-
మొసలి నోటికి చిక్కిన మహిళ.. గంట తర్వాత బయటపడిందిలా..!
ఈ భూమి మీద నూకలున్నంత వరకూ ప్రాణం ఎలాగైనా నిలబడుతుందంటారు. ఇది 38 ఏళ్ల మహిళ విషయంలో నిరూపితమయ్యింది. ఒక భారీ మెసలి ఆమెపై దాడి చేసింది. నీటిలోతుల్లోకి లాక్కుపోయింది. గంట పాటు ఆ మహిళను మొసలి నోటిలో చిక్కుకుని విలవిలలాడిపోయింది. అయితే అప్పుడే అద్భుతం జరిగింది. ఆమె ప్రాణాలతో బయటపడింది. సోషల్ మీడియాలో ఆమె కథ విపరీతంగా వైరల్ అవుతోంది. మెట్రో యూకే తెలిపిన వివరాల ప్రకారం 38 ఏళ్ల ఫమ్లిరా.. పామ్ ఆయిల్ తోటల్లో పనిచేస్తుంటుంది. ఇటీవల ఆమె ఒక నదిలో నీటిని పాత్రలో పట్టుకుంటోంది. ఆ నదిలో మొసళ్లు ఉన్న సంగతి ఆమెకు తెలియదు. ఇంతలో ఒక మొసలి క్షణాల్లో ఆమెను నీటిలోనికి లాక్కుపోయింది. ఫ్లమిరా బాధతో తనను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేసింది. ఆమెతో పాటు పనిచేసే కూలీలు ఆమెను కాపాడేందుకు పరుగులు పెట్టారు. వారు ఆ మొసలిని కర్రలతో కొట్టాసాగారు. దీంతో బాధితురాలు ఆ మెసలి నోటి బారి నుంచి ఎలాగోలా బయటపడింది. అయితే ఆమెను కాపాడేందుకు కూలీలు గంటకుపైగా శ్రమించారు. ఈ సమయంలో ఫల్మిరా కూడా మొసలి బారి నుంచి బయటపడేందుకు ప్రయత్నించింది. అటు కూలీల దాడి, ఇటు బాధితురాలి పెనుగులాట మధ్య ఆ మొసలి ఆమెను తన నోటి నుంచి విడిచిపెట్టింది. బాధితురాలిని మొసలి బారి నుంచి తప్పించేందుకు ప్రయత్నించిన కొందరు గాయాలపాలయ్యారు. ప్రాణాలతో బయటపడిన ఫమ్లిరా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మొసలి నోటికి చిక్కిన తాను దాని బారి నుంచి బయటపడుతాననుకోలేదన్నారు. ఇప్పటికీ తన కళ్ల ముందు మొసలి ఉన్నట్లుందన్నారు. కాగా మొసలి దాడిలో ఫల్మిరా పాదాలకు, ఉదర భాగానికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఇది కూడా చదవండి: ఎందుకు పెంచుకున్నారు? ఎందుకు చంపేశారు? -
సారొచ్చారొచ్చారు
- నూతన కలెక్టర్ కాకినాడకు రాక - పాత కలెక్టర్ అరుణ్ కుమార్ సాదర స్వాగతం సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లా పాలనా పగ్గాలు చేపట్టేందుకు కొత్త సారథి వచ్చేశారు. ఆయన రాకతో రెండేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్న పాత సారథికి వీడ్కోలు పలికారు. ఇదంతా బుధవారం రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల మధ్య జరిగింది. రాజమహేంద్రవరం మధురపూడి ఎయిర్పోర్టు నుంచి ప్రైవేటు కారులో కాకినాడ కలెక్టర్ బంగ్లాకు రాత్రి 7.30 గంటలకు వచ్చారు. బంగ్లాలో ప్రస్తుత కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్తో సుమారు గంట సేపు భేటీ అయ్యారు. సుమారు గంటపాటు వీరిద్దరూ సమావేశమయ్యారు. జిల్లా పాలనా వ్యవహారాలు, భౌగోళిక, సామాజిక, రాజకీయ పరిస్థితులపై సుమారు గంటపాటు ఇద్దరూ చర్చించుకున్నారు. అనంతరం ప్రస్తుత కలెక్టర్ అరుణ్కుమార్ విధుల నుంచి రిలీవ్ అవుతున్నట్టు రికార్డుల్లో సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కాకినాడ, పెద్దాపురం, రామచంద్రపురం ఆర్డీఓలు రఘుబాబు, విశ్వేశ్వరరావు, కొమ్ముల సుబ్బారావు, సమాచార శాఖ డీడీ ఫ్రాన్సిస్ తదితర అధికారులు బంగ్లాలో కొత్త కలెక్టర్ కార్తికేయను కలిసి స్వాగతం పలికారు. కొత్త కలెక్టర్ను పరిచయం చేసుకున్నాక రామచంద్రపురం, పెద్దాపురం ఆర్డీఓలను తమ, తమ ప్రాంతాలకు వెళ్లిపోవాలని చెప్పిన కొత్త కలెక్టర్ మిశ్రా కాకినాడ ఆర్డీఓ రఘుబాబుకు మాత్రం ఉదయం రావాలని సూచించారు. కలెక్టర్ బంగ్లా నుంచి రాత్రి 8.30 గంటలకు కార్తికేయ కలెక్టరేట్ ఆవరణలోని ఆర్అండ్బీ అతిథి గృహానికి చేరుకుని అక్కడే బస చేశారు. అరుణ్కుమార్ రిలీవ్ కావడంతో కొత్త కలెక్టర్ మిశ్రా బాధ్యతలు తీసుకోవడం ఇక లాంఛనమేనంటున్నారు. మిశ్రా గురువారం ఉదయం 10 గంటల తరువాత మిశ్రా జిల్లా 145 కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. 2009 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన కార్తికేయ మిశ్రా ఇంతవరకు పరిశ్రమల శాఖ డైరెక్టర్గా పనిచేస్తూ తొలిసారి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపడుతున్నారు. ముక్కుసూటి మనస్తత్వం కలిగిన మిశ్రా ఇంత పెద్ద జిల్లా పాలనను ఎలా నిర్వహిస్తారా అని అటు జిల్లా యంత్రాంగం, ఇటు జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. రెండేళ్లపాటు ఇక్కడ కలెక్టర్గా పనిచేసి రిలీవ్ అయిన అరుణ్కుమార్ స్త్రీ, శిశుసంక్షేమశాఖ కమిషనర్గా వెళ్లనున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ పదోన్నతిపై కర్నూలు కలెక్టర్గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జేసీగా ఎవరు వస్తారనేది ఒకటి, రెండు రోజుల్లో తేలిపోనుంది. జేసీ పోస్టు కోసం రాజమహేంద్రవరం కార్పొరేషన్ కమిషనర్ విజయరామరాజు, కాకినాడ పోర్టు డైరెక్టర్ ప్రసన్నవెంకటేష్ ప్రయత్నాల్లో ఉన్నారని అధికారవర్గాల ద్వారా తెలియవచ్చింది. -
అప్పుడు అదృశ్యం...ఇప్పుడు ప్రత్యక్షం
20 ఏళ్ల క్రిందట అదృశ్యమైన తమ్ముడు ఆకస్మికంగా ప్యత్యక్షం ... ఆ కుటుంబాల్లో ఆనందం ఇరవై ఏళ్ల కిందట ... పదిహేనేళ్ల వయసులో ఇంట్లో అలిగి పారిపోయాడు. కడుపు మాడితే వాడే వస్తాడులే అనుకున్నారు. ఒకటి, రెండు రోజులు ఎదురు చూశారు. అప్పటికీ రాకపోవడంతో కుటుంబ సభ్యులతోపాటు బంధువులు, సన్నిహితులు, స్నేహితులు ఒక్కటై వెదికారు. ఫలితం కనిపించలేదు. ఆశలు వదులుకున్నారు. ఈ ఘటన 1997 మే నెలలో జరిగింది. 20017 ఏప్రిల్ నెల ... సరిగ్గా 20 ఏళ్ల తర్వాత నాడు అదృశ్యమైన కుర్రాడు ఓ కేసు విచారణలో ఊరు పేరు బయటపడడంతో అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్కు తీసుకువచ్చి తన కుటుంబ సభ్యులను పిలిపించడంతో ఉద్విగ్న పరిస్థితులు నెలకున్నాయి. - అమలాపురం టౌన్ 20 ఏళ్ల క్రితం ఏం జరిగింది? అమలాపురం రూరల్ మండలం సాకుర్రు గ్రామానికి చెందిన శిరగం బాలకృష్ణ అన్నదమ్ములు పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవించే వారు. ఆ అన్నదమ్ముల్లో చివరి వాడైన శిరగం రాంబాబు (15) తన అన్నల వ్యాపారంలో తన వంతు సాయపడేవాడు. వీరి తల్లిదండ్రులు చిన్నతనంలో మరణించారు. దీంతో రాంబాబు తన ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు అక్కలు దగ్గరే పెరిగాడు. ఓ రోజు ఇంట్లో కోపగించి హైదరాబాద్ వెళ్లిపోయాడు. కొన్నాళ్లు రాంబాబు కోసం బంధువులు, స్నేహితులు ఇళ్ల వద్ద గాలించినా ప్రయోజనం లేదు. ఈ లోపు అక్కలకు పెళ్లిళ్లు కావడం, అన్నయ్యలు పండ్ల వ్యాపారాలతో వేరే గ్రామాల్లో స్థిరపడ్డారు. ఎక్కడెక్కడ పనిచేశాడు.. రాంబాబు ఇంట్లోంచి 15వ ఏట వెళ్లిపోయి హైదరాబాద్ చేరుకున్నాడు. అక్కడే ఇరవై ఏళ్లుగా కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ షామియానా షాపులో కూలీగా పదేళ్లు పనిచేశాడు. బోయినపల్లిలో ఓ పంక్షన్ హాలులో మరో పదేళ్లు కూలీగా పనిచేశాడు. అయితే మూడు నెలల క్రితం అమలాపురం వచ్చి పట్టణంలోని ఓ పాత ఇనుము, ప్లాస్టిక్ సామాన్ల దుకాణంలో పనిచేస్తున్నాడు. పోలీసు స్టేషన్కు వచ్చిందిలా.. పట్టణంలో మంగళవారం సాయంత్రం రోడ్డుపై రాంబాబు, మరో వ్యక్తి ఓ విషయమై గొడవ పడ్డారు. అవతలి వ్యక్తి ఫిర్యాదుతో రాంబాబును స్టేషన్ క్రైం పార్టీ హెడ్ కానిస్టేబుళ్లు అయితాబత్తుల బాలకృష్ణ, బత్తుల రామచంద్రరావు స్టేషన్కు తీసుకుని వచ్చి విచారించారు. అసలు నీది ఏ ఊరు?, నీ వాళ్లు ఎవరు? అని ఆరా తీశారు. రాంబాబు మాది సాకుర్రు గ్రామమని, గతంలో ఇళ్లు విడిచి వెళ్లిపోయానని... ఇప్పుడు మా వాళ్లు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదని బదులిచ్చాడు. దీంతో పోలీసులు సాకుర్రులోని రాంబాబు బంధువులను రప్పించి సమాచారం చెప్పారు. అంబాజీపేటలో ఉంటున్న రాంబాబు అన్నయ్య బాలకృష్ణకు, సాకుర్రులో ఉంటున్న అక్క నల్లా ఆదిలక్ష్మి కుటుంబాలకు బంధువులు సమాచారం అందించి బుధవారం మధ్యాహ్నం పోలీసు స్టేషన్కు రప్పించారు. 20 ఏళ్ల తర్వాత రాంబాబును చూసి అన్నయ్య, అక్క కుటుంబాల వారు ఉద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నందుకు వారి ఆనందానికి అవుధుల్లేవు. మొత్తానికి కథ కంచికి.. రాంబాబు ఇంటికి చేరాడు. -
అన్నీ ఇచ్చి.. ఆదరణ కరువై...
కుమారుడు పట్టించుకోవడం లేదని ఆర్డీఓ కోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు పాల్వంచ రూరల్: నవమాసాలు మోసి.. అష్టకష్టాలు పడి కనిపెంచిన కొడుకు... మలిదశలో ఆదుకోవాల్సిందిపోయి వేధిస్తున్నాడని, తమకు న్యాయం చేయాలంటూ ఓ వృద్ధ తల్లిదండ్రులు ఆర్డీఓ కోర్టును ఆశ్రయించారు. పాల్వంచలోని ఆర్డీఓ కోర్టుకు ఆ వృద్ధ దంపతులు మంగâýæవారం హాజరయ్యారు. ములకలపల్లి మండలం చాపరాలపల్లి గ్రామానికి చెందిన నున్నా సూరయ్య (85), నున్నా రమణమ్మ (80) దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. సూరయ్యకు 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కొంత భూమిని కూతుâýæ్లకు ఇవ్వగా, మిగిలిన కొంత కుమారుడు నున్నా నర్సింహారావుకు ఇచ్చారు. కొంతకాలం తన దగ్గర ఉంచుకుని, ఇటీవల తల్లిదండ్రులను కుమారుడు పట్టించుకోకుండా వదిలేశారు. దీంతో తల్లిదండ్రులు అదే గ్రామంలో ఉన్న కూతుళ్ల వద్ద ఆశ్రయం పొందుతున్నారు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ చేయడంతో తానే సంరక్షిస్తానని అంగీకరించిన కుమారుడు తిరిగి పట్టించుకోవడం లేదు. దీంతో వృద్ధ దంపతులు ఎ¯ŒSజీఓ మహిళా సాధికారత సంస్థ ఉమె¯ŒS ఎంపవర్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు మందపల్లి ఉమను ఆశ్రయించారు. కుమారుడు నర్సింహారావు తీరుపై మూడు వారాల క్రితం పాల్వంచ ఆర్డీఓ కోర్టును ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు మంగâýæవారం ఆర్డీఓ కోర్టు ఎదుట తల్లిదండ్రులు, కుమారుడు హాజరయ్యారు. ఆర్డీఓ విచారణ నిర్వహిన్నారు. -
అమాయక పౌరుల్ని చంపేందుకే వచ్చా..!
శ్రీనగర్ః భద్రతా బలగాలకు సజీవంగా చిక్కిన పాకిస్తానీ టెర్రరిస్ట్ బహదూర్ అలి.. తాను అమాయక పౌరుల్ని చంపేందుకే పాకిస్తాన్ నుంచీ కశ్మీర్ కు వచ్చినట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ముందు తెలిపాడు. కశ్మీర్ లో భద్రతా బలగాలు అరెస్టు తర్వాత.. అతనిని విచారించిన ఎన్ఐఏ ముందు ఈ విచిత్ర ప్రకటన చేశాడు. శ్రీనగర్ లో భద్రతాబలగాలకు చిక్కిన ఉగ్రవాది బహదూర్ అలి ఎన్ఐఏ విచారణ సందర్భంలో అశ్చర్యకర నిజాలను వెల్లడించాడు. బహదూర్ అలి.. అలియాస్ సైఫుల్లా తాను కశ్మీర్ కు సాధారణ, అమాయక ప్రజలను చంపేందుకే పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు ఎన్ఐఏ విచారణలో తెలిపాడు. అంతేకాదు తాను గెరిల్లా వార్ ఫేర్ లోని లష్కరే తోయిబాలో (ఎల్ఈటీ) శిక్షణ పొందినట్లు చెప్పడంతోపాటు, జమాత్ ఉద్ దవా (జుద్) ఛీఫ్ హఫీజ్ సయీద్ ను కూడా రెండుసార్లు కలిసినట్లు ఆ 22 ఏళ్ళ టెర్రరిస్ట్ ఎన్ఐఏకు తెలిపాడు. దీనికితోడు తాను పాక్ లో ఏర్పాటైన కంట్రోల్ రూమ్ తో నిత్యం సంప్రదింపులు కూడా జరిపినట్లు చెప్పాడు. దీంతో బహదూర్ అలి లాహోర్ నగరానికి చెందిన పాకిస్తాన్ జాతీయుడని విచారణలో హోం మంత్రిత్వశాఖ నిర్థారించింది. అలాగే కేంద్ర హోం శాఖ సహాయమంత్రి హన్స్ రాజ్ అహిర్ కూడా అతడి గుర్తింపును ధ్రువీకరించారు. కుప్వారా జిల్లా నౌగామ్ సెక్టర్ సమీపంలో భద్రతాబలగాల కాల్పుల్లో మరో నలుగురు ఎల్ఈటీ ఉగ్రవాదులు చనిపోగా బహదూర్ అలి మాత్రం సజీవంగా పట్టుబడ్డాడు. అతనివద్ద నుంచీ మూడు ఏకే-47 రైఫిల్స్, రెండు తుపాకులు, 23 వేల రూపాయలు కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. గత రెండు నెలల కాలంలో సరిహద్దు జిల్లాల్లో పాకిస్తానీ టెర్రరిస్టును సజీవంగా పట్టుకోవడం ఇది రెండోసారి కాగా.. పాక్ ఆక్రమిత కశ్మీర్ టీట్వాల్ ప్రాంతంనుంచీ తీవ్రవాదులు లోయలోకి ప్రవేశించినట్లు హోం శాఖ వర్గాలు తెలిపాయి. ముందుగా టాంగ్ధర్ సెక్టర్ లోకి ప్రవేశించిన టెర్రరిస్టులు.. అక్కడినుంచీ లీపా లోయలోకి వెళ్ళి అనంతరం ఎన్ కౌంటర్ జరిగిన అడవీప్రాంతంలో దాక్కున్నట్లు హోంశాఖ వెల్లడించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక
కాంగ్రెస్తోనే కుల వృత్తులకు మహర్దశ
అంతటా యజ్ఞ సహిత యోగా నిర్వహించాలి
ముగిసిన హోం ఓటింగ్
జిల్లా రద్దు అంశంపై ఫోకస్..
మల్లారంలో నేరడిగొండవాసి హత్య
ఎల్లారెడ్డి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్కు నోటీసులు?
హైదరాబాద్పై కుట్ర
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement