-
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్
-
ఆర్ఎంపీ డాక్టర్.. విలాసవంతమైన జీవనానికి అలవాటుపడి..
సాక్షి, హైదరాబాద్: అతను ఆర్ఎంపీ డాక్టర్.. విలాసవంతమైన జీవనానికి అలవాటుపడిన అతడికి వైద్యం చేస్తే వచ్చే డబ్బులు సరిపోలేదు. సులువుగా డబ్బులు సంపాదించేందుకు దొంగతనాల బాటపట్టాడు.. రాత్రి వేళల్లో ల్యాప్టాప్తో బస్సుల్లో ప్రయాణించే వారినే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తుంటాడు. మంగళవారం ఉదయం వనస్థలిపురంలోని పనామా క్రాస్రోడ్లో ల్యాప్టాప్ బ్యాగ్లతో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని ఎల్బీనగర్ సీసీఎస్ ఏసీపీ క్రైమ్ ఆర్.శేఖర్రెడ్డి, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.5 లక్షల విలువ చేసే 16 ల్యాప్టాప్లు, 5 సెల్ఫోన్లు, 2 పవర్ బ్యాంక్, ఒక వాచ్ స్వాధీనం చేసుకున్నారు. ► భద్రాచలం పట్టణంలోని జగదీష్ కాలనీకి చెందిన గుడికాడి నవీన్ కుమార్(41) ఖమ్మం జిల్లా పాల్వంచలోని లక్ష్మిదేవునిపల్లిలో ఆర్ఎంపీ డాక్టర్గా స్థిరపడ్డాడు. లగ్జరీ లైఫ్కు అలవాటు పడిన ఇతను డబ్బు కోసం చోరీలు చేస్తుంటాడు. రాత్రి సమయాల్లో వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు ప్రయాణిస్తుంటాడు. ల్యాప్టాప్ బ్యాగ్లతో బస్లలో ప్రయాణించడాన్ని గమనిస్తుంటాడు. వారితో పాటు తోటి ప్రయాణికుడిగా బస్ ఎక్కుతాడు. హైదరాబాద్లోని శివారు ప్రాంతాలకు బస్ చేరుకుంటుందనగా ల్యాప్టాప్ బ్యాగ్లను లాక్కొని రన్నింగ్ బస్ నుంచి సెకనులో దిగేసి పారిపోతాడు. లేదంటే దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం వంటి ప్రాంతాల్లోని బ్యాచ్లర్స్ రూమ్స్లలోకి చొరబడి ల్యాప్టాప్స్ను దొంగిలిస్తుంటాడు. ► చోరీలో భాగంగా గత నెల 8వ తేదీన ఫిర్యాదుదారుడు, అతని స్నేహితుడు ఇద్దరూ కలిసి నర్సరావుపేట నుంచి నిజాంపేట వెళ్లేందుకు హైదరాబాద్ బస్ ఎక్కారు. వాళ్లు పనిచేసే కంపెనీ ఇచ్చిన హెచ్పీ, డెల్ ల్యాప్టాప్లను తీసుకొని బస్లో కూర్చున్నారు. వాళ్ల మొబైల్ ఫోన్లను కూడా అదే బ్యాగ్లో పెట్టేసి పడుకున్నారు. ఇది గమనించిన నిందితుడు నవీన్ కుమార్ అదే బస్లో ఎక్కాడు. రిజర్వేషన్ చేసుకుంటే వివరాలు తెలిసిపోతాయని.. టికెట్కు సరిపోయే డబ్బులు చెల్లించి వారి పక్కనే కూర్చున్నాడు. బస్ ఆటోనగర్కు సమీపిస్తున్న సమయంలో నిందితుడు ల్యాప్టాప్ బ్యాగ్లతో దిగి పారిపోయాడు. మరుసటి రోజు ఉదయం చూసుకునేసరికి ల్యాప్టాప్ బ్యాగ్లు కనిపించకపోయేసరికి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ► గతంలో నవీన్ కుమార్ మీద వనస్థలిపురం, ఎల్బీనగర్, మీర్పేట, సరూర్నగర్ పోలీస్ స్టేషన్లలో 5 కేసులు నమోదయ్యాయి. చదవండి: అటవీ ప్రాంతంలో పేకాట.. -
అతడే ఒక సైన్యంలా..!
భువనేశ్వర్: ఓ జవాన్ తెగువ.. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరి ప్రాణాలను కాపాడగలిగింది. ఒడిశాలోని కియోంజర్ 2వ ప్రత్యేక భద్రతా దళానికి చెందిన జవాన్ హిమాంశు శేఖర పాత్రో కటక్ నుంచి భువనేశ్వర్కి బస్సులో ఆదివారం ఉదయం బయలుదేరాడు. డెంకనాల్ జిల్లా సమీపంలోకి రాగానే కొంతమంది దుండగులు బస్సుని ఆపారు. డ్రైవర్ తలపై తుపాకీ గురిపెట్టి బెదిరించారు. ప్రయాణికులు భయపడుతుండగా బస్సులో ఉన్న జవాన్ సాహసించి ఒక్కసారిగా దుండగుల వైపు దూకాడు. వారి చేతిలోని తుపాకీని స్వాధీనం చేసుకుని వారికే గురిపెట్టాడు. దీంతో భయపడిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆగంతకులు ఎవరు, ఎందుకు దాడి చేశారనే దానిపై విచారిస్తున్నట్లు డెంకనాల్ జిల్లా ఇన్చార్జ్ పోలీస్ సూపరింటెండెంట్ జగ్మోహన్ మీనా తెలిపారు. దుండగుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. చదవండి: (ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో దద్దరిల్లిన తుపాకీలు) ఘటనాస్థలంలో నిలిచిపోయిన బస్సు జవాన్కు డీజీపీ సత్కారం.. దుండగుల బారి నుంచి ప్రయాణికులను కాపాడిన జవాన్ పాత్రోని ఒడిశా డీజీపీ అభయ్ విందుకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జవాన్కు డీజీపీ ప్రశంసా పత్రం అందజేసి సత్కరించారు. హిమాంశు చాలా ధైర్యవంతుడని, సాదాసీదా వ్యక్తిత్వంతో విధి నిర్వహణలో క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందాడని డీజీపీ ప్రశంసించారు. విపత్కర పరిస్థితుల్లో సమయ స్ఫూర్తితో స్పందించి, బస్సు ప్రయాణికుల ప్రాణాలను రక్షించడంలో జవాన్ అంకితభావం స్ఫూర్తిదాయకమని డీజీపీ అన్నారు. దుండగుల నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకీ -
సిటీ బస్సు ప్రయాణికులకు గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ ఆర్టీసీ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుక్రవారం శుభవార్త చెప్పింది. కోవిడ్ కారణంగా విధించిన లాక్డౌన్ కాలంలో బస్ పాస్ ఉపయోగించుకోని వారికి మళ్ళీ సదుపాయం కల్పించనుంది. కోవిడ్ లాక్డౌన్లో తీసుకున్న బస్ పాస్లో(ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్, ఎయిర్పోర్ట్ పుష్పక్ ఎసీ బస్) ఎన్ని రోజులు ఉపయోగించుకోలేదో అన్ని రోజులు మళ్లీ ఉపయోగించుకునే అవకాశాన్ని గ్రేటర్ హైదరాబాద్ జోన్ టీఎస్ఆర్టీసీ కల్పించనుంది. దీంతో వినియోగదారులు అప్పటి బస్ పాస్ను కౌంటర్లో తిరిగి ఇచ్చేసి కొత్త కార్డు తీసుకోవాలని ఆర్టీసీ సూచించింది. కొత్త పాస్లో కోల్పోయిన రోజులను కలిపి పాసులు జారీ చేయనుంది. ఈ సదుపాయాన్ని నవంబర్ 30 వరకు వినియోగించుకోవచ్చు. చదవండి: ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త -
బాబోయ్ బస్సు ప్రయాణం!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో దసరా సెలవుల రద్దీ కొనసాగుతోంది. ప్లాట్ఫారం మీదకి వచ్చిన ప్రతీ బస్సు క్షణాల్లో ప్రయాణికులతో కిక్కిరిసిపోతోంది. పండుగ రద్దీ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ‘దసరా స్పెషల్’పేరిట ప్రత్యేక బస్సులను నడుపుతోంది. హైదరాబాద్ నుంచి 4,480 ప్రత్యేక బస్సులు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు నడుస్తున్నాయి. ఈ నెల 13 నుంచి 21 వరకు ఈ సర్వీసులు తిరుగుతాయి. ప్రతీ బస్ టికెట్పై ఆర్టీసీ 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తోంది. కార్యాలయాలు, కళాశాలలు, ఇతర కోచింగ్ సెంటర్లకు సెలవులు ప్రకటించిన దరిమిలా.. ఈ రద్దీ ఆదివారం నుంచి మరింత పెరిగింది. బస్సు దొరికితే చాలు, కనీసం నిలబడి అయినా సరే వెళదామనుకునే వారి సంఖ్య అధికంగా ఉంది. కానరాని సదుపాయాలు.. రద్దీ నేపథ్యంలో ఎంజీబీఎస్, ఉప్పల్, కాచిగూడ, జేబీఎస్ల నుంచి ఆర్టీసీ దసరా స్పెషల్ బస్సులను నడుపుతోంది. ఇందులో ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్లగ్జరీ బస్సులు ఉన్నాయి. వీటిలో చాలా బస్సుల్లో సరైన సదుపాయాల్లేవు. ఎక్స్ప్రెస్ బస్సుల్లో కిటికీలు సరిగ్గా లేక రాత్రిపూట ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సూపర్ లగ్జరీ బస్సుల్లో టీవీలు లేక ఖాళీ అరలు దర్శనమిస్తున్నాయి. అయినా టికెట్ ధరలో ఎలాంటి మార్పులు ఉండకపోవడం గమనార్హం. ఇక రాజధాని, గరుడ బస్సుల్లో దుప్పట్లు, వాటర్ బాటిళ్లు అందజేయాలి. కానీ కొన్ని బస్సుల్లో వాటిని ఇవ్వడం లేదని ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్నారు. సూపర్లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో ఎక్కువగా ఆన్లైన్ ద్వారానే బుకింగ్ ఉంటుంది. ఆన్లైన్ చెల్లింపుల్లో ప్రతి టికెట్పై అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. అయినా, వీరికి కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. పలుచోట్ల డ్రైవర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు. సమస్య పరిష్కారమైంది: మునిశేఖర్ సీటీవో, టీఎస్ఆర్టీసీ కరీంనగర్, వరంగల్తోపాటు కొన్ని జిల్లాలకు వెళ్లే బస్సుల్లో దుప్పట్లు, వాటర్ బాటిళ్లు అందించడం లేదన్న ఫిర్యాదులు మా దృష్టికి వచ్చాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడిన విషయం వాస్తవమే. వీటిని సరఫరా చేసే కాంట్రాక్టర్కు బిల్లుల చెల్లింపులో జరిగిన జాప్యమే దీనికి కారణం. ఇప్పుడు ఆ సమస్య తీరిపోయింది. ప్రయాణికులు బస్సుల్లో కిక్కిరిసిపోతున్నా.. ఆ బస్సులన్నీ తిరిగి వచ్చేటప్పడు ఖాళీగానే వస్తున్నాయి. అందుకే తాము ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేస్తున్నాం.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement