-
నిరుద్యోగులకు బస్పాస్లో 20 శాతం రాయితీ
సాక్షి, హైదరాబాద్: పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగులకు బస్ పాస్ల్లో ఆర్టీసీ రాయితీ ప్రకటించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో మూడు నెలల పాస్లపై 20 శాతం చొప్పున రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాదగిరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం మూడు నెలల (క్వార్టర్లీ) ఆర్డినరీ బస్పాస్ రూ.3,450 ఉండగా.. 20 శాతం రాయితీ రూ.2800కు పాస్లు ఇస్తారు. మెట్రో మూడు నెలల పాస్ (క్వార్టర్లీ) ప్రస్తుతం రూ.3900. 20 శాతం డిస్కౌంట్ అనంతరం రూ.3120. రౌండెడ్ ఆఫ్తో రూ.3200కు పాస్లను పొందవచ్చు. పాస్ల కోసం తీసుకొనే గుర్తింపు కార్డుకు రూ.30 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఆర్టీసీ తాత్కాలిక బస్షెల్టర్లు రహదారుల విస్తరణ కారణంగా తొలగించిన బస్షెల్టర్ల స్థానంలో ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేసింది. తొలగించిన బస్షెల్టర్లను జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు పునర్నిర్మించకపోవడంతో ప్రయాణికులు మండుటెండల్లో పడిగాపులు కాస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల సదుపాయం కోసం 24 బస్టాపుల్లో తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాదగిరి తెలిపారు. భరత్నగర్ (ఎర్రగడ్డ వైపు), ప్రగతినగర్, ఎల్లంపేట్ క్రాస్రోడ్, ఆర్సీపురం, ఉప్పల్ (రేణుక వైన్స్), యాప్రాల్, కాచిగూడ క్రాస్రోడ్స్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, కొత్తగూడ ఎక్స్రోడ్స్, జియాగూడ గాంధీ విగ్రహం, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి, అడిక్మెట్, నారాయణగూడ (హిమాయత్నగర్ వైపు), బర్కత్పురా పీఎఫ్ ఆఫీస్, అఫ్జల్గంజ్, జిల్లెలగూడ, జైపురికాలనీ, మన్నెగూడ, ఎల్బీనగర్, ఉప్పల్ క్రాస్రోడ్స్, ఉప్పల్ డిపో తదితర ప్రాంతాల్లో టెంట్లు వేసి తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. (చదవండి: పుట్టగానే ఆధార్!) -
ఇంటికే బస్ పాస్
-
వికలాంగులకు బస్పాసు కౌంటర్
బస్పాసుల అందజేసిన డీఎం హేమంత్రావు ఇబ్రహీంపట్నం : వికలాంగులకు బస్పాసు కౌంటర్ను స్థానిక డీపో మేనేజర్ హేమంత్రావు సోమవారం ప్రారంభించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రతి నెల 25, 26 తేదీలల్లో వికలాంగులకు బస్పాసులను ఇవ్వానున్నట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం బస్స్టాండ్లో బస్పాస్ కౌంటర్ను ఏర్పాటు చేసామని ఈ ఆవకాశాన్ని వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం విహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కాళ్ల జంగయ్య మాట్లాడుతూ వికలాంగుల సిటీ బస్సుపాసులను ఇబ్రహీంపట్నంలో తీసుకునేవిధంగా ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసేందుకు సహకరించిన మంత్రి మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, డీఎం హేమంత్రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు వీరన్న, బీ. చంద్రశేఖర్, విహెచ్పీఎస్ నాయకులు శ్రీనివాస్, రమేష్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వికలాంగులకు డీఎం చేతుల మీదుగా బస్పాసులను అందజేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement