breaking news
C-Class Grand Edition
-
మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరల పెంపు
న్యూఢిల్లీ: మెర్సిడెస్ బెంజ్ జనవరి ఒకటి నుంచి కొన్ని మోడళ్ల ధరలను 2% వరకు పెంచనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇన్పుట్ వ్యయాలు, కమోడిటీ ధరలు, రవాణా సరఫరా ఖర్చులు అధికమవడంతో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కారణంగా కార్ల ధరలు పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. సీ–క్లాస్ కారుపై రూ.60,000 నుంచి, టాప్ ఎండ్ మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్680పై రూ.3.4 లక్షల వరకు పెంపుదల ఉంటుంది. మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఏ–క్లాస్ సెడాన్ నుంచి ఎస్యూవీ జీ63 ఏజీఎం వరకు వివిధ మోడళ్ల కార్లను రూ.46 లక్షలు – రూ.3.4 కోట్ల ధరల శ్రేణిలో విక్రయిస్తుంది. -
మెర్సిడెస్ సి-క్లాస్ గ్రాండ్ ఎడిషన్
ముంబై: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ బెంజ్ కొత్త సి-క్లాస్ గ్రాండ్ ఎడిషన్ కారును మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభించే ఈ కారు ధరలు రూ.36.81 లక్షల నుంచి రూ.39.16 లక్షల రేంజ్లో(ఎక్స్ షోరూమ్, ముంబై) ఉన్నాయని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో ఇబర్హర్డ్ కెర్న్ తెలిపారు. పుణేలోని చకన్ ప్లాంట్లో 50వేల కార్లు ఉత్పత్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సి-క్లాస్ గ్రాండ్ ఎడిషన్ను అందిస్తున్నామని వివరించారు. కారు ప్రత్యేకతలు..: 2,143 సీసీ (డీజిల్), 1,796 సీసీ (పెట్రోల్), ఇంజిన్ సామర్థ్యం శాటిలైట్ నావిగేషన్తో కూడిన మల్టీ కలర్ డిస్ప్లే. కొత్త పనోరమిక్ సన్రూఫ్. 7జీ-ట్రానిక్ ప్లస్ ఆటోమాటిక్ గేర్ బాక్స్, బై గ్జెనాన్ హెడ్ల్యాంప్స్, ఏఎంజీ బాడీ కిట్ . ఆరు ఎయిర్బ్యాగ్లు, అటెన్షన్ అసిస్ట్ తదితర సేఫ్టీ ఫీచర్లున్నాయి.