-
మిడ్మానేరుకు స్కానింగ్!
సాక్షి, హైదరాబాద్: ప్రతి ఏడాది ఎడతెరిపిలేని వానలు.. పోటెత్తుతున్న వాగులు, వంకలు.. పరవళ్లుతొక్కే వరద ప్రవాహాలు.. వెరసి ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిడ్మానేరు రిజర్వాయర్ పరిధిలో వరద నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు మిడ్మానేరు గుండె కాయలాంటిది. కీలకమైన ఈ రిజర్వాయర్ పరిధిలో గతంలో రెండుసార్లు కట్ట తెగిన దృష్ట్యా వరదను ఎదుర్కొనే ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని నిర్ణయించింది. డ్యామ్ బ్రేక్ అనాలిసిస్లో భాగంగా ఉండే ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ నిమిత్తం పుణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్)కు ప్రాజెక్టు అధికారులు లేఖ రాశారు. మేడిగడ్డ నుంచి ఎత్తిపోసే నీళ్లు ఎల్లంపల్లిని దాటి మిడ్మానేరుకు చేరుకుంటాయి. మిడ్మానేరు నుంచి ఎస్సారెస్పీ పునరుజ్జీవం వైపు, దిగువ లోయర్ మానేరు, అనంతగిరి, రంగనాయక్సాగర్ మీదుగా కొండపోచమ్మ వైపు నీళ్లు సరఫరా అవుతాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని భాగాలకు ఇక్కడి నుంచే నీటి సరఫరా ఉండటంతో రిజర్వాయర్ పటిష్టత కీలకం. 5 లక్షల క్యూసెక్కుల మేర వరద వచ్చినా తట్టుకునేలా ఈ రిజర్వాయర్ను నిర్మించారు. యాక్షన్ ప్లాన్ సిద్ధమైతే...: ఈ యాక్షన్ ప్లాన్ సిద్ధమైతే ఎగువ నుంచి వరదను అంచనా వేయడంతో పాటు ఏ స్థాయి లో వరద వస్తే రిజర్వాయర్లో ఎంతమేర నీటిని నిల్వ చేయాలి, ఎంతమేర దిగువకు వదలాలి? అన్న అంచనాకు రావచ్చు. ఈ వరద అంచనాలకు అనుగుణంగా దిగువ రిజర్వాయర్కు నీటి విడుదల చేయడం, లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయడం వంటివి ముందస్తుగానే సిద్ధం చేసుకోవచ్చని ప్రాజెక్టు ఇంజనీర్లు చెబుతున్నారు. గత ఏడాది ఆగస్టులో ఏమైందంటే... గతేడాది సైతం ఆగస్టులో మిడ్మానేరులో 15 టీఎంసీల మేర నీటిని నింపిన అనంతరం రిజర్వాయర్ పరిధిలో కొన్ని సీపేజీలు ఏర్పడ్డాయి. కట్టకు దిగువన ఏర్పడ్డ ఒర్రెలతోనూ సమస్యలు వచ్చాయి. దీంతో 10 కిలోమీటర్ల పొడవైన కట్టను పూర్తి స్థాయిలో పరీక్షించి, రాక్టో నిర్మాణాలను పరిశీలించి, కట్ట 2.450 కిలోమీటర్ నుంచి 2.700 కిలోమీటర్లు మేర పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసేందుకు రూ.16 కోట్లు ఖర్చు చేశారు. ఈ లీకేజీల మరమ్మతుల కోసం హడావుడిగా రిజర్వాయర్ను ఖాళీ చేయాల్సి వచ్చింది. ఈ సంఘనటకు ముందు 2016లో రిజర్వాయర్ నిర్మాణం పూర్తికాక ముందే ఎగువన ఉన్న కూడవెళ్లి వాగు, మానేరు వాగుల నుంచి ఒక్కసారిగా 2.50 లక్షల క్యూసెక్కులకుపైగా వరద పోటెత్తడంతో రిజర్వాయ ర్కు ఎడమవైపు 130 మీటర్ల మేర కట్ట తెగిపోయింది. దీంతో దిగువన ఉన్న 12 వేల మంది ప్రజలను çసురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. ఈ నేపథ్యం లో వరదను ఎదుర్కొనేలా ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సర్కారు నిర్ణయించింది. -
‘నేరడి’ ఆశలు పదిలం
నేరడి బ్యారేజ్(భామిని): వంశధార విస్తరణ ప్రాజెక్టుపై ఆశలు చిగురిస్తున్నాయి. రైతు బాంధవుడు, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్రెడ్డి కలల ప్రాజెక్టు సాకారం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లా రైతుల ఆశల పంట పండనుంది. సుమారు 3.5 లక్షల ఎకరాలకు సాగు అందించే ఈ ప్రెజెక్టు నిర్మాణానికి అనుమతులు లభించే అవకాశాలు మెరుగుపడ్డాయి. పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యుపీఆర్ఎస్)లో ఈ ప్రాజెక్టుపై శుక్రవారం మోడల్ సర్వే జరిగినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. వంశధార ట్రిబ్యునల్ కమిటీ చైర్మన్ జస్టిస్ డాక్టర్ ముకుందం శర్మ, సభ్యులు ఎం.ఎస్.చతుర్వేది, గులాం మహ్మద్లు ప్రాజెక్టు నమూనా ఆధారంగా వరద ప్రవాహాన్ని పరిశీలించి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం అందింది. ఒడిశా అభ్యంతరాలతో దశాబ్దాలుగా అంతర్ రాష్ట్ర వివాదంలో ఈ ప్రాజెక్టు నలుగుతున్న విషయం తెలిసిందే. దీంతో వంశధార ప్రాజెక్టు స్టేజ్-2లో భాగంగా భామిని మండలం నేరడి వద్ద బ్యారేజ్ నిర్మాణ ప్రతిపాదన అలాగే ఉండిపోయింది. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాద పరిష్కారానికి సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య ట్రిబ్యునల్ కమిటీ జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలు, పూణే రీసెర్చ్ స్టేషన్లో జరిపిన అధ్యయనాల ఆధారంగా సమస్య పరిష్కారానికి మార్గం అన్వేషిస్తోంది. నమూనా పరిశీలనలో వీగిన ఒడిశా వాదన పూనేలో జరిపిన నమూనా పరిశీలనలో తమ ప్రాంతాలకు వరద ముప్పు ఉందన్న ఒడిశా వాదన వీగిపోయినట్లు తెలిసింది. ప్రాజెక్టు నిర్మిస్తే.. నదిలో 6 లక్షలపైచిలుక వరద ప్రహించినప్పుడు దాని బ్యాక్వాటర్తో తమ రాష్ట్రంలోని 10.5 కి.మీ. ప్రాంతం ముంపునకు గురవుతుందని ఒడిశా వాదిస్తోంది. ఈ నమూనా ప్రయోగంలో 6.5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహ పరిస్థితిని పరిశీలించగా ఎగువన ఒడిశాలోని 6.5 కి.మీ. లోపే ప్రమాదం ఉంటుందని గుర్తించారు. ఈ పరిశీలన ఒడిశా వాదనను బలహీనపరుస్తోంది. ఒడిశా ప్రభుత్వం వేసిన పిటిషన్ ఆధారంగా సుప్రీంకోర్టు సమస్యపై అధ్యయనానికి త్రిసభ్య కమిటీని నియమించింది. తొలిసారిగా ఈ కమిటీ 2013 ఏప్రిల్ 22న పర్యటించి వివాద స్థలాన్ని, ముంపు ప్రాంతాలను పరిశీలించింది. 2013 మే 13 నుంచి 21 వరకు కేంద్ర జల సంఘం పర్యవేక్షణలో ఆంధ్రా-ఒడిశా ఇంజినీరింగ్ బృందాలు నేరడి బ్యారేజ్కు ఎగువ, దిగువ ప్రాంతాల్లో రీసర్వే చేసి సీడబ్ల్యుఎస్కు నివేదించాయి. తిరిగి ఈ ఏడాది మార్చి 21న ట్రిబ్యునల్ కమిటీ నేరడి బ్యారేజ్ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించింది. కాగా గత నెల 25 నుంచి ఇరు రాష్ట్రాల వాదనలు విన్న ట్రిబ్యునల్ ఒడిశాలో ముంపు నష్టాలు, అవసరమైన రక్షణ గోడలు, వరద గట్ల నిర్మాణ ప్రతిపాదనలపై పూర్తిస్థాయి నివేదికలు ఇవ్వాలని ఆదేశించడంతో విచారణ నిర్ణయాత్మక దశకు చేరుకుందని వంశధార ప్రాజెక్టు అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూణేలో జరిగిన మోడల్ సర్వేలో త్రిసభ్య కమిటీతో పాటు వంశదార ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ శివరాంప్రసాద్, ఎస్ఈ రాంబాబు, డీఈఈలు నాగేశ్వరరావు, వెంకటరమణలు పాల్గొన్నారు.త్వరలో మరోసారి ప్రాజెక్టు ప్రాంతంలో ఇరురాష్ట్రాల అధికారులు సర్వేలు చేయనున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement