్ధి వేగం పుంజుకుని ఆర్థికంగా మేలు కలుగుతుంది. ఇదే విషయాన్ని వెంకయ్య నాయుడుతో పాటు ఇప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణŠ జైట్లీ 2014లో రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోద సమయంలో ప్రస్తావించారు. పదేళ్లు ఇవ్వాలని yì మాండ్ చేశారు. అయితే.. ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేకSహోదా కల్పిస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ రాజ్యసభలో ప్రకటించారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. దీంతో రాష్ట్రానికి హోదా వస్తుందని అందరూ ఆశపడ్డారు. కానీ కుంటిసాకులు చెబుతూ హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చేసింది. ఈ క్రమంలో రాష్ట్రాభివద్ధి కోసం పోరాడాల్సిన ఏపీ ప్రభుత్వం పూర్తిగా కేంద్రానికి లొంగిపోయింది. హోదాతో ఒరిగేదేమీ లేదని, ప్యాకేజీతో అంతకంటే మేలు జరుగుతుందని చంద్రబాబు కొత్తపల్లవి అందుకున్నారు. ఆయన వైఖరి వల్ల రాష్ట్రానికి, మరీముఖ్యంగా ‘అనంత’లాంటి వెనుకబడిన ప్రాంతాలకు తీరని నష్టం జరుగుతోంది. హోదాతోనే ‘అనంత’ అభివద్ధి అనంతపురం జిల్లాలో 19.13 లక్షల హెక్టార్ల భూమి ఉంది. ఇందులో 13 శాతం అటవీ భూములు ఉన్నాయి. అటవీ భూములను మినహాయించగా.. మిగిలిన భూముల్లో 69 శాతం వ్యవసాయ యోగ్యమైనవి. తక్కిన 31శాతం భూముల్లో వ్యవసాయం చేయలేని పరిస్థితి. ఈ భూముల్లో పరిశ్రమలు స్థాపిస్తే జిల్లా పారిశ్రామికంగా అభివద్ధి చెందుతుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. లక్షలాది ఎకరాల పొలాలు బెంగళూరు ఎయిర్పోర్టుకు దగ్గరగా ఉన్నాయి. జిల్లా సరిహద్దులకు 400 కిలోమీటర్ల దూరంలో గోవా పోర్టు ఉంది. అయినప్పటికీ దశాబ్దాలుగా ‘అనంత’లో పారిశ్రామికాభివద్ధి జరగలేదు. తాడిపత్రి సమీపంలో అల్ట్రాటెక్, పెన్నా సిమెంట్స్, గరుడస్టీల్స్ మినహా జిల్లాలో పరిశ్రమల జాడ లేదు. వెయ్యిమంది ఉద్యోగులు పనిచేసే ఒక్క పరిశ్రమ కూడా లేదు. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ప్రకటిస్తే జిల్లాలో అత్యంత వేగంగా పారిశ్రామికాభివద్ధి జరిగే అవకాశముంది. -
"సాక్షి" చైతన్యపథం - ఏలూరు