breaking news
Central Electricity Regulatory Commission
-
సీఈఆర్సీ ఉత్తర్వులు..రూ.20కి ‘హైప్రైస్’ కరెంట్!
సాక్షి, హైదరాబాద్: వేసవిలో దేశవ్యాప్తంగా డిమాండ్ భారీగా పెరిగిన నేపథ్యంలో హైప్రైస్ సెగ్మెంట్ కింద విద్యుత్ ఎక్చేంజీల్లో యూనిట్కు రూ.20 గరిష్ట పరిమితితో విద్యుత్ను విక్రయించుకోవడానికి అనుమతిస్తూ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ) ఉత్తర్వులు జారీ చేసింది. హైప్రైస్ డే అహెడ్ మార్కెట్ సెగ్మెంట్ పేరుతో ఈ విక్రయాలు జరపుకోవచ్చు. ఇతర సెగ్మెంట్ల కింద యూనిట్కు రూ.10 గరిష్ట పరిమితితో విక్రయాలు జరపాలని ఆదేశించింది. గతేడాది వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో ఎక్చేంజీల్లో ధరలు ఆకాశాన్ని తాకాయి. దీంతో ఎక్చేంజీల్లో విక్రయించే ధరలపై యూనిట్కు రూ.12 గరిష్ట పరిమితి విధిస్తూ 2022 జూన్ 30న సీఈఆర్సీ సుమోటో ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా జారీ చేసిన ఉత్తర్వులతో పవర్ ఎక్చేంజీల్లో విద్యుత్ ధరలు యూనిట్కు హైప్రైస్ సెగ్మెంట్ కింద రూ.0–20, ఇతర సెగ్మెంట్ల కింద రూ.0–10 వరకు ఉంటాయి. మరుసటి రోజుకు అవసరమైన అదనపు విద్యుత్ను ఒకరోజు ముందే విద్యుత్ ఎక్చేంజిల్లో డే అహెడ్ మార్కెట్, గ్రీన్ డే అహెడ్ మార్కెట్ విధానంలో డిస్కంలు కొనుగోలు చేస్తాయి. అదేరోజు అవసరమైన విద్యుత్ను కనీసం 15 నిమిషాల ముందు రియల్ టైమ్ మార్కెట్ విధానంలో బుక్ చేసుకుంటాయి. ఈ విభాగాల కింద రూ.0–10 ధరతో యూనిట్ విద్యుత్ విక్రయాలకు తాజాగా సీఈఆర్సీ అనుమతిచ్చింది. దిగుమతి చేసిన బొగ్గు/గ్యాస్ ఆధారిత విద్యుత్ను ఎక్చేంజీల్లో హైప్రైస్ డే అహెడ్ మార్కెట్ విభాగం కింద యూనిట్కు రూ.50 ధరతో విక్రయించడానికి ఇండియన్ ఎనర్జీ ఎక్చేంజీకి అనుమతిస్తూ ఫిబ్రవరి 16న సీఈఆర్సీ ఉత్తర్వులిచ్చింది. తాజా ఆదేశాలతో యూనిట్కు రూ.20 గరిష్ట ధరతో హైప్రైస్ విద్యుత్ అమ్ముకోవడానికి అన్ని పవర్ ఎక్చేంజీలకు అనుమతిచ్చినట్టు అయింది. -
టాటా పవర్
ఎందుకంటే: ప్రైవేట్ రంగ దిగ్గజ విద్యుత్ కంపెనీల్లో ఒకటైన ఈ కంపెనీ షేర్ రూ.142 స్థాయిల నుంచి రూ.80కు పడిపోయింది. పలు అనుకూలమైన అంశాలు సమీప భవిష్యత్తులో ఈ కంపెనీ షేర్ పెరుగుదలకు దోహద పడనున్నాయి. ఇండోనేసియా బొగ్గు గనుల్లో 30% వాటా విక్రయించాలని యాజమాన్యం నిర్ణయించడం దీంట్లో మొదటిది. ఈ వాటా విక్రయం కారణంగా కంపెనీకి రూ.3,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. దీంతో కంపెనీ రుణ భారం గణనీయంగా తగ్గనున్నది. ఏడాదికి వడ్డీ భారం రూ.300 కోట్లు తగ్గుతాయి. రైట్స్ ఇష్యూ ద్వారా రూ.2,000 కోట్లు సమీకరించాలని గత వారంలో కంపెనీ డెరైక్టర్ల బోర్డ్ నిర్ణయించింది. ఇది రెండోది. ఈ నిధుల కారణంగా కూడా రుణ భారం తగ్గనున్నది. ముంద్రా ప్రాజెక్ట్ విషయంలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(సెర్క్) ఇచ్చిన ఉత్తర్వులు ఈ కంపెనీకి ప్రయోజనం కలిగించడం మూడవది. ఫలితంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆర్థిక ఫలి తాలు అంచనాలను మించనున్నాయి. ప్రస్తుతం 9,000 మెగావాట్లుగా ఉన్న కంపెనీ కెపాసిటీ ఐదేళ్లలో 25 వేల మెగావాట్లకు పెరగనున్నది. వీటన్నింటి దృష్ట్యా ప్రస్తుత ధర వద్ద కొనుగోళ్లకు ఈ షేర్ ఆకర్షణీయంగా ఉందని భావిస్తున్నాం. ఏడాది కాలానికి టార్గెట్ ధరను నిర్ణయించాం.