breaking news
bye -Election
-
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. ‘నేనే మాగంటి గోపినాథ్ వారసుడిని’..
సాక్షి,హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత ఎంపికలో బిగ్ట్విస్ట్ చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ వారసుడిని తానేనంటూ తారక్ ప్రద్యుమ్న తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు.ఆ లేఖలో ‘తన తల్లి మాలినీ దేవిని హిందూ వివాహ చట్ట ప్రకారం.. మాగంటి గోపీనాథ్ పెళ్లి చేసుకున్నారు. గోపీనాథ్ భార్య అంటూ సునీత తప్పుడు సమాచారం ఇస్తున్నారు. సునీత అఫిడవిట్ను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఇప్పటికే మాగంటి సునీత నామినేషన్కు ఈసీ ఆమోదం తెలిపింది. మరోవైపు షేక్పేట్ ఆర్వో కార్యాలయానికి మాగంటి సునీత వచ్చారు. నామినేషన్లో తాను పేర్కొన్న అంశాలన్నీ సరైనవేనంటూ ఎన్నికల అధికారులకు డిక్లరేషన్ ఫారమ్ అందజేశారు. -
రేపే దీపక్ రెడ్డి నామినేషన్.. ముగ్గురు బీజేపీ ముఖ్యమంత్రుల రాక!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికపై ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీలు విజయం కోసం ప్రణాళికలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు.. ఉప ఎన్నిక నేపథ్యంలో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు అవుతున్నాయి.ఇక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి రేపు(మంగళవారం) తన నామినేషన్ వేయనున్నారు. ఈ క్రమంలో యూసఫ్గూడ హైలం కాలనీ నుంచి షేక్పేట్ తహశీల్దార్ ఆఫీస్ వరకు నామినేషన్ ర్యాలీ చేపట్టనున్నట్టు సమాచారం. ఆయన నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముగ్గులు సీఎంలు ముఖ్యఅతిథిలుగా రానున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే గోవా సీఎం ప్రమోద్ సావంత్ అధికారికంగా కన్ఫరేషన్ ఇచ్చారు. అసోం, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల కన్ఫరేషన్ కోసం తెలంగాణ బీజేపీ నేతలు ఎదురుచూస్తున్నారు. కాగా, నామినేషన్ ర్యాలీలో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొననున్నారు. పెద్ద ఎత్తున జనసమీకరణతో భారీ ర్యాలీకి తెలంగాణ బీజేపీ ప్లాన్ చేసింది. -
బిహార్లో రెండు విడతల్లో ఎన్నికలు
సాక్షి,న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆసక్తిరేపుతోన్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండుదశల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం (అక్టోబరు 6న) 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ బిహార్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నవంబర్ 6న తొలిదశ ఎన్నికల పోలింగ్నవంబర్ 11 రెండోదశ ఎన్నికల పోలింగ్నవంబర్ 14న కౌంటింగ్ తొలిదశ ఎన్నికకు ఈ నెల 10న నోటిఫికేషన్ విడుదలబిహార్ అసెంబ్లీ స్థానాలు, ఓటర్ల వివరాలు బిహార్లో 243అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలుమొత్తం ఓటర్లు 7.42కోట్లు జూన్ 24నుంచి ఓటర్ల అభ్యంతరాలను స్వీకరించాంఆగస్టు 1న తుది జాబితా ప్రకటించాంనామినేషన్ల కంటే 10 రోజల ముందు వరకు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవచ్చుబీహార్లోని 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నవంబర్ 22 నాటికి పూర్తవుతాయి. 22ఏళ్ల తర్వాత బిహార్లో ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో సంస్కరించాం. 90వేల 712కేంద్రాల్లో ఎన్నికల పోలింగ్ 14లక్షల మంది కొత్త ఓటర్లు100ఏళ్లకు పైబడిన ఓటర్లు మొత్తం 14వేలఎన్నికల్లో 17 సంస్కరణలు బిహార్ ఎన్నికల నుంచి 17 కొత్త సంస్కరణలు తీసుకొచ్చాంప్రతి పోలింగ్ స్టేషన్లో ఓటర్ల సంఖ్యను 1,200కి పరిమితం చేశాంగతంలో నలుపు, తెలుపు రంగులో ఉండే సీరియల్ నంబర్ ఫాంట్ను వినియోగించాం. అభ్యర్థుల ఫోటోలు ఇప్పుడు రంగులో ఉంటాయి. -
ఖేడ్లో జోరుగా ప్రచారం
♦ దూసుకెళ్తున్న కారు మండలాలను ♦ చుట్టివస్తున్న కాంగ్రెస్, టీడీపీ నేతలు ♦ పోటాపోటీగా ప్రచారం నారాయణఖేడ్: ఉప ఎన్నిక సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఖేడ్ నియోజకవర్గంలో అన్ని పార్టీల ప్రచారం ఊపందుకుంది. దీంతో పార్టీల నేతలు గ్రామాలను చుట్టివస్తున్నారు. ఉదయం నుంచి రాత్రివరకు ప్రచార హోరు సాగుతోంది. గ్రామాల్లో ఎన్నికల వేడి రగిలింది. క్షేత్రస్థాయి సభలు, సమావేశాలు, పర్యటనల హోరు కొనసాగుతోంది. పార్టీలు పోటాపోటీ ప్రచారానికి దిగాయి. ముఖ్యంగా ప్రచారంలో కారు జోరుమీదుంది. ఆ పార్టీ తరఫున రాష్ట్ర మంత్రి హరీశ్రావు క్షేత్రస్థాయి ప్రచారం కొనసాగిస్తున్నారు. నిత్యం పది, పన్నెండు గ్రామాల్లో ఆయన ప్రచారం చేస్తున్నారు. ఉదయం నుంచి మొదలయ్యే ప్రచారం రాత్రి వరకు కొనసాగుతోంది. నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత నారాయణఖేడ్, మనూరు, కంగ్టి, కల్హేర్ మండలాల్లోని పలు గ్రామాలను ఇప్పటికే మంత్రి చుట్టివచ్చారు. ఈనెల 10వ తేదీవరకు మంత్రి పర్యటన షెడ్యూల్ను ఆ పార్టీ ఖరారు చేసింది. ముఖ్యంగా ఖేడ్ వెనుకబాటుతనం, విద్య, వైద్యం, ఉద్యోగావకాశాలు, ఉపాధి, తాగు, సాగు నీటి అవసరాలను వివరిస్తూ ఓటర్లను చైతన్యపరుస్తున్నారు. గత పాలకుల వివక్ష, అణచివేత, పోలీసు కేసులను మంత్రి ప్రధాన ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నారు. దీంతోపాటు తాము చేపట్టబోయే అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. తాను మాటలు చెప్పడంకాదని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని, మాటకోసం ప్రాణమైనా ఇస్తానంటూ సభల్లో మంత్రి పేర్కొంటుండడంతో ప్రజలనుంచి అనూహ్య స్పందన వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో జనం తాగునీటికోసం అల్లాడుతున్నారు. నీటివనరుల వట్టిపోవడం, విద్య, ఉపాధి, వైద్యం తదితర రంగాల్లో వెనుకబాటును మంత్రి ప్రస్థావిస్తూ ఉండడంతో ప్రజలనుంచి స్పందన వస్తోంది. మంత్రితోపాటు ఎంపీ బీబీ పాటిల్, దుబ్బాక, సంగారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, చింతాప్రభాకర్, హన్మంతు షిండే తదితరులు టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, అభ్యర్థి సంజీవరెడ్డితో పాటు పార్టీ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. టీడీపీ తరఫున రాష్ర్ట రైతు విభాగం అధ్యక్షుడు వంటేరు ప్రతాప్రెడ్డి, అభ్యర్థి విజయపాల్రెడ్డి ప్రచారం చేన్నారు. ప్రధానంగా ఇక్కడ పోటీ మూడు పార్టీల మధ్యే ఉంది.


